కవిత్వం

కగార్  యుద్ధం

తల్లి అయితేనేం ఒడిలో పసిపిల్ల అయితేనేం తూటా తుపాకి నుంచి దూసుకొచ్చిందంటేనెత్తురు తాగకుండా నేల రాలదుముగ్గురయితేనేం మావోయిస్టులు పదముగ్గురయితేనేంపట్టాలు తప్పిన డబుల్‌ ఇంజన్‌ రైలురక్తదాహానికి నాలుగు నెలల్లో ఏభయి అయితేనేం ఎందరయితేనేంమనుషులుగా ఆటంకమైన వాళ్లందరూఅసువులు బాయందే అడవిలో కంపెనీ కాల్మోపలేదుపక్షులయినా అడవిలో కాయో పండో తిని విహాయసంలో ఎగిరినపుడు విత్తనాలు వెదజల్లుతాయిఎదురిచ్చే కృతజ్ఞతతో బాక్సైట్‌ దోచుకొని ఆకాశంలోకెగిరిన భారత్‌ ఎయిర్‌ ఫోర్స్‌ విమానాలు మాత్రంచెట్టు చేమలనూ, జనావాసాలనేకాదునేల సారాన్ని ధ్వంసం చేసి ఆదివాసీ ఉసురు తీసిగానీ ఎగురవు అర్థంకాని పరాయి లోకపులోహ విహంగం ఆకారంగాహృదయ రహిత రాజ్యం నీడగామనుషుల మధ్య భీతావహంగా అసహ్యంగాలూటీ సర్కారు జనతన సర్కార్‌సరిహద్దుల్నే చెరిపేసేదాక
కవిత్వం

గాజా కవితలు రెండు

ఒకటి: లోహ సందర్భం నిర్భయత్వానికి చాలా సార్లు తోడు దొరకదు! భీరువులు జనాభాగా నిండిపోయిన ప్రపంచం కదా! దాహం వేసినప్పుడు దాహమే తోడు ఆకలేసినప్పుడు ఆకలే దోస్తు పక్క మీద కళ్ళ నుంచి దొర్లిన కలత కలలా "హింస" మీద పడి రక్కడానికి ఎప్పుడూ సిధ్ధంగా ఉంటుంది డ్రోన్లు నెత్తి మీద ఆడుతున్నపుడు బాంబుల కంట్లో కన్ను పెట్టి చూస్తూ ప్రాణాన్ని ఉగ్గబట్టుకోవాలి పక్కన పడి విచ్చుకునే అగ్నిదాహానికి ఆహుతైపోకుండా కాపాడుకోవాలి ఆయుష్షుకీ, మృత్యువుకీ మధ్య గీతలన్నీ కరిగిపోయిన కాలపు సందిగ్ధత లో స్పష్టమైన చూపుతో ముందుకెళ్ళాలి దుమ్మూ - ధూళీ, పొగను పీలుస్తున్న గాలి ఊపిరితిత్తులను శుభ్ర
కవిత్వం

గుడిపల్లి నిరంజన్ రెండు కవితలు

1 .నలిపెడుతున్న భావమేదో..! ఏమీ తోచని స్థితి ఎప్పుడో ఒకసారి అందరికీ వస్తుంది. అమ్మ పోయినప్పుడో నాన్న ఊపిరి ఆగినప్పుడో మనసు వెన్ను విరిగినప్పుడో అనర్ధాలు ఎదురుపడ్డప్పుడో అపార్థాలతో స్నేహాలు కూలినప్పుడో.. దారితప్పినప్పుడో... ఎప్పుడో ఒకప్పుడు ఊపిరాడని స్థితి అందరికీ వస్తుంది. పూర్వజ్ఞాపకాలు రోదించినప్పుడో.. కయ్యాలు కురిసినప్పుడో గింజలు మొలువనప్పుడో కోసిన పంట తుఫాన్ లో కొట్టుకపోయినప్పుడో ఆత్మకు నచ్చినవాళ్లు వెనక్కి గుంజి నప్పుడో.. అప్పుడే సోప్ప బెండులా అల్కగా బరువు తగ్గిపోతాం. ఈనెపుల్లలా సన్నగా మారుతాం. ఒక్కోసారి మనసు లోపల కసిబిసితో నలిపెడుతున్న భావమేదో బయటికి ఉసులుతుంది. అప్పుడే ఏమీతోచని స్థితి వేడి శ్వాసల రూపంతో బయటకు
కవిత్వం

ఇనుప మేకుల భూమి

భూతల్లి ఎదపై నాటిన ఇనుప మేకులు ఎవరి ఆకలిని తీర్చగలవు? ఎంత పచ్చదనాన్ని తుంచగలవు?? ఆ సిమెంట్ బ్యారి గేట్లు ఎవరి ఇంటికి గోడలుగా నిలబడగలవు? ఎంత ధైర్యాన్ని అణచగలవు?? గాలిలో ఎగిరే డ్రోన్లు ఎవరి పంట చేనులకు మందులు కొట్టగలవు? ఎంత ఆక్సిజన్ ను భర్తీ చేయగలదు?? వాడు చేస్తున్న దాడిలో కోల్పోయిన రైతుల ప్రాణాలను ఎవరు మొలకెత్తించగలరు? గడ్డిపోచల గుండె చప్పుడుతో ఊపిరి వీస్తున్న స్వదేశ రైతులను కట్టడి చేసే అట్టడుగుల్లో ఎంత కాలం కొట్టుమిట్టాడగలరు ?? రాజకీయం తెలిసిన ప్రభుత్వానికి రైతుల కన్నీటి బాధలను తీర్చడం తెలియనిదా? భారతరత్న అవార్డు ప్రకటనలో కూడా రాజకీయ
కవిత్వం

మరల మరల అదే వాక్యం

ఒకరి గురించి దుఃఖపడడం గుండె కవాటాలను మెలితిప్పుతుంది కదా .... పెంచిన చేతులలోనే చివరి శ్వాస వదిలే పసిపాపల కనులను చూస్తూ ఆ గుండెలు మూగబోవా! .... నీకేమి కాదు మెదడులోకి ఇంకినది హృదయంలోకి ఇగరని మనిషివి కదా .... నాకెందుకో నా చెవులలో ఆ పసిపాపల రోదనలు తప్ప ఏమీ వినిపించదు .... ఆ కూలిన ఆసుపత్రుల గోడలనంటిన నెత్తుటి చారికల మధ్య నా మొఖం అగుపిస్తోంది .... ఎన్నిసార్లు రాసినా నీ దుఃఖ వాక్యమే మరల మరల వెంటాడుతోంది పాలస్తీనా ..... అంతరించిపోతున్న నీ నేల పచ్చని గురుతులు దుఃఖాన్ని ఆలపిస్తూ .
కవిత్వం

ఇదేనా స్త్రీల ఉన్నతి?

బుక్కెడు బువ్వ కోసం కార్డు కోసం క్యూ కట్టాలి మోదీ గ్యారంటీ అన్న యోజన అంటూ చప్పట్లు కొట్టాలి ‘ఉజ్వల’తో నిప్పు రాజేస్తే పళ్లెంలోకి బువ్వ చేరుతోంది మోదీ స్మరణతో పొట్ట నింపాలి చీకట్లో, ముఖం చాటేసుకొని సిగ్గుతో బజార్లో దొడ్డికెళ్లక తప్పని దిక్కుమాలిన జీవితాల్లో శాచాలయం మోదీ గ్యారంటీ తల దాచుకోవడానికి నీడ కరువైన జీవితాల్లో ప్రధాన మంత్రి అవాస్‌ యోజనతో సంసారం చేయాలి సమాన హొదా అంటూ సర్పంచు పదవులతో నారీ శక్తికి వందనం అంటూ చట్ట సభలలో రిజర్వేషన్‌లతో అందలం ఎక్కిస్తున్నారు నిర్భయను మరిచిపొమ్మంటున్నారు హథారాస్‌ మనది కాదంటున్నారు కశ్మీర్‌కు అలా జరుగాల్సిందే అంటారు
కవిత్వం

పదేళ్ల అక్రమ నిర్భంధం

చేయని తప్పు చేసాడని కటకటాల వెనక్కి పంపిన రాజ్యం అక్షరం హేతువు ను బోధిస్తుందని హేతువు మార్క్సిజానికి మూలమని అక్షరానికి సంకెళ్ళు వేసింది వందశాతం ఫాసిజం కోరలు పీకి తొంభై శాతం వైకల్యం సాధించిన గెలుపు ఇంకా తరాజులో న్యాయం వుందని తేల్చింది ఎన్ని ఉదయాలు ఎన్ని అస్తమయాలు ఈ పదేళ్లలో తూర్పు పడమర ల మధ్య ఊగాయో ఓ కొత్త పొడుపు కోసం నిరీక్షించిన కళ్ళు నిజాన్ని బంధిస్తే అబద్దాల రాజ్యం కి వెసులుబాటు మసి పూసి మారేడు కాయ చేయజూస్తే మసి పూసుకోక తప్పదు ఎన్నాళ్ళైనా!! కోల్పోయిన సామాజిక జీవనం చీకటి రాత్రుల్లో కోల్పోయిన వెలుగు
కవిత్వం

 మౌమిత ఆలం కవిత్వం

1.స్నేహితుడా..నేను నీ శత్రువుని నేను నా హృదయాన్ని తెరిచిన ప్రతిసారీ సజీవంగా ఉండే నీ మాటలను స్పృశించడంలో విఫలమవుతున్నాను. మీ భూమి నుండి నేను సంవత్సరాలుగా పావుకున్న పేగుల,రక్త,ద్రోహం దుర్వాసనను ఈ మాటలు నాకు మిగిల్చాయి. నీ పదజాలంలో నే చొప్పించిన నల్లటి పదాలు పట్టపగలే నా సాంత్వనలో నన్ను వెంబడించాయి. నేను లైటు ఆపేస్తే అవి చీకటిలో మరింత ఉజ్వలంగా వెలుగుతాయి. సమాధానాల కోసం నిశ్శబ్దంగా నువ్వు వేసే ప్రశ్నలు నా జీవం లేని గుండెను వెంటాడుతున్నాయి. నేను నా నుండి కళ్ళు తిప్పుకుంటాను, ఒక హంతకుడు నేరం చేసిన నెపాన్ని ఇతరుల మీదకు తోస్తాడు. గొంతు
కవిత్వం

పదేళ్ల పచ్చి గాయం

ఎలాగైతేనేం ఉబికి వచ్చే కన్నీటికి ఇసుక గూడంత విరామం దొరికింది ఆ మధ్యానం అన్నం కుండ దించుతుండగా చెవులకు లీలగా తాకిన వార్త పళ్ళెంలో మొదటి ముద్ద అతని కోసమే కలుపుతున్నట్టు స్కూలు నుంచి వచ్చిన పిల్లాడి లంచ్ బాక్స్ అంట్ల గిన్నెలో గబగబా సర్దుతున్నట్టు అంతా తత్తరపాటు అప్పటికి విన్న ఆమెకది పగటి కలే కావచ్చు ముఖ పరిచయమే లేని నాకు మాత్రం ఎండిన నాలుకపై తెప్పరిల్లే చిన్న వాన చినుకు అతగాడికి కాగితాలకందని శిక్ష వెయ్యాలని తీర్పరి చెరకుగడ పిప్పిగా పాఠాన్ని నములుతూ పోతుంటాడు శూన్యం కుమ్మరించిన నేలపై ఒకరి కళ్లను మరొకరు ఫొటోగ్రాఫ్ చేస్తూ
కవిత్వం

దేని గురించి మాట్లాడగలను

ఈ రోజు దేని గురించి మాట్లాడగలను మరణాల గురించి తప్ప పాలస్తీనాలో పసికందుల మరణాల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను దండకారణ్యం గురించి తప్ప ఆకాశం నుండి నేలతల్లి ఒడిలోని ఆదివాసీ పసిపాపలపై జరుగుతున్న బాంబు దాడుల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను బుల్డోజర్ దాడుల గురించి తప్ప మసీదుల కింద తవ్వుతూ కొత్తగా లేని ఆనవాళ్ళేవో దొరికాయని కూల్చి వేసే కుట్రల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కోరితే కాల్పులు జరుపుతున్న వాడి నైజాన్ని గురించి తప్ప