స్పందన

ఐదు దశాబ్దాల విప్లవోద్యమ అనుభవం

తేదీ 31 మే, భారత విప్లవోద్యమ చరిత్రలో మరో తీవ్ర విషాద దినంగా నమోదైంది. కామ్రేడ్‌ ఆనంద్‌ (కటకం సుదర్శన్‌, దూలాదా) అనారోగ్యంతో 69వ ఏట కన్ను మూశాడని జూన్‌ 5 నాడు వార్తలలో చూసి నిర్ఘాంతపోయాను. ‘‘మన దేశాంలో చైనా అనుభవాలు మక్కికిమక్కి లేదా కొన్ని సవరణలతో అన్వయిస్తే సరైన ఫలితాలు రావు. మన దేశ నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి విప్లవోద్యమాన్ని నిర్వహించాలి. మూడు రంగాలలో ఎత్తుగడలు నూతనంగానే ఉండాలి. మనం ఈ నిర్బంధంలో నిర్మించే సంఘాలు ఒక కొత్త తరహాలో ఉండాలి. గతంలో మనకు లేని ప్రయోగాలు చేయాలి’’. అనే అభిప్రాయం ఆయనకు ఉండేది. తాత్కాలిక
స్పందన

నమ్మీకోలమ్మీ..

అమ్మీ ఓలమ్మీ ఉపాధి హామీ పనికెల్లొచ్చీసినావేటి. డబ్బులెప్పుడు పడతాయో నేదో తెలీదు కానీ ఎండతోటి గునపాం పట్టుకోనేక మట్టి కాడక తవ్వీ తవ్వీ ఇసుగెత్తిపోతే‌ నెత్తి మండిపోతున్నా తట్టల్తోని మోసుకెల్లి ముగ్గేసినట్లు గట్టు తీర్సి దిద్ది‌ ఒచ్చీసినాక ఇలా‌ గెంజి తాగి సేరబడ్డానే.  ఏటో ఈమజ్జెన ఒల్లలిసిపోయొచ్చినా సరే నిద్దర కంటి మీదకి రాక‌ టీవీ సూడ్డం అలవాటయిపోయినాదే. సీరియల్లు సూడ్డం మొదలెడితే రాతిరి పది వరకు ఆపనేం. గుంట్లకొండి పోసినామా లేదో కూడా తెలీడం లేదోలమ్మి. ఆలకి సెలవులిచ్చిన కానించి ఇంటికి జేరకుండా ఈదిలో ఆటల్తోనే కాలం గడిపేత్తున్నారే. ఈ సెల్లులొకటి కదా? ఆల్నాయన ఈమజ్జెన కొన్న