యుగ స్వరం
2000 సంవత్సరంలో యుగాంతం అవుతుందని, మహా ప్రళయం ప్రపంచాన్ని ముంచెత్తుతుందని అప్పట్లో ప్రచారం జరిగింది. యుగాంతం కాలేదుగానీ, మహా ప్రళయం మాత్రం సుడులు తిరుగుతూ ఇప్పుడది ఢిల్లీని తాకింది. ఈ ప్రళయాన్ని నిలువరించడం కోసం అప్పటి బీజేపీ ప్రభుత్వం యాగాలు, హోమాలు చేస్తే, ఇప్పటి ఆ పార్టీ ప్రభుత్వం బుల్లెట్లు, పెల్లెట్లు ప్రయోగించింది. రెండు ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ఇన్నాళ్లూ భారత పాలకవర్గాలు దేని గురించి భయపడుతూ వచ్చారో ఆ జన్ జీ భూతం కళ్ల ముందుకే వచ్చి నిలబడింది. ఇండియా మృత సమాజంగా మారిపోయిందనుకున్నవారిలో సైతం కొత్త మోసులు మొలిపించింది. నేనిప్పుడు నిశ్చంతగా చనిపోగలను.... అని రచయిత్రీ అరుంధతీరాయ్తో










