సంపాదకీయం

మణిపూర్‌లో మంటలు కాదు ..మాటలు కావాలి

మణిపూర్‌ మండుతోంది. అయితే అగ్గి రాజేసింది ఎవరు? దానంతట అదే అంటుకుందా? దాన్ని ఊది ఊది పెనుమంటగా మార్చిందెవరు? అక్కడి ఆదివాసీలేనా? ఇదంతా కేవలం మెయితీలు అనే ఒక తెగకు షెడ్యుల్డు తెగ హోదా ఇచ్చే విషయం మీద ఆలోచించి నివేదిక సమర్పించమని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించిన ఫలితంగానే జరిగిందా? (ఆ న్యాయమూర్తికి అలాంటి ఆదేశం ఇచ్చే అధికారం లేదనీ, ఆ అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే వుందనీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించడాన్ని మనం గమనించాలి) లేక ఇంకేమైనా లోతైన విషయాలు వున్నాయా? లోతుల్లోకి వెళ్ళి పరిశీలించకుండా సమస్య అసలు స్వభావాన్ని అర్థం చేసుకోలేం. ఆ స్వభావం అర్థం
వ్యాసాలు

ఆంగన్‌వాడీల జీవితాన్నిపరిచయం చేసిన పోరాటం

(గత ఏడాది చివరలో దేశమంతా మొదలైన అంగన్ వాడీల, ఆశా వర్కర్ల పోరాటం ఆ తర్వాత కూడా కొనసాగింది. ఈ వ్యాసం అప్పట్లో రాశారు. వసంత మేఘానికి ఆలస్యం గా చేరింది. విషయం ప్రాధాన్యత ఇప్పటికి ఉన్నందు వల్ల ప్రచురిస్తున్నాం - వసంత మేఘం టీం ) మన దేశంలో చాలీ చాలని జీతాలతో వెట్టి చాకిరి చేసే ప్రభుత్వ ఉద్యోగులు కోట్ల సంఖ్యలో వుంటారు. వారంతా దిగువ శ్రేణిలోకే  వస్తారు. అలాంటి ఉద్యోగులలో అంగన్‌వాడీలు, వారి వద్ద సహాయకులుగా చిన్నారులకు వంటచేసి పెట్లే వారు, ఆశా (ఏ.ఎస్‌.హెచ్‌.ఏ - సాధికారిక సామాజిక అరోగ్య కార్యకర్త) వర్మర్లు కూడ
స్పందన

నమ్మీకోలమ్మీ..

అమ్మీ ఓలమ్మీ ఉపాధి హామీ పనికెల్లొచ్చీసినావేటి. డబ్బులెప్పుడు పడతాయో నేదో తెలీదు కానీ ఎండతోటి గునపాం పట్టుకోనేక మట్టి కాడక తవ్వీ తవ్వీ ఇసుగెత్తిపోతే‌ నెత్తి మండిపోతున్నా తట్టల్తోని మోసుకెల్లి ముగ్గేసినట్లు గట్టు తీర్సి దిద్ది‌ ఒచ్చీసినాక ఇలా‌ గెంజి తాగి సేరబడ్డానే.  ఏటో ఈమజ్జెన ఒల్లలిసిపోయొచ్చినా సరే నిద్దర కంటి మీదకి రాక‌ టీవీ సూడ్డం అలవాటయిపోయినాదే. సీరియల్లు సూడ్డం మొదలెడితే రాతిరి పది వరకు ఆపనేం. గుంట్లకొండి పోసినామా లేదో కూడా తెలీడం లేదోలమ్మి. ఆలకి సెలవులిచ్చిన కానించి ఇంటికి జేరకుండా ఈదిలో ఆటల్తోనే కాలం గడిపేత్తున్నారే. ఈ సెల్లులొకటి కదా? ఆల్నాయన ఈమజ్జెన కొన్న
నివేదిక

సంతోష్ కుమార్ రాయ్, కృష్ణమూర్తి,వెంకట్ రెడ్డి, సత్యలకు వ్యతిరేకంగాఅవసరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

SC 998 of 2018 IV మెట్రోపాలిటన్  సెషన్స్ జడ్జి, రంగారెడ్డి కోర్టులో చర్లపల్లి జైలు ఖైదీ ఇచ్చిన దరఖాస్తు నా పేరు సయ్యద్ గపూర్,  CT నెంబర్ 6634.  నేను చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉంటున్నాను.  14.5.2023  నాడు సాయంత్రం వేళలో జైలు సిబ్బంది నన్ను  కొట్టారు. చిత్రహింసలకు గురి చేశారు.  నాకు ఐదు రోజుల నుంచి తిండి లేదు.  కేవలం నీళ్లతో మాత్రమే ఉన్నాను.  మూడు నెలల కిందట కూడా ఇదే విధమైన వేధింపులకు గురి చేశారు.  మొన్న సంతోష్ కుమార్ రాయ్ సూపరింటెండెంట్,  కృష్ణమూర్తి,  వెంకటరెడ్డి  నా ముఖం మీద కాళ్ళ మీద  తన్నారు. 
నివేదిక

సైనిక క్యాంపులకు వ్యతిరేకంగా పాదయాత్ర

బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ లో సీఆర్‌పీఎఫ్ క్యాంపు ఏర్పాటు, వివిధ చోట్ల రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా ఆదివాసీలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా మే 12, 13 తేదీల్లో వారు  జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు పాదయాత్ర చేసారు. దాదాపు 200 రోజులుగా, వేలాది మంది గ్రామస్తులు తమ మూడు అంశాల డిమాండ్ల కోసం అబూజ్‌మడ్ తోయ్మెటాలో ధర్నాకు కూర్చున్నారు. ప్రభుత్వం తమ మాట వినకపోవడంతో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. రేషన్, నీళ్లతో  బయలుదేరారు. అబూజ్‌మడ్‌కు చెందిన వేలాది మంది ఆదివాసీలు శుక్రవారంనాడు మండుతున్న ఎండలో రేషన్, నీరు, నిత్యావసర వస్తువులు, సంప్రదాయ ఆయుధాలతో
సమీక్షలు

ఊరి మీదికి మరులుగొలిపే కథలు

చిన్నప్పుడు ఎమ్నూరు (ఎమ్మిగనూరు) అంటే నాకు రెండే కొండగుర్తులు. మా వూరి మిందనుంచి పొయ్యే ఎంజి (మాచాని గంగప్ప ట్రాన్స్పోర్ట్ సర్వీస్) బస్సు. అప్పట్లో నీటుగా వుండి  స్వీడు...గా పోయే బస్సని బో పేరు దానికి. చార్జిగాని గవుర్మెంటు బస్సు కాడికి రోంత తక్కువ. ఆ బస్సు వచ్చే తాలికి పెద్దింత మంది జమైతాండ్రి , ఆలీశం అయినా ఆ బస్సు కోసరమే ఎదురు చూస్తాండ్రి . రెండోది ప్రతీ ఎండాకాలం సెలవులకి మా రోజ పెద్దమ్మ కాడికి పోతే కర్నూలులో వెరైటీ, శ్రీరామా, ఆనంద్ టాకీసుల దారిలో, రాజ్ విహార్ సెంటర్లో రోడ్డు మింద బట్టల షాపుబైట 
వ్యాసాలు

పోలవరంలో మునిగిపోతున్న ఆదివాసులు

తెలంగాణ తొలి, మలివిడత ఉద్యమకారుల ఆధ్వర్యంలో 'భూ హక్కుల పరిరక్షణ ఉద్యమకారుల సమాఖ్య' ఏర్పడింది. హక్కుల కార్యకర్తలు, కవులు, రచయితలు, న్యాయవాదులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఈ సమాఖ్యలో భాగస్వాములుగా ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం, నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయాలను ప్రశ్నించడం ఈ ఐక్య సంఘటన కమిటి ప్రధాన లక్ష్యం. తెలంగాణ ఏర్పడ్డాక ఏడు మండలాలను అక్రమంగా ఆంధ్రాలో కలిపి తీరని అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంతో తెలంగాణ, ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌లో లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతం ముంపుకు గురవుతుంది. లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారు. కూనవరం, బూర్ఘంపాడు, వరా రామచంద్రాపురం
వ్యాసాలు

ఎడతెరపి లేని వానల్లో నిరవధిక ఉద్యమం

నీరు-అడవి-భూమికోసం ఆదివాసీల పోరాటం చాలా కాలంగా జరుగుతోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో వారు అలాంటి పోరాటమే ఒకటి చేస్తున్నారు. కొత్త భద్రతా బలగాల క్యాంపు ఏర్పాటు, గ్రామంలో రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా ప్రజలు నిరవధిక సమ్మెకు కూర్చున్నారు. 115 రోజులకు పైగా సాగుతున్న ఈ ఉద్యమంలో 33 గ్రామాల ప్రజలు పాల్గొంటున్నారు. 'మడోనార్ జన్ ఆందోళన్' బ్యానర్‌పై జరుగుతున్న ఈ ఉద్యమంలో వందలాది మంది పాల్గొంటున్నారు. ఇందులో పురుషులు-మహిళలు, పిల్లలు-వృద్ధులు అందరూ ఉన్నారు. తమ సంస్కృతిని, అడవిని కాపాడుకోవడం ఒక్కటే వారి లక్ష్యం. నారాయణపూర్‌లో ఖనిజ సంపద పుష్కలంగా ఉండటంతో, ప్రజలు వ్యతిరేకించినప్పటికీ రావ్‌ఘాట్, ఛోటేడోంగర్‌లో గనుల
పత్రికా ప్రకటనలు

ఆదివాసుల మీద వైమానిక దాడులుఎందుకు చేస్తున్నారు?

ఆహ్వానందండకారణ్యం శతృదేశమా?ఆదివాసుల మీద వైమానిక దాడులు ఎందుకు చేస్తున్నారు?చర్చా కార్యక్రమం21 మే, 2023 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5.30 దాకా మిత్రులారా చత్తీస్‌ఘడ్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా డ్రోన్లు, హెలికాప్టర్లతో దాడులు చేస్తున్న సంగతి మీకు తెలిసిందే.  ఈ దాడులు మొదట 2021 జూన్‌ 19న బీజాపూర్‌ జిల్లాలో బొట్టలంక, పాలగూడెం గ్రామాల మీద మానవ రహిత డ్రోన్లతో  12 బాంబులు వేయడంతో మొదలయ్యాయి. ఆ తర్వాత 2022 ఏప్రిల్‌ 14, 15 తేదీల మధ్య రాత్రి బీజాపూర్‌, సుక్మా జిల్లాల మధ్య ఉన్న బొట్టెంతోగె, మెట్టగూడెం, దులోడ్‌, సక్లెట్‌,
కవిత్వం

సంపూర్ణం…! 

దాహాలు అసంపూర్ణంగానే ఆరంభమౌతాయి. ఆలోచనల సంఘర్షణలోంచి ఒక దారి తళుక్కున మెరుస్తుంది. ఒక లక్ష్యం నిద్రలేని క్షణాల్ని వేలాడదీస్తుంది. జీవితం ఒక్కో పాదముద్రను చెక్కుతూ నిరాడంబరంగా విజయానికో చిరునవ్వు విసురుకుంటూ ముందుకు పోతుంది. ప్రతి క్షణమూ తిరిగిరానిదే. ఇక్కడ ఛేదించాల్సినవి చేయాల్సినవి కొన్ని వుంటాయి. అలా అలా సంతోషాల్ని లిఖిస్తూ కాస్త ముందుకు జరగాలి. అసంపూర్ణం నుంచి సంపూర్ణానికి ఒక్కో అడుగు తొడుగుతూ ఒక్కో మైలురాయి లో చిహ్నాల్ని కొన్ని తీపి గురుతులు గా నిలిపి సంపూర్ణ ప్రయాణం గా ప్రయత్నాల్ని మలచుకోవడం లోనే వుంది. జీవితపు గెలుపు రహస్యం.