సాహిత్య విమర్శలో కెవిఆర్ చారిత్రక దృక్పథం
ఇది కెవిఆర్ శతజయంతి సంవత్సరం. ఆయన మార్చి 23, 1927న జన్మించారు. 1948లో తన 21వ ఏట అభ్యుదయ రచయితల సంఘంలో చేరారు. 1998 జనవరి 15న తన 71వ ఏట విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడిగా కన్నుమూశారు. సరిగ్గా యాభై ఏళ్లు సాహిత్య సాంస్కృతిక మేధో ఉద్యమాల్లో తలమునకలుగా ఉన్నారు. ఆ ఉద్యమాల ప్రధాన నాయకుడిగా, వ్యాఖ్యాతగా, పెద్ద దిక్కుగా కొనసాగారు. వందేళ్ల భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో యాభై ఏళ్లు పార్టీతో కలిసి నడిచారు. సిపిఐ దగ్గరి నుంచి సిపిఐ ఎంఎల్ పీపుల్స్వార్ దాకా ఆయన ప్రయాణం సాగింది. కేవలం పార్టీ అభిమానిగా, శ్రేయోభిలాషిగా కాదు.










