సంపాదకీయం

రాజ్యాన్ని సవాల్‌ చేస్తున్న సిలింగేర్‌, హస్‌దేవ్ పోరాటాలు

దశాబ్దాల మానవ నాగరికతలో ఆదివాసీ పోరాటాలు, వాటి యొక్క ప్రతిఫలనాలు భారతదేశ ప్రజాస్వామ్యానికి కొత్తవికాదు. అయితే ఎప్పటికప్పుడు ఆ పోరాట రూపాలు మారుతూ వస్తున్నాయి. ప్రతి కొత్తతరం తమదయిన అస్తిత్వం కోసమే కాదు, భారత ప్రజల తరపున నూతన పోరాట రూపాలను రూపొందించుకుంటున్నది. ఇది ఆదివాసీల జీవన్మరణ సమస్య కాదు. వారి వ్యక్తిత్వంలోనే కలగలసిన మనుషుల కోసం జీవించడమనే ఆకాంక్ష బలీయమైనది. వనవాసి నవలలో ఆదివాసి మహిళ భానుమతి నాకు భారతదేశమంటే తెలియదు అంటుంది. అరణ్యం మాత్రమే మా ఊరు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి నమూనా వెనుక దాగిన విధ్వంసీకరణలో భానుమతి ఆ మాట అనగలిగింది. ఒక దేశ
సాహిత్యం సమీక్షలు

జీవన లాలస – పాఠకుడి నోట్సు

1998లో అనుకుంటాను గోదావరిఖనిలో కథల వర్కు షాప్ జరిగింది. అల్లంరాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, వారాల ఆనంద్ గార్ల పూనికతో. వర్క్ షాపు అయ్యాక బొగ్గుబాయిలు చూడటానికి పోయాము అందరమూ. పాత అండర్‌గ్రౌండ్ మైనింగ్‌తో పాటు అప్పుడప్పుడే ఓపెన్ కాస్ట్ తవ్వకాలూ మొదలయిన కాలం అది. ఒక కొండను మించివున్న పేద్ద పేద్ద యంత్రభూతాలు నిజంగానే భయపెట్టాయి. నేను, రాప్తాడు గోపాలకృష్ణ, పాణీ బొగ్గు బాయిలను చూడటం అదే మొదటిసారి. లోపల భరించలేని వేడి, ఉక్కపోత, పేద్ద ఫ్యాన్లు పెట్టి గాలి లోపలికి తోలుతున్నా అది సగదూరం కూడా పోదు. ఆకు అల్లాడిన గాలికూడా రాదు. అతి తక్కువ ఆక్సిజనే
సమీక్షలు సాహిత్యం

త‌ల్లుల బిడ్డ‌ల వీర‌గాథ‌

ఆదిలాబాదు విప్లవానికి కన్నతల్లి’ అని ప్రముఖ విప్లవ కవి ఎన్‌కె అంటారు.‘విప్లవానికి సింగరేణి ఊట చెలిమ’ అని ‘తల్లులు బిడ్డలు’ అనే ఈ నవలలో పాత్రగా కనిపించే నల్లా ఆదిరెడ్డి అంటాడు.మొదటిది కవితాత్మక వ్యాఖ్య. రెండోది విప్లవోద్యమ అనుభవం. అదే ఒక సూత్రీకరణ అయింది. అదే ఈ నవల నిరూపించే సత్యం.సింగరేణి ప్రాంతంలోని బెల్లంపల్లి కేంద్రంగా హుస్సేన్‌ రాసిన ‘తల్లులు బిడ్డలు’ నవల నడుస్తుంది. అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అంతా విస్తరించి, ఇటు తెలంగాణలోని మిగతా జిల్లాల్లోకి, అటు ఆదివాసీ ప్రాంతంలోకి ఇందులోని కథా స్థలం చేరుకుంటుంది. పైకి చూడ్డానికి గజ్జల లక్ష్మమ్మ కేంద్రంగా రచన
కవిత్వం

ఎవరిదీ జెండా

దేశమంతా సంబరాలపేరుతో మాయల ఫకీరుఉచ్చులో ఊరేగుతున్న వేళ దాహమంటూ గ్లాసుడునీళ్ళు తాగితేకొట్టి కొట్టి చంపినఅపర బ్రహ్మలున్న చోట అమృతమెవడిదోవిష పాత్ర ఎవరిదోబెత్తంతో గిరిగీసినపంతుళ్ళకుఏ శిక్షా లేని చోట నీ ఇంటి మీదఏ జెండా ఎగరేయగలవుచిన్నోడా! కులమొక్కటేమతమొక్కటేఏక్ భారత్శ్రేష్ఠ భారత్అని కూస్తున్నమర్మాల మర శబ్దాలనడుమనీదీ నాదీకాని దేశం కదాఇది తొమ్మిదేళ్ళ నీచిన్ని గుండెపైమండిన అగ్ని కీలలుఆ చూపుడు వేలుచివరల మండుతూఎగసిపడతాయాఏనాటికైనా? (కుండలో నీళ్ళు తాగి చావుకు గురైన ఇంద్రా మేఘవాల్ కు క్షమాపణలతో)
కవిత్వం

వందే అని ఎలా పాడను..!?

ఈ తరం నవతరంమా తరమే యువతరంఅర్ధరాత్రి స్వాతంత్ర్యంచీకటి కోణమేఏ వెలుగు జాడ లేనినిశి రాత్రి నీడలేఅమృతం ఏడ తేనుఉత్సవం ఎలా జరపనువందేమాతరం అంటూఎలా పాడను..!? బక్క చిక్కిన బతుకులుమెతుకుల కోసం ఆరాటంఅకృత్యాల అర్ధనాదాలుఅన్నార్ధుల జాడలులేని రోజు కోసంస్వేచ్ఛకై తపిస్తున్న చోటఅమృతం ఏడ తెనుఉత్సవం ఎలా జరపనువందేమాతరం అంటూఎలా పాడను…!? ఇప్పుడు దేశ భక్తిపాదరసంలా పారుతున్నదిపౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మర్చిఅణచివేత చుట్టివేతలతోకుట్రలకు దారి తీస్తుందిడెబ్భై ఏళ్ళ స్వాతంత్ర్యంలోదేశమే జైలయి తలపిస్తున్న వేలఅమృతం ఏడ తేనుఉత్సవం ఎలా జరపనువందేమాతరం అంటూఎలా పాడను…!? ఈ మట్టి మాదిఈ దేశం మాదిహద్దులు లేని ప్రపంచం మాదిసకల శ్రామిక జనం మా నేస్తంలక్ష్మణ రేఖ
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

 బ్రెస్ట్ టాక్…

'హస్బెండ్ స్టిచ్' 3 చిన్నారి తల్లీ... నన్ను క్షమించు. ఇక ఇవన్నీ వీడ్కోలు దినాలేనా ఇక మనిద్దరికీ? నిన్నూ... నన్నూ బలవంతంగా విడదీస్తున్నారు. అదీ అసహజంగా... ఇవి నీకు పాలు మాన్పిస్తున్న సమయాలు... నీ నోటి నుంచి ఆహారం గుంజుకుంటున్న కాలాలు! ఎంత దౌర్భాగ్యం ఈ అమ్మకు... ఎంత దురదృష్టం నీకు...? పసి బిడ్డ పొట్టగొట్టి మరీ వాంఛ తీర్చుకునేవాడు మరెవరో కాదు తల్లీ... మీ నాన్న! అవును మీ నాన్నే... బాధగా వుందా పాపా? నా రొమ్ములు చిన్నగా ముడుచుకు పోతాయట నువ్వు పాలు తాగితే... నిజానికి నా హృదయం ముడుచుకు పోతుందని మీ నాన్నకు తెలీదు!
కరపత్రాలు

కార్పొరేటీకరణ – భారత రాజకీయార్థిక వ్యవస్థ సదస్సు

కామ్రేడ్‌ కనకాచారి స్మృతిలో దేశాన్ని అమ్మేస్తున్నవారే దేశభక్తిని ప్రచారం చేస్తున్నారు. దేశభక్తిలో తమను మించిన వాళ్లు లేరని దబాయిస్తున్నారు. మిగతా అందరినీ దేశద్రోహులని చెరసాలలో పెడుతున్నారు. ఇప్పుడు దేశభక్తి అంటే ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం. మోదీ తనకు ప్రియమైన ఆదానీని ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలో నిలబెట్టడం. దీని కోసం ఉన్న చట్టాలన్నిటినీ ఉల్లంఘించడం. ఇష్టం వచ్చినట్లు మార్చేయడం. నిరంకుశ చట్టాలు తీసుకరావడం. ఇదీ ఇవాళ దేశభక్తి విశ్వరూపం. దేశభక్తి రహదారిలో భారత ఆర్థిక వ్యవస్థ కార్పొరేటీకరణ అంతిమ లక్ష్యంతో శరవేగంగా పరుగులు తీస్తోంది. ప్రజల రక్త మాంసాలతో ఉత్పత్తి అయిన సంపదలను, అపారమైన సహజ వనరులను
కవిత్వం

వధ్య శిల

వధ్యశిల రజతోత్సవమ్మటబంధిఖానలు ప్రజల సొమ్మటన్యాయమే వర్థిల్లుతుందటనాయకుల ఆరాధనాలట పూలుగోయర తమ్ముడామాల గట్టవె చెల్లెలా కొత్త సంకెళ్లేమిలేవటతెల్లదొరలను దించినారటదేశ దేశములోన భారతిబిచ్చమెత్తుట మాన్పినారట గర్వపడరా తమ్ముడాపరవశింపవె చెల్లెలా ఆనకట్టలు కట్టినారటభూమి పేదలకిచ్చినారటఆకలెత్తిన ఆయుధాలనుఅణచి మేల్‌ సమకూర్చినారటభయములేదుర తమ్ముడాశీలవతివే చెల్లెలాగ్రామ పంచాయతులు పెట్టిపేదలకు నిధి పంచినారటపల్లె నుండీ ఢల్లిదాకాసోషలిజమే పారుతుందట వంతపాడర తమ్ముడాగొంతుకలపవె చెల్లెలా పదవికయినా కొలువుకయినాతెలివి ఒక్కటె గీటురాయటకులమతాలను చంపినారటరామరాజ్యము తెచ్చినారటఅందుకొనరా తమ్ముడాఆడిపాడవె చెల్లెలా అధిక ధరలను ఆపినారటదోచువారికి జైలు శిక్షటదేవళమ్ములు నిలిపినారటముక్తి మార్గం చూపినారటపూజ సలపర తమ్ముడాపున్నె మొచ్చునె చెల్లెలా ప్రణాళికల పరిమళాలటప్రతి గృహానికి ప్రాకినాయటనిరుద్యోగమ పొమ్ము పొమ్మనికొత్తగొంతుక విప్పుతారట సహన ముంచర తమ్ముడాఆలకించవె చెల్లెలా ఎవరి ప్రాణము
కవిత్వం

వినవమ్మా…

నీకు 75 ఎండ్లంటా..రోడ్ల వెంట నివాసం ఉన్నకాలి కడుపును నింపలేనందుకు,ప్రతి పుట సంబరాలు జరుపుకో.. సడక్ సందులో గుడిసేపైకప్పు లేదు,త్రివర్ణ పతాకాన్ని కప్పుదాం అంటే,శుద్ధ నీతులు చెప్పే "దేశ భక్తుల" కత్తులుఎక్కడ నా కడుపులో దిగుతాయని భయంగా ఉంది తల్లి.. నువ్వు నన్ను కన్నవంట కదమ్మ,నా జననం మురికి కాలువలోఎందుకు జరిగిందో,కొంత మంది పుట్టుక అద్దాలమేడలో ఎందుకు జరిగిందో నాకిప్పటకి తెలియదమ్మా.. మూడు రంగులునీకు అలంకరిస్తున్నరమ్మా..మాకేంటి తల్లి ఎప్పటికి జీవితాల్లో"నలుపే" కనపడుతుంది..? 75 సంవత్సరాల వయసున్న నీకు..నా దుఃఖం ఎప్పుడు వినపడుతుంది చెప్పమ్మా..?
కవిత్వం

ఎగరేద్దాం జెండాని

ఎగరేద్దాం జెండానిఆగస్టు 15 ఆనవాయితీ గదాఎగరెయ్యాల్సిందే!అయితే‌ నాదో విన్నపం…ఎవరెవరికి ఏయే సమస్యలున్నాయోఅన్నిటినీ దారంగా కట్టిమరీ ఎగరేద్దాం!.కష్టాల్నీ,కన్నీళ్ళనీ,బాధల్నీ,దీనుల గాధల్నీజెండాకు కుట్టి మరీ ఎగరేద్దాం! తస్మాత్ జాగ్రత్త!జెండా ఎగరెయ్యకపోతేNIA వాళ్ళుమన ఇళ్ళ కొస్తారుఢిల్లీకి వచ్చి సంజాయిషీ ఇమ్మంటారుఎందుకొచ్చిన ఖర్మ?ఎగరేద్దాం జెండాని!75 ఏళ్ళుగాపేదల నిట్టూర్పులఉసురు పోసుకున్నజెండాని ఎగరేద్దాం! ఇంటింటిపై ఎగిరిన జెండాలుఆగస్టు 15 తర్వాతవీథుల్లో,చెత్త కుప్పల్లోపడి దొర్లాడుతుంటేపాపం పింగళి వెంకయ్యఎక్కడున్నాడో!ఆయన ఆత్మకుశాంతి కలగాలనిలేని దేవుణ్ణి ప్రార్థిద్దాం!47 లో డాలర్ కునాలుగు రూపాయలేఈనాటికి80 రూపాయలయ్యాయనిచంక లెగరేసుకొనిఎగరేద్దాం జెండాని!దేశంలో ఎన్ని సవాళ్ళు!ఎన్ని ఉరితాళ్ళు!నోళ్ళు తెరుచుకొంటున్నఎన్నెన్ని జైళ్ళు!అన్నిటినీ గానం చేస్తూఎగరేద్దాం జెండాని!ఎగిరే జెండాని చూసిప్రజా స్వామ్యంవిరగబడి నవ్వకముందేమత్తు వదిలినిద్ర లేవకముందేఎగరేద్దాం జెండాని!