సంపాదకీయం

ఫాసిస్టు ధిక్కారంగా విరసం సాహిత్య పాఠశాల

ఎన్ఐఏ దాడులు, విచారణల మధ్యనే ఎగిరిన విరసం జెండా విరసం 22 వ సాహిత్య పాఠశాల ఏప్రిల్ 12 న విజయవాడలో జరిగింది. ఒక వైపు కరోనా భయం మరో వైపు ఎన్ఐఏ సోదాలు, విచారణలు . యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న విరసం మరో యాభైల్లోకి.. ఫాసిస్టు కల్లోలంలో రూపొందుతున్న కొత్త పోరాటాల ప్రపంచంతో పనిచేస్తానని కలిసి నడుస్తానని బాస చేసింది. ఈ సాహిత్యపాఠశాలలో ఉండాల్సిన కవులు, కళాకారులు, ప్రజా సంఘాల బాధ్యులు కొందరు జెయిళ్లలో ఉన్నారు. చాలామంది ఎన్‌ఐఏ విచారణలో ఇరుక్కుపోయారు. ఆ వెలితి ఉన్నప్పటికీ ఎప్పటిలాగే ఉత్తేజభరితంగా పాఠశాల జరిగింది. ఫాసిస్టు కల్లోలంలో రూపొందుతున్న
కాలమ్స్ ఆర్ధికం

అమ్మకానికి దేశం – దళారిగా ప్రభుత్వం

మనది ప్రజాస్వామ్య లౌకిక సర్వసత్తాక గణతంత్ర దేశం. గణతంత్ర రాజ్యమంటే యావత్తు దేశం స్వీయ సంపుష్టి పొందడం. స్వావలంబన (ఆత్మనిర్భర్‌) అంటే స్వంత వనరులు, స్వంత పరిజ్ఞానం, స్వంతశ్రమతో ఉత్పత్తి చేసి వినియోగించడంగా ఉంటుంది. దీనికోసం పౌరులకు స్వేచ్చ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి. ఇప్పుడు ఈ రెండూ ప్రమాదంలో ఉన్నాయి. అయితే మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు దేశ వనరులను, దేశ సంపదను, దేశ శ్రమను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు దారాదత్తం చేసేవిధంగా ఉంది. గణతంత్ర దేశంలో ప్రజలే విదాన నిర్ణయ కర్తలు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సమాజ సంపుష్టితత్వం కోసం ప్రధాన రంగాలైన
సంపాదకీయం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులను ఖండిద్దాం

ఢిల్లీలో నార్త్ బ్లాక్లో ఉన్న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కథలు రాయడంలో తలమునకలైంది. రచయితలు చేయాల్సిన పనిని అది తలెకెత్తుకున్నది. రచయితలనేమో దేశద్రోహులుగా బందీలను చేస్తుంది. ఇప్పటికే భీమాకొరేగాం లాంటి పెద్ద కల్పిత కథను సృష్టించింది. రైతాంగ ఉద్యమం, సిఏఏ సందర్భంలో కూడా కల్పిత కథలు ప్రచారం చేసింది. ఈ సారి అది తెలుగు రాష్టాల ప్రజా సంఘాల కోసం పాత కథనే తిప్పి రాస్తుంది. మార్చి 31 2021 న సాయంత్రం 4 - 5 గంటల మధ్య ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ప్రజా సంఘాల నాయకుల ఇళ్ల మీద ఎన్ఐఏ దాడులు చేసింది. వీరిలో విరసం
కాలమ్స్ ఓపెన్ పేజీ

అందోళనాజీవుల కాలమిది

హిందుత్వ ఫాసిజమనే విష వృక్షం రోజు రోజుకు తన వేర్లను సమాజ లోతుల్లోకి చొప్పించి తన పునాదిని గట్టిపర్చుకుంటుంది. తన శాఖలను విస్తరించుకుంటూ పాలనా, చట్టం, న్యాయం, మీడియా అన్నింటిని తన నీడ కిందికి తెచ్చుకుంటుంది. మన సమాజంలో చారిత్రకంగా (వందల సంవత్సరాలుగా) అనేక రూపాలలో కొనసాగుతున్న అధిపత్య భావనలు (కుల దురాహంకారం, పితృస్వామ్యం, మత పెత్తనం)  హిందుత్వ విష వృక్షపు వేర్లకు సత్తువనిస్తున్నాయి. ఆ విష వృక్షం ఈ రోజు దోపిడీ కుల, వర్గాల అండదండలతో అధికారం చేజిక్కించుకొని తన ఫాసిస్టు నిజ స్వరూపాన్ని నగ్నంగా ప్రదర్శిస్తుంది. అయితే ఈ రోజు కాకపోతే రేపు ఆ విష
అనువాదాలు సంభాషణ

న్యాయం కోసం ఎదురుచూస్తూ మరణించిన కంచన్

కంచన్ నన్నవరే వైద్య చికిత్సలో నిర్లక్ష్యం ఉందా లేదా అనేది జ్యుడిషియల్ దర్యాప్తు మాత్రమే నిర్ణయిస్తుంది. ఒక విషయం స్పష్టంగా ఉంది: భర్తకు సమాచారం ఇవ్వకపోవడం ద్వారా జైలు అధికారులు చట్టాన్ని ఉల్లంఘించారు. మెడికల్ బెయిల్ విషయంలో ఆమె న్యాయవాదులుగా బాంబే హైకోర్టులో సీనియర్ న్యాయవాది గాయత్రీ సింగ్, న్యాయవాది అంకిత్ కులకర్ణి, ట్రయల్ కోర్టులో (పూణే స్పెషల్ కోర్ట్) న్యాయవాదులు రోహన్ నహర్, రాహుల్ దేశ్ ముఖ్, పార్థ్ షా చేశారు. --- ఎల్గర్ పరిషత్ కేసు విస్తృత, వివరణాత్మక మీడియా దృష్టిని ఆకర్శించగా, పూణే మహిళా సెంట్రల్ జైలులో అనారోగ్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని,
సమీక్షలు

జోజో – జాక్ వెల్లడిస్తున్న ప్రపంచ స్త్రీ-పురుష సంబంధాలు!

నెదర్లాండ్స్ దేశం నుంచి డచ్ భాషలో 2012 సంవత్సరంలో వచ్చిన అద్భుతమైన చిత్రం “కౌబాయ్”( Kauwboy) ఈ చిత్ర దర్శకుడ: “హెల్మర్ బౌడేవిజ్న్ కూలే” ( Helmer Boudewijn Koole). దీని నిడివి 90 నిమిషాలు. జోజో అనే  10 సంవత్సరాల బాలుడికీ - మన కాకి పిల్ల లాంటి చిన్నపక్షికీ మధ్య ఏర్పడిన స్నేహమే ఈ సినిమా ఇతివృత్తం. Kauwboy అంటే డచ్ భాష లో “బుజ్జి పక్షి” అని అర్ధం.  హాలండ్ శివారు ప్రాంతంలోని  ఒక ఆకుపచ్చని అందమైన గ్రామంలో  పదేళ్ళ జోజో తన తండ్రితో నివసిస్తుంటాడు. ఒత్తైన బ్రౌన్ కలర్ జుట్టుతో, ఆరోగ్యంగా, అప్పుడప్పుడే
కాలమ్స్ సమకాలీనం

సైన్స్ పరిశోధనా సంస్థకు ఫాసిస్టు పేరా!

ప్రపంచంలో చాలా దేశాలలో ఆయా రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారి పేర్లను సాధారణంగా వారి మరణానంతరం ఆయా సంస్థలకో లేదా మరో రంగానికో వారి పై గౌరవంతోనో వారికి గుర్తింపు గానో పెట్టడం జరుగుతుంది. భారతదేశంలోను ఆ ఆనవాయితి కొనసాగుతున్నది. పాలక వర్గాలు మారినప్పుడల్లా వారి భావజాల ప్రతినిధుల పేర్లను ఎక్కడో ఒక చోట తగిలించడం అలవాటు చేసుకున్నారు. ప్రజాజీవితంలో ఉండి వారి ప్రయోజనాలకు పాటుబడిన వారిని అలా గుర్తుంచుకోవాలంటే పేచీ ఏమి ఉండదేమో గాని మొత్తంగా వారి జీవితకాల ఆచరణకు పొసగని లేదా విరుద్ధమైన రంగాలకు వారి పేరు పెట్టడం చాలా కాలం క్రితమే మొదలయింది.
సాహిత్యం గల్పిక కథలు

సెగ సెకలు!

పెట్రోలు ధరలు పెరిగాయని మా ఆయన స్కూటరు వొదిలి సైకిలు యెక్కాడు. దారికాసిన పోలీసులు సైకిలు లాక్కున్నారు. మా ఆయన హెల్మెట్ లేదనేమోనని అనుమానించి, హెల్మెట్ తెచ్చుకుంటాను అన్నాడు. వినలేదు. బెల్లే హారన్ అని ట్రింగు ట్రింగుమని కొట్టి చూపించాడు. వినలేదు. లైట్ వేసి చూపించాడు. వినలేదు. టూవీలర్ ఫోర్వీలర్ లైసెన్స్ వుంది, సైకిలుకి లైసెన్స్ తీసుకుంటాను అన్నాడు. వినలేదు. మేం త్రిబుల్స్ వెళ్ళడం లేదు కదా అన్నాడు. అయినా వినలేదు. పోన్లే సైకిలు తీసుకుంటే తీసుకున్నారు. నడిచిపోతానని మా ఆయన బుద్ధిగా నడిచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు పోలీసులు యెవరికో ఫోను చేశారు. వాళ్ళు వచ్చి మా ఆయన్ని
వ్యాసాలు

ఎవరిపై పోరాడుతున్నారో తెలుసుకోండి

పోలీసు, అర్ధ సైనిక, సైనిక జవాన్ లారా! భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) గత 50 సంవత్సరాలకు పైగా మన దేశంలో విప్లవోద్యమాన్ని నిర్మిస్తోంది. భారత విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి మిమ్మల్ని పెద్ద సంఖ్యలో పాలకులు మోహరిస్తున్నారు. ఇప్పటికే దేశానికి ఉత్తరాన కశ్మీర్ లో, ఈశాన్యాన అసోం నుండి అరుణాచల్ ప్రదేశ్ ల వరకు లక్షల సంఖ్యలో మిమ్మల్ని మోహరించారు. మధ్య, తూర్పు భారత రాష్ట్రాలలో మీరు ఆరు లక్షలకు పైగానే మోహరించబడి ఉన్నారు. ఇటీవల 2019 డిసెంబర్ లో జాతీయ భద్రతా సలహాదారు విజయకుమార్ నాయకత్వంలో జరిగిన ఐదు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో నూతనంగా విప్లవోద్యమం నిర్మూలనకు
కాలమ్స్ కథ..కథయ్యిందా!

నాన్నా కతచెప్పవూ…కథ

రాప్తాడు గోపాలకృష్ణ  నాన్నా కతచెప్పవూ , కథ రాప్తాడు గోపాల కృష్ణ ది.అతడుబయలుదేరాడు , కథా సంపుటి లోది.ఈ కథ నిద్ర పోవడానికి రాత్రుళ్లు కథలడిగే పిల్లవాడి కోరిక.బిడ్డడిని నిద్రపుచ్చడానికి ఒక తండ్రి తలకెత్తుకునే బాధ్యత.అంతకుమునుపే నిద్రపుచ్చడానికి యెన్నో కథలు చెప్పాక , నిద్రపుచ్చడంలో విఫలమయ్యాక , ఆఖరుగా యీ కథ చెబుతున్నట్టూ , దీని తర్వాత యిక కథలడక్కుండా నిద్రపోయితీరాలనే ఒప్పందంతో యీ కథను బయటికి తీసాడు, యీకథలోని తండ్రి.ఆమేరకు యిది కథలోని కథ.ఈకథ చెప్పడంలో తండ్రి కి ఒక లక్ష్యం వుంది.అలాగే యీ కథలల్లుతున్న కథకుడికీ లక్ష్యముంది.అది రెండంచుల కత్తిలాంటి లక్ష్యం.ఆ కథలోని కొడుకును నిద్రపుచ్చడమనేది