గిరి ప్రసాద్ చెలమల్లు మూడు కవితలు
1. మోదుగు పువ్వుఉద్దండులు అడవిని వీడారు కలిసిరాని కాలం అన్నారు ఆయుధమే అప్పగించాం సిద్ధాంతం సజీవం అన్నారు రాజ్యం విధించిన గడువు తీరిపోయింది రాజ్యాంగమే చేతుల్లోకి వాలింది ఇక అంతా ప్రజాస్వామ్యమేనని నమ్మ బలికింది చదువుకుంది లేదు కాసింది మేకలు పోలియో అవిటితనం పైగా అమ్మాయి అయితేనేం సిద్ధాంతాన్ని నమ్మింది అడవి బాట పట్టింది అంచెలంచెలుగా ఎదిగింది నమ్ముకున్నది తనని తాను వంచించటం చేతకాదు దారితప్పుటకు దారులు వెతుక్కోలేదు మాటలు నేర్చుకోలేదు వక్ర భాష్యాలకు నేర్చుకున్నదల్లా జనం కోసం అడుగులేయటమే!చావును ముద్దాడాలనుకుంది లొంగి పోనని తెగేసి చెప్పింది పోయే నాడెలా వెళ్ళిందో దాన్ని కోసమే ఆరాట పడింది చివరంటా




