సంపాదకీయం

కా. గొంజాలోకు జోహార్లు

పెరూ తొలితరం మావోయిస్టు, షైనింగ్‌ పాత్‌ నిర్మాత, ప్రజాయుద్ధ సంస్కృతిని లాటిన్‌ అమెరికా పోరాట ఆచ‌ర‌ణ‌లో ఎత్తిప‌ట్టిన  గొప్ప మార్క్సిస్టు-లెనినిస్టు  కామ్రేడ్‌  గొంజాలోకు విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం జోహార్లు! ప్రపంచ సోషలిస్టు విప్లవాన్ని వెలిగించిన 1980ల తరం మావోయిస్టు  మేధావి చివరి ముప్ఫై ఏళ్ల జీవితం జైలులోనే గడిచిపోయింది. పెరూలోని నావికా స్థావరంలోని ఆస్పత్రిలో 2021 సెప్టెంబరు 11వ తేదీన గొంజాలో 86 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా పార్కిన్సన్‌, చర్మ కేన్సర్‌తో ఆయన బాధపడుతున్నారు. ఈ స్థితిలో కూడా ఆయనకు వైద్య సాయాన్ని ప్రభుత్వం నిరాకరించింది. చివరకు తన భార్యతో ఇంటర్వ్యూను సైతం రద్దుచేసింది.
వ్యాసాలు

రాజును చంపడం ఎందుకు తప్పు?

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ పసిపాపను అత్యంత దుర్మార్గంగా అత్యాచారం చేసి చంపిన రాజు రైలు పట్టాలపై శవమయ్యాడు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడా, అతన్ని చంపేసి పట్టాలపై పడేశారా అన్న విషయంపై అనుమానాలున్నాయి కాని జనం న్యాయం జరిగిందని ఊపిరి పీల్చుకున్నారు. నిలువెల్లా గగుర్పాటు కలిగించిన సైదాబాద్ సంఘటనకు చలించని మనసు లేదు. ఎంత మంది తమ పిల్లలని పొదువుకొని గుండెలు గుబగుబలాడగా దుఃఖితులై ఉంటారో అందరూ ఆ పని చేసినవాడ్ని ఏం చేసినా పాపం లేదని అనుకొని ఉంటారు. అందరూ శపించినట్లుగానే రాజు దిక్కులేని చావు చచ్చిపోయాడు. న్యాయం జరిగిందని చాలా మంది అనుకుంటున్నారు. నిజంగా న్యాయం
సాహిత్యం సంభాషణ

సాహ‌సోపేతంగా పురోగ‌మించండి

(ఛైర్మన్ గొంజలో ఉపన్యాసం) (ఆయ‌న త‌త్వ‌శాస్త్ర ఆచార్యుడు. విశ్వ‌విద్యాల‌యంలో పాఠాలు చెప్పేవాడు.  ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర పాఠాలు నేర్చ‌కోడానికి  యూనివ‌ర్సిటీని వ‌దిలేశాడు.    నేర్చుకోవ‌డం అంటే నేర్పించ‌డం అనే గ‌తిత‌ర్కం తెలిసిన‌వాడు. ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయాలు నేర్పించాడు. ఆయ‌నే పెరూ విప్ల‌వ నాయకుడు కా. గొంజాలో. ఆ దేశంలో ప్ర‌జా యుద్ధ మార్గ‌ద‌ర్శి. ప‌థ నిర్దేశితుడు. ఆయ‌న నాయ‌క‌త్వంలో పెరూ ప్ర‌పంచ పీడిత వ‌ర్గానికి ఆశారేఖ‌లాగా వెలుగొందింది. ఆ ఉద్య‌మాన్ని దెబ్బ‌తీయ‌డానికి అమెరికా, పెరూ పాల‌క‌వ‌ర్గాలు  ఆయ‌న‌ను నిర్బంధించాయి. ముప్పై ఏళ్లుగా క‌ఠిన కారాగార శిక్ష  అనుభ‌విస్తూ ఈ నెల 11న అమ‌రుడ‌య్యాడు.  ఆయ‌న ప్ర‌జ‌ల‌కు   కాల‌పు ప్ర‌పంచ మేధావుల్లో ఒక‌రు. 
కాలమ్స్ కవి నడిచిన దారి

ఒక్కడుగు

అసలింకా నడవాల్సిన దారి తెల్సిందా ? ఈలోగానే ‘నడచిన దారంటే' దేన్ని గురించి రాయమని ? ఎంతో కలసివస్తే (?) తప్ప, వయసెప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. స్థిర చరాస్థులు; వాటికోసం చేసే అప్పులూ, కట్టే వడ్డీలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు; పండుగలూ, పబ్బాలూ, ఫంక్షన్లూ, దర్బార్లూ, జబ్బులూ, మందులూ, ఒకటేమిటి ? అన్నీ పెరుగుతాయి. వీటి మధ్య గడుస్తున్న కాలమే నన్ను నడిపిస్తున్న దారా ? అలా అని, తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళనట్లేదు. దారంటే; అసలేం తెలియకుండా వేసిన తొలి అడుగు. తెలిశాక ఆగలేని బ్రతుకు. ఏం ? నువ్వే ఎందుకు రాస్తావు కవిత్వం ? నిన్నే
ఓపెన్ పేజీ

వాళ్లు తాలిబాన్ల‌కంటే భిన్నంగా ఉన్నారా?

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి రావడం వారి మునుపటి పాలన జ్ఞాపకాలను తాజా చేసింది. ఆ సమయంలో తాలిబాన్లు షరియాకి తమ సొంత పద్ధతిని, మహిళలపై భయంకరమైన అణచివేతను అమలు చేశారు. వారు  పురుషులను కూడా విడిచిపెట్టలేదు. పురుషులకు ప్రత్యేక దుస్తులు, గడ్డం తప్పనిసరి చేసారు. బమియాన్‌లోని గౌతమ్ బుద్ధ భగవానుని పురావస్తు ప్రాముఖ్యత కలిగిన విగ్రహాలను కూడా తాలిబాన్లు కూల్చివేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబాన్‌లను భారతీయ ముస్లింలలో ఒక చిన్న విభాగం స్వాగతించింది. వారి దృష్టిలో ఇది విదేశీ ఆక్రమణదారులపై ఇస్లాం విజయం. ఈ పరిణామంతో చాలా మంది ముస్లింలు, ముఖ్యంగా ముస్లిం
సాహిత్యం సంభాషణ

మరణానంతర ప్రేమ లేఖ

యాప నారాయణ హరిభూషణ్‌గా ఎదిగిన క్రమం మనసు తెరమీద రూపు కడుతున్నది. మానుకోట దొరల గడీల చుట్టూ మర్రి ఊడల కింద మొలిచిన గడ్డి మొక్కలు ఆంబోతులను బంధించిన ముకుతాళ్లలో బిగిసిన పిడికిళ్లు గుర్తుకొస్తున్నాయి. ఆదివాసి జీవితం ఒక విప్లవ పాఠశాల అయిన క్రమం వరంగల్‌ ఆర్ట్స్‌ సైన్స్‌ కాలేజీ విద్యార్థిగా జ్ఞానం అంటే రాడికల్‌ మార్పు అని నేర్చుకున్న  చదువులు. అప్పటి అధ్యాపకులు అందరు ఆ విద్యార్థుల దగ్గరే నేర్చుకున్నామన్నారు. సమాజాన్ని చదువుకోవడం.  ఖమ్మం జిల్లాలో చేపట్టిన విప్లవోద్యమ విస్తరణ,  తెలంగాణా మీదుగా దండకారణ్యం దాకా రెండడుగులు నాలుగు అడుగులుగా నడిచింది. రెండు గుండెలు ఒక దండోరాగా
సాహిత్యం సంభాషణ

ఛైర్మన్ గొంజలో వర్ధిల్లాలి , అతని శక్తివంతమైన, ప్రభావశాలియైన ఆలోచనా విధానం వర్ధిల్లాలి!

సాధారణ రాజకీయ పంథాలో ఛైర్మన్ గొంజలో వివరణలు,  ప్రపంచ విప్లవానికి అందించిన రచనలు: మార్క్సిజం- లెనినిజం -మావో ఆలోచనా విధానం లేకుండా, గొంజలో ఆలోచనా విధానాన్ని ఊహించలేము, ఎందుకంటే అది మన వాస్తవికతక మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానపు సృజనాత్మక అనువర్తనం. శ్రామికవర్గ భావజాలపు చారిత్రక అభివృద్ధిని, మావోయిజం ప్రధానమైనదిగా ఆ భావజాలం మార్క్సిజం-లెనినిజం-మావోయిజంగా రూపుదిద్దుకున్న మూడు దశలను అర్థం చేసుకోవడం అనేది ఇందులో కీలకాంశం. సారాంశంలో, మార్క్సిజం-లెనినిజం-మావోయిజాన్ని ఒక విశ్వజనీన సత్యంగా పెరూ విప్లవ నిర్దిష్ట  పరిస్థితులకు అన్వయించడం అనేది ప్రధానమైనది. అందువల్ల గొంజలో ఆలోచనా విధానం పెరూ కమ్యూనిస్ట్ పార్టీకి, ఆ పార్టీ నాయకత్వంలో జరుగుతున్న విప్లవానికి ప్రత్యేకంగా ప్రధానమైనది. గొంజలో ఆలోచనా విధానంలోని
కాలమ్స్ సమకాలీనం

అమెరికా నిష్క్రమణ దేనికి సంకేతం?

రెండు దశాబ్దాల క్రితం ఉగ్రవాదం అణచివేత పేరుతో ఆఫ్ఘన్ నేల పై అడుగుపెట్టిన అమెరికా అవమానకరమైన రీతిలో తట్టా బుట్టా సర్దుకొని విమానమెక్కి ఉడాయించింది. రెండేళ్లుగా తనకు ఏ ప్రమాదం తలపెట్టకుండా వెళ్లనీయండoటూ తాలిబాన్ లతో రహాస్యంగా దోహలో మొదలైన చర్చలు పరిపూర్ణం కాకుండానే తానే విధించుకున్న గడువు ముంచుకు రావడంతో వియత్నాం ను విడిచివెళ్లిన చారిత్రక దృశ్యాలను ప్రపంచానికి మరోసారి గుర్తుకు చేస్తూ మరీ నిష్క్రమించింది అమెరికా. ఉగ్రవాదాన్ని అణచడమే మా పని.. జాతి నిర్మాణం కాదని ఇప్పుడు అంటోంది.  1980 తొలినాళ్లలో సోవియట్ సేనలను ఎదుర్కొనేందుకు తానే నాటిన ఛాందస బీజాలు నేడు పెరిగి పెద్దయిన
కాలమ్స్ ఆర్థికం

అవినీతి, దోపిడీల‌ను పెంచే క్రోనీ క్యాపిటలిజం

ఊసరవెల్లి రంగులు మార్చుకున్నట్లు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ కూడ అనేక రూపాలలో కొనసాగుతుంది. అందులో ఒకటి క్రోనీ క్యాపిటలిజం. (ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం) అని మనం పిలుస్తున్నాం. ఆసియా టైగర్‌గా పిలువబడే నాలుగు దేశాలు దక్షిణ కొరియా, తైవాన్‌, సింగపూర్‌, హాంకాంగ్‌ దేశాలు వేగంగా పారిశ్రామికీకరణ చెంది 1960-96 వరకు సంవత్సరానికి 7 శాతానికి పైగా ఆర్థిక వృద్ధి రేటును కొనసాగించాయి. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐయంఎఫ్‌) సంస్థలు ఆ దేశాల అభివృద్ధి తీరును బాగా శ్లాఘించాయి. అయితే 1997లో ఆసియా టైగర్‌ దేశాల ద్రవ్యవ్యవస్థ ఒకేసారి కుప్పకూలింది. అయితే ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లు ఆసియా టైగర్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు