కాలమ్స్ క్యా చల్రా .?

మూడు రాజధానుల ముచ్చట ముగిసిన అధ్యాయం కాదు

 నేటి (21/11) జగన్ ప్రభుత్వ ప్రకటన అందర్నీ ఆశ్చర్యం లో ముంచిందనడంలో సందేహం లేదు. మొన్నటి మోడీ ప్రకటన, మూడు వ్యవసాయచట్టాల రద్దు, నేటి మూడురాజధానుల చట్టం రద్దులలో కొన్ని సారూప్యతలున్నా, కొన్ని తేడాలూ వున్నాయి. సారూప్యత, ఇరువురూ తాము మంచిబుద్ధితో చట్టాలు తెచ్చినా వాటి ప్రయోజనాల గురించి కొంతమందిలో కలిగిన అపోహలు తొలగించడంలో విఫలమయ్యామని, అందువల్ల తాము వాటిని రద్దుచేయక తప్పలేదని విచారం వ్యక్తం చేస్తూ ప్రకటించారు. తాము అనుసరించిన విధానాలలోని  తప్పులను అంగీకరించక, తామేదో ప్రజల్ని ఉద్ధరించే ప్రయత్నాలు జేస్తే, కొందరు... అందరూ కాదు, అడ్డుపడ్డారని వాపోయారు. ఈ సారూప్యతలటుంచుతే, మోడీ వెనుకంజకు కారణం రాబోయే
కాలమ్స్ క్యా చల్రా .?

బొగ్గు కొర‌త లేదు.. వ్యాపారం అంతే

1 మళ్లీ చీకటిరోజుల్లోకి గ్రామాలను, పట్టణాలను ప్రస్తుత విద్యుత్‌ సంక్షోభం తోసేయనుందా? జ: అలాంటి అవకాశమే లేదు. ఎందువల్లనంటే, ఈ రోజు విద్యుత్‌ ప్రభుత్వ బాధ్యతగా కాక, ఒక సరుకుగా మారిపోయింది. ఎప్పుడైనా సరుకులు అమ్ముడుపోతేనే లాభం వస్తుంది కనుక, విద్యుత్‌ కూడా అమ్ముడుపోవాలి. ఇది నేడు నిత్యావసరమయింది కనుక, ప్రజలు కూడా ధర ఎక్కువైనా తప్పకుండా కొనితీరవలసిందే. 2. థర్మల్‌ విద్యుదుత్పత్తికి కావాల్సిన బొగ్గు కొరత, దిగుమతి సమస్యలే ఈ సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయా? జ: బొగ్గు కొరతే లేదని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి తెలిపారు. తాజాగా ఆర్ధిక అంత్రి ఎటువంటి కొరత లేదని, విద్యుత్‌ ఉత్పత్తిలో
కాలమ్స్ క్యా చల్రా .?

సంస్కరించుకోకపోతే తాలీబన్లను కూడ తరిమేస్తారు

  1. ఇస్లామిక్ దేశాలు తరచూ వివాదాల్లో వుంటుంటాయి దేనికి? ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో దీనిని వివరిస్తారా? సామ్రాజ్యవాద దేశాలు తరచూ ఇస్లామిక్ దేశాల్ని వివాదాల్లోనికి లాగుతుంటాయి. మనం దాన్ని తలకిందులుగా అర్థం చేసుకుంటుంటాము. భూగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఒక విషయం సులువుగా అర్థం అవుతుంది. ముస్లిం దేశాల్లో చమురు, ఆదివాసులు సంచరించే నేలల్లో ఖనిజ నిక్షేపాలున్నాయి. ఇవి రెండూ సామ్రాజ్యవాద దేశాలకు కావాలి. చంపదలిచిన కుక్కను పిచ్చిదని ప్రచారం చేయాలనే ఉపాయం ఎలాగూవుంది. ముస్లింలు, ఆదివాసుల్ని అనాగరికులుగా ప్రచారం చేయడం సామ్రాజ్యవాదుల ఆర్థిక అవసరం. ఆదివాసులు కొండలు, లోయలు, అడవుల్లో నివశిస్తారని మనందరికీ తెలుసు. కానీ,