కవిత్వం

అర్బన్ నక్సల్

1వడివడిగా...అంగలే వేసానోఒక 'క(౦)గారు' లో .. దూరమే ఎగిరిపడ్డానో..అయినా..చాలా ముందుకే వెళ్ళిపోయానుజీవితం అనేది 'వన్ వే' నో కాదో కానీ..పోరాటానిది మాత్రం ఒక్కటే దారిసాగిల పడిపోయిన నీకోసంనేను.. ఎప్పటికి వెనక్కి రాలేనునా వెనక వెనకే అయినా నువ్వేకదిలి రావాలి... కాని..నీ చెయ్యి పట్టి నేను నడవలేనువెలుగు వెంట సాగే నా నీడ దారినైనానువ్వే నడిచి రావాలి ఎద(ర) పరుచుకున్న రక్త తర్పణ దారి తప్పనీ 'విశాల హృదయం' కానరాదు నాకుఅవును..నా దృష్టిలో ఒక స్పష్టమైన విభజననీ వల్లే కొట్టొచ్చినట్టు కనిపిస్తుందిదప్పిక ఎరగని ఒంటె.. ద్దు పోకడ ఏకాకి ఎడారి ఓడ.. నా ప్రయాణంనీతో కలిసి ఇప్పుడు నేను నడవలేను2నా
వ్యాసాలు

సమకాలీన భారతదేశంలో విద్య

ప్రతి సంవత్సరం భారతదేశంలోని లక్షలాది మంది విద్యార్థులకు ఒకే విధమైన హామీ ఇస్తున్నారు : ఇప్పుడు కష్టపడి చదవండి, అవసరమైన త్యాగాలు చేయండి, అప్పుడు విద్య మీకు మెరుగైన భవిష్యత్తును అందిస్తుంది. ఈ ఆశతో కుటుంబాలు పాఠశాల ఫీజులు, కోచింగ్ సెంటర్లు, పోటీ పరీక్షల కోసం భారీ మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తున్నాయి. విద్యార్థులు తమ సామాజిక జీవితాన్ని, అభిరుచులను, తగిన నిద్రను కూడా త్యాగం చేస్తూ పగలు-రాత్రి కష్టపడి చదువుతున్నారు. తమ శ్రమకు చివరకు ఫలితం దక్కుతుందని ఆశిస్తూ పోటీ పరీక్షలను ఎదుర్కొంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ప్రశ్నాపత్రాల లీకులు సంవత్సరాల తరబడి
కవిత్వం

సుదూరమైన ఆఫ్రికా నుంచి ఓ పెను కేక

అల్లకల్లోలంగా ఉన్న ప్రచండమైన గాలి ఆఫ్రికా కికియులోని పసుపు రంగు గోధుమ పంట నేలను జంతువు చర్మంలా కదిలిస్తోంది.అచ్చం గుంపుల్లో కదిలే ఈగల్లా, పుష్టిగా పెరిగిన ఆఫ్రికా విశాలమైన గడ్డి మైదానాల్లో ఉధృతంగా పారే రక్తపుటేరుల్లా స్వర్గంలో శవాలు చెల్లాచెదురై పడి ఉన్నాయి ~ప్రజలు ఆఫ్రికా గడ్డి మైదానాల్లో జరిగిన ఈ రక్తపాతాలతో ముడిపడి ఉన్నారు! ఈ అభాగ్యుల మరణాల వల్ల లాభ పడేదంతా శవాలను తినే లుకలుక లాడే పురుగులు, రాబందులు మాత్రమే! చూడండి ఎంత నిర్ధయో? అన్ని వైపుల నుంచి "మృతి చెందిన వాళ్ళపై అస్సలు జాలి చూపద్దు" అనే అరుపులు వినిపిస్తున్నాయి!~. ఇక్కడ మృతుల
సమీక్షలు

సామాజిక సౌందర్యాత్మక సంగీతంమట్టి తంబూర

మల్లెల నరసింహమూర్తి మల్లె పువ్వు లాంటి కవిత్వాన్నే కాదు పాలకవర్గాల దోపిడీ విధానాల్ని, రాయలసీమ కరువును, వెనుకబాటుతనాన్ని, ముఠా కక్షల్ని నిరసిస్తూ సీరియస్ కవిత్వాన్ని రాసే అభ్యుదయవాది. “మట్టి తంబూర” అనే శీర్షికతో ఈ కావ్యాన్ని వెలువరించడమూ, ఒక జానపద సంగీత వాద్యంగా ఈ కావ్యాన్ని ప్రకటించడంతోనే మట్టితో కవి కవిత్వం ఎంతలా మమేకమైందో అర్థం అవుతుంది. 2004లో ప్రాంతీయ అస్తిత్వంలో భాగంగా “జలస్వప్నం” కావ్యాన్ని రాస్తే దానికి కొనసాగింపుగా 2024న రాయలసీమ నీటివ్యథలపై “మాకు ఒక నది కావాలి” రాశాడు. అదే పరంపరలోనే ‘మట్టి తంబూర ‘శీర్షికతో మరో కావ్యాన్ని వెలువరించాడు. ఈ మట్టి తంబూర కేవలం