మన హృదయం, ఆలోచనలు, చేతులూ పాలస్తీనా కోసమే
70 ఏళ్లుగా ఆ నేల పాలస్తీనా ప్రజల రక్తంతో తడుస్తోంది. వాళ్ల తమ జాతి విముక్తి ఆకాంక్ష ప్రపంచమంతా పిక్కటిల్లుతోంది. ఆ పక్కనే ఇజ్రాయిల్ దారుణాలు వినిస్తున్నాయి. అరబ్బుల నిర్మూలనే లక్ష్యంగా ఏర్పడింది ఇజ్రాయిల్. ఈ మే 14తో దాని దురాక్రమణకు 70 ఏళ్ళు నిండుతాయి. ఈ 70 ఏళ్ల కాలంలో లెక్కలేనన్ని సార్లు అది పాలస్తీనా ప్రజల అంతమే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ సారి దానికి మే 7 ను ఎంచుకుంది. జెరూసలెంలోని ఓల్డ్ సిటీలో అల్-అక్సా మసీదు కాంప్లెక్స్ ఉంది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఇది ఒకటి. రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా