వ్యాసాలు

వందేళ్ల ఆర్‌ ఎస్‌ ఎస్‌ కుట్ర- జైలుపాలయిన రాజకీయ ఖైదీలు

జులై 2 చెరబండరాజు అమరత్వం రోజు విరసం ఆవిర్భావసభ  సంఘపరివార్‌ వందేళ్ల ఫాసిజం పై సాంస్కృతిక ప్రతిఘటనా వ్యూహం ప్రకటించే ప్రతిజ్ఞ తీసుకోవడం చాల అర్థవంతంగా ఉంది. ఆయన విరసంలో తన కవిత్వం ద్వారా రచనల ద్వారా ‘ఏ కులమబ్బీ మాది ఏ మతమబ్బీ’ , ‘జగద్గురువులొస్తున్నారు జాగ్రత్త’ వంటి పాటలు, కవితల ద్వారా బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలంతో తలపడినాడు. జీవితాచరణలో ప్రతిఘటించాడు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన చెంచల్‌గూడ జైల్లో ఉన్నపుడు విరసం, మరికొందరు విప్లవ పార్టీల,  ప్రజాసంఘాల కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి డిటెన్యూలు అందరినీ ఒకే ఆవరణలో ఉంచారు. అట్లా దేశభక్తులను, దేశద్రోహులతో కలిపి ఉంచడాన్ని టైగర్‌
లోచూపు

చరిత్ర పొడవునా ఫాసిజం

చారిత్రక కారణాలు ఏవైనా ఫాసిజం మన సామాజిక సాంస్కృతిక నేలలోనే మొలిచే విషపు కలుపు మొక్క. దానిని సకాలంలో గుర్తించి పెరికి వేయకపోతే పచ్చని పంట నాశనం అవుతుంది. సాధారణ కలుపు మొక్కలను ఏరివేయకపోతే పంట ఏపుగా పెరగదు గానీ, విషపు కలుపు మొక్క(ల)ను ఏరివేయకపోతే పంట నాశనం అవ్వడమే కాకుండా, నేల కూడా విషపూరితమై భవిష్యత్తులో ఏ పంటా పండని ప్రమాదం తలెత్తుతుంది. అటువంటి మనిషి మౌలిక మనుగడకే ప్రమాదకరమైన ఫాసిస్ట్ ఆక్టోపస్ తన విషపు కోరలతో మన దేశాన్ని కబళిస్తోంది. నిజమైన సంస్కరణోద్యమ పోరాటాలు, లౌకిక, ప్రజాస్వామిక, సమూల పరివర్తనా(విప్లవ) పోరాటాలు చాలా కాలంగా జరుగుతూనే
వ్యాసాలు

ఉమ్మడి పౌరస్మృతి ప్రజావసరమా? బిజేపి  అవసరమా?

ఈ ప్రశ్నకు సమాధానం ప్రజలందరికీ తెలుసు. కానీ ఇది ప్రజలకు అవసరమై చట్టమని,ప్రజల కోసమే తీసుకువస్తున్నట్లు బీజేపీ చెబుతోంది.  ఉమ్మడి హిందువులకే ఒక చట్టం లేదు..  ఇప్పుడు ఉమ్మడి పౌరసత్వ చట్టం ఎందుకు? అనే  ప్రశ్నకు బీజెపి  వద్ద   సమాధానం లేదు. అది మా ఎజండా అంశం.. ప్రజలందరికి అవసరం.. అందుకే తీసుకు వస్తున్నాం.. అంటోంది.  ఏ లాభం లేనిదీ ఏ రాజకీయ పార్టీ ఏ చట్టాన్నీ తేవాలనుకోదు. ఇది ఎవరేమన్నా ఆర్‌ఎస్‌ఎస్‌ రహస్య ఎజండా! దాన్ని  అమలు చేయటానికి బిజేపి ఎన్ని ఎత్తులు, పొత్తులు, కుట్రలకైనా వెనుకాడదు. సూటిగా చెప్పాలంటే ఇప్పటికిప్పుడు ఈ చట్టం తీసుకు రాకుంటే
వ్యాసాలు

కామ్రేడ్ ఎల్‌ఎస్‌ఎన్ స్నేహం శరచ్చంద్రిక

కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి అమరుడైన 21 డిసెంబర్ రోజే 53 సంవత్సరాల తర్వాత కామ్రేడ్ ఎల్.ఎస్.ఎన్ మూర్తి అమరుడు కావడం యాదృచ్ఛికమే కావచ్చు. కాకపోతే ముప్పై ఏళ్ళు నిండకుండానే శ్రీకాకుళ విప్లవంలో ఎన్‌కౌంటర్ అయిన సుబ్బారావు పాణిగ్రాహి పూజారిగా పనిచేస్తూ కమ్యూనిస్టు భావాలతో ప్రభావితుడు అయ్యాడు. గుడికి వచ్చే వారికి, గ్రామ ప్రజలకు ఆ భావాలు ప్రచారం చేసేవాడు. ఇక ఎల్.ఎస్.ఎన్ పూర్వీకులది కాంగ్రెస్‌లోనే ‘అతివాదం’గా భావించబడిన రాజకీయ చరిత్ర. గుంటూరులో అన్న లక్కవరం రాధాకృష్ణమూర్తి యింట్లో ఉండి చదువుకున్న రోజుల్లో ఆయన ఇంగ్లిషు లెక్చరర్ అయిన అన్న నుంచి, ఆ ఇంట్లో ఉండి స్ఫూర్తిశ్రీ పేరుతో భారతి
వ్యాసాలు

కుకీలకు మద్దతిచ్చినందుకు కోర్టు సమన్లు

'ది వైర్' కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి, ప్రొఫెసర్ ఖమ్ ఖాన్ సువాన్ హౌసింగ్; కుకీ ఉమెన్స్ ఫోరమ్ కన్వీనర్ మేరీ గ్రేస్ జూ; కుకీ పీపుల్స్ అలయన్స్ ప్రధాన కార్యదర్శి విల్సన్ లాలం హాంగ్షింగ్ లకు ఇంఫాల్ కోర్టు సమన్లు జారీ చేసింది. కరణ్ థాపర్ కు  ఇచ్చిన ఇంటర్వ్యూలలో, ఆ ముగ్గురూ మణిపూర్ కుకీ సముదాయానికి  ప్రత్యేక పరిపాలన ఉండాలనే డిమాండ్‌కు మద్దతునిచ్చారు. దీనితో ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు పలు ఐపీసీ నిబంధనల కింద వారిపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రొఫెసర్ హౌసింగ్ పై మెయితీ ట్రైబ్స్
కవిత్వం

ఊహ చేయడమే హెచ్చరిక

నీ ఊపిరి విశ్వమంతా పాకిపోయింది విశ్వాన్నెలా భస్మం చేస్తాడు నీ ఆలోచన జనసంద్రం నిండా నిండిపోయింది సముద్రాన్నెలా బందీ చేస్తాడు నీ ఆలోచనకు కాళ్లెలా వుంటాయి గాలికీ జీవనదికీ కాళ్లుంటాయా మండే సూర్యుడున్నాక వెలిగే చంద్రుడున్నాక నీ శ్వాసకు అంతమెలా వుంటుంది పీక పిసుకుతాడు కనురెప్పల్ని పీక సాగుతాడు ఊహకెలా ఉరితాడు వేస్తాడు వరిగింజల్లో పిడికిళ్లున్నాయని రాలుతున్న వరిపొట్టులోంచి పిట్టలు పైకెగురుతున్నాయని సృజన చేసిన మెదళ్ళను కూల్చడానికి ఏ బుల్డోజరూ సరిపోదు నీ చేతులు విల్లంబులు పట్టలేదు నీ వాక్యాలు బాణాలయ్యాయి నీ చేతులు తుపాకులు పట్టలేదు చావును నిరాకరించిన నీ దైర్యం తూటాగా మారింది నీ తలనరాలు
కథలు

మనుషులను కలపడమే మన పని

నేను కొత్తగా దళంలోకి వెళ్లిన రోజులవి. నేను కొత్తగా దళంలోకి వెళ్లిన రోజులవి. ఉదయాన్నే ఐదు గంటలకు ‘లెగండి లెగండి.. బయలుదేరాలి..’ అంటూ డిప్యూటీ కమాండర్‌ అరుపులతో అందరం నిద్ర లేచాం. నేను కళ్లు తెరిచి చూసేసరికే ఒకరిద్దరు కిట్లు సర్దుకుంతున్నారు. దీర్ఘ ప్రయాణం చేసి రాత్రి డ్యూటీ పడ్డ కామ్రేడ్స్‌ లేవడానికి ఇబ్బంది పడుతున్నారు. మూత పడుతున్న కళ్ళతోనే పాలిథిన్‌ కవర్లు మడత పెట్టుకుంటున్నారు. ఆ ప్రశాంత వాతావరణంలో కామ్రేడ్ల కదలికల జోరుతో పాలిథిన్ల చప్పుడు తోడైంది. నేను బద్ధకంగా లేచి కూర్చున్నాను. అది గమనించిన మా దళం ఫ్రంట్‌ పైలెట్‌ మంగన్న ‘నిర్మలక్క ఇక్కడే ఉంటది.
కరపత్రాలు

మార్పు కోసం ప్రాణాలు బలిపెట్టక తప్పదనేఅమరుల సందేశాన్ని ఎత్తిపడదాం

కరపత్రంజీవితమంతా విప్లవమేఅమరుల బంధుమిత్రుల సంఘం ఎబిఎంఎస్ 21వ ఆవిర్భావ దినం సందర్భంగాఅక్రమ కేసులకు, రాజ్యహింసకు వ్యతిరేకంగా సభజూలై 18, మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకుసుందరయ్య విజ్ఞానకేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌   కా. గంటి ప్రసాదం అమరుడై ఈ జూలై 4కు పదేళ్లు. 2013 జూలై 4న నెల్లూరిలో ప్రసాదాన్ని ప్రభుత్వ హంతక ముఠాలు హత్య చేశాయి. వేలాది మంది అమరుల స్ఫూర్తితో 20 ఏళ్ల కింద మొదలైన ఏబిఎంఎస్‌ ప్రసాదం త్యాగాన్ని గుండెలకు హత్తుకొని కన్నీటితోనే ఈ పదేళ్లుగా పని చేస్తున్నది. ఆయన మృత్యుముఖంలో ఉండి కూడా ‘వాళ్లు నన్ను చంపవచ్చు. నా స్పూర్తిని
కథలు

వేగుచుక్క

ఆదివారం సాయంత్రం ఇంటి ముందు అరుగు మీద కుర్చీలో కూర్చున్న గోపాలరావు సిగరెట్‌ కాలుస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతని కళ్లు విషాదంతో నిండి వున్నాయి. అతని హృదయంలో సుళ్లు తిరుగుతున్న దుఃఖం, వేదన ఏమిటో 40 ఏళ్లుగా అతనితో జీవితం పంచుకున్న జానకమ్మకు తెలుసు. జానకమ్మ అతడిని గమనిస్తూనే మౌనంగా అతడికెదురుగా కత్తిపీట ముందేసుక్కూర్చుని ఉల్లిపాయలు కోస్తున్నది. అతడు జానకమ్మను చూసాడు. ఆమె చెంపల మీదుగా కన్నీళ్లు కిందకు జారుతున్నాయి. అవి ఉల్లిపాయల ఘాటు వలన కాదని అతనికి తెలుసు. ఆమె మౌనం, కన్నీళ్ల వెనుక వున్న ఆవేదనను అతను అర్థం చేసుకోగలడు. ఆమెనలా చూస్తుంటే అతనికి గుండె
కవిత్వం

చందమామ ఒక ట్రాన్స్ !

చందమామ ఒక ట్రాన్స్ ! అవును ..ఈ క్షణం నుంచి చంద్రుడొక ట్రాన్స్. ఎప్పుడైతే నువ్వు చందమామని గౌరవించవో.. ఇక ఆమె గురుంచి రాసే అర్హతని కోల్పోతావు ! ఆమెను తనవైన ..సరైన సర్వనామాలతో పిలవనంతవరకూ... నువ్వు చందమామతో మాట్లాడలేవు ! ఆమె పని పూర్తి అయ్యేదాకా.. మీరు మనుషులను చందమామ పైకి పంపలేరు . అలా చేయాలంటే.. ఆమె ముందు సాష్టాంగ పడండి.. భూమి చేసిన పాపాలకి మీరు ఆమెని క్షమాపణ అడగండి. వెళ్ళండి..ఆమె మీ కోసం నిరీక్షిస్తున్నది. మిమ్మల్ని మెల్లిగా తనవైపుకి ఆకర్షిస్తున్నది. దయచేసి మీకంటే ముందు చరిత్రలో ఆమె గురుంచి వాగినదంతా మీరూ అనడం