పత్రికా ప్రకటనలు

నిషేధం రాజ్యాంగ వ్యతిరేకం

విరసం తదితర 16 ప్రజా సంఘాలపై తెలంగాణ ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను వ్యతిరేకించండి 26.4.2021 విప్లవ రచయితల సంఘం సహా 16 ప్రజా సంఘాలను చట్టవ్యతరేక సంస్థలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛకు, రాజకీయ స్వేచ్ఛకు, సంఘం పెట్టుకొనే హక్కుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ జీవో ప్రభుత్వ పాలనా పద్ధతులకు కూడా పూర్తి వ్యతిరేకంగా వెలుగులోకి వచ్చింది. జీవో ఎంఎస్ 73 పేరుతో మార్చి 30న ఈ ఉత్తర్వులను తయారు చేశారు. ఏప్రిల్ 28న పత్రికలకు విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో జీవోలు
కాలమ్స్ లోచూపు

ఆజాదీ కీ ఆవాజ్

యూరప్ లో 14వ శతాబ్దము నుండి రెండు,మూడు శతాబ్దాల పాటు రాచరిక భూస్వామ్యం పై తీవ్రంగా ఘర్షణ పడి, దాన్ని ఓడించి గెలిచిన పెట్టుబడిదారీ వ్యవస్థ(తన స్వప్రయోజనం కోసమే అయినా) ‘మనుషులందరూ సమానమే’, ‘ఏ మనిషికైనా ఒకటే విలువ’ లాంటి కొన్ని ఆధునిక విలువలను ముందుకు తెచ్చింది. పెట్టుబడి తన విస్తరణ కోసం ప్రపంచవ్యాప్తంగా వలసలు ఏర్పరచుకునే క్రమంలో భారతదేశం కూడా ఒక బ్రిటిష్ వలసగా మారింది. ఆ తర్వాత వలసవాద వ్యతిరేక స్వాతంత్ర్య ఉద్యమం ఫలితంగా అధికార మార్పిడి జరిగి,బూర్జువా ప్రజాస్వామ్యం ఇక్కడి భూస్వామ్యంతో తీవ్ర ఘర్షణేమీ లేకుండానే మనదేశానికి దిగుమతి కావడం వల్ల ప్రగతిశీల ఆధునిక
కథలు

ఆవు శాస్త్రం!

వయసు మీద పడ్డ వైస్ ఛాన్సలర్  కళ్ళద్దాలు తుడుచుకొని కళ్ళు పులుముకొని రెప్పలు ఆడించి చేతిలోని ఆర్డర్‌ని మరోసారి చూశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి వచ్చిన లెటర్ అది. మళ్ళీ చదువుకున్నారు. క్షణకాలం అలానే వుండిపోయారు. రిజిస్ట్రారూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినరూ డీన్లూ డిపార్టుమెంటు హెడ్లూ సూపరింటెండెంట్లూ యింకా ప్రొఫెసర్లూ కొద్దిమంది స్టూడెంట్లూ వారి నాయకులూ అంతా అయన వంక చూశారు. ఒకరకంగా అది ఇంటర్నల్ మీటింగ్. ఇంకా చెప్పాలంటే కాన్ఫిడెన్సియల్ మీటింగ్. ‘నేషనలిజమ్... జాతీయవాదం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యీ ప్రతిపాదనలు చేసింది...’ అన్నారు ఛాన్సలర్. ‘విద్యారంగం అందుకొక మార్గం... సో’ అని ఆగిపోయారు.
సాహిత్యం గల్పిక కథలు

ఆవు యేమనును?

మేధావులందరూ వొక్క చోట చేరారు. ‘జై శ్రీరామ్’ చెప్పుకున్నారు. వాళ్ళ మెదళ్ళ కుదుళ్ళలో దేశ భవిత దాగుందని వాళ్ళకే తెలిసిపోవడంతో మదముతో మేధో మదనమునకు సిద్ధపడ్డారు. గోడకు వేళ్ళాడదీయబడ్డ దేశ యేలికుని చిత్రపటం చూస్తూ ‘ఆ తెల్లని గడ్డంలో యేమి కనిపిస్తోంది?’ అని అడిగి, అంతలోనే ‘ఆ తెల్లని గడ్డంలో దాగిన మర్మమేమి?’ అని దిద్దుకున్నారు వృద్ధ పెద్దమనిషి. ‘స్వచ్ఛత’ అన్నారు కొందరు. ‘పాలవంటి తెల్లని స్వచ్ఛత’ అన్నారు యింకొందరు. ‘మాకు దేశ శిఖరాయమాన హిమాలయాలు కనిపిస్తున్నాయి’ అన్నారు మరికొందరు. ‘మాకయితే పాల సముద్రం కనిపిస్తోంది’ అన్నారు మిగిలిన అందరూ. ‘నాకయితే తెల్లని ఆవు కనిపిస్తున్నది’ యెంతో సౌమ్యంగా
సాహిత్యం వ్యాసాలు

ఆన్ లైన్ విద్యతో పెరిగిన డ్రాపౌట్లు

అంతర్జాతీయ కరోనా సంక్షోభం నేపథ్యంలో గత ఏడాది నుండి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 24 మిలియన్ల పాఠశాల స్థాయి విద్యార్థులు డ్రాపౌట్లుగా మారినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన అనుబంధ సంస్థ యునెస్కో(UNESCO) ప్రకటించింది. మార్చి 20,2020 నాడు దేశవ్యాప్త లాక్ డౌన్ లో భాగంగా తెలంగాణలో విద్యా సంస్థలు మూసివేయటంతో విద్యార్థుల చదువులు నిలిచిపోయాయి.అనంతరం ప్రభుత్వం ప్రకటించిన వర్చువల్ విధానంలో ఆన్ లైన్ తరగతులు పేరుకే మిగిలిపోయాయి.గ్రామీణ ప్రాంతాలలోని,పట్టణ ప్రాంతాలలోని యస్సీ,యస్టీ,బిసి,మైనార్టీ వర్గాల-కులాల పేద విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినేందుకు అవసరమైన సౌకర్యాలు,కనీసం స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ లేక తీవ్రంగా నష్టపోయారు.వీరి చదువులు నిలిచిపోయాయి.తెలంగాణలో ప్రాథమిక స్థాయి విద్యార్థుల
సాహిత్యం కవిత్వం

పదునెక్కిన వేళ యిది

చిలకమ్మా! చిలకమ్మా!చైత్ర మాసపు వెన్నెలపండునుదోచుకుపోదామని వచ్చిందెవరేఉలుకమ్మా! పలుకమ్మా! బుడి వడి నడకలబుడతన్నా ఉడతన్నారాసుకొని దాచుకున్నజనరూపకాలను దండుకుపోయినదెవరే కూతలమ్మా క్రో యిలమ్మాతెలవారు చల్లని సంధ్యలోనీరెండతొడిగిన లేమావి చిగుళ్లనుపచ్చటి చెట్టుమీదేచిదిమేసే ఆ మృగమెవరే జాజిమల్లీ ప్రేమవల్లీనిండారా దాచుకున్నపూలసుగంధాన్నిమురికి కాలువలోకివొలిపిన మూర్ధుడెవరే పట్నంపాలబడ్డ పాలపిట్టాపసుల పిలగాని వకాల్తాఅడవిలిక్కుజిట్టల కేసు కట్టలుమాయం చేసిందెవరేఎవరమ్మా? ఆ బూచొోళ్ళు డమ డమా టమ టమాటముకేసే నామాల పిట్టానీతప్పేటమూగదయ్యిందిచిర్రా, చిటికెనపుల్లాఇరిచేసిందెవరే పద్మమ్మా పద్దమ్మాజిట్రేగి చెట్లపై నువు గీసినఅమరుల చిత్రాలుదొంగిలించినదెవరే!ఎవరమ్మా ఆ బూచోళ్ళు నెత్తిన తురాయినెత్తినతురక పికిలి పిట్టానీ కలలను, కాంక్షలనుకొల్లగొట్ట వచ్చిందెవరేపూలపట్టురెక్కలనువిరివజూసిందెవరే మందార ఎరుపెరుపువెదురు జీనువాయీకాలం ముంచుకొస్తోందిఆడివంచుల నుంచిఆకురాయి తేగలవా కంసాలి పిట్టనూవడ్రంగి పిట్టనూ పిలవండేకాలం ఎట్టేడుస్తుందో యేమోఇంకమనమూ
సాహిత్యం కవిత్వం

ట్రిగ్గర్

చర్య ప్రతి చర్యజీవితం ట్రిగ్గర్ పై ఆధారం ఆకలి చర్యప్రశ్న ప్రతి చర్యతిరుగుబాటు చివరి అంకంలో ట్రిగ్గర్ నేల లో బీజం చర్యమట్టిపెళ్ళను తన్నుకుని వచ్చే మొక్క ట్రిగ్గర్ చదువు జ్ఞానంచదువుకి బతుక్కి లంకె ఉద్యోగం చర్యచర్య కప్పెట్టితేప్రతిచర్య ట్రిగ్గింగ్ విస్పోటనం లా అచ్చటో పొగ పొగ వెనకాల హేతువుహేతువు ని సాధించకట్రిగ్గర్ పై వేలెడితే హేతువు కూడా ట్రిగ్గింగ్ వైపే పచ్చని అడవిలోనిక్షేపాలు జనం సొత్తుకాదంటూ వాడొస్తేవీడూ ప్రతి చర్య వైపేగా రాజ్యంలో ప్రజాస్వామ్యంఅపహాస్యమైతేట్రిగ్గర్లు ప్రతి మెదల్లో మొలుస్తాయి తోక లేని పిట్టలుతొంభై ఆమడలెల్లిఅక్షరాన్ని బుర్రల్లో జొప్పిస్తేగుండె లోతుల్లో ట్రిగ్గింగ్ కూకటి వేళ్ళతో పెకిలించ కులం కాటికిమతం సమాధివర్గం అంతంఇదే ఆఖరి
సాహిత్యం కవిత్వం

యుద్దానికి ఆవల..

చిటుక్కుమని గండు చీమ మామిడి ఆకు తొడిమ కొరికిన సడి ఎంత గట్టిగా వినబడిందో టేకు ఆకు మొదలుపై వాలిన గోరపిట్ట కాలి గోరు శబ్దం టిక్ టిక్ మని చెవులని తాకింది  ఇంతలోనే గాలి మోసుకొచ్చిన టకటక బూట్ల శబ్దం ఎత్తుపల్లాల మధ్య హోరుగా వినిపిస్తూ ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం  మొదలైన యుద్ధం చివరాఖరుకు నెత్తుటి ముద్దల విసిరివేతతో హాహాకారాల ఆర్తనాదాలమయంగా అడవి హోరుపెట్టింది పుడమి తల్లి గర్భంలో దాగిన‌ సంపదను కాపాడుతూ ఒరిగిన ప్రాణాలు కొన్ని ఫాసిస్ట్ కార్పొరేట్‌ దొంగల ఆశలు కావలి కాసే ఆకలి కడుపుల జీతగాళ్ళ మృతదేహాలు కొన్ని  నేలపై కారిన ప్రతి రక్తపు బొట్టు ఎదురెదురు గుండెల మండే కన్నీటి చారికల గాయపడిన అమ్మతనం  పేలిన‌ ప్రతి తూటాకు కళ్ళుంటేతను వెళ్ళే దిక్కు చూపేదినోరుంటే సాక్షిగా
సాహిత్యం కవిత్వం

వెన్నెలపంట

ఒకేసీటులోపక్కపక్కనే కూర్చుంటాంవందలకొద్ది మైళ్ళుకలిసే ప్రయాణిస్తాంహలొఅంటే హలొమీరెక్కడిదాకాపలాన వూరుఅంతేమాట్లాడటం ముగుస్తుంది నాచేతిలో సెల్ ఫోన్పక్కనవ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ఇద్దరితలలు ఓరిగిపోతాయి ఇక్కడదూరంలో ఉన్న వ్యక్తితో సంభాషణఅక్కడఎక్కడోవున్న వ్యక్తితో సంభాషణఇక్కడవీడియోగేమ్స్అక్కడఫేస్ బుక్ఇక్కడట్విట్టర్అక్కడవాట్సప్ యూట్యూబ్ గూగుల్ సెర్చింగ్ లునచ్చిన వాటిని వెదుక్కునివాటిల్లో లీనమవుతాం గ్రామాలను దాటుతాంపట్టణాలను దాటుటాంతలపక్కకుతిప్పికిటికిలోనుండి బయటకు చూసినప్పుడుఅనేక దృశ్యాలుతెరలు తెరలుగా ఎదురవుతాయి వర్తమానంలోకి వచ్చిఎవరిని చూసినారంగులు పూసుకున్న మొఖాలే చిరునవ్వుకిచిరునామలేని ప్రతిభింభాలు కాలానికి కళ్లెం లేదుభద్రతకు భరోసాలేదుఅంతాపల్లెరుకాయల పరాకు దుఃఖాలు ఎదురుపడతాయిసోకాలు ఎదురుపడతాయిఅన్నింటినిచూస్తూనే దాటిపోతుంటాంస్ఫురణలోకి వచ్చినప్పుడుఎదురుపడిన దృశ్యాలునిమిషమోఅరనిమిషమోబాధను కలిగిస్తాయి గమ్యం చేరువయ్యిందిఎవరిదిశగావారు వెళ్లిపోతున్నదారిలోనీడలు కనుమరుగయ్యాయిఅంతా గాఢాంధకారంనిశరాత్రిలోనిశ్శబ్దమేతప్పాతీతువుపిట్ట అరుపులులేవు అందరుఅందరిలోవున్నాప్రతిఒక్కరినిఒంటరితనం వెంటాడుతున్న క్షణానవెన్నెలపంటకోసం నేను