సాహిత్యం కవిత్వం

ఒక రహశ్యం చెబుతా..

పట్టుపరుపులు లేవుజారి పడేంత నునుపైన కట్టడాలూ లేవు అప్పుడంతానడక నేర్పిన పూల దారుల పెరళ్ళవిఆకాశాన్ని పొదివిపట్టిన ఆనందమదినిలబడిన నేల మట్టిని శ్వాసించిన ఒకానొక విజయమదిఅప్పట్లో మనుషులుండే వారని చెప్పుకునే అరుదైన క్షణాలూ అవే! ఇప్పుడుఏవేవో లెక్కలు వేసుకుని రెండుగా చీలిపోయాంఇద్దరి మధ్యా కొలవలేనంత దూరంవేలు పెట్టి చూపిస్తూ!కూడికలు ముందు స్థానంలో ఉన్నాయనుకుంటాం కానీఆకాశాన్ని భూమిని మింగేసిన లెక్కకు తేలనితీసివేతల జాబితా అదంతా!మెదడు అట్టడుగు పొరల్లోపూడుకు పోయిన అవశేషాల నిండు గర్భమది! ఈ మాట వినగానే గుండె పాతాళంలోకి జారిపోయిందా!?నీ చోటు ఇదేనని నొక్కి వక్కాణిస్తోందా!?ఎవరు ఏమైనా అనుకోనీఒక మాట మాత్రం చెప్పుకోవాలిప్రపంచమిప్పుడు విలువల్ని వివేకాన్నిప్లాస్టిక్ జార్ లో కుదించిన
వ్యాసాలు

మానవ హక్కులపై నిలదీసిన యుఎన్‌హెచ్‌ఆర్‌సి

దేశములో మానవ హక్కుల పరిస్థితి దారుణంగా తయారైందని, తీవ్రవాద నిరోధక చట్టాల పేరుతో పౌర సమాజంపై ఆంక్షలు విధిస్తున్నారని, ఐరాస మానవ హక్కుల కమీషన్‌ ఆధ్వర్యంలో జెనీవాలో నవంబర్‌ 10న జరిగిన వార్షిక సమావేశంలో భారత్‌ను పలుదేశాలు నిలదీయడం జరిగింది. సభ్య దేశాలైన 193 దేశాలలో పౌర, మానవ హక్కుల పరిస్థితిపై ఐరాస మానవ హక్కుల మండలి ఐదు సంవత్సరాల కొకసారి సమీక్ష జరుపుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అదనపు సమావేశాలకు పిలుపు నిస్తుంది. మానవ హక్కుల మండలిలో 43 దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలలోని మానవ హక్కుల పరిస్థితి నివేదికలపై సమీక్ష చేస్తారు. సభ్య దేశాల నుంచి మానవ
సాహిత్యం కవిత్వం

వసంత మేఘమై కురస్తాం.

దిగులు పడకు నేస్తంవర్గ పోరాటాల చరిత్ర మనది.రేపటి సూర్యోదయం కోసం త్యాగం అనివార్యమైనది.తూర్పు పవనానాలువికసిస్తున్నాయి.అక్రమ చట్టాలతోమతాల మరణహోమం జరుగుతున్నది.బూటకపు ప్రజాస్వామ్య వ్యవస్థలకుళ్లును కడుగుదం.రండి నేస్తం…త్యాగం బాటలో చిందిన రక్తంను విత్తనాలుగా చల్లుదాం.నేల రాలిన చోటపువ్వులు వికసిస్తున్నయ్.కష్టాలు కన్నీళ్లు లేనిసమాజం కోసం కవాత్ చేద్దం..రేపటి వసంతం కోసంకదలి రండి .మరో వసంత మేఘమై కురస్తాం…..
సాహిత్యం కొత్త పుస్తకం

విప్లవాన్వేషణలో…..

ఇది విప్లవకారుడు రాంప్రసాద్ బిస్మిల్ ఆత్మకథ. 1925 ఆగస్టు 9న అంటే ఇప్పటికి తొంభై ఏడేళ్ల క్రితం కాకోరీ రైలునాపి ఖజానా కొల్లగొట్టిన విప్లవాకారుల బృంద నాయకుడు రాంప్రసాద్ బిస్మిల్ ఆత్మకథ. కాకోరీ కుట్ర కేసుగా ప్రసిద్ధమైన నేరారోపణలో శిక్షలు పడిన విప్లవకారుల కథ. వీరిలో రాంప్రసాద్ ‘బిస్మిల్’, అష్ఫఖుల్లా ఖాన్ ‘వారాసీ’, రాజేంద్రనాథ్ లాహిరి స్వయంగా ఖజానా కొల్లగొట్టిన ఘటనలో పాల్గొన్నవారు. వీరిలో రాజేంద్రనాథ్ లాహిరిని అప్పటి సంయుక్త రాష్ట్రాల (ఇప్పటి ఉత్తరప్రదేశ్) గోండా జైలులో నిర్ణీతమైన తేదీకి రెండు రోజుల ముందే 1927 డిసెంబర్ 17న ఉరి తీశారు. ఎందుకంటే అతన్ని నిర్ణీత తేదీకి ముందే
సాహిత్యం కొత్త పుస్తకం

ఒంటరి గానం కాదు. సామూహిక గీతం.

ఏ బిందువు దగ్గర మొదలు పెట్టాలో తెలిస్తే చివరాఖరి వాక్యమేదో స్పష్టమౌతుంది. ఆరంభం, కొనసాగింపు తేలికయిన విషయం కాదు. విరసం ఆరంభం కూడా ఆలా జరగలేదు. నిరసన, ఆగ్రహ ప్రకటన ద్వారా మాత్రమే విప్లవ రచయితల సంఘం ఏర్పడలేదు. ఒక నిర్మాణం వెనుక అచంచల విశ్వాసం, నిమగ్నత మాతమ్రే సరిపోదు. ప్రజల నుండి ప్రజలకు ప్రవహించే సన్నటి నీటిధార అనేక దాహార్తులను తీర్చుతూ, అనేక ఖాళీలను పూరిస్తూ సాగవలసి ఉంటుంది. ఈ నడకలో కొన్ని ఖాళీలు కొత్తగా కనబడవచ్చు. దేనికయినా అన్వేషణే ముఖ్యం. విరసం యాభై ఏళ్ల సందర్భంగా పర్‌స్పెక్టివ్‌ ప్రచురణగా ‘50 ఏళ్ల విరసం పయనం ప్రభావం’
సాహిత్యం కొత్త పుస్తకం

పిల్లల కలల ప్రపంచం

పిల్లల సినిమాలని వాటి సమీక్షలని విశ్లేషించే ముందు మనం మన బాల్యంలోకి తొంగి చూడాలి. మనల్ని ఆకట్టుకున్న సినిమాలు, మనపై ప్రభావం చూపిన సినిమాలు గుర్తొస్తాయి. అవి ఎందుకు ప్రభావం చూపించాయో ఇప్పుడు వయసుపెరిగాక మరో కోణంలో అర్థమవుతుంది. వాటిని పిల్లల కోసం తీసిన సినిమాలుగా, పిల్లల గురించి పెద్దల కోసం తీసిన సినిమాలుగా విభజించవచ్చు. పిల్లల కోసం తీసిన సినిమాలు ఏ వయసు వారి కోసం తీశారో కూడా చూడాలి. ఎందుకంటే, వారి వారి వయసుని బట్టి జ్ఞాన సముపార్జన, అవగాహన వుంటాయి. వారి మానసిక ఎదుగుదలకి అనుగుణంగా మనం వారికి విజ్ఞానాన్ని అందించగల్గితే వారు ఎంతో
సాహిత్యం కొత్త పుస్తకం

విధ్వంస, నిర్మాణాల కొత్త ప్రపంచపు కథలు

ఇవి ఈ తరం విప్లవ కథలు. సరిగ్గా ఇప్పటి మనందరి జీవితానుభవంతో సరిపోలే కథలు. మన అనుభవ పరిధికి ఆవల ఉన్న వాస్తవికతలోకి మనల్ని నడిపించే కథలు. అదే ఈ కథల ప్రత్యేకత. ఇందులో పదకొండు కథలే ఉన్నాయి. ఇవన్నీ విప్లవ దృక్పథ వైశాల్యాన్ని చూపిస్తాయి. ‘కొన్ని రంగులు ఒక కల’ అనే కథతో పావని కథా రచనలోకి అడుగుపెట్టింది. విరసం నిర్వహిస్తున్న కథల వర్క్‌షాపులు కథకుల కలయికకు, అభిప్రాయాల కలబోతకే పరిమితం కాకుండా కొత్త కథల, కథకుల తయారీ కేంద్రాలనడానికి ఒక ఉదాహరణ పావని. సాహిత్యం, రాజకీయాలు, ప్రజా ఉద్యమాలపట్ల ఇష్టంతో పావని సాహిత్యోద్యమంలోకి వచ్చింది. తన
సాహిత్యం కొత్త పుస్తకం

ఒక పల్లెటూరి పిల్ల ప్రయాణం

గత పది సంవత్సరాలుగా కథలు రాస్తున్న పావని తన కథల సంకలనానికి ముందు మాట రాసివ్వమని అడిగింది. పావని వయస్సు రీత్యా మా చిన్నమ్మాయి తోటిది. విరసం సభల్లో, కథల వర్క్‌ షాపుల్లో ఇప్పటి యువతరపు ప్రతినిధిగా పరిచయం. వాళ్ల తాతది మధ్యతరగతి పై కులపు వ్యవసాయ కుటుంబం. కడప జిల్లాలోని పులివెందుల. గిట్టుబాటు కాని వ్యవసాయ గ్రామాల్లో ఊపిరిసలపనివ్వని భూస్వామిక ముఠా తగాదాలు, 1947లో అధికారమార్పిడి జరిగిన తర్వాత పల్లెల్లోకి అందివచ్చిన పాఠశాలలు, పావని తండ్రి చదువుకుని ఉద్యోగస్తుడిగా ప్రొద్దుటూరుకు మారారు. అప్పటికే పల్లెలనొదిలి పట్నాలలో స్థిరపడ్డ కుటుంబానికి చెందిన పావని అమ్మగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. అంటే
సాహిత్యం కొత్త పుస్తకం

లందల్ల ఎగసిన రగల్‌ జెండా… సలంద్ర

అతడు యిందూరు లందల్లో ఉదయించిన తొలిపొద్దు. వెలి బతుకుల్ని ప్రేమించిన ఎన్నెల కోన. దోపిడీ, పీడన, అణచివేత, వివక్షల నుంచి విముక్తి దారిని కలగన్న స్వాప్నికుడు. నిప్పుల పాటల డప్పై మోగిన ధిక్కార గీతం. మతోన్మాద ఆగడాలపై కాగడాలా రగిలిన రాడికల్‌ రగల్‌ జెండా. అతడు ఉస్మానియా శిగన మెరిసిన మోదుగు పూవు. అక్షరాల్ని ప్రేమించి అగ్నిపర్వతాల్ని రాజేసిన తుడుం మోతల యుద్ధగీతం. హోరెత్తే రేరేలా పాటల్లో ఆదిమ గానం. అతడు విప్లవ కవి సలంద్ర. కవి, రచయిత, జర్నలిస్టు, విప్లవకారుడు. ఎక్కడి యిందూరు!. ఎక్కడి హైదరాబాద్‌!. దారి పొడవునా నెర్రెలు వారిన బీళ్లను గుండెలకు హత్తుకున్నాడు. గుక్కెడు
సాహిత్యం కొత్త పుస్తకం

ఇసుకపర్రల్లో చెరిగిపోతోన్న పాదముద్రలు

నీ మూలం యెక్కడనది నవ్విందికాగజ్ దిఖావోనది నడక ఆపిందివెనక్కి పోనది అదృశ్యమైంది మనిషి కూడా నదిలా ప్రవాహశీలే . పుట్టిన చోట మనుషులు యెవరూ పాతుకుపోయి వుండరు. పొట్ట చేతబట్టుకుని పక్షుల్లా పలుదెసలకు పయనిస్తారు.  వలసపోతారు (అందరం అమ్మ కడుపునుంచి భూమ్మీదకి వలస వచ్చినవాళ్ళమే. కాకుంటే సామ్రాజ్య విస్తరణవాదుల ఆధిపత్య వలసలు వేరు; శ్రమజీవుల పొట్టకూటి వలసలు వేరు). అలా బెంగాల్ నుంచి అస్సామ్ బ్రహ్మపుత్ర పరివాహ ప్రాంతాలకు బ్రిటిష్ పాలకులు రవాణా చేస్తే కూలీలుగా వలస వచ్చిన ముస్లింలు  మియాలు. మేం మియాలం కాదు అసోమియాలం అంటారు వాళ్ళు( నేను చారువా (ఇసక మేటవాసి) ని కాను,