అసమానతల భారత్లో పెరుగుతున్న బిలియనీర్లు
దేశంలో సంపదల అసమానత విపరీతంగా పెరుగుతున్నదని, సంపదల పున:పంపిణీ జరగకపోతే సామాజిక సంక్షోభానికి దారితీస్తుందని అనేక మంది చెబుతున్నారు. కొంత మంది దగ్గరే అపార సంపద పోగుపడితే మొదటికే మోసం వస్తుందన్నది వారి ఉద్దేశ్యం. “2026 ప్రపంచ అసమానతల నివేదిక” 2025 డిసెంబర్ లో విడుదలైంది. ప్రపంచ అసమానతల నివేదిక : ప్రపంచ అసమానతల సమాచార సంస్థకు అనుబంధంగా ఉన్న రెండు వందల మందికి పైగా పరిశోధకులు అనేక కోణాల్లో చేసిన విశ్లేషణల సారమే ప్రపంచ అసమానతల నివేదిక , అన్ని అంశాలను ఇక్కడ సృజించటం సాధ్యం కాదు గనుక సంపదల పున:పంపిణీ గురించి చర్చిద్దాం. ప్రపంచాన్ని “కమ్యూనిస్టు










