భారతదేశంలో ఫాసిజం : ప్రత్యేకతలు
చీకటిలో చూపు నిశితమవుతుంది. నిశ్శబ్దంలో మాట పదునెక్కుతుంది. దురాక్రమణలో స్వేచ్ఛాకాంక్ష అణువణువునా విస్తరిస్తుంది. మానవత రద్దయ్యే భీకర సన్నివేశంలోకి ఊహించని వైపుల నుంచి లక్షల, కోట్ల గొంతుకల జీవన గీతం పోటెత్తుతుంది. ఇప్పుడు దేశం దేశమంతా దుఃఖాన్ని, ధైర్యాన్ని ఒకే ఒక స్వరంతో పాడుతోంది. ఫాసిజం ఎట్లా ఉంటుందో, దాని వికటాట్టహాసం ఎంత క్రౌర్యంగా ఉంటుందో మనకు ఎన్నడో అనుభవంలోకి వచ్చింది. ఫాసిజం మనలోని రాజకీయశక్తినీ, నైతికశక్తినీ కుప్పకూల్చాలనుకుంటుంది. మాట్లాడే మనుషులు లేకుండా తుడిచిపెట్టేయాలనుకుంటుంది. కానీ పెట్టుబడిదారీ విధానంలాగే ఫాసిజం కూడా తన ప్రత్యర్థిని వెంటేసుకొని పుడుతుంది. ఇవాళ అదే చూస్తున్నాం. గెలుపు ఓటముల మధ్యనే, అణచివేత ధిక్కారాల










