సంపాదకీయం

2024 ఎన్నికలు – హిందూ రాష్ట్ర స్థాపన

ఇప్పుడు దేశంలో ఎన్నికల కాలం నడుస్తున్నది. గత కొంత కాలంగా సాగుతున్న ఓట్ల యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. 2024 ఎన్నికలు ఈ దేశ  గమనాన్ని  నిర్ణయిస్తాయనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంటే, మరోసారి ఆ పార్టీ వస్తే దేశం ఏమైపోతుందని ఆందోళనపడేవాళ్లు ఎక్కువ అవుతున్నారు.  దీనికి కారణం లేకపోలేదు.  మూడోసారి  బిజెపీ అధికారంలోకి రావడం అంటే ‘హిందూ రాష్ట్ర’ స్థాపన అధికారికంగా ప్రారంభం కావడమే. ఇప్పటికే దానికి అవసరమైన సన్నాహాలను బీజేపీ పూర్తి చేసుకున్నది. సకల సాధనాలను ఉపయోగిస్తున్నది.  మరో వైపు కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని నిర్ణయించే ఎన్నికలు కూడా
సంపాదకీయం

రాముడ్ని కాదు, రైతును చూడండి

ప్రతి ఉద్యమం సమాజానికి ఒక మేల్కొలుపు వంటింది. అది వాస్తవ పరిస్థితి పట్ల కళ్లు తెరిపించి మార్పు కోసం దారి చూపిస్తుంది. అయోధ్య రామున్ని అడ్డం పెట్టి హిందూ మెజారిటీని భక్తితో, ముస్లింలు తదితర మైనారిటీలను భయంతో కళ్లు, నోరు మూసుకునేలా చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంది బిజెపి. పాత ఎత్తుగడే కానీ ఇప్పుడు ఇనుమడిరచిన ఉత్సాహంతో, మీడియాను తన వశం చేసుకున్నాక రెట్టించిన బలంతో పాచిక వేసింది. రాముడొచ్చాడు అని దిక్కులు మోగేలా అరిచింది మీడియా. రాముడొచ్చాడు కాచుకోండి అన్నారు ఫాసిస్టులు. ఆ భజన మోతలో, ఆ ఆర్భాటంలో మణిపూర్‌ల కేకలు వినపడలేదు, అదానీల దోపిడి కనపడలేదు. ఇంకా
గెస్ట్ ఎడిటోరియల్ సంపాదకీయం

రాజ్యాంగాన్ని, రాజ్యాంగవాదాన్ని విమర్శించకూడదా?

విజయవాడలో ఇటీవల జరిగిన 29 వ మహాసభల సందర్భంగా విరసం ఒక కీనోట్‌ పేపర్‌ను విడుదల చేసింది. దాని శీర్షిక ‘‘ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం’’. ఆ కీనోట్‌ పేపర్‌ ను కా.పి. వరలక్ష్మి మహాసభల్లో ప్రవేశపెట్టారు. దానిపై మహా సభలు ప్రారంభం కాకముందే చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాతా మౌఖిక, లిఖిత రూపాల్లో అనేక ప్రతిస్పందనలు వెలువడ్డాయి. ఆ ప్రతిస్పందనలలో విరసాన్ని తప్పుపడుతూ ఈ కింది అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.                                                                        విరసం రాజ్యాంగవాదాన్ని విమర్శిస్తున్నదంటే అంబేద్కర్‌ను విమర్శిస్తున్నట్టని, రాజ్యాంగం ద్వారా అందాల్సిన హక్కులు, రక్షణలు దళితులకు, పీడిత సమూహాలకు దక్కకుండా చేసే ఉద్దేశం విరసానికున్నదని కొందరు భావించారు. రాజ్యాంగం
సంపాదకీయం

ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం

విప్లవ రచయితల సంఘం 29వ మహా సభలు27 , 28 జనవరి 2024 , సిద్ధార్థ అకాడమీ , విజయవాడ విప్లవ రచయితల సంఘం 29వ రాష్ట్ర మహా సభల ఇతివృత్తం ‘ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం’. విప్లవోద్యమ మేధో, సాంస్కృతిక కంఠస్వరమైన విరసం ఆశయం ప్రజా జీవితంలోని సంక్షోభాలను విశ్లేషించడం. వాటికి ఉండగల పరిష్కారాలను ఎత్తి చూపడం. ఈ పని ఫాసిజం చెలరేగిపోతున్న సమయంలో మరింత సునిశితంగా చేయవలసి ఉన్నది. దేనికంటే మన సామాజిక సాంస్కృతిక జీవితం  చాలా జటిలంగా మారిపోతున్నది. వ్యక్తిగత, బహిరంగ జీవితాలు కల్లోలభరితంగా తయారయ్యాయి. ఆధునిక ప్రజాస్వామిక విలువలు సంక్షోభంలో పడిపోయాయి. మానవ సంబంధాల్లో
సంపాదకీయం

మావోయిస్టు పార్టీ మీద నిషేధంఎందుకు ఎత్తేయాలంటే…

విష్లవ పార్టీ మీద నిషేధం తొలగించాలని కోరడం అంత మామూలు డిమాండ్‌ కాదు.  దీని చుట్టూ ఎన్నో అంశాలు ఉన్నాయి. కాబట్టి సహజంగానే చాలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటన్నిటినీ చర్చించాల్సిందే. ముందు ఆ పని చేయకపోతే నిషేధం తొలగించాలని ఎందుకు కోరుతున్నామో చెప్పలేం. మావోయిస్టు పార్టీ మీద నిషేధం ఎత్తేయాలనే మాట 2004 తర్వాత మళ్లీ ఇవ్చుడే వినిపిస్తోంది. ఇంత నుదీర్ఘకాలం ప్రస్తావనలో లేకపోవడం వల్ల ఈ డిమాండ్‌ చాలా కొత్తగా ఉన్నది. ఎంతగానంటే మావోయిస్టుల మీది నిషేధం మామూలే కదా! అని సమాజం చాలా వరకు కన్విన్స్‌ అయిపోయింది. చర్చ లేకుండా, చర్చించాల్సిన విషయం కాకుండాపోయి, దాని
సంపాదకీయం

మావోయిస్టులపై నిషేధం ఎత్తివేతే ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సానుకూలత

పదేళ్ల భారత రాష్ట్ర సమితి పాలన ముగిసి  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సాధనలో చోదకశక్తి అని , తెలంగాణ తెచ్చింది తామేనని టిఆర్ఎస్ నాయకత్వం తెలంగాణ సమాజాన్ని వంచన చేసింది. అనేక బలిదానాలు, త్యాగాలు , వర్గాల సమీకరణలో భాగంగా దశాబ్దం క్రితం తెలంగాణ సాకారమైంది‌. పోరాడి సాధించుకున్న తెలంగాణ  ప్రజాస్వామిక తెలంగాణగా తమ వనరులు తమకు దక్కడమేగాక  నూతన రాష్ట్రంలో తమ ఆకాంక్షలన్నీ  నెరవేరాలని, ప్రజాస్వామిక  భావనలు మరింత విస్తృతం కావాలని ప్రజలు ఆశించారు‌. తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి వాక్కు నిజం కావాలని
సంపాదకీయం

పోతూ పోతూ కూడా..

.. ఈసారి ఆయన అధికారంలోంచి దిగిపోతాడనే అంటున్నారు. ఎప్పటి నుంచో పరిశీలకులు చెబుతూనే ఉన్నారు.  ఎగ్జిట్‌ పోల్‌ అంచనాల్లో అవే కనిపిస్తున్నాయి.  ఎన్నికల్లో ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు  అవకాశం ఉందా? ప్రజా సమస్యల ప్రచారానికి,  పరిష్కారానికి గతంలోలాగా కనీసంగా అయినా ఇప్పుడు ఎన్నికలు ఉపయోగపడతాయా? లేక ఎప్పటిలాగే వంచనలు, ప్రలోభాలు, ఓట్ల కొనుగోళ్లు .. ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయా?  ఎన్నికల ఎత్తుగడవాదుల ప్రయత్నాలు ఓట్ల ఫలితాలను కనీసంగా అయినా ప్రభావితం చేస్తాయా?   అని ఎంత విశ్లేషణ అయినా ఇవ్వవచ్చు.  కాకపోతే  పదేళ్ల నియంతృత్వ పాలన మీద ఈ ఎన్నికల సమయంలో కూడా తెలంగాణ పదునైన విమర్శను  వినిపించింది. ఎన్నికల రాజకీయాల్లో
గెస్ట్ ఎడిటోరియల్

ఇథనాల్ వ్యతిరేక ఉద్యమంపై దాడి 

(ప్రాణాంతక ఇథనాల్ కంపెనీ వ్యతిరేక రైతాంగ పోరాటానికి మద్దతుగా , ఆ ఉద్యమం పై రాజ్య హింసను నిరసిస్తూ చిత్తనూరు ఇథనాల్‍ వ్యతిరేక పోరాట కమిటీ పక్షాన రాసిన ఈ కీనోట్ ను ఈ సంచిక సంపాదకీయంగా ప్రచురిస్తున్నాం - వసంత మేఘం టీం) చిత్తనూర్‍, ఎక్లాస్పూర్‍, జిన్నారం గ్రామాలకి చాలాదగ్గరలో ఇథనాల్‍ కంపెనీకి దగ్గర్లో ఎక్లాస్పూర్‍ గేటు దగ్గర రిలే ధర్నాలు జరుగుతున్న శిబిరం ముందు 22.10.2023న ఉదయం పూట రైతాంగంపై పోలీసులు దాడిచేశారు. అధికారులు, రాజకీయ నాయకత్వం మరియు కంపెనీ పక్షాన పోలీసులు చాలా ఆగ్రహంతో దాడిచేశారు. ఇది రైతులు ఊహించని ఘటన. ఎందుకు ఇలా
సంపాదకీయం

పాలస్తీనా సందర్భంలో ప్రమాదకరంగా మారిన సోషల్‌ మీడియా

భారతదేశం అరుదైన రికార్డును సాధించింది. సోషల్‌ మీడియా అబద్ధాల ప్రచారంలో ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ఇండియా చాలా ముందుంది. ఈ ఘనత సాధించిన సందర్భం ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధం. ఇజ్రాయెల్‌ అనుకూల, ముస్లిం వ్యతిరేక సోషల్‌ మీడియా పోస్టుల్లో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారంలో 70 శాతానికి పైగా భారతదేశం నుండి ప్రచారమవుతున్నాయని డిజిటల్‌ డేటాను పరిశీలించే ఒక నివేదిక చెప్పింది! ఈ స్థాయిలో ఇజ్రాయెల్‌ పక్షం తీసుకుని భారతీయులు సోషల్‌ మీడియా యుద్ధం చేయడం చూసి ప్రపంచం విస్తుపోతోంది. స్వయంగా ఇజ్రాయెల్‌ కూడా ఇంతగా తనను తాను సమర్థించుకొని ఉండదు. వందేళ్ల పాలస్తీనా-ఇజ్రాయెల్‌ సంఘర్షణా చరిత్రలో ఎన్నడూ లేని
సంపాదకీయం

విశ్వవిద్యాలయాలా ? శిశు మందిరాలా ?

కేంద్ర ప్రభుత్వం తాను ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం ` 2020లో భాగంగా ఐకెయస్‌ను ఆచరణలోకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని ఇప్పుడు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా వెయ్యిమంది అధ్యాపకులకు భారతీయ జ్ఞాన వ్యవస్థలలో డిగ్రీస్థాయిలో బోధించడానికి అనుగుణంగా సుశిక్షితులను చేసే కార్యక్రమాన్ని యుజిసి ప్రారంభించింది. గ్రాడ్యుయేట్‌ స్థాయిలోనూ, పోస్టు గ్రాడ్యుయేట్‌ స్థాయిలోనూ రాబోయే విద్యాసంవత్సరం నుంచి భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి, జీవన విధానాలపై ఒక అవగాహన కల్పించడం దీని వుద్దేశం. అలాంటి పాఠాలను బోధించడానికి వీలుగా అధ్యాపకులకు శిక్షణ యిస్తున్నారు. యుజి స్థాయిలోనూ, పిజి స్థాయిలోనూ మొదటి సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా దీనికి సంబంధించిన రెండు కోర్సులను పూర్తిచేయాలనే నిబంధనను యుజిసి