ఈ సంవత్సరం ఏప్రిల్ మధ్య నుండి, నోయిడా, గ్రేటర్ నోయిడా అంతటా పారిశ్రామిక, గృహ కార్మికులు పదివేల సంఖ్యలో స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్నారు. కనీస వేతనాన్ని కనీసం ₹20,000 కు పెంచి సమయానికి చెల్లించడం, వారాంతపు సెలవులతో కూడిన 8 గంటల పని దినం, అదనపు పని గంటలకు (ఓవర్టైమ్) రెట్టింపు వేతనం, భద్రత, ఉద్యోగ భద్రత వంటి ప్రాథమిక సౌకర్యాలతో పాటు కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయడం మొదలైనవి వారి ప్రధాన డిమాండ్లు. సమ్మె చేసినందుకు వెయ్యి మందికి పైగా కార్మికులను రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు; వందలాది మందిపైన ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేసి అరెస్టు