ఆర్ధికం

మందగమనంలో భారత ఆర్థిక వ్యవస్థ

కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం,  స్థూల జాతీయోత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించడం,  2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరడం..వంటి లక్ష్యాలు చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ కేవలం మాటల గారడీతో అభివృద్ధి సాధ్యం కాదని గత పదేళ్ల కాలంలో ప్రత్యక్షంగా చూశాం. మరోవైపు మోడీ ప్రచారానికి భిన్నమైన వాస్తవ దృశ్యాలు ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతున్నాయి. వర్తమాన కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను దట్టమైన చీకట్లు కమ్ముకొన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా క్షీణించిందనేదీ చేదు నిజం. వాస్తవానికి ‘ఆర్థిక వినాశనం’ అని చెప్పవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటుంది.
సంపాదకీయం

ఏడాదిగా కగార్‌ విధ్వంసం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గత ఏడాది డిసెంబర్‌ 13 నుంచి మూడు రోజులు చత్తీస్‌ఘడ్‌లో పర్యటించాడు. ఆ సందర్భంగా ఆయన ‘మావోయిస్టు రహిత భారత్‌ అనే స్వప్నం సాకారమవుతోంద’ని అన్నాడు. ‘మావోయిస్టులందరినీ చంపేయడానికి   భద్రతా బలగాలు సిద్ధంగా, ఉత్సాహంగా ఉన్నాయ’ని అన్నాడు. ఆ తర్వాతి రోజు పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యాడు.  అక్కడ బాబాసాహెబ్‌ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. మొదటి మాట ఆదివాసీ హక్కుల గురించి, మావోయిస్టు ఉద్యమం గురించి పట్టించుకునేవారికే వినిపించింది. మిగతా వాళ్లకు కూడా వినిపించే ఉండొచ్చు. కానీ మౌనం పాటించారు. తెలుగు సమాజంలోని గౌరవనీయ పాత్రికేయులు, మేధావులు, రచయితలు ఇందులో మొదటి వరుసలో
Stories

Guerilla’s Life in a squad

The train was speeding along. Trees and hills were racing past with equal speed. The events of the past seven months flashed before Lakshmi's eyes. --- Itwas 11 o'clock. As soon as the train stopped at the station, Lakshmi got down, waited for it to leave, and then crossed the tracks. Her eyes scanned the station premises. She held the signals she brought tightly in her hand. Meanwhile, a middle-aged
వ్యాసాలు

ఉజ్వల, విషాద అనంత గాథ

(ఇటీవల విడుదల అయిన రాయలసీమ విద్యావంతుల వేదిక బులిటెన్ -2 *మన రాయలసీమ* సంపాదకీయం) రాయలసీమ అనేక ఉప ప్రాంతాల ఉమ్మడి అస్తిత్వ సీమ. ఇవ్వాల్టి భౌగోళిక, పాలనా గుర్తింపులతో నిమిత్తం లేని చారిత్రక, సామాజిక, సాంస్కృతిక ప్రత్యేకతలు ప్రతి ఉప ప్రాంతానికీ ఉన్నాయి. మళ్లీ అన్నిటి మధ్య సాధారణ లక్షణాలు ఉన్నాయి.   వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో, సాంస్కృతిక వికాసంలో ఇవి కనిపిస్తాయి.   కనీసం ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి  వీటిని చాలా స్పష్టంగా  పరిశీలించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమలోని ప్రతి ఉపప్రాంతం నిర్దిష్ట స్థానిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ సమస్యలు తీవ్రమవుతున్నాయి.
కవిత్వం

మాట్లాడే మనిషి

సందింట్లో సాయంకాల వేల అలసిన ఆలికి నాలుగు ముచ్చట్లు చెప్పే పెనిమిటి తిరిగి వచ్చే రోజు కోసం ఎగసేపి బిడ్డ కోసం దారిపట్టే తల్లి ఆవు కోసం ఊపిరి బిగబట్టి గాలినిఎగదని గూడు చేరే పక్షుల కోసంనిలువనీడనిస్తూ చిగురించెఆ చెట్ల కోసం స్పందించి స్వరాన్ని వినిపించేసాయి ఆఖరి శ్వాస విడిచిన వేళదిక్కులు దినబోయి దిశ తిరిగె కొండ గాలిఅలిగిన అమలాపురానికి మిగిలిన వసంతంనేల విడువని పాదాలు మట్టి వదలని చేతుల మార్పు కోసం వైకల్యం ఆదమరిచిప్రశ్నించే ప్రతి చోట బలమైన మస్తిష్కం బంధించిన చెరసాల యమున గంగను కలసి ఎదపై గోదారి కృష్ణమ్మ వెనుతిరిగిమూసికి ముచ్చట్లుమంజీరా మా కోసంరేపటి
కవిత్వం

నాలుగు పిట్టలు (కళ్ళూ- కన్నీళ్ళు)

సముద్రాన్ని కళ్ళల్లో నింపుకుందామనుకున్నసాధ్యమైతే కాలేదురెప్పలు మధ్య కన్నీరు ఉబికేదాకాదుఃఖం కంటే గొప్ప సాగరమేముందో తెలియలేదు***కన్నీళ్ళ తో కాస్త జాగ్రత్తఉండండిగాయపరచడానికి ముందుమీ కళ్ళ గురించి కూడా ఆలోచించండి***ఒక్కోసారి కన్నీళ్ళతో పాటుచూపు ప్రవహిస్తుందిదృశ్యాలను అనేకంతనలో కరిగించుకొని****కన్నీళ్ళ కళ్ళనుఅవమాన పరచకండిదుఃఖం ఆగాక ఉప్పొంగేఉద్వేగం పేరు ఆగ్రహం***కళ్ళున్న చోటంతాకన్నీళ్ళుండక పోవచ్చుకొందరి హృదయాలుఎండమావులు***తడి ఉన్నదంతాకన్నీళ్ళు కాదుమోసకారులుకోకొల్లలు****కన్నీళ్ళ శక్తి కి అంచనా లేదుకేరటాల్లా, వానలా, వరదలాఅవి బండలలైనాకరిగించగలవు కదిలించగలవు***లోపలచెలరేగేతుపానులనుఅదుపు చేసేలంగరులు కన్నీళ్ళు***కన్నీళ్ళుచాలా వాస్తవమైనవిఅవే మనో మంటలనుచల్లార్చగలిగేవి***కన్నీళ్ళు రానివాళ్ళలోపలహృదయం ఎండిపోయిఉంటుంది***నువ్వో సముద్రాన్నిలోపల మోస్తున్నావనిచెప్పే ఆధారాలుకన్నీళ్ళు****కళ్ళను నమ్మని వారైనా సరేకన్నీళ్ళను నమ్ముతారునీలో మనిషి ఉన్నాడనిఅప్పుడు గుర్తిస్తారు***గట్టి రొమ్మున్న వారు కూడారొప్ప కుండా ఉండలేరుఏడ్పు రాని వారెవరూఈ లోకంలో ఇప్పటికీ పుట్టలేదు***ఒక
కథనం

“రహ”

మణిపూర్, పర్వతాలు వున్న నదుల ఒడిలో మనోహరమైన రాష్ట్రం. భిన్న జాతులు, సంస్కృతుల సమ్మేళనం. కానీ అక్కడి ఆహ్లాదకరమైన ప్రకృతి వైభవం కన్నీటి ప్రవాహానికి దారి తీసింది. వివిధ తెగల మధ్య అవగాహన లోపం, రాజకీయ లబ్ధి కోసం ఆడే ఆటలు, సామాజిక అంతరాలు సమాజాన్ని చీల్చాయి. సూర్యుడు ఉదయించే ముందు గ్రామాల్లో మంటలు చెలరేగాయి. ఆ మరుసటి రోజు మహిళలు, పిల్లలు అరిచిన స్వరం గాలి ద్వారా అడవుల్ని దాటింది. నది తీరాన ఉన్న చిన్న గ్రామంలో సుందరి అనే యువతి తన ఇద్దరు చిన్న పిల్లలతో నిద్రపోతోంది. ఆమెకు తెలియదు, రాత్రి వాళ్ల గ్రామాన్ని ఆగంతుకులు
కవిత్వం

అర్బన్ నక్సల్

మాటాడుతున్న వారు ప్రశ్నిస్తున్న వారు రాస్తున్న వారు పాడుతున్న వారు అందరూ కూడాఅర్బన్ నక్సలే నిజానికి నువ్వు అంటున్నది బెదిరించి నోళ్లు మూయించడానికే ప్రజల వైపు ఎవరూ మిగిలి ఉండకూడదన్నదే ఈ మాట వెనక సూత్రం కానీ ఇది ఇప్పుడు ఒక అవార్డులా తయారయింది ఇలా నువ్వు ఎవరి గురించైనా చెప్పావంటే వాళ్ళు నిన్నంతగా భయపెట్టారని ప్రజలు గుర్తిస్తున్నారు స్వేచ్ఛను ఇంతలాహరించిన ప్రతిసారీ అది చీకట్లను తెంచుకుని మరలా రివ్వున పైకి లేస్తుందిగొంతులపై మోపిన ఉక్కు పాదాన్ని పెకలించే నాగలిగా రూపాంతరం చెందుతుంది సరిహద్దులలోనిసైన్యాన్ని ప్రజలపై మోహరిస్తున్న ఈ కాలంలో రైతులు నీ సరిహద్దులను చుట్టుముట్టి వున్నారు ఓట్ల
దండకారణ్య సమయం

బస్తర్‍లో సమాధానం దొరకని ప్రశ్నలు 

నారాయణపుర్ జిల్లాలోని అడవుల్లో యూనిఫాం ధరించిన ఏడుగురు మావోయిస్టులను చంపినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించిన వారం తర్వాత డిసెంబర్ 19నాడు వారిలో నలుగురి  స్వస్థలం  కుమ్మంకి వెళ్లాను. అప్పటికే వారిని ఖననం చేసేసారు. వారు సాధారణ గ్రామస్తులని, మావోయిస్టులు కాదని, తమ పొలాలకు దగ్గరగా ఉన్న పొదల్లో భద్రతా బలగాలు చంపాయని వారి కుటుంబీకులు చెప్పారు. డిసెంబరు 12 నాడు కాల్పులు జరిగినట్లు పోలీసులు చెబుతున్న ప్రదేశానికి గ్రామస్థులు నన్ను తీసుకెళ్లారు. ఇది కల్హాజా-దొండెర్‌బెడా అడవుల నుంచి రెండున్నర గంటల నడకదూరంలో ఉంది. మేము ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నప్పుడు, ఊహించని దుర్వాసన వచ్చింది. ముక్కు మూసుకుని దగ్గరకు వెళ్ళేసరికి,
సమకాలీనం

మావోయిస్టులపై యుద్ధం నేపథ్యంలో చంద్రార్కర్ హత్య

2025 మొదటి వారంలో బస్తర్‌లో 16 మంది మరణించారు. వారిలో ఒకరు యువకుడు, ధైర్యవంతుడైన జర్నలిస్టు, ముఖేష్ చంద్రార్కర్. బీజాపుర్ జిల్లాలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలకు సంబంధించి ఆయన  బయటకు తీసిన వార్తలు  ప్రభుత్వ దర్యాప్తుకు దారితీసిన ఐదు నెలల తర్వాత, ఆయన మృతదేహం రోడ్డు కాంట్రాక్టర్ కు చెందిన స్థలంలోని  సెప్టిక్ ట్యాంక్‌లో  దొరికింది. అవినీతిని బహిర్గతం చేసినందుకు జరిగిన చంద్రార్కర్ హత్య, సహజంగానే దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. అయితే ఈ ప్రాంతం మావోయిస్టుల  పోరాటంతో ఎంత సన్నిహితంగా ముడిపడి ఉందో కొద్ది మందికే తెలుసు. చంద్రాకర్ మరణించిన కొన్ని రోజుల తర్వాత, 120