సంపాదకీయం

మ‌న హృద‌యం, ఆలోచ‌న‌లు, చేతులూ పాల‌స్తీనా కోస‌మే

70 ఏళ్లుగా ఆ నేల  పాలస్తీనా ప్రజల రక్తంతో త‌డుస్తోంది. వాళ్ల తమ జాతి విముక్తి  ఆకాంక్ష ప్ర‌పంచ‌మంతా పిక్క‌టిల్లుతోంది. ఆ ప‌క్క‌నే ఇజ్రాయిల్ దారుణాలు వినిస్తున్నాయి.  అరబ్బుల నిర్మూలనే లక్ష్యంగా ఏర్పడింది ఇజ్రాయిల్. ఈ మే 14తో దాని దురాక్రమణకు 70 ఏళ్ళు నిండుతాయి. ఈ 70 ఏళ్ల కాలంలో లెక్కలేనన్ని సార్లు అది పాలస్తీనా ప్రజల అంతమే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ సారి దానికి మే 7 ను ఎంచుకుంది. జెరూసలెంలోని ఓల్డ్ సిటీలో అల్-అక్సా మసీదు కాంప్లెక్స్ ఉంది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఇది ఒకటి. రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా
వ్యాసాలు

దండకారణ్యంలో సైనిక దాడులు

(మార్చి 31న రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసంఘాల కార్యకర్తల ఇండ్ల మీద ఎన్ఐఏ దాడులు మొదలుకావడానికి కొన్ని గంటల ముందు రాసిన వ్యాసం.. అముద్రితం- సంపాదకుడు) కళ్ల ముందరి సత్యం  తెలుపు న‌లుపుల్లో క‌నిపిస్తుంద‌న్న గ్యారెంటీ ఏమీ లేదు. అది మ‌న చుట్టూ క్రీనీడల్లో కనిపించకుండాపోవచ్చు. ఈ సమస్యను తప్పించుకోడానికి పదునైన చూపు ఉండాలనుకుంటాం. కానీ న్యాయా న్యాయాలపట్ల మన వైఖరులతో, విలువలతోసంబంధం లేకుండా మన చూపు పదునెక్కబోదు. చుట్టూ ఉన్న సంక్షోభాలను, పోరాటాలను అర్థం చేసుకోవడంలో ఈ పరిమితిని  అధిగమించగలమా? లేదా? అనేదే ప్రశ్న.దేనికంటే మనుషుల్లోని సకల ఉత్తేజాలను పాలకవర్గం నిరంతరం కొల్లగొడుతూ ఉంటుంది. దానికి ఒక
కథలు

అడవి నేర్పిన అమ్మతనం

(ఒక మీనూ, ఒక మానో, ఒక పుష్ప, ఒక సుజాత) మీనూ, నీవు ఒక పాపకు తల్లివి. ఒక ఇల్లాలివి. నేనూ ఒక తల్లిగా నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. బిడ్డను కోల్పోయిన తల్లి వేదన ఎలా ఉంటుందో స్త్రీగా, తల్లిగా నాకు చెప్పాల్సిన పని లేదనే నమ్మకంతో రాస్తున్నాను. ఇప్పుడు నేను జీవితంలో ఇంకెన్నడూ చూడలేని నా కూతురు యోగితా జ్ఞాపకాలను మోస్తూనే నీతో మాట్లాడుతున్నా. బిడ్డను కోల్పోయిన కన్నీటి తడి ఇంకా ఆరక ముందే, పొంగి వచ్చే దుఃఖాన్ని అది మిపట్టుకుంటూ ఇలా రాస్తున్నాను. నీ భర్త కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హస్ గెరిల్లాల
వ్యాసాలు

ఆ త‌ల్లుల త్యాగాలు గుర్తున్నాయా?

చరిత్రహీనుల జీవితాలకు రంగులద్ధి , మేలిముసుగులేసి , అందమైన అలంకరణాలు చేస్తున్న పాల‌న ఇది. దేశ‌ద్రోహుల‌, లొంగుబాటుదారుల  వికృత ,  ప్రజావ్యతిరేక  జీవితాలను గొప్ప చేసి వాళ్లు మహ‌నీయులని, త్యాగమూర్తులని, ఆద‌ర్శనీయులని    బహుళ ప్రచారం చేస్తున్న రోజులివి.  “జననీజన్మభూమి ” అంటూ నాటకీయ విన్యాసాలతో, తమ అంగ ,అర్థ బలాలతో,   ప్రభుత్వ విధేయతలే “దేశభక్తి”గా ప్రజలను ఒప్పిస్తున్నపాలన ఇది. ప్ర‌భుభ‌క్తిని మించిన దేశ‌భ‌క్తి లేని కాలం ఇది.  ఈ వాతావరణంలో, ప్రజల కోసం, దేశ విముక్తి కోసం సర్వస్వం త్యాగం జేసిన మేధావులను, విప్లవకారులను, వారిని క‌న్న త‌ల్లుల‌ను, వారికుటుంబాలను ప‌దే ప‌దే గుర్తు చేయాల్సిన అవ‌స‌రం
సంభాషణ

పులి

"సార్ అతను చచ్చిపోయేట్టు వున్నాడు. మనం కొట్టిన దెబ్బలకు అతను స్పృహ తప్పి పడిపోయాడు సార్" కానిస్టేబుల్ పరాంకుశం కంగారు మాటలకి డి.ఎస్.పి వజేరా చిరాకుగా మొహం పెట్టాడు.2 డిసెంబర్ 2002, సోమవారం మధ్యాహ్నం 3:45 కు, బిజీగా ఉన్న ముంబై దగ్గరి ఘాట్కోపర్ స్టేషన్ సమీపంలో బస్సు సీటు కింద గుర్తు తెలియని వ్యక్తులు ఉంచిన బాంబు పేలింది. బస్సు వెనుక భాగంలో బాంబు ఉంచారు. ఈ పేలుళ్లలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. 50మందికి పైగా గాయపడ్డారు. ఘట్కోపర్ చివరి స్టాప్ కావడంతో, బస్సులోని ప్రయాణికులందరూ అప్పటికే దిగిపోయారు. తిరుగు ప్రయాణానికి ప్రయాణికులు ఇంకా బస్సులోకి ప్రవేశించలేదు.
కథలు

దొర్లు దొర్లు పుచ్చకాయ్

జేబులోవున్న ఆ ఒక్కరూపాయి బందా కంబగిరికి అగ్నిపరీక్ష పెడుతున్నది. స్కూలు బయట అమ్ముతున్న బొంబాయి మిఠాయి, ఉప్పుసెనగలు, బఠాణీలు, సొంగలు అంతగనం వూరిస్తున్నాయి. "మా! మా! ఉప్పుసెనగలు కొనుక్కుంటానే!” గంట బంగపోతే ఉట్టిచట్టిలో నుండి అమ్మ తీసి ఇచ్చిన గుండ్రని మిలమిలలాడుతున్న కొత్త రూపాయి బందా. పొద్దుటినుంచి దాన్ని చూస్తున్నాడు… జేబు లోపలికి తోస్తున్నాడు. చూస్తున్నాడు …లోపలికి తోస్తున్నాడు. ఆ రూపాయి వాడికి అపురూపం. కనీసం రెండురోజులన్నా దాన్ని జేబులో వూరబెట్టి…వూరబెట్టి కొనుక్కుంటే…అప్పుడు సెనిగబ్యాల్ల పాశం తిన్నంత తృప్తి. వాని తంటాలు చూసిన జేజి "పాపోడా ! ఎంగావాల్నో కొనుక్కోని తినుకోపోరా! కావాలంటే అనిక నేను రూపాయి ఇత్సా
కాలమ్స్ ఆర్ధికం

ఉపాధి డమాల్

కరోనా సెకెండ్ వేవ్ సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రతి మనిషి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న దయనీయ స్థితి. ఒకవైపు జనాలు పిట్టల్లా రాలుతుండడంతో చావు భయం వణికిస్తోంది. ఈ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియని భయానక వాతావరణంలో భారతీయ సమాజ జీవనం సాగిస్తోంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్లా భయాందోళన రాజ్యమేలుతోంది. కరోనాను ఎదుర్కోవడంలో విఫల ప్రభుత్వంగా ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ సర్కార్‌కు కూడా ఇప్పుడు ఊపిరాడడం లేదు. అన్ని వైపుల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలతో మోడీ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ స్థితిలో అంతర్జాతీయ పత్రికలు మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని
సాహిత్యం వ్యాసాలు

మమతా ఫాసిజం మాటేమిటో!

“ఎంత మాట! ఇట్లనవచ్చా? సందర్భశుద్ధి లేకుండా?” అనే వాళ్లుంటారని నాకు తెలుసు. సరిగ్గా అనవలసిన సందర్భం ఇదే. పైగా నిన్న మొన్న కూడా ఈ మాట అన్నవాళ్లకు ఇప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు. పశ్చిమ బెంగాల్ విషయంలో సోషల్ ఫాసిజమనీ, మమతా ఫాసిజమనే మాటలు ఎప్పుడో ముందుకు వచ్చాయి. ఫాసిజాన్ని ఇన్ని రకాలుగా, ఇన్ని విశేషణాలతో చెబితే అసలు ఫాసిజం మీద విమర్శ పలుచన అవుతుందనే వాళ్లూ ఉండొచ్చు. మన దేశంలో ఫాసిజం కూడా బహురూపి. సూక్ష్మరూపి, సర్వవ్యాపి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, పాలకవర్గ రాజకీయార్థికానికి అది అత్యంత సన్నిహితమైనది. కేవలం బ్రాహ్మణీయ హిందుత్వ వల్లనే మన దేశంలోని ఫాసిజం
వ్యాసాలు

క‌రోనా కాలంలో పోలీసు కాల్పులు

స‌కెండ్ వేవ్ లోనూ క్యాంపుల ఏర్పాటు, ఎన్‌కౌంట‌ర్లు,  స్తూపాల కూల్చివేత  ప్రపంచమంతా  కరోనాతో యుద్ధం చేస్తున్న కాలం ఇది. మనిషి తనకు తాను బందీగా మారుతున్న కాలం. బతకాలంటే బందీగా ఉండాల్సిన సమయం. ప్రభుత్వాలు కరోనాని కట్టడి చేయలేక అంతా మనుషులు మీద నెట్టేసి ఊరుకున్నాయి. ప్రాణ అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ కూడా అందివ్వ‌కుండా ప్ర‌జ‌ల  నిర్లక్ష్యం కారణంగానే కరోనా  ఉధృత‌మైందని  అంతా ప్రజల మీదికే తోసేశాయి.. ఈ విష‌యంలో చేతులెత్తేసిన ప్రభుత్వాలు పోరాట ప్రజలపై  అణిచివేత‌కు త‌న ర‌హ‌స్య హ‌స్తాల‌ను కూడా ఎప్ప‌టి కంటే దుర్మార్గంగా వాడుతున్నాయి. ముఖ్యంగా స‌క‌ల ప్రాకృతిక సంప‌ద‌ల‌ నిలయమైన దండకారణ్యంలో పాల‌క దాడులు  నానాటికి