ఇరవై ఐదేళ్ల విప్లవాచరణ
( నవంబర్ 24 న కృష్ణా జిల్లా కోడూరు మండలం నారేవారి పాలెంలో జరిగిన కామ్రేడ్ గౌతమ్ సంస్మరణ సభలో ఆవిష్కరించిన *సమాజ శిల్పి* పుస్తకానికి రాసిన ముందు మాట) కామ్రేడ్ గౌతమ్ ను 2006 నవంబర్ 23న పోలీసులు దొంగ ఎదురు కాల్పుల్లో హత్యచేశారు. 24న తెల్లారికల్లా పత్రికల్లో ఈ విషాద వార్త వచ్చింది. మేము కొద్దిమందిమి రాత్రికి బయల్దేరాలి అనుకున్నాము. అప్పటికే గౌతం కుటుంబ సభ్యులు విజయవాడలో పౌరహక్కుల సంఘం నాయకులను కలిశారు. మృత దేహాన్ని స్వాధీనం చేసుకోడానికి గౌతమ్ కుటుంబ సభ్యులతోపాటు మీరెవరైనా వెళతారా? అని లాయర్ ఆంజనేయులుగారు అడిగారు. మేము రావడానికి లేటు