కవిత్వం

పొద్దు తిరుగుడు పువ్వు

పొద్దు తిరుగుడు పువ్వు ప్రేమగా ఎర్రని సూర్యున్ని ముద్దాడుతూ అడవులను చెట్లను మొక్కలను అన్నిటినీ మనసారా హత్తుకుంటుంది రైతులను ఆదివాసులను ప్రేమగా దగ్గరకు తీసుకొని వారి నవ్వులకు వెలుగులను పంచుతుంది పువ్వులకు పేద ధనిక కులము మతము ఏమీ ఉండవు కదా అందరికీ సమానంగా పరిమళాలను వెదజల్లుతుంది రాజ్యం కుట్ర చేసి పువ్వులను నరుకుతున్నప్పుడు ఆ రాజ్యానికి తెలియదుపువ్వులకు కూడా బలమైన మెదడు ఉంటుందని భూమి మీద విత్తనాలు వెదజల్లుతూపువ్వులు నేలకొరిగిపోతాయి. ఒకనాటికి సూర్యున్ని ముద్దాడడానికి పొద్దు తిరుగుడు పువ్వులు మళ్లీ మొలకెత్తుతాయి.
కవిత్వం

విప్లవ స్వాప్నికుడు

డియర్ సాయి నీవు మరణించావని అంటే నేనెట్ల నమ్ముతాను ఈ రాజ్యం కదా నిన్ను నిలువునా హత్య జేసింది..!నీవు వీల్ చెర్ నుండి కదలలేవని అడుగు కదప లేవని విశ్వమంతా తెలిసినా నీ ఆలోచనల సృజనకు జడుసుకున్న ఈ రాజ్యం సూడో నేత్రపు కత్తుల బోను ప్రహారలో బంధించింది కదా సాయి..!!నాలుగు గోడల తరగతి గదుల నడుమనల్లబోర్డు మీద విద్యార్థులకు ప్రపంచ గతిని మార్చే పాఠాలు చెప్పినందుకు నక్సలైట్ గా ముద్రలు వేసిన రాజ్యం నీ అక్షర కణానికి దాని గుండె గవాక్షాలు మూసుకపోయాయి..!డియర్ సాయిబాబా నీవు దశాబ్ద కాలం మగ్గిన ఆ చీకటి కుహరపు గోడల్లో ఏ
మీరీ పుస్తకం చదివారా ?

ఫాసిస్టు రుతువులో కవి హత్య

*అత్యంత దుర్భరమైన జైలు జీవితానుభవాల తాకిడిని ఒడిసిపట్టుకొని, తన జీవన దృక్పథపు తెరచాపతో దృఢంగా నిలబడేందుకు చేస్తున్న సాహస ప్రక్రియే ఈ కవిత్వం. వాస్తవికమైన ఉద్వేగాల, విశ్వాసాల, ఆగ్రహావేశాల, కన్నీటి దుఃఖాల కాల్పనిక ప్రపంచమంతా చుట్టి వచ్చి తిరిగి జైలు గది నేల మీది నుంచి కవిత్వాన్ని సమున్నతంగా ఎత్తిపట్టే ప్రక్రియ ఇది. కాల్పనిక రూపం ధరించే మానవ విశ్వాసానికి ఎంత శక్తి వస్తుందో ఈ కవిత్వంలో చూడవచ్చు. కవిత్వమంటే సరిగ్గా ఇదే. అలవిగాని ఒంటరితనాన్ని అనంత మానవ సంబంధాల్లోకి, అతి సున్నితమైన, ఆర్ద్రమైన అనుభూతుల్లోకి, మానవులకు మాత్రమే సాధ్యమయ్యే అనుభవాల్లోకి, అంతకుమించి భవిష్యదాశలోకి మళ్లించడంకంటే కవిత్వానికి అర్థం
సమకాలీనం

అవార్డును తిరస్కరించిన రచయిత్రి జసింతా కెర్కెట్

పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధ బాధితులకు సంఘీభావంగా యునైటెడ్  ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూ‌ఎస్‌ఎఐ‌డి), రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ సంయుక్తంగా ఇచ్చిన అవార్డును స్వీకరించడానికి ఆదివాసీ కార్యకర్త, రచయిత్రి జసింతా కెర్కట్ట నిరాకరించారు. ఆమె పుస్తకం, కవితల సంపుటి అయిన జిర్హుల్, చిల్డ్రన్స్ బుక్ క్రియేటర్స్ అవార్డులలో 'రూమ్ టు రీడ్ యంగ్ ఆథర్ అవార్డు'కి ఎంపికైంది. ఈ నిర్ణయంపై అవార్డు యిచ్చేవారు ఇంకా బహిరంగంగా స్పందించలేదు. బాలల సాహిత్య అవార్డుల 2వ ఎడిషన్ వేడుక అక్టోబర్ 7న జరుగుతుందని దాని వెబ్‌సైట్ పేర్కొంది. పిల్లల కోసం పుస్తకాలు ముఖ్యమైనవి కానీ పెద్దలు
సంపాదకీయం

సాహచర్య వంతెన..

ఇటు చూడు కన్నీళ్ళతో నిండిన నీకళ్ళను నాకు చూపియ్యడానికి   సిగ్గుపడకు... ఈ రోజైనా కన్నీటి వర్షాలు వరదలు పెట్టనివ్వు       -కబీర్. అక్టోబర్ 4వ తేదీన ముప్పైమంది మావోయిస్టుల హననం జరిగిన వారం రోజుల తర్వాత సాయిబాబా మరణించాడు. దుఃఖానికి ఒక కొలత ఉండాలి. దానికొక అడ్డు కూడా ఉండాలి. కానీ నిర్వికల్పసంగీతంలా భారత సమాజంలో దుఃఖం ప్రవహిస్తుంది. దుఃఖతీవ్రత సాయిబాబ దగ్గర  ఆగింది.   2013 విరసం  జనరల్ బాడీ సమావేశం కావలిలో జరుగుతుండగా ఢిల్లీలో సాయిబాబా  నివాసంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ  ఉన్నదని  వరవరరావు మా దృష్టికి  తీసుకువచ్చారు. యూపీఏ పాలనలో కేసు నమోదు అయింది. తర్వాత
సమకాలీనం

గెస్టపోలాంటిదే ఎన్ఐఎ

వర్సైల్స్ ఒడంబడిక* లోని అవమానకరమైన నిబంధనలు జర్మన్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసాయి. ఈ ఒప్పందం దేశ సార్వభౌమాధికారాన్ని, ఆర్థిక  స్వాతంత్య్రాన్ని  అంతం చేసింది. వారు విజేతల ముందు తలవంచవలసి వచ్చింది (ట్రిపుల్ అలయన్స్). వర్సైల్స్ ఒప్పందం ప్రకారం, జర్మనీ $33 బిలియన్ డాలర్ల యుద్ధ నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది; విలువైన విదేశీ వలసలను వదులుకుంది; ఫ్రాన్స్, పోలాండ్‌లకు తన స్థానిక భూములలో విలువైన భాగాలను అప్పగించింది. జర్మన్ సైన్యం గణనీయంగా తగ్గిపోయింది; జలాంతర్గాములు లేదా వైమానిక దళం నిషేధానికి గురయింది. "మేము జర్మన్ నిమ్మకాయను దాని విత్తనాలు కేకలు వేసే వరకు పిండి పిప్పి చేస్తాం!"1 అని ఒక
పాట

జన సమర భేరి

పల్లవి:ఓ.. సాయి బాబా - జన సమర భేరినిత్య సంఘర్షణే-నీ త్యాగ నిరతినీ తలను చూసిఏ శిలకు వణుకునీ గళం కలముకులేదాయె బెణుకుఆ కొండ కోనలేనీ గుండె బలముఆదివాసే కదావిముక్తి దళముబండి చక్రం పైనె ఎడతెగని పయనంబందించినా జైలు కౄర పరిహాసం ||ఓ సాయి బాబా||1) అమలాపురమొక ఉద్యానవనముఏ తల్లి నినుగందొ ప్రజలకే వరమూకళాశాల కదన రంగమయ్యిందోకవిగా నీ కలల పంట పండిందోఅక్షరాల పరుగు ఆగనిది వెలుగుదీక్షగా ఢిల్లీకి చేరింది అడుగుముంబై ప్రతిఘటననీ కాయకష్టంవిశ్వజన పీడితులశంఖారావంసామ్రాజ్యవాదాన్ని ఎదిరించె లక్ష్యంపోరాట ప్రపంచమొకటయ్యె గమ్యం ||ఓ సాయి బాబా||2) మండేటి కాశ్మీరు మనసుల్ని గెలువారగిలేటి ఈశాన్య రాష్ట్రాల తెగువాకార్పోరేట్ల దృష్టి కారడవి
సంభాషణ

ఒక వీరునికి కడసారి వీడ్కోలు

2024 అక్టోబర్ 14,హైదరాబాద్, మౌలాలిలోని ఒక పెద్ద అపార్ట్ మెంట్ కింద కార్ పార్కింగ్ ప్లేస్ అంతా జనంతో కిటకిటలాడుతోంది. మధ్యాహ్నం 12 దాటుతోంది. జనం వస్తూనే వున్నారు. అల్విదా.. సాయిబాబా అంటున్నారెవరో! ఎర్ర గులాబీల దండల కింద ఒక కవిఏ కదలికా లేకుండా వున్నాడు. సుత్తికొడవలితో మెరుస్తున్న ఎర్ర జెండా కింద... రాజీపడని, తలవంచని, భయమెరుగని యోధుడొకడు అచేతనంగా వున్నాడు. ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబా అనే ప్రజల మనిషినిచివరిసారి చూడడం కోసం జనం తోసుకుని వస్తున్నారు. జోహార్ కామ్రేడ్ సాయిబాబా అంటూ నినదిస్తున్నారు. అక్కడంతా ఉద్రిక్తంగా వుంది. ఒక ఉద్వేగం, విషాదం కలిసి అక్కడ ప్రవహిస్తున్నాయి.వందలమంది స్త్రీలు
కవిత్వం

ఈ మౌన సందర్భానికి

దీపాన్నైతే ఆర్పేశారు గానీ ఈ ఉదయ కాంతిలో మెరుస్తున్ననీ మృత్యుంజయ మందహాసాన్నిలొంగ తీసేవారెవరు?అండాసెల్ చీకట్లో చావును నిరాకరించిన నీ మొండి గుండె చప్పుడునీ పదాలకూ వాక్యాలకూ మధ్యన మరింత దృఢంగా మేల్కొన్నదితరగతిలో "అరణ్యకాండ"బోధిస్తున్న వేళ గొంతులో ప్రవేశిస్తావునా రక్తనాళాల వ్యాకోచంలోనాగరికతా విధ్వంసాల ఆర్తనాదంగా..ఆదివాసి గూడాల ప్రవాహ దుఃఖంలాధ్వనించి,అక్కరలేని శాంతిని భగ్నం చేస్తావుతల్లికీ బిడ్డకూ మధ్యన ఫైబర్ గాజు కిటికీలా....భార్యనూ భర్తనూ మరింత మరింతగా భేదించే ములాఖత్ మౌనంలా...సహస్ర రూపాల అధికార క్రౌర్యoనీ బిగిపిడికిట్లో శిరస్సురాలి ఓడింది...ఔను...రక్తం ఒలుకుతున్న కాలం గుండాసమాజం నడుస్తోంది...మన ప్రియమైన దేశాన్ని గత్తరలా పట్టుకున్న ఈ మౌన సందర్భానికి నువ్వవసరం.
పత్రికా ప్రకటనలు

సాయిబాబా మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందడంపట్ల  బాధాతప్త హృదయంతో నిర్బంధ వ్యతిరేక వేదిక జోహార్లు తెలియజేస్తుంది.  ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తగా, కవిగా, రచయితగా, విద్యావేత్తగా పేరుపొందిన సాయిబాబా రాజ్యం కక్షపూరిత చర్యలకు బలైపోయాడు. .1990 సంవత్సరాల నుండి రిజర్వేషన్ అనుకూల ఉద్యమం, జైలు ఖైదీల హక్కుల సాధన ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం, ఆదివాసి హక్కుల ఉద్యమం లాంటి అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడం సహించలేని రాజ్యం అతనిపై అక్రమ కేసులు బనాయించి పది సంవత్సరాలు జైలులో అండా సెల్