తొలికెరటాలు

త్యాగమూర్తి సావిత్రీబాయి ఫూలే

సావిత్రీబాయి ఫూలే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. సావిత్రీబాయి ఫూలే 1831, జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా, ఖండాలా తాలూకాలోని నాయగావ్ అనే గ్రామంలో జన్మించారు. ఆమె తల్లి పేరు లక్ష్మీబాయి మరియు తండ్రి వారు ఖండోజీ నెవసే పాటిల్. ఆమె తండ్రి ఆ గ్రామానికి పాటిల్, అంటే గ్రామ పెద్దగా ఉండేవారు. ​సావిత్రీబాయి ఫూలే వెనుకబడిన తరగతికి చెందిన 'మాలి' పూల తోటల పెంపకం చేసే కుటుంబంలో జన్మించారు. ఆమె తన తల్లిదండ్రులకు నలుగురు పిల్లలలో పెద్ద కుమార్తె. ఆనాటి సామాజిక పరిస్థితుల ప్రకారం సావిత్రీబాయి గారికి, ముఖ్యంగా ఆడపిల్లలకు చదువుకునే హక్కు ఉండేది కాదు.
తొలికెరటాలు

ఉపాధ్యాయుడికి ప్రేరణనిచ్చే  “పగటి కల”

గిజుభాయి బదేక రాసిన "పగటికల" పుస్తకం విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆశించే ఉపాధ్యాయులకు ఓ గొప్ప మార్గదర్శక పుస్తకం. పోలు శేషగిరిరావు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. పేరులో ఉన్నట్టు ఈ పుస్తకం"ఈ పగటి కల" కాకుండా పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా భయం లేని విద్యను అందించాలని ఉపాధ్యాయులకు ప్రేరణను ఇస్తుంది. ఈ పుస్తకం ముఖ్యంగా నేటి ఆధునిక విద్యా వ్యవస్థకు కూడా ఎంతో అవసరం. పుస్తకంలో గురువు పాత్ర పోషించినది లక్ష్మీకాంత్ అనే ఓ నూతన ఉపాధ్యాయుడు. అతను ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరి అక్కడ ఉన్న పాత బోధనా పద్ధతులను మార్చి,
తొలికెరటాలు

అంటరానితనమే ఓ కేస్

కులం భారతదేశంలో క్రీస్తు పూర్వం ఉంది క్రీస్తు తర్వాత కూడా ఉంది. అది ఇప్పటికీ సజీవంగానే ఉంది అయితే ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికనుగుణంగా రూపం మారుతూ ఉంది. ఒకప్పుడు బహిరంగంగానే చూపేవారు ఇప్పుడు చూపించకనే చూపిస్తున్నారు. వర్షం కురవని నేల ఉంది ఎండ పడని భూమి ఉంది కాకులు దూరని కారడవి ఉంది కానీ కులం లేని సమాజం లేదు. ప్రతి దగ్గర ఏదో విధంగా ఏదో రకంగా ఆధిపత్యం చూపిస్తూనే ఉంటారు. అగ్ర కులాలకు లోకులాలు, దళితులంటే గిట్టదు లోకులాలకు వారి కింద కులాలంటే పడదు. ఒకరి కింద ఒకరు అంటూ బాయిలో కప్పల్లా ఉంటున్నారు. కులాలు
తొలికెరటాలు

ముస్లిం బతుకుల హృదయ దీపం

"హృదయ దీపం" కథల సంపుటిని భాను ముస్తాక్ రచించారు. ఈ పుస్తకం 2025 సంవత్సరాలనికి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ను గెలుచుకున్నది. ఈ పుస్తకాన్ని తెలుగులోకి "నాగిని అప్పసాని" అనువదించారు. ఇందులో మొత్తం 12 కథలు ఉంటాయి. అవి ముస్లిం మహిళల రోజు వారి జీవితాలను, అనుభవాలను తెలియజేస్తాయి. వారి జీవితాల పట్ల సానుభూతి ఇందులో ఉంటుంది. ముస్లిం స్త్రీల దైనందిన జీవితంలోని బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఎలా ఉంటాయో ఈ పుస్తకం చదివితే కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. వారికి రోజూ గృహింసనే కాదు, సామాజిక కట్టుబాట్లను  వారు నిశ్శబ్దంగా ఎలా భరించారనే విషయాలు తెలుస్తాయి. అంతేకాకుండా మూఢనమ్మకాలు
తొలికెరటాలు

విప్లవంలో చిగురించిన ప్రేమికులు-మార్క్స్,జెన్నీ

వాళ్ళిద్దరిది ఒకే మాట. ఒకే ఆలోచన. ఒకే తీరు. ఒకే సిద్ధాంతం. ఒకే స్వప్నం. ఒకే వ్యక్తిత్వం. ఒకే పోరాటం. ప్రజల కోసమే పుట్టిన త్యాగమూర్తులు వాళ్ళు.వాళ్లే జెన్నీ,కార్ల్ మార్క్స్. జెన్నీ తండ్రి లుడ్విగ్ వాన్ వెస్ట్ ఫాలెన్. జెన్నీ తల్లి ఎంతో ప్రేమస్పదమైన హృదయం ఆమెది. జెన్ని సోదరుడు హెడ్గార్.హెడ్గార్ కు సహ పాఠకుడే మార్క్స్. సోదరుడి మూలంగానే మార్క్స్ కు,మరియు జెన్నీకి మధ్య బాల్యం నుండే స్నేహం ఏర్పడింది.కాలం గడిచే కొద్దీ వాళ్ళిద్దరూ మరింత సన్నిహితులయ్యారు. కాలం అనేది మనుషుల మధ్యన ప్రేమను, మానవత్వాన్ని, జాలి, దయను, కలిగిన వ్యక్తులను మనకు సమీపంగా తెస్తుందేమో.మరోవైపు మార్క్స్
తొలికెరటాలు

మట్టి  మనసుల చిత్రణ కుందేరు సాక్షిగా

సురేంద్ర శీలం రాసిన ఈ నవల కేవలం కుందేరు నది ఒడ్డున ఉన్న క్రిస్టిపాడు గ్రామ కథ మాత్రమే కాదు. ఆ ఊరి ప్రజల జీవితాలను మాత్రమే చిత్రించదు. ఇది మట్టి మనుషుల మనసుల లోతులను పరిశీలిస్తూ, వారి జీవన విధానాన్ని, భావోద్వేగాలను సూక్ష్మంగా అద్దం పట్టే నవల. రాయలసీమ గ్రామీణ వాతావరణాన్ని అక్కడి మనుషుల బంధాలను, అక్కడి రాజకీయాలను, అక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. సహజంగా నది అనేది నాగరికతకు మూలం. నాగరికత వృద్ధి చెందే క్రమంలో అక్కడ జరిగిన మార్పులకు అక్కడి ప్రజల జీవితాల్లో సంస్కృతి పరంగా, జీవన విధానంలో అన్ని రకాల మార్పులకు సాక్ష్యం నది.
తొలికెరటాలు

అనేక రూపాల ప్రేమ‌

“ప్రేమమ్ – కాలయానం (1995)” అనే పుస్తకం పేరు వినగానే ఇది ఒక ప్రేమకథగా అనిపిస్తుంది. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత తెలుస్తుంది,ఇది కేవలం ప్రేమ గురించి మాత్రమే కాదు. ప్రేమను ప్రధానంగా పెట్టుకుని, కాలం, జ్ఞాపకం, విధి, పశ్చాత్తాపం, రెండో అవకాశం, తండ్రి ప్రేమ వంటి అంశాల్ని ఒకదానితో ఒకటి ముడిపెట్టి నడిపించిన కథ అని. 1995 అనే సంవత్సరం ఇక్కడ ఒక తేదీ కాదు; అది, మన మనసులో ఎప్పుడో దాచిపెట్టిన మధుర జ్ఞాపకాల్ని, పాత గాయాల్ని, చెప్పుకోని ప్రేమల్ని ఈ పుస్తకం మళ్లీ బయటకు తీసుకొస్తుంది. ఈ కథలో 1995 నేపథ్యం చాలా
తొలికెరటాలు

దొంగ సారా: ఒక విషాద సామాజిక చిత్రణ

భారతక్క (ఎండపల్లి భారతి) రచనలో ఊర్లో మనుషుల మధ్యలో ఉండి వాళ్ల మాటలు విన్నట్టు అనుభవమవుతుంది. ఆమె రాత అంత సహజంగా, ఏబ్బేట్టుగా లేకుండా ఉంటుంది – చదువుతుంటే ఊరి గాలి, మాటలు, బాధలు కళ్ల ముందు కనిపిస్తాయి. భారతక్క పుస్తకం చదివితే సారా కాయడం, అమ్మడం ఊర్లలో ఎంత పెద్ద సమస్యో అర్థమవుతుంది. ఇది కేవలం తాగుడు సమస్య కాదు – ఇది ఆర్థికం, సామాజికం, రాజకీయం కలిసిన పెద్ద విషాదం. సారా కాయడం – దాని వాస్తవ రూపం ఒకప్పుడు సారా సోక్కంగా (సహజంగా, సాంప్రదాయ పద్ధతిలో) తయారు చేసేవారు. కానీ తరువాత లాభం కోసం
తొలికెరటాలు

ధిక్కార పతాకమై ఎగిరే నీలం రంగు నది

నల్లింకు పెన్నుతో పరిచయమైన రచయిత హథీరామ్ సభావట్, తనలోని ఎన్నో ఆవేదనలను అక్షరీకరించి, మళ్ళీ తన బలమైన గొంతును వినిపించేందుకు ధిక్కార పతాకమై ఎగిరే "నీలం రంగు నది"ని మన ముందుకు తెచ్చారు. ఇందులోని ప్రతీ కవిత దేనికదే ప్రత్యేకం. ఆదివాసీ గూడాల గుండెలలో రగులుతున్న ఆవేదనను... పాలస్తీనా, సూడాన్ వంటి ప్రపంచ దేశాలలో జరుగుతున్న మానవ హననాన్ని... ప్రకృతిని దోచుకుంటున్న రాజ్యపు అహంకారాన్ని.... మనుగడ కాన్వాస్ పై రక్తపు మరకలతో యుద్ధం చిత్రించిన దృశ్యాలను... ఎన్నింటినో రచయిత తన కవిత్వంతో మన కళ్ళ ముందుంచారు. నది అనగానే మనకు గుర్తొచ్చేది పచ్చని ప్రకృతి. ఆ ప్రకృతితో మమేకమై
తొలికెరటాలు

సు – ఒక మైలురాయి పుస్తకం

తెలుగు సాహిత్యంలో సైన్స్ ఆధారిత రచనలు చాలా అరుదు. మరీ ముఖ్యంగా ఒక నిర్దిష్ట సైన్స్ సబ్జెక్టును (ఇక్కడ మైక్రోబయాలజీ & ఆంకాలజీ) కేంద్రంగా చేసుకొని, ఫిక్షన్ రూపంలో అందంగా అల్లిన నవలలు దాదాపు లేవని చెప్పవచ్చు (ఉంటే నన్ను కరెక్ట్ చేయండి). అలాంటి ఖాళీని ‘సు’ అద్భుతంగా నింపేసింది. ఇది కేవలం ఒక నవల మాత్రమే కాదు – తెలుగు సాహిత్యంలో సైన్స్-ఫిక్షన్ జానర్‌కు ఒక బలమైన పునాది వేసిన మైలురాయి. చదువుకున్న సబ్జెక్టును సాహిత్యంలో రాయడం అంటే సులువైన పని కాదు. దానికి సబ్జెక్టుపై లోతైన పట్టు, శాస్త్రీయ ఖచ్చితత్వం, అదే సమయంలో పాఠకుడికి ఆసక్తికరంగా