కవిత్వం

గిరి ప్రసాద్ చెలమల్లు మూడు కవితలు

1. మోదుగు పువ్వుఉద్దండులు అడవిని వీడారు కలిసిరాని కాలం అన్నారు ఆయుధమే అప్పగించాం సిద్ధాంతం సజీవం అన్నారు రాజ్యం విధించిన గడువు తీరిపోయింది రాజ్యాంగమే చేతుల్లోకి వాలింది ఇక అంతా ప్రజాస్వామ్యమేనని నమ్మ బలికింది చదువుకుంది లేదు కాసింది మేకలు పోలియో అవిటితనం పైగా అమ్మాయి అయితేనేం సిద్ధాంతాన్ని నమ్మింది అడవి బాట పట్టింది అంచెలంచెలుగా ఎదిగింది నమ్ముకున్నది తనని తాను వంచించటం చేతకాదు దారితప్పుటకు దారులు వెతుక్కోలేదు మాటలు నేర్చుకోలేదు వక్ర భాష్యాలకు నేర్చుకున్నదల్లా జనం కోసం అడుగులేయటమే!చావును ముద్దాడాలనుకుంది లొంగి పోనని తెగేసి చెప్పింది పోయే నాడెలా వెళ్ళిందో దాన్ని కోసమే ఆరాట పడింది చివరంటా
కవిత్వం

తాను ఎంచుకున్న దారి

‘ఏప్రిల్ అత్యంత క్రూరమైన మాసం’వాళ్ళకు ఆమె మీద చాల కోపంగా ఉన్నది ఎర్రటి ఎండల్లో ఎర్రెర్రని జెండా కప్పించుకోడానికి విప్లవపాటలు పాడించుకోడానికి అమర కామ్రేడ్ అనిపించుకోడానికి నీ ఆశయాలను కొనసాగిస్తామనిప్రతిజ్ఞ చేయించడానికి సాయుధ పోరాట ప్రగల్భాలుప్రచారం చేయడానికి మారిన పరిస్థితుల్లో లొంగిపోకుండా ఎన్‌కౌంటర్ ఎంచుకున్నందుకు వాళ్ళకు ఆమె మీద చాల చాల కోపంగా ఉన్నది అన్నింటికన్న మించి ఇపుడు ఆమె ఎలాగూ ఈ కీర్తనగీతాలు వినలేదుగానీతాము వినాల్సి వస్తున్నందుకు తాము చూడాల్సి వస్తున్నందుకు చాల చాల కోపంగా ఉన్నది వాళ్ళను చాలామంది ఇపుడు మార్చ్ 31 తర్వాత దొరికి లొంగిపోనంటే చంపకండి జైల్లో పెట్టండి అని అడుగొచ్చు కదా
వ్యాసాలు

మహిళల భుజంపై తుపాకీ పెట్టి…

కేంద్రంలోని కూటమి ప్రభుత్వం 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు- 2026 ను ఏప్రిల్ 18వ తేదీన లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో లోక్ సభ, శాసనసభల స్థానాల  పునర్విభజన, అందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల గూర్చి పేర్కొన్నారు. ఈ బిల్లు 2 /3 వ వంతు మెజారిటీతో గెలుపొందవలసి ఉన్నప్పటికీ,  కూటమి ప్రభుత్వానికి లోక్ సభలో అంత మెజారిటీ లేకపోవడం వలన వీగిపోయింది. అనంతరం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అధికార పక్ష  నాయకులు ప్రతిపక్షానికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదంటే, నియోజకవర్గాల పునర్విభజన  పేరుతో కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుందని