త్యాగమూర్తి సావిత్రీబాయి ఫూలే
సావిత్రీబాయి ఫూలే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. సావిత్రీబాయి ఫూలే 1831, జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా, ఖండాలా తాలూకాలోని నాయగావ్ అనే గ్రామంలో జన్మించారు. ఆమె తల్లి పేరు లక్ష్మీబాయి మరియు తండ్రి వారు ఖండోజీ నెవసే పాటిల్. ఆమె తండ్రి ఆ గ్రామానికి పాటిల్, అంటే గ్రామ పెద్దగా ఉండేవారు. సావిత్రీబాయి ఫూలే వెనుకబడిన తరగతికి చెందిన 'మాలి' పూల తోటల పెంపకం చేసే కుటుంబంలో జన్మించారు. ఆమె తన తల్లిదండ్రులకు నలుగురు పిల్లలలో పెద్ద కుమార్తె. ఆనాటి సామాజిక పరిస్థితుల ప్రకారం సావిత్రీబాయి గారికి, ముఖ్యంగా ఆడపిల్లలకు చదువుకునే హక్కు ఉండేది కాదు.










