కవిత్వం

విజయ చిహ్నాలు

★Victory Signs★By Moumitha Alam-west Bengal.【A poem on Manipuri Kuki tribal women who have been Paraded Naked & raped 】★విజయ చిహ్నాలు★తెలుగు అనుసృజన-గీతాంజలి ఓ..నా ప్రియమైన కుకీ తల్లులారా., మన భారత దేశంలో.. మన శరీరాలే యుధ్ధక్షేత్రాలు కాదంటారా ? పురుషులు నీళ్ల సీసాలు దొరక్క..వాటి కోసం కొట్లాడు తున్నప్పుడు కూడా.. *నీ యమ్మ..నీ తల్లిని..నీ చెల్లిని దెన్●● అనే యుగాల నుంచీ అలవాటైన బూతులతో మొదట మన తల్లులనే శపిస్తారు ! మన బట్టలు తొలగించబడతాయి.. మన మీద కిరాతకంగా లైంగిక అత్యాచారం జరుగుతుంది. క్రూరమైన జంతువుల గాయాలతో మన దేహాలు
కవిత్వం

మేము అర్బన్ నక్సలైట్లమైతాము

ప్రజలు అంటరానితనానికి గురౌతున్నప్పుడు లైంగిక వేధింపులకు గురౌతున్నప్పుడు మతం ముసుగులో మునుగుతున్నప్పుడు మూఢనమ్మకాలకు బలౌతున్నప్పుడు మేము కలం నుండి జాలువారిన కన్నీటి చుక్కలమైతాం ఆదివాసీ హక్కులకై ఉద్యమించినప్పుడు వారిపై వైమానిక దాడులు జరుగుతున్నప్పుడు దేశపు సహజ సంపదను దోచుకుపోతున్నప్పుడు ఈ దేశ ఆదివాసీ ముఖంపై ఉచ్చ పోసినప్పుడు మేము ప్రశ్నించే మొక్కలమై మొలకెత్తుతాం కాలేజీలో దేశ చరిత్రను విప్పి చెప్పినప్పుడు సమాన హక్కు గురించి మేము పోరాడినప్పుడు ఈ దేశపు అన్యాయాన్ని అక్షరమైన మేము ప్రశ్నించినప్పుడు రాజ్యం మా పైన పీడియఫ్లు ఉపా కేసులు పెట్టినప్పుడు ఈ రాజ్యం దృష్టిలో మేము అర్బన్ నక్సలైట్లమైతాము
సంపాదకీయం

రాజ్యాంగం చెప్పినవన్నీ చేశారా? ఉమ్మడి పౌరస్మృతి తేవడానికి..

ప్రజా క్షేత్రం గురించి బీజేపీకి బాగా తెలుసు. ఎంత బాగా తెలుసో అర్థమయ్యే కొద్దీ మనకు ఆందోళన పెరుగుతుంది. మామూలుగా  కామన్‌సెన్స్‌లో భాగంగా సంఫ్‌ుపరివార్‌  ఈ సమాజాన్ని మధ్య యుగాల్లోకి తీసికెళుతుందనే విమర్శ చాలా మంది చేస్తుంటారు. తన మీద ఇలాంటి అభిప్రాయం ఉన్న ఈ సమాజంతో  సంఫ్‌ు ఎట్లా వ్యవహరిస్తుంది? నిజంగానే ఈ దేశంలోకి ముస్లింలు రాకముందటి రోజులే ఉజ్వలమైనవని,  కాబట్టి  సమాజాన్ని  అక్కడికి తీసికెళతానని అనగలుగుతుందా? సంఫ్‌ుపరివార్‌కు ఇలాంటి భావజాలంలో కూడా ఉన్నది. ఒక ‘అద్భుతమైన’ గతాన్ని ఊహించి  చెప్పి, దాని చుట్టూ భావోద్వేగాలు లేవదీసి, ‘ఇతరుల’ మీద విద్వేష విషాన్ని నింపి, ‘తనదే’ అయిన
కవిత్వం

‘గే’ గా ఉండడం….

మీకెవరికీ ఎప్పటికీ అర్థం కాదు. బయటకు కనిపించే అందమైన ముఖం వెనక ఉన్న నా హృదయం ఉపిరాడానంతగా మూసుకుపోయిందని. చిక్కని మీసాల కింద కోరిక అణిచివేయబడింది. మీరు విధించిన నిషేధ ఫత్వాల మధ్య నా ఆకాంక్షలు ఉరిపోసుకున్నాయి. ఇక ఎప్పటికీ ఎవరితోనూ .మధురమైన ముద్దు పెట్టించుకోలేను.. మరెవరితోనూ ప్రేమించబడలేను ! నా ప్రేమ అసహ్యించుకోబడుతుంది. ఎవరితోనూ దాన్ని ఇచ్చిపుచ్చుకోలేను. నా ఒకే ఒక్క జీవితంలో నా ప్రేమ వృధాగా.,ఈ అనంతమైన లోకంలో ఏకాకిగా మిగిలిపోతుంది. అయినా...మరోసారి గట్టిగా చెబుతున్నాను వినండి..అవును ! నేను 'గే' ని. అలాగ ఉండిపోవడమే నాకు ఇష్టం. ఎంత దుఖఃమైనా సరే...! అసలు ఈ
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

ఫ్రాక్చర్‌

దేవయాని బాధతో మూల్గింది. మెల్లగా వాకర్‌ పట్టుకుని నడుస్తూ బాత్‌రూం నుంచి బయటకు వచ్చి మెల్లిగా మంచం మీద కూర్చుంది... ఇంకా ఎన్ని రోజులో ఈ బాధ... దేవయానికి తనకి అయిన యాక్సిడెంట్‌ గ్నాపకం వచ్చింది. కోడలుగా అత్తకు చాలా సేవలు చేసింది. మలమూత్రాలు ఎత్తిపోసింది. నోటికి ముద్దలు పెట్టింది... చంటిబిడ్డకు పోసినట్లు స్నానాలు పోసింది. పిచ్చెక్కి రోడ్లమీద పారిపోతే ఎన్నిసార్లు ఉరుకులు పరుగులెత్తి తెచ్చుకుందో... ఒక్కతే పిచ్చి అత్తను పట్కొని హాస్పిటల్‌ చుట్టూ తిరిగిందో ఆమెకి కూడా ఆరోగ్యం ఏమీ బాగుండదు. అయినా అత్తను తల్లికంటే ఎక్కువ చూస్కుంది. ‘ఆ పుణ్యమంతా ఆమెదే. అందుకే నిన్న రాత్రి
వ్యాసాలు

కార్మిక వర్గ మేధావి,  మేటి విప్లవ నాయకుడు ఆనంద్

భారతదేశంలో విప్లవోద్యమం పీడిత తాడిత కులాలకు, వర్గాలకు చెందిన ఎందరినో ప్రజానాయకులుగా, విప్లవ నాయకులుగా తీర్చి దిద్దింది. తరతరాల కుల, వర్గ పీడనలను తుదముట్టించాలని, భారతదేశాన్ని ఒక సుందర సామ్యవాద దేశంగా మార్చాలనే స్వప్నాలను లక్షలాది యువకులు, విద్యార్థులు కనేలా చేసింది నక్సల్బరీ తిరుగుబాటు. ఆ స్వప్నాన్ని కంటూ దాన్ని సాకారం చేసేటందుకు విప్లవ బాట పట్టిన అసంఖ్యాక యువకుల్లో కా. కటకం సుదర్శన్‌ ఒకరు. అలాంటి వారిలోని అగ్రగణ్యుల్లో ఆయన ఒకరు. నక్సలైట్‌ ఉద్యమ మలి దశలోని తొలి రోజులలోనే 19 ఏళ్ల ప్రాయంలో విప్లవోద్యమంలోకి వచ్చిన కా. సుదర్శన్‌ యాభై ఏళ్ల పాటు విప్లవోద్యమానికే తన
వ్యాసాలు

బతుక్కి అర్థం చెప్పిన ఆనంద్‌ మరణం

మరణం ఎప్పుడూ మనిషిని భయపెట్టేదే ..ఏ  దేవుడ్ని నమ్ముకున్నా ఆ బాధ తీరేది కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని సమస్యలకు పరిష్కారం కొందరి చావులతోనే  ముడిపడేవి.. అంతకు మించి ఆలోచించే స్థాయికి సమాజాలు కూడా ఎదగలేక పోయాయి. మార్కిజం వెలుగులో సమస్యలకు అసలు పరిష్కారం ఎక్కడుందో తెలుసుకున్న బెల్లంపల్లి  యువకులు కొందరు విప్లవాచరణలోకి వెళ్లారు.  అందులో ఒకరు కామ్రేడ్‌   కటకం  సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌. రాష్ట్రంలో 1973 నుంచి విప్లవ విద్యార్ధి ఉద్యమం ప్రారంభమైంది. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం నుండి చాలా మంది విద్యార్థులు వరంగల్‌, హైదరాబాద్‌ పట్టణాలలో ఇంజనీరింగ్‌ , పాలిటెక్నిక్‌ కోర్సుల కోసం వెళ్లేవారు
సమీక్షలు

క‌థ‌ల సేద్యం

శ్రీనివాస మూర్తి ‘ఖబర్‌కె సాత్‌’ పదిహేను కథలు చ‌ద‌వ‌డ‌మంటే రాయలసీమ ముప్పై సంవత్సరాల రాజకీయార్థిక పోరాటాల భావోద్వేగాలతో మిళితం కావ‌డ‌మే. 1978 నుండి మా వూరంత ప్రేమగా ` రాయలసీమతో నాకు అనుబంధం ఉంది. మధురాంతకం రాజారాం, నరేంద్ర, మహేంద్ర, పిసి నర్సింహారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వడ్డెర చండీదాస్‌, సింగంనేని నారాయణ, శేషయ్య, శశికళ, బండి నారాయణస్వామి, నాగేశ్వ‌రాచారి,  శాంతినారాయ‌ణ‌, దేవపుత్ర, కేశవరెడ్డి, నామిని, రాసాని, సడ్లపల్లి చిదంబర రెడ్డి, పాణి, వరలక్ష్మి, వెంక‌ట‌కృష్ణ‌, సుభాషిణి, రామ‌కృష్ణ‌, రాప్తాడు గోపాలకృష్ణ, చక్రవేణు, సౌదా,  త్రిపురనేని శ్రీనివాస్‌, విష్ణు వంటి ఆత్మీయులంద‌రితో క‌లిసి తిరిగిన రోజుల‌వి.    విద్యార్థి ఉద్యమాలు,
కవిత్వం

కలలతో పయనించే కాలం రాలేదింకా

మనసు మత్తడి పోస్తున్నది కలలను కానీ మనసుకు ఆవల పని చాలా మిగిలున్నది నేస్తం! ఇంకా కొన్ని దేహాలపై కాంక్షలు దాడులు చేస్తున్నవి! ఇంకా కొన్ని నేరాలకై ప్రజాస్వామ్య పావురం గొడుగు పడుతున్నది! ఇంకా పార్లమెంటు అసెంబ్లీ భవనాలు ఏదో అంటరానితనాన్ని పాటిస్తున్నవి! ఇంకా ఓ ఆడకూతురు పెందలకడనే మరణిస్తున్నది ఇంకా విద్య పౌష్టికాహార లోపంతో జబ్బుపడి తల్లడిల్లుతున్నది! ఇంకా ఓ సంచారి సాయంకాలానికి ఓ చెట్టును, ఓ ముద్దను అర్థిస్తున్నాడు! ఇంకా నగరం రోజుకో బిచ్చగాణ్ణి అపస్మారక స్థితికి చేరుస్తున్నది! ఇంకా పల్లె దేహం వలసలతో సలసల కాగుతూనే ఉంది! ఇంకా ఈ స్వరాజ్యం బానిసత్వపు అవార్డులు
కవిత్వం

చీకటి పాట

చూపు మసకబారిన చోట స్వరాలకు కన్నులు మొలుస్తాయి. చీకటి దీపం మేల్కొని దీపానికి చీకటి లేదని ఒక గాయం ఆ వీధిన గేయమై వికసిస్తుంది. రద్దీలో పరిగెడుతున్న కూడలిని నిలువునా రోడ్డుకు కట్టేసి ఒక సమ్మోహన రాగం బిచ్చమెత్తుకుంటుంది. అక్కడొక వర్షం విచ్చుకుంటుంది. కాలం కాసేపలా వినమ్రంగా మొక్కుతుంది. ఒక సముద్రమేదో..అలల ఊయలలో వీధిని జో కొడుతుంది. అనంత జీవనకాంక్షా స్వరం కదల బారిన క్షణాల రోడ్డు పుష్పిస్తుంది. వీధికి వసంతాన్నిస్తుంది. ఆశ భూమిని ఆహ్వానిస్తుంది. సంకల్పాన్ని ఆకాశం హత్తుకుంటుంది. బతుకు ఒక పాటల పల్లవై మోగుతుంది. ఎడారులు అరణ్యాలై చిగురుస్తాయి. భయానికి ధైర్యం వస్తుంది. ఓటమికి భయం