సమకాలీనం

కడపటి యుద్ధం – స్వామి సనాతనం

దేని మీదైనా సరే, వ్యాసాలు రాశాక, ప్రసంగాలు చేశాక కూడా సాహిత్యంగా త‌ప్ప మ‌రోలా చెప్ప‌లేనిది మిగిలి ఉన్నప్పుడు రచయితలు కాల్పనిక ప్రక్రియల్లోకి వెళతారు. మానవ అనుభవాన్ని వర్ణించడానికీ, పంచుకోడానికీ సాహిత్య రచన తప్పనిసరవుతుంది. ఆ అనుభవం ఇవ్వాల్టిదైనా కావచ్చు. చరిత్రలోని సుదూర గతానిదైనా కావచ్చు. కానీ, సుప్రసిద్ధ రాయలసీమ రచయిత బండి నారాయణ స్వామి ఇటీవల 600 పేజీల ‘కడపటి యుద్ధం’ నవల రాశాక కూడా తన ఇతివృత్తం గురించి, అందులో తన ప్రతిపాదన గురించి ఆయన మళ్లీ వ్యాసాలు రాయవలసి వస్తున్నది. ఈ పని నవల ‘వెనుక మాట’తోనే ఆయన ఆరంభించారు. నవల ద్వారా తాను
సంపాదకీయం

అభివృద్ధి వెలుగులో పర్యావరణ సంక్షోభం

‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అని గురుజాడ అన్నారు. దేశమంటే మనిషి కాదు మట్టి అన్నది నేటి ప్రభుత్వాల మాట. మట్టి అంటే మట్టిలో దాగి ఉన్న ఖనిజ సంపద అని. ఖనిజ వనరులతో అభివృద్ది చెంది అగ్రదేశం అవుతాం అని చెబుతారు. అభివృద్దిలో మనిషి ఉండడా అనే సందేహం పెట్టుకోకండి. అభివృద్దిలో లెక్కలు, లాభాల అంచనాలు మాత్రమే ఉంటాయి. లాభాల వేటలో మనుషులు, చెట్లు, జంతువులు, నీరు, గాలి అనే జీవావరణం పోగా  లాభాలు మిగులుతున్నాయి. ఈ లాభాల వేటలో ఏమి కోల్పోతున్నామో నాగరిక మానవుడు తెలుసుకోలేని స్థితిలోకి నెట్టబడ్డాడు.                   ఈ లాభాల వేటలో
వ్యాసాలు

నక్సల్బరీ: రాజ్యాధికార భావన

(నక్సల్బరీ  వార్షికోత్సవం సంద‌ర్భంగా మే 24న పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక హైద‌రాబాదులో నిర్వహించిన  మ‌ర‌ణ‌మే లేదంది నక్సల్బరీ స‌ద‌స్సు ప్రసంగ ప‌త్రం - వసంత‌మేఘం టీం) నక్సల్బరీ అనేది ఒక ఊరు పేరు మాత్రమే కాదు. అది కేవలం రైతుల తిరుగుబాటు కూడా కాదు. తీవ్రతలో గాని, దీర్ఘకాలికతలో గాని అది మహత్తర తెలంగాణ రైతాంగ తిరుగుబాటుతో కూడా పోల్చదగినది కాదు. కానీ అది ప్రైరీ అగ్ని లాంటి ఆర్పలేని అగ్నిని సృష్టించింది. అయితే నక్సల్బరీ పోరాటాన్ని భారత రాజ్య యంత్రాంగం అనతి కాలంలోనే అణచివేసింది. మహత్తర శ్రీకాకుళ పోరాటం కూడా ఓడిపోయింది. బీహార్ లోని అగ్రకుల
వ్యాసాలు

ప్రభుత్వ విద్య వెనుకబాటును గుర్తించిన తెలంగాణ విద్యా కమీషన్

తెలంగాణ సర్కారు ఏడాదిన్నర క్రితం రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అకునూరి మురళి, ప్రొఫెసర్ పి.ఎల్ విశ్వేశ్వరరావు మరియు ఇద్దరు సభ్యుల ఆద్వర్యంలో తెలంగాణ విద్యా కమీషన్ ను ఏర్పాటు చేసింది.   ఈ కమిషన్ తన అధ్యయనంలో రాష్ట్రంలో విద్యా వెనుకబాటును‌ స్పష్టంగా గుర్తిస్తూ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అదే సమయంలో ప్రస్తుతం విద్య రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి విద్యారంగం వెనుకబాటు నుండి బాగు చేయడానికి పలు సిఫార్సులు చేసింది. కేంద్రంలో ఎన్డిఏ సర్కారు రూపొందించిన నూతన విద్యా విధానం-2020లోని అశాస్త్రీయ విధానాలు తిరస్కరించాలని, ఉచిత
వ్యాసాలు

భారతదేశాన్ని హిందూ వ్యవస్థే పాలిస్తోంది

2026 మే 18 తరచుగా జరుగుతున్నట్లే, చారిత్రాత్మక కమల్ మౌలా మసీదు ఒక హిందూ దేవతకు అంకితం చేసిన దేవాలయమని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది’. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్‌లో ఉన్న కమల్ మౌలా మసీదు 78 ఏళ్ల మహమ్మద్ రఫీక్‌కు మరో ఇల్లు. రఫీక్ 50 ఏళ్లుగా ఆ మసీదులో ముస్లింలను ప్రార్థనకు పిలిచే ముఅజ్జిన్‌గా ఉన్నారు. అతనికి ముందు 1947లో భారతదేశానికి బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్ర్యం రాకముందే అతని తాత హాఫిజ్ నజీరుద్దీన్ ప్రార్థనలను నిర్వహించేవారు. కానీ పురావస్తు ప్రాముఖ్యత కలిగిన, సంరక్షిత స్మారక చిహ్నమైన భోజ్‌శాల సముదాయంలోని మసీదులోకి ఇప్పుడు ధార్‌లోని
వ్యాసాలు

భారత జెన్ – జెడ్ యువత ప్రయాణం ఎటువైపు…?

 మే 15వ తేదీన సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ దేశ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు భారతీయ యువతలో అసంతృప్తి ప్రకంపనలు సోషల్ మీడియాలో పుట్టించాయి. అతని వ్యాఖ్యలు  ఈ దేశం యువతను సోమరిపోతులు గాను, బద్దకస్తులుగాను చెబుతూ, వారిని బొద్దింకలతో పోల్చారు. దీనికి  స్పందనగా మే- 16న "కాక్రోచ్ జనతా పార్టీ" పేరుతో సోషల్ మీడియాలో ఈ దేశ యువత మరియు విదేశాల్లో ఉన్న భారతీయ యువకులు పెద్ద ఎత్తున నిరసన తెలియ జేశారు. ఆ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చినప్పటికీ, పాలక ఎన్. డి.
సంభాషణ

చలం – రచన ప్రపంచంలో ఓ ‘చుక్కమ్మ’

ఎక్కడో ఛత్తీస్‌ఘడ్ అడవిలో ఒక చెట్టుకింద కూర్చున్న నాకు చలం పరిచయమయ్యాడు. అక్కడ సిగ్నల్ ఉండదని ముందే యూట్యూబ్  కొన్ని వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నాను.   వాటిల్లో  చలం రచనలు అని ఇరవై రెండో ఇరవై మూడో ఎపిసోడ్లు కూడా ఉన్నాయి.   అప్లోడ్ చేసిన వాళ్ళు సరిగా గుర్తులేరు కౌముది అనుకుంటా. అవన్నీ వింటూ వింటూ చలం పరిచయం అయ్యాడు. మొదట అందులో నేనూ విన్నది కూడా  ప్రేమలేఖలు అనే వీడియో.  అప్పుడు నాకు విరహం కూడా ఎక్కువే ఉండేది.  కుటుంబాల మీద కాదు!  అక్కడి నుంచి నాకు చలం అలవాటు అయ్యాడు.  నేను సాహిత్య ప్రపంచంలోకి రావడానికి ఒక
రిపోర్ట్

బాక్సైట్ తవ్వకాల కోసం వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం మ్యాప్ మార్పు

2026 మే 27 ఒడిశా ప్రభుత్వం కొన్నేళ్లుగా తన బాక్సైట్ నిల్వలపై కన్నేసింది. దానికి ఒక ముఖ్యమైన అడ్డంకి ఎదురైంది. అదే, అత్యంత విలువైన ఆ బాక్సైట్ నిల్వల పైన ఉన్న అడవులు. రక్షిత ప్రాంతాలను తవ్వకాలకు తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ వన్యప్రాణి సంరక్షణ మండలి ఎలా కలిసి పనిచేశాయో మా పరిశోధన వెల్లడిస్తుంది. [సంపాదకీయ గమనిక: బాక్సైట్‌పైన ఒడిశా ప్రభుత్వానికి ఉన్న ప్రేమను, ఆ బాక్సైట్ నిల్వలపైన నివసిస్తున్న ఆదివాసీ సముదాయాలపైన ఉన్న ప్రేమగా చిత్రీకరిస్తున్నారు. కార్లపట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సమీపంలో ఉన్న బాక్సైట్ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి, ఆ క్రమంలో
ఆర్ధికం

భారత్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం

పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి! ఇది యాధృచ్ఛికం కాదు. విధానపర మైన నిర్లక్ష్యం దౌర్బ‌ల్యం. అంత‌కు మించి ఆర్థిక నిర్వహణలో వైఫల్యం. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధ‌రలు తగ్గినా, ఆ లాభం వినియోగదారుడికి చేరట్లేదు. పెరిగితే మాత్రం వెంటనే ప్ర‌జ‌ల‌పై భారం మోపబ డుతున్న‌ది. ఇది మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానం. దాంతో రోజు రోజుకు తీవ్రతరం అవుతు న్న సంక్షోభ కారుమేఘాలు దేశ గగనతలంపై కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే నిరుద్యోగం విజృంభించి, వేత నాల ప్రతిష్టంభన ఏర్ప‌డింది. ఈ జంట సంక్షోభాలు ఉండగా అదనంగా యుద్ధం వల్ల ధరల పెరుగు దల  హడలగొడుతున్నాయి.  కొంత