భారతదేశంలో 12.5 కోట్ల షెడ్యూల్డ్ తెగల గుర్తింపు;ఆదివాసీ హోదా నిరాకరణ
దేశంలో 12.5 కోట్ల మందికి పైగా పౌరులను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించినప్పటికీ, అంతర్జాతీయ చట్టం ప్రకారం ఆదివాసులను స్వదేశీ ప్రజలుగా అధికారికంగా గుర్తించడానికి భారతదేశం నిరాకరించడంపైన దృష్టి సారించాలని ఆదివాసీ, స్వదేశీ సముదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు ఐక్యరాజ్యసమితిని కోరాయి. ఆదివాసి మహాసభ ఫౌండేషన్, ఇండియా ఇండిజినస్ పీపుల్స్, ఆదివాసి సమన్వయ మంచ్, ఇండిజినే గ్లోబల్ కాన్ఫెడరేషన్, ఇండియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండిజినస్ అండ్ ట్రైబల్ పీపుల్స్ (నార్త్ ఈస్ట్ జోన్), బోడో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్, ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్ సంస్థలు ఐక్యరాజ్యసమితి ఆదివాసీ ప్రజల హక్కుల నిపుణుల యంత్రాంగంనిర్వహించిన 19వ సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తాయి.








