దండకారణ్య సమయం

సిజిమాలిలో ఏం జరుగుతుంది?  

వేదాంత బాక్సైట్ గని కోసం ఒడిశాలో ఆదివాసుల పేరుతో రోడ్డు 2026 మే 31 [ఎడిటర్ గమనిక: ఒడిశా ప్రభుత్వం తమ కోసమే నిర్మిస్తోందని చెప్తున్న ఒక రోడ్డుకు వ్యతిరేకంగా ఆదివాసులు, దళితులు నిరసనలు తెలుపుతున్న వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. కొంతమందిని అరెస్టు చేశారు; బెయిల్ షరతుల్లో భాగంగా పోలీస్ స్టేషన్‌ను శుభ్రం చేయమని కూడా కోర్టు ఆదేశమిచ్చింది. నిరసన తెలుపుతున్న వారు అభివృద్ధికి వ్యతిరేకమా? లేదా మిగతా భారతదేశానికి తెలియని విషయం ఏదైనా వారికి తెలుసా? ఈ సిరీస్ రెండవ భాగంలో, ఒడిశా ప్రభుత్వం ఆదివాసీ ప్రజల పేరుతో, వేదాంత సంస్థకు పర్యావరణ చట్టాల అమలును
వ్యాసాలు

డేటా సెంటర్ల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ విపత్తుకు దారితీస్తుందా?

ఆంధ్రప్రదేశ్ ఎఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ కు  తొమ్మిది రోజుల్లో పర్యావరణ అనుమతులు ప్రభుత్వం ఇచ్చింది. నమ్మశక్యం కానీ ఉద్యోగాల సంఖ్య, భారీ ప్రోత్సాహకాలతో, ఆంధ్రప్రదేశ్ ఎఐ మౌలిక సదుపాయాల కల్పన ప్రయత్నం, దేశంలో డేటా సెంటర్ల విషయంలో ఉన్న నియంత్రణా లోపాన్ని బట్టబయలు చేస్తోంది. తర్లవాడలోని వైజాగ్ మెగా డేటా సెంటర్ పార్క్, అనకాపల్లిలోని వైజాగ్ రాంబిల్లి డేటా సెంటర్ పార్క్‌లకు సంబంధించిన ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ ప్లాన్స్ (పర్యావరణ నిర్వహణ ప్రణాళికలు) లోని ఒక పేజీలో  షాపింగ్ మాల్‌కు సంబంధించిన నీటి పొదుపు లెక్కలను పొందుపరిచారు. ఈ రెండు పత్రాలలోనూ,
సమీక్షలు

రాజకీయాలే కథలైన సందర్భం

జైలు కథలు అనగానే నాకు ఎప్పుడో స్వతంత్ర సమయంలోనో, తెలంగాణ తొలిదశ ఉద్యమంలోనో వెలువడిన కథలు అవ్వొచ్చు అనే ఆలోచన ఉండేది. మొదటిసారి బి. అనూరాధ గారి పుస్తకం హజారీబాగ్ జైలు కథలు చదివినప్పుడు "ఓహో నేను పుట్టిన తర్వాత కూడా జైలు కథలు వచ్చాయి, అవి నా కాలానికి సంబంధించిన జైలు కథలే" అనే అంశం మెదలగానే ఒకింత ఆశ్చర్యం మరో వైపు జైలు కథల్లోని పాత్రల జీవితాలు విస్మయానికి గురిచేశాయి. రచయిత్రి అనూరాధతో నాకు వ్యక్తిగత పరిచయం లేకపోయినా ఆమె కథల్లోనే ఒక గంభీరమైన వ్యక్తిత్వంగా నా మనసులో ముద్రించుకుపోయారు. హజారీబాగ్ జైలు కథలు పుస్తకం
సమకాలీనం

అవగాహన లేని విద్వేషపు మాటలే పవన్ కళ్యాణ్ రాజకీయమా?

అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని శాంతింపజేయటం పౌరుల బాధ్యత, ముఖ్యంగా రాజకీయాల్లో లీడర్ స్థానంలో ఉన్నవాళ్లకి అది మరింత ముఖ్యమైన బాధ్యత. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  విస్మరించారా ఉద్దేశ పూర్వకంగానే ఆ నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానం రాకమానదు. 2026 జూన్ 2 న అంటే తెలంగాణ  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగే సమయంలోనే తాను ఇక్కడ సభ పెడతానూ అనటం. భావోద్వేగాలను రెచ్చగొట్టటమే కాదా!?  ఆరోజున బహిరంగ సభ అంటే కచ్చితంగా అనుమతి నిరాకరిస్తారని ముందే తెలిసి, దానిని అణచివేత చర్యగా చెబుతూ తన ఇంటివద్దనే ప్రెస్‌మీట్ పెట్టడం కూడా
ఆర్ధికం

అప్పుల ఊబిలో భారత ఆర్థిక వ్యవస్థ

ప్రభుత్వం రుణంతో అవసరమైన మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం ద్వారా వృద్ధిని ఉత్తేజ పరిచి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోతాన‌ని చెప్తుంది. కాని ప్ర‌భుత్వాలు చేస్తున్న‌ అధిక రుణాలు ప్రైవేట్ పెట్టుబడులను తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని పెంచడం, భవిష్యత్ తరాలపై అధిక పన్నుల భారాన్ని మోపడం వంటి ప్రమాదాలను కలిగి ఉంటాయి. దీని మొత్తం ప్రభావం రుణ-జిడిపి నిష్పత్తి, ఖర్చు ఉద్దేశ్యం, వడ్డీరేట్లపై ఆధారపడి ఉంటుంది.  తాజా గణాంకాల ప్రకారం మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల మొత్తం అప్పు 2026 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో సుమారు 81 శాతంగా ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభు త్వాల వాటా గణనీయమైనది.
కథలు

“గూగు” కథ 

విశాఖపట్నం సముద్రపు గాలిలో ఇప్పుడు ఉప్పు వాసన లేదు. దానికి బదులుగా కాలిపోయిన రాగి తీగలు, వేడెక్కిన సిలికాన్ బోర్డుల వాసన గాలిలో నెమ్మదిగా, ఒక దీర్ఘకాలిక వ్యాధిలా వ్యాపిస్తోంది.  సాయంత్రం వేళ కొండల మీద పడే ఎండ కూడా సహజమైన రంగును కోల్పోయి, ఎల్‌ఈడీ స్క్రీన్ మీద వెలుగుతున్న పాలిపోయిన పసుపు రంగులా కనిపిస్తోంది. నగరంలో ఎవరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదు, కానీ అందరి కళ్ళలో ఒక నిశ్శబ్దమైన, అర్థంకాని అలసట. అన్నిటికంటే విషాదకరమైన విషయం ముడసర్లోవ జలాశయం. రాత్రికి రాత్రే ఆ జలాశయం ఎండిపోవడం మొదలైంది. కానీ నీరు మామూలుగా ఆవిరి కావడం లేదు. ఆ
సమీక్షలు

నిశిత విశ్లేష‌ణ‌

తొమ్మిది విభిన్న అంశాల పుస్తకాల సమీక్షా వ్యాసాల పుస్తకం *నిశిత*. రచయిత విరసం సీనియర్లలో ఒకరైన చెంచయ్య గారు.  ఈ పుస్త‌కం వ‌చ్చిపదేండ్లైనా సాహిత్య కారులకు నిరంతర అవసరమైన సాహిత్య విమర్శ అయినందున ఈ వ్యాసాలకు కాలం తీరదు. "నిశిత" అనే ఈ పుస్తకం పేరు నూరుపాళ్ళు సార్థకమని మనం ఒప్పుకొని తీరుతాం. ఇందులో పరిశీలన నిశితమైనదే. కానీ చెంచయ్య గారి వ్యక్తిత్వం నుండి చెప్పిన తీరు "వ్యక్తిత్వమే సాహిత్య విమర్శ"  అనిపిస్తూంది.  "కవిలో చిత్తశుద్ధి ఉంది- అవగాహనే కొరవడింది" అనే సమీక్షా వ్యాసంలో కవిత్వం రాసే వాళ్లలోని గందరగోళాన్ని వివరించారు. సరియైన అధ్యయనం లేకపోవడం వల్ల కవిత్వంలో
పాట

భూ బకాసురులు

పల్లవి:ఊరూర వెలిసారురన్నో…భూ బకాసురుల గుంపురన్నో…బీదోడు బతికితే భయమంటూభూములన్నీ మింగేస్తారురన్నో!లేచి రా… ఎదిరించరా…నీ హక్కుకోసం గర్జించరా!ఈభూమి మన అమ్మలాంటిది రా తరాలరక్తంతో కాపాడుకున్నదిరా!!చరణం 1:బలం లేదంటే బలిచేస్తారురాపేదోడ్ని చూసి పండుగ చేసుకుంటారురాతాతల పత్రాలు చూపిస్తారురాతరతరాల చెమటను దోచేస్తారురా!రాత్రికిరాత్రే సరిహద్దు మార్చినిన్ను నీ నేలకే పరాయివాడ్ని చేసిఊరంతా మాదేనంటూఉచ్చులెన్నో వేస్తారురన్నో!చరణం 2:దీనుల ఇళ్లు… పొలాలపై కన్నేసిదేవుని మాన్యాలూ దోచేస్తారురావాగుల్ని, వంకల్ని మింగేస్తూవేల కోట్ల రాజులై తిరుగుతారురా!ఖబరిస్తానైనా… ఖరీదైన స్థలమైనా…ప్లాట్ల మాఫియా పేరిటకబ్జాల రాజ్యం నడిపిస్తారురాకన్నీటి గాధలు రాస్తారురా!చరణం 3:అన్నదమ్ముల మధ్య అగ్గి రాజేసితల్లి పిల్లల్ని వీధికొదిలేలా చేసిధనబలం మదంతో రెచ్చిపోయిదౌర్జన్యాలే ధర్మమంటారురా!ఎదురు నిలిస్తే కేసులంటారునిజం మాట్లాడితే బెదిరిస్తారుకానీ ప్రజా గళం మోగిందంటేపర్వతాలైనా
తొలికెరటాలు

స్త్రీ ఆత్మగౌరవ పోరాటం “అలల కాలం”

ఒకప్పుడు స్త్రీ భుజాల పై వస్త్రం ఉండకూడదని చట్టాలు చేసిన సమాజం, నేడు ఆమె ఏ బట్టలు వేసుకోవాలో చెప్పుతుంది, మారింది కాలం మాత్రమే అణిచివేత కాదు. చరిత్రను మనం ఎక్కువగా రాజులు, యుద్ధాలు ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అన్న విషయాలకే పుస్తకాల్లో స్థానం ఉంటుంది.  కానీ ఒక స్త్రీ తన శరీరాన్ని తన ఇష్టానుసారం కప్పుకోవడానికి కూడా పోరాడాల్సి వచ్చిన చరిత్ర గురించి ఎంతమందికి తెలుసు? ఒక వర్గానికి చెందిన మహిళలు తమ భుజాల పై బట్టలను వేసుకోవాలంటే రక్తం చిందించాల్సి వచ్చిందనే విషయం ఎంతమంది చదివారు? అలాంటి చరిత్రను చూపించిన నవల అలల కాలం.
వ్యాసాలు

ఫీజుల నియంత్రణ‌ ఆవశ్యకత-ప్రభుత్వ వైఫల్యం

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యా బోధనను కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతున్నాయి. దీనితో రాష్ట్రంలోని ప్రజలు వారి పిల్లలను ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ ఆ సంఖ్య నేడు 60% కి పైగా పెరిగింది. విద్యాభోధన అనగానే ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల్లో మాత్రమే నాణ్యమైన విద్య అందే అవకాశం ఉందనే ‌భావన తల్లిదండ్రుల్లో నెలకొనే విధంగా ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాలు ప్రచారం చేస్తున్నాయి. దేశంలో మొదట విద్యాబోధన ప్రభుత్వరంగంలోనే కొనసాగినప్పటికీ 1986 లో మన పాలకులు విద్యారంగంలో ప్రైవేటీకరణకు అనుమతించడంతో పాటు గాట్స్