సాహిత్యం ఇంటర్వ్యూ సంభాషణ

వ‌ర్త‌మాన క‌థ‌కుల‌కు గ‌ట్టి వెన్నెముక లేదు

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  గ‌త  సంచిక‌లో ఇద్ద‌రు  సాహిత్య‌కారుల అభిప్రాయాలు  ప్ర‌చురించాం. ఈ సంచిక‌లో మ‌రో ఇద్ద‌రి స్పంద‌న‌లు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1.     కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని
సంపాదకీయం

విప్లవంలో శాంతి నిర్వచనం

ఆర్‌కె మరణానంతర జీవితాన్ని ఆరంభించాడు.  రెండు రోజులుగా ఆయన కోసం సమాజం దు:ఖిస్తున్నది. ఆయన్ను తలపోసుకుంటున్నది. ఆయనలాంటి వీరోచిత విప్లవకారులెందరినో ఆయనలో పోల్చుకుంటున్నది. ఉద్విగ్న విషాదాలతో తల్లడిల్లుతున్నది. ఆయనతో, ఆయన నిర్మించిన విప్లవోద్యమంతో రక్తమాంసాల, మేధో సంబంధం ఉన్నవాళ్ల దగ్గరి నుంచి, ఆయన రాజకీయాలతో ఏకీభావం లేని వాళ్ల దాకా అందరూ కన్నీరు కార్చుతున్నారు.   అది కేవలం ఒక మరణానికి సాటి మనుషుల ప్రతిస్పందన  కాదు. అదీ ఉంటుంది. అది అత్యంత మానవీయమైనది. నాగరికమైనది. దానితోపాటు ఆర్‌కెను ఒక వ్యక్తిగాకాక భారత విప్లవోద్యమానికి ప్రతీకగా భావించారు. విప్లవంలో రూపొందిన ఆయన మూర్తిమత్వం విప్లవానికి నిదర్శనమని అనుకున్నారు. అందుకే ఈ
ఇంటర్వ్యూ సంభాషణ

మా ఉద్యమానికి ఆయువుపట్టు భూమి సమస్యే

(శాంతి చ‌ర్చ‌ల స‌మ‌యంలో చ‌ర్చ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ స్పేస్ ప‌త్రిక కా. ఆర్కేతో చేసిన ఇంట‌ర్వ్యూ ఇది. బులిటెన్‌6(న‌వంబ‌ర్ 10, 2004)లో అచ్చ‌యింది. ఇందులో  విప్ల‌వం, వ‌ర్గ‌పోరాటం, శాంతి, స్వావ‌లంబ‌న‌, రాజ్యాధికార స్వాధీనం, ప్రాంతీయ స‌మ‌స్య‌లు మొద‌లైన ఎన్నో అంశాల‌పై ఆలోచ‌నాత్మ‌క స‌మాధానాలు చెప్పాడు. ఇప్ప‌టికీ ఇందులో చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోగా మ‌రింత జ‌టిలంగా త‌యార‌య్యాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయ‌న డెమోక్ర‌టిక్ స్పేస్ ను ప్ర‌భుత్వం ఇవ్వ‌దు. అది అయాచితంగా రాదు. మ‌న‌లాంటి దేశాల్లో ప్ర‌జాస్వామికీక‌ర‌ణ పోరాటాల ద్వారా, విప్ల‌వాల ద్వారానే సాధ్యం.. అని అన్నాడు. ఈ రోజుకూ విప్ల‌వ‌, ప్ర‌జా పోరాటాల‌న్నిటికీ దారి చూసే భావ‌న‌లు
వ్యాసాలు

ప్రజా జీవితం వెల్లి విరియడానికే మా పోరాటం

(ప్ర‌జా జీవితం వెల్లివిరియ‌డ‌మ‌నే క‌వితాత్మ‌క వాక్యానికి ఆర్‌కె ఎంత విస్తృత రాజ‌కీయ  వ్యాఖ్యానం చేశాడో ఈ వ్యాసంలో చూడ‌వ‌చ్చు. జీవితాన్ని ఈ దోపిడీ వ్య‌వ‌స్థ‌, అస‌మ సాంఘిక సంబంధాలు ప‌ట్టి ఉంచిన తావుల‌న్నిటా విప్ల‌వం జ‌రగ‌ల‌వ‌సిందే అంటాడు ఆర్‌కె. కొంద‌ర‌నుకున్న‌ట్ల విప్ల‌వం  ఏదో ఒకానొక స‌మ‌స్య ప‌రిష్కార‌మైతే ప‌రిపూర్తి కాదు. అదొక సింగిల్ పాయింట్ ప్రోగ్రాం కాదు. అది బ‌హుముఖీన‌మైన క‌ర్త‌వ్యం. ఈ విష‌యంలో విప్ల‌వకారుల అవ‌గాహ‌న‌ను ఇంత చిన్న వ్యాసంలో ఆర్‌కె రాశాడు. జీవితం వెల్లివిరిసేలా చేసుకోవ‌డం ఈ  రాజ్యం ద్వారా సాధ్యం కాద‌ని, ఈ రాజ్యాంగ ప‌రిధిలో అయ్యేప‌ని కాద‌ని చెప్ప‌డం ఆయ‌న అస‌లు ఉద్దేశం. ఇంత
వ్యాసాలు

నిషేధం ఎత్తివేత రైతుల ఆత్మహత్యల నివారణకు తోడ్పడుతుంది

(2004 అక్టోబ‌ర్ 15 నుంచి19 దాకా అప్ప‌టి రాష్ట్ర ప్ర‌భుత్వానికి, రెండు విప్ల‌వ పార్టీల‌కు మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు జ‌రిగాయి. దానికి స‌న్నాహంగా తెలుగు స‌మాజాల్లో ఒక గొప్ప భావ సంఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ మొత్తానికి విప్ల‌వోద్య‌మం వైపు నుంచి కా. ఆర్‌కె నాయ‌క‌త్వం వ‌హించాడు.  శాంతి చ‌ర్చ‌ల  నేప‌థ్యంలో  2004 జూలై నుంచి న‌డిచిన *చ‌ర్చ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ స్పేస్* ప‌త్రిక బులెటిన్‌2(జూలై 25)లో ఆర్‌కె రాసిన వ్యాసం ఇది. పాఠ‌కుల కోసం పున‌ర్ముద్రిస్తున్నాం- వ‌సంత‌మేఘం టీం) ఈ వాదన కొందరికి ఆశ్చర్యంగానూ, అతిశయోక్తిగాను అనిపించవచ్చు. కాని, సామాజిక రుగ్మతలను, అసమానతలను, అన్యాయాలను రూపుమాపడంలో ప్రజలు ఎదుర్కొంటున్న
కథావరణం కాలమ్స్

“సాహిత్య సమాజ సంబంధాల విశ్లేషణ కె.వి కూర్మనాథ్ కథలు”

జీవితాలు ఉద్యమాలే కాదు మరణాలు కూడా మనకు చాలా పాఠాలు చెబుతాయి. జీవితం కన్నా  మరణం చాలా గొప్పది. విప్లవకారుడి, ఉద్యమకారుడి మరణం ఒక చరిత్ర.  అంతులేని గాయాలు అంతు తెలియని సత్యాలు, ఎన్నో అనుభవాలు వైఫల్యాలు పోరాటాలు విజయాలు వ్యధలు దుఃఖాలు ఇవన్నీ కలగలిసిన చరిత్ర ఒక వీరుడి మరణం. ఒకానొక చారిత్రక సందర్భంలో ఇక్కడ నిలబడి వెనుదిరిగి చూసుకుంటే, ఉద్యమం వెనుక కారణాలు, ఉద్యమం బలపడిన సందర్భాలు, ఉద్యమం బలహీన పడిన సందర్భాలు, ఆటుపోట్లు వెన్నుపోట్లు ఆంక్షలు నిర్బంధాలు అణచివేతలు, వ్యక్తులు అదృశ్యం కావడం, మనుషులు శవాలుగా మారటం, శవాలు కూడా కనిపించకుండా పోవడం.. అనేక
సాహిత్యం కవిత్వం

మీరూ… నేనూ… వెన్నెలదారుల కొన్ని మందారాలూ

నే నడిచానాఅంతంత దూరం ఏనాడైనామోశానా అంతంత భారం ఎన్నడైనాపూసినకాసెగడ్డిలో పేట్లఇరుకు దారులవెంటనల్లమలలో ఆ రాత్రి నానడకనిన్ను కలవడానికోనన్ను నేను వెతకడానికో వెన్నెల నీడల మాటునచుక్కలపూల దుప్పటి కప్పుకొనిఆ రాత్రి కొండలన్నీ గడిచానానిన్ను నన్ను కలిపేవేగును అతివేగంగా అనుసరించానాయేగిరంగా నీ ముంజేతిని ముద్దాడాలన్నపిచ్చి తాపత్రయం యేనాటికీ కోసు అంచు కొసలమీద దీర్ఘకాలపు నడకడస్సిపోయోనీ ఆలోచనల్లో మునిగిపోయో…తూలి ఆవలలోయలో పడబోయానునాగురించి చెప్పేపంపావు వాళ్లకు….రెప్పలకింద దాచుకుతెమ్మనినీవు అప్రమత్తుడవు. కలిశానా! ఎట్టకేలకుతెల్లని కోరమీసం కొసనచల్లనినీ నవ్వువెన్నెలపూసి పొగడదండలైనచెట్లమొదలచిక్కని పచ్చనాకుల దాపునమనమిద్దరమో ముగ్గురమో పలువురమోగలగలమని వనమంతా విరిసినమాటలుకొసరు కబుర్లు కొన్ని….కనుల మధ్యవాలిన మౌనాలు మరిన్నిజమేదారి కోయిలో… జమేదారికోయిలో…పాటలు పవనమై ఆడివంతా వీచిభయం లోనో… మోహంలోనో సంభ్రమమైన
సాహిత్యం కవిత్వం

అతడు రేపటి పొద్దు

మరణం మౌనం కాదునిశ్శబ్దన్ని బద్ధలుకొట్టడమే.ఆశయం కోసం నడిచి అలసిపోలేదు,ఆరిపోలేదు.అడుగుల చప్పుడు ఆశయం కోసం వినబడుతూ వున్నాయి. చెదలు పట్టిన సమాజం నుచర్చలతో ఛేదించలేమన్నారువిఫలం అయితేవిప్లవమే అన్నాడు.యుద్ధంకోసంమాటీచ్చి మరిచిపోలేదు.వాగ్దానంగనిలబడ్డాడు. మృత్యువు ముచ్చట పెట్టినచివరిరక్తం బొట్టుచిందించిండు.మాయదారి రోగంమందలించినపోరుదారికి మరణంలేదన్నడు. చిగురించిన వసంతములోమేఘమై కురుస్తానని.రేపటి పొద్దుకుమాటిచ్చిన వీరుడతడు. 15-10-2021
సాహిత్యం కథలు

అమ్మను చూడాలి

" ఏమిటండీ? అలా ఉన్నారు? ఒంట్లో బాగానే ఉంది కదా!" జానకి అడిగింది కోర్టు నుండి వచ్చినప్పట్నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న భర్తను. " ఇవాళ కోర్టులో ఒక వింత కేసు వచ్చింది ...""సరిపోయింది. కోర్టు పిచ్చి.. ఇంటి దాకా తెచ్చుకున్నారా? నేను ఇంకా  ఏమిటోనని భయపడ్డా !లేవండి భోజనానికి."           జానకి కోటయ్య మాటలు పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయింది .జానకి ఎప్పుడూ అంతే. తను చెప్పదలుచుకున్నది చెప్పడమే గానీ తన మాట  విన్నది ఎపుడని?  అందుకే తను మాట్లాడడమే మానేసాడు అవసరమైతే తప్ప. అప్పుడైనా తన మాట నెగ్గదు. అయినా జానకి నోటి దురుసు కు జంకి 
సాహిత్యం కవిత్వం

కవాతు..

ఇప్పుడు ఒక నిశ్శబ్దంకమ్ముకున్నది దుఃఖమొక్కటేభాషగా మారింది ఎవరికి వారుమౌనంగాసంభాషిస్తున్న సమయం చిరునవ్వుల సితారాపల్లవించనివిషాద సందర్భం మీరలా చేరగిలబడినఆ మద్ది వృక్షంవిషాద సంకేతంగారాల్చిన ఆకులనుమీ దేహం పై వేస్తూ మీరు దాహంతీర్చుకున్న ఈ సెలయేరుదుఃఖిస్తూ ఉప్పగా మారింది మీతో కలిసి పాడినపక్షుల గుంపులుమౌనంగా రోదిస్తున్నాయి యుద్ధానికి సంకేతంగామారిన సాకేత్ దాదాఎక్కడని కుందేళ్ళగుంపు అడవినంతాగాలిస్తున్నాయి శతృవు గుండెల్లోపేలిన ప్రతి తూటానెత్తురంటినకంటితో వినమ్రంగావిప్లవ జోహార్లర్పిస్తున్నాయి మీరు నేర్పిన నడకతోవిస్తరించి సరిహద్దులనుచెరిపేసిన ప్రజా పంథాకన్నీటిని ఒత్తుకుంటూఎర్రజెండాను ఎత్తిపట్టింది వీరునికితంగేడు పూల మాలలతోవీడ్కోలు పలుకుతూకదులుతోందిప్రజా యుద్ధ కవాతు.. (కామ్రేడ్ ఆర్కే స్మృతిలో)