వ్యాసాలు

ఇరవై ఐదేళ్ల విప్లవాచరణ

( నవంబర్ 24 న కృష్ణా జిల్లా కోడూరు మండలం నారేవారి పాలెంలో జరిగిన కామ్రేడ్  గౌతమ్ సంస్మరణ సభలో  ఆవిష్కరించిన *సమాజ శిల్పి* పుస్తకానికి రాసిన ముందు మాట) కామ్రేడ్ గౌతమ్ ను 2006 నవంబర్ 23న పోలీసులు దొంగ ఎదురు కాల్పుల్లో హత్యచేశారు. 24న తెల్లారికల్లా పత్రికల్లో ఈ విషాద వార్త వచ్చింది. మేము కొద్దిమందిమి రాత్రికి బయల్దేరాలి అనుకున్నాము. అప్పటికే గౌతం కుటుంబ సభ్యులు విజయవాడలో పౌరహక్కుల సంఘం నాయకులను కలిశారు. మృత దేహాన్ని స్వాధీనం చేసుకోడానికి గౌతమ్ కుటుంబ సభ్యులతోపాటు మీరెవరైనా వెళతారా? అని లాయర్ ఆంజనేయులుగారు అడిగారు. మేము రావడానికి లేటు
కవిత్వం

చేరని తీరం

అతనలా ఆ గుంపులో నిండు పున్నమిలా తన చుట్టూ పరిభ్రమించాను నేనెప్పటిలా దశాబ్దాల దూరాల మధ్యనే గూడుకట్టిన ఓమాట ఓ పలకరింపు ఓ కరచాలనం ఎప్పటిలానే కల కరిగిపోతోంది ఇలా నీరింకని కళ్ళను ఓదార్చుతూ గొంతు పెగలని దుఃఖం సుడిగుండమై మిగిలిపోతుందిలా నాలోలోపల.
కథలు

మనుషులను కలపడమే మన పని

నేను కొత్తగా దళంలోకి వెళ్లిన రోజులవి. నేను కొత్తగా దళంలోకి వెళ్లిన రోజులవి. ఉదయాన్నే ఐదు గంటలకు ‘లెగండి లెగండి.. బయలుదేరాలి..’ అంటూ డిప్యూటీ కమాండర్‌ అరుపులతో అందరం నిద్ర లేచాం. నేను కళ్లు తెరిచి చూసేసరికే ఒకరిద్దరు కిట్లు సర్దుకుంతున్నారు. దీర్ఘ ప్రయాణం చేసి రాత్రి డ్యూటీ పడ్డ కామ్రేడ్స్‌ లేవడానికి ఇబ్బంది పడుతున్నారు. మూత పడుతున్న కళ్ళతోనే పాలిథిన్‌ కవర్లు మడత పెట్టుకుంటున్నారు. ఆ ప్రశాంత వాతావరణంలో కామ్రేడ్ల కదలికల జోరుతో పాలిథిన్ల చప్పుడు తోడైంది. నేను బద్ధకంగా లేచి కూర్చున్నాను. అది గమనించిన మా దళం ఫ్రంట్‌ పైలెట్‌ మంగన్న ‘నిర్మలక్క ఇక్కడే ఉంటది.
వ్యాసాలు సంభాషణ

మానని గాయమూ, తీరని ఆగ్రహమూ వాకపల్లి..

‌ (వాకపల్లి మహిళల కు  న్యాయం జరిగిందా ?  ఆదివాసులకు, అందునా ఆదివాసీ మహిళ లకు న్యాయం చేసే వ్యవస్థలోనే మనం ఉన్నామా? కోర్టు తీర్పు నేపథ్యంలో విరసం . ఆర్గ్ జూన్ 1 , 2016 లో గతంలో అచ్చయిన ఈ వ్యాసం పాఠకుల కోసం.. - వసంతమేఘం టీం ) విశాఖపట్నం దగ్గర కరకవానిపాలెంలో అమరుడు కామ్రేడ్‌ అజాద్‌ ‌సంస్మరణ సభ భావోద్వేగాలతో జరుగుతున్నది. ఆ సమయంలో నా పక్కన కూర్చున్న లాయర్‌ ‌బాలక్రిష్ణ ‘వాకపల్లి వెళుతున్నాం వస్తారా?’ అని అడిగాడు. ఛిద్రమైపోతున్న ప్రజల జీవితం గురించి దాదాపుగా రెండు గంటలుగా ఆ సభ జరుగుతున్నది.