కవిత్వం

వలసవాదులు

అన్వేషకుడుదాన్ని "పరిశోధన "అన్నాడుఓజెండా, ఓ శిలువ, ఓ కిరీటంఅకస్మాత్తుగ బందిపోటుపవిత్రుడైపోతాడుప్రజలను తరిమేశాకఅదంతా "ఖాళీ నేల" అవుతుందిమూలవాసులుచరిత్రను పూడ్చిపెట్టిందెవరోచూపెడతారుమీ మ్యాపులకన్న ముందుఇక్కడొక భాష ఉండేదిమీ సరిహద్దులకు ముందుఇక్కడ జ్నాపకాలుండేవిమీ లెక్కల పుస్తకాలముందుఇక్కడ జీవిత ముండేదివలసవాదులుఅడవిని కనుగొనలేదుదాన్ని "సృష్టించారు"పేర్లను, మనుషుల్ని, భవిష్యత్తును తుడిచేసిదాని పేరు నిశ్శబ్ద నాగరికతగా నామకరణం చేశారువాళ్లుతెచ్చింది నాగరికత గాదురోగాలు, సంకెళ్లు, కట్టు కథలుమేధావులకో "ప్రశ్న "పరిశోధన అంటే నిజాయితేనాలేక తన అధికారంసుస్థిరం చేసుకోవడానికిచెప్పే మొదటి అబద్ధమా**థింక్ అండ్ ఎగ్జిస్ట్...నుండిస్వేచ్ఛానువాదం.. ఉదయమిత్ర
కవిత్వం

మరో విషయం గురించి!

నిజమే!నేను ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఇంకొక దాని గురించి కూడా అనిపిస్తోంది! ఇది విచిత్రంగా అనిపించినా ఇదే వాస్తవం! అలాగే ఒక విషయం గురించి చెబుతూ మరొక విషయాన్ని చెప్పకుండా దాటవేయడం చాలా కష్టం! *** పినోచెట్ గురించి రాయడం అంటే సుహార్తో, మార్కోస్, హిట్లర్ గురించి కూడా రాయడం లాంటిదన్నమాట! చిలీలో అదృశ్యమైన వ్యక్తి చెమ్మానిలో కూడా పాతి పెట్టబడి ఉన్నాడు మరి! మెరిసివిలి, సూర్య కందలోని సామూహిక సమాధులు ఒకే పెద్ద గుంటగా తవ్వి ఉన్నాయి! *** బాబ్రీ మసీదును కూల్చిన గునపాలు జాఫ్నా లైబ్రరీని దహించిన మంటలనుంచే పుట్టాయి! ఆ మంటల
కవిత్వం

ఈ  పాడు కాలంగడిచిపోతది

ఓ దుఖంపెనుగంగలా ఉప్పొంగిజీవితాన్ని ముంచెత్తిమనశ్శాంతిని భగ్నం చేసినప్పుడుకనుచూపుమేరాప్రియమైనవన్నీ దూరమైనప్పుడునీ హృదయానికి పదేపదే ఇలా చెప్పు"ఈ పాడుకాలం గడిచిపోతది" అంతులేని శ్రమనీ సంతోషగానాల మీదమౌనపు తెరల గమ్మినప్పుడుప్రార్థించడానికి సైతంనీ పెదాలు వొణుకుతున్నప్పుడుఈ సత్యంమబ్బుల తొలగించినిన్ను తేలికపరచనీ"ఈ పాడుకాలం గడిచిపోతది " జీవితంవిలాసవంతమైభౌతిక సుఖాలలోకాలం దొర్లుతున్నప్పుడుఈ మాటలునిన్ను ఎప్పుడూ వెంటాడనీ"ఈ పాడు కలం గడిచిపోతది" నీ శ్రమ జీవజలంలోకీర్తి కాంతులు పుష్పించినప్పుడుప్రపంచంలోనేఉన్నతమైనవి నీకందివొచ్చినప్పుడుఈ జీవితంఒక అంతులేని, అద్భుత కథ అని గుర్తించుకో జీవితం దుర్భరమైన చోటజీవించడం మానకు అవిశ్వాసం లేనేలేదుమనకు తెలియకుండానేపెదాలు తిరస్కరించినచోటమనసు విశ్వాసంతో ఉరకలేస్తుంది** Elizabeth Y.case (1840)," This too shall passaway"కు స్వేచ్చానువాదం : ఉదయమిత్ర
కవిత్వం

గడువు ముగిసిన పన్నెండవ రోజు

అప్పటి వరకుఆమె భుజాల మీద ఏ బాధ్యత కూర్చుండ వచ్చునో భూమి కన్నీళ్ళు తుడుస్తూనోఅడవి వీపు నిమురుతూనోకాల్పుల్లో అనాదైన ఆదివాసీ చిన్నారిఆకలి కడుపు తీడుతూనో ఏ దుఃఖంఆమె కాళ్ళను చుట్టుకొని ఉంటుందో అడవిలోరాలి పడిన నెత్తుటి జెండాల్నేరుతూనోకాల్పుల్లో కూలిన శిరస్త్రాణాల గుండె కత్తుకుంటూనోవిరిగి పడిన ఆయుధాల ఆనవాళ్ళు కుప్పేస్తూనో లొంగుబాటులల్లనో అరెస్టులల్లనో కనిపించని'రూపి'ఏ ఆర్తి అమ్మలా కమ్ముకొనిఆమెను అడవికి కట్టేసుకోనుంటుందో కొంత ఫాసిజంఊడలైన సహచరత్వం నడుమకొంత ఆశయాలు పారి పోయిన మనుషుల నడుమకొంత పిరికితనం పొగచూరిన అడుగుల మధ్య ఎర్రజెండా రెపరెపలాడ్తూఆమెను ఏ దృశ్యం నిలబెట్టి ఉంటుందో ! అమ్మకలల్నో నాన్న కలల్నోకొంచెం ఊపిరి పీల్చిఆశల చెట్టు ఆకుల్లా
కవిత్వం

యుద్ధం ఇప్పుడు కొత్తగా మొదలవడమేంటి..?

ఎప్పటికప్పుడుచెరలు చెరసాలలు దాటుకుని మరీపోరాటం పునరావృతమవుతూనే ఉంది..మళ్లీ మళ్లీ కొత్త జ్ఞానం వికసిస్తూనే ఉంది..పరిణామక్రమమంతా యుద్ధాలమయమే కదా!విశ్వాంతరాళాల్లోప్రకృతి మొదలుపెట్టిన సహజ యుద్ధాన్నిదేశాల మధ్యకు బదిలీ చేసిఒకడెవడో సంతోషిస్తున్నాడు గానీమనిషిలో అంతర్లీనంగాఈ యుద్ధమేనాడో మొదలైంది..సంపద మొదలైననాడుఅది పోగుపడడం మొదలైననాడుగుంపు నుండి ఒక్కడి వైపుమనిషి ప్రయాణం మొదలైన నాడుప్రకృతి పచ్చదనంనోట్ల పరపరలకు అమ్ముడు పోవడం మొదలైన నాడుఉనికి అస్తిత్వం గుర్తింపుఅన్నిటికీవిపణి ముట్టడిలోనేనిర్వచనాలు తయారవుతూపోతుంటేయుద్ధం ఇప్పుడు కొత్తగా మొదలవడమేంటి..కింద పడిన ప్రతిసారీపైకి లేసేందుకుజరగాల్సిన యుద్ధాన్ని వదిలేసిపడిపోవడంలోనేపడుకోవడంలోనేరాజీని వెతుక్కుంటున్నప్రతి సందిగ్ధ సమయంలోనూమళ్లీ మళ్లీ యుద్ధం పుడుతూనే ఉందియుద్ధంలో మనిషిమనిషిలో యుద్ధంకలగలిపి చేసేసమాంతర ప్రయాణమే కదా చరిత్ర!మరిప్పుడు మళ్ళీ కొత్తగా మొదలవడమేంటి..? అందుకే వాడిలాగేమనకూ యుద్ధం
కవిత్వం

గిరి ప్రసాద్ చెలమల్లు మూడు కవితలు

మోదుగు పువ్వు ఉద్దండులు అడవిని వీడారుకలిసిరాని కాలం అన్నారుఆయుధమే అప్పగించాంసిద్ధాంతం సజీవం అన్నారు రాజ్యం విధించిన గడువు తీరిపోయిందిరాజ్యాంగమే చేతుల్లోకి వాలిందిఇక అంతా ప్రజాస్వామ్యమేనని నమ్మ బలికింది చదువుకుంది లేదుకాసింది మేకలుపోలియో అవిటితనం పైగా అమ్మాయిఅయితేనేం సిద్ధాంతాన్ని నమ్మిందిఅడవి బాట పట్టిందిఅంచెలంచెలుగా ఎదిగింది నమ్ముకున్నది తనని తానువంచించటం చేతకాదుదారితప్పుటకు దారులు వెతుక్కోలేదుమాటలు నేర్చుకోలేదు వక్ర భాష్యాలకునేర్చుకున్నదల్లా జనం కోసం అడుగులేయటమే! చావును ముద్దాడాలనుకుందిలొంగి పోనని తెగేసి చెప్పిందిపోయే నాడెలా వెళ్ళిందో దాన్నికోసమే ఆరాట పడింది చివరంటాసహచరుడినెలా చంపారో అలాగే చంపమందినేను నియమించిన వాళ్ళు చంపబడ్డాకనేను లొంగిపోతే నేను మనిషినే కాదన్నది !బలమైన మనోస్థైర్యం ఆమె సొంతం! చిత్రహింసల చావుని
కవిత్వం

తాను ఎంచుకున్న దారి

‘ఏప్రిల్ అత్యంత క్రూరమైన మాసం’వాళ్ళకు ఆమె మీద చాల కోపంగా ఉన్నదిఎర్రటి ఎండల్లో ఎర్రెర్రని జెండా కప్పించుకోడానికివిప్లవపాటలు పాడించుకోడానికిఅమర కామ్రేడ్ అనిపించుకోడానికినీ ఆశయాలను కొనసాగిస్తామనిప్రతిజ్ఞ చేయించడానికిసాయుధ పోరాట ప్రగల్భాలుప్రచారం చేయడానికిమారిన పరిస్థితుల్లో లొంగిపోకుండాఎన్‌కౌంటర్ ఎంచుకున్నందుకువాళ్ళకు ఆమె మీదచాల చాల కోపంగా ఉన్నది అన్నింటికన్న మించి ఇపుడుఆమె ఎలాగూ ఈ కీర్తనగీతాలు వినలేదుగానీతాము వినాల్సి వస్తున్నందుకుతాము చూడాల్సి వస్తున్నందుకుచాల చాల కోపంగా ఉన్నది వాళ్ళను చాలామంది ఇపుడుమార్చ్ 31 తర్వాత దొరికిలొంగిపోనంటే చంపకండిజైల్లో పెట్టండి అని అడుగొచ్చు కదాఅంటున్నారుఅది చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ కిపుడు ఏప్రిల్ 22 కన్నామార్చ్ 31 పవిత్రమైన దినమైందిపార్టీ నిర్మాణం చేసిరాజ్యంపై సాయుధంగా విప్లవించే
కవిత్వం

వర్గ పోరాటపు స్పూర్తి కామ్రేడ్ బుస్కీ

బస్తర్ తరాల చరిత్ర  అంతా ప్రజా పోరుకు మారు పేరు ఒకరి కింద బానిసలుగా మేము వుండమ్ ఈ  అడవి మాదే  అంటూ విస్తృత, వినూత్న    పోరు-సమరాలు నడిపింది ఆ వారసత్వము నుండే నేడు వర్గ పోరాటపు చైతన్యముతో ఆ కాశంలో సగం - సమరంలో సగం అంటూ దండకారణయ్య ఉద్యమంలో సమసమాజ నిర్మాణా కర్తవ్యంతో అడుగేసిన నూపో బుస్కీ సాధారణ ఆదివాసి యువతి అ ఆ లతో పాటూ-యుద్ద నీతిని నేర్చి కమాండర్ గా నాయకత్వంలోకి ఎదిగివచ్చిన విప్లవ వీరాంగణ సల్వజుడుమ్,`సమాధాన్’ సామూహిక సమరాల్లో సహసంగా పోరాడిన  ధీశాలి ఫాసిష్టు  ఆపరేషన్ `కగార్`బాంబుదాడుల్లో కన్ను కోల్పోయినా
కవిత్వం

నీళ్ళు, అడవి, భూమి…

(జల్, జంగల్, జమీన్) సర్కార్ చుట్టరికం ఇప్పుడు నదులతో లేదు, నక్శా లతో ఉన్నదిఅక్కడ నీళ్ళు ప్రవహించవుసత్యమని నమ్మించే పటం మీద గీసిన రేఖలతో ఉన్నది పర్వతాలు ఔన్నత్యంతో కాదుఖనిజాల నిధులుగా మారినవి ఆరావళీ ఛాతీ మీద నడుస్తున్న యంత్రం ఏదో ప్రాచీన శోక గీతం వలెధ్వనిస్తున్నది.కానిప్రజల బాంధవ్యం ఇంకా తెగిపోలేదు ఇప్పుడు కూడ ప్రజలునదిని అమ్మా అంటారు వృక్షాలతో సంభాషిస్తారు మట్టిని తమ నుదుటిమీదఅలంకారంగా దిద్దుకుంటారుప్రకృతిపై వాళ్ళ విశ్వాసం మూఢ విశ్వాసం కాదుఅది ఇతిహాసం అది ప్రతి ఎండాకాలం తర్వాత ఒక పత్రహరితమై తిరిగి వస్తుందినగరం మనల్ని నాగరీకుల్ని చేస్తుందని అంటారు ఎప్పటిదాకా మా ఊపిరితిత్తుల్లో అడవి
కవిత్వం

చివరి వారెవరు?

అతడొక్కడేమిగిలి వున్నాడాఇంకెవరూ లేరనినీ ప్రకటన చూసిసముద్రం నవ్వుకుంటుందిజీవితం నీకు ఆగిపోవచ్చుఅక్కడనుండే మరలమేము మొదలవుతాంచరిత్ర నువ్వుతలకిందులుగా చదువుతావునీ చరిత్ర మట్టిలో కూరుకుపోయేకుళ్ళిన శవం మాత్రమేమేము చరిత్ర నిర్మాతలంమా పేజీలన్నీ నెత్తుటిరేఖలతో లిఖింప పడుతూచిరస్మరణీయమవుతాయిజనం ప్రభంజనమయ్యేరోజు మరల మొదలవుతోందిఅరణ్యం పచ్చగాచిగురిస్తోందినదులన్నీ ప్రవహిస్తూనే వున్నాయిపర్వత సానువలన్నీనిటారుగా నిలబడే వున్నాయిసూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడువెన్నెలా విరగబూస్తోందినువ్వనుకుంటావుఓడిపోయింది తల్లి పేగానిఆ చివరి విలుకాడు నుండిపెల్లుబికి వెళ్లువెత్తేయుద్ధ భేరీ నాదంనీ గుండెలను చీల్చుతుందికాలం మరల మరలతిరిగి తిరిగిముందుకే నడుస్తుందిఇదిసత్యం చెప్పిన మాటఅతడు తిరిగి కొండబారిడివరి కంకులలో గింజ కడుతున్నాడుచీకటి కొండల్లో దాచినబర్మారులో గంధకందట్టించి వస్తున్నాడుమహేంద్ర గిరులలోనుంచినియాంగిరి పర్వత సానువులనుండినలుదిక్కులా ప్రవహిస్తున్నారుఅతడుచివరి వాడూ కాదుఆమెచివరిదీ కాదుఇది ఓటమీ కాదునీది గెలుపూ