గిరి ప్రసాద్ చెలమల్లు మూడు కవితలు
మోదుగు పువ్వు ఉద్దండులు అడవిని వీడారుకలిసిరాని కాలం అన్నారుఆయుధమే అప్పగించాంసిద్ధాంతం సజీవం అన్నారు రాజ్యం విధించిన గడువు తీరిపోయిందిరాజ్యాంగమే చేతుల్లోకి వాలిందిఇక అంతా ప్రజాస్వామ్యమేనని నమ్మ బలికింది చదువుకుంది లేదుకాసింది మేకలుపోలియో అవిటితనం పైగా అమ్మాయిఅయితేనేం సిద్ధాంతాన్ని నమ్మిందిఅడవి బాట పట్టిందిఅంచెలంచెలుగా ఎదిగింది నమ్ముకున్నది తనని తానువంచించటం చేతకాదుదారితప్పుటకు దారులు వెతుక్కోలేదుమాటలు నేర్చుకోలేదు వక్ర భాష్యాలకునేర్చుకున్నదల్లా జనం కోసం అడుగులేయటమే! చావును ముద్దాడాలనుకుందిలొంగి పోనని తెగేసి చెప్పిందిపోయే నాడెలా వెళ్ళిందో దాన్నికోసమే ఆరాట పడింది చివరంటాసహచరుడినెలా చంపారో అలాగే చంపమందినేను నియమించిన వాళ్ళు చంపబడ్డాకనేను లొంగిపోతే నేను మనిషినే కాదన్నది !బలమైన మనోస్థైర్యం ఆమె సొంతం! చిత్రహింసల చావుని





