గెస్ట్ ఎడిటోరియల్

భారతదేశంలో ఫాసిజం : ప్రత్యేకతలు

చీకటిలో చూపు నిశితమవుతుంది. నిశ్శబ్దంలో మాట పదునెక్కుతుంది. దురాక్రమణలో స్వేచ్ఛాకాంక్ష అణువణువునా విస్తరిస్తుంది. మానవత రద్దయ్యే భీకర సన్నివేశంలోకి ఊహించని వైపుల నుంచి లక్షల, కోట్ల గొంతుకల జీవన గీతం పోటెత్తుతుంది. ఇప్పుడు దేశం దేశమంతా దుఃఖాన్ని, ధైర్యాన్ని ఒకే ఒక స్వరంతో పాడుతోంది. ఫాసిజం ఎట్లా ఉంటుందో, దాని వికటాట్టహాసం ఎంత క్రౌర్యంగా ఉంటుందో మనకు ఎన్నడో అనుభవంలోకి వచ్చింది. ఫాసిజం మనలోని రాజకీయశక్తినీ, నైతికశక్తినీ కుప్పకూల్చాలనుకుంటుంది. మాట్లాడే మనుషులు లేకుండా తుడిచిపెట్టేయాలనుకుంటుంది. కానీ పెట్టుబడిదారీ విధానంలాగే ఫాసిజం కూడా తన ప్రత్యర్థిని వెంటేసుకొని పుడుతుంది. ఇవాళ అదే చూస్తున్నాం. గెలుపు ఓటముల మధ్యనే, అణచివేత ధిక్కారాల
సంపాదకీయం

అభివృద్ధి వెలుగులో పర్యావరణ సంక్షోభం

‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అని గురుజాడ అన్నారు. దేశమంటే మనిషి కాదు మట్టి అన్నది నేటి ప్రభుత్వాల మాట. మట్టి అంటే మట్టిలో దాగి ఉన్న ఖనిజ సంపద అని. ఖనిజ వనరులతో అభివృద్ది చెంది అగ్రదేశం అవుతాం అని చెబుతారు. అభివృద్దిలో మనిషి ఉండడా అనే సందేహం పెట్టుకోకండి. అభివృద్దిలో లెక్కలు, లాభాల అంచనాలు మాత్రమే ఉంటాయి. లాభాల వేటలో మనుషులు, చెట్లు, జంతువులు, నీరు, గాలి అనే జీవావరణం పోగా  లాభాలు మిగులుతున్నాయి. ఈ లాభాల వేటలో ఏమి కోల్పోతున్నామో నాగరిక మానవుడు తెలుసుకోలేని స్థితిలోకి నెట్టబడ్డాడు.                   ఈ లాభాల వేటలో
సంపాదకీయం

మేనియా కాదు..మ్యాజిక్ లేదు.. ఓటర్లపై యుద్ధమిది!

యుద్ధాలు జ‌రుగుతున్న‌ప్పుడు ఎన్నిక‌లొస్తే సాధార‌ణంగా ప్ర‌భుత్వాలు కుదేల‌వుతాయి. అధికార ప‌క్షం ప‌ద‌విని పోగొట్టుకోవ‌డ‌మో, ఓట్ల శాతాన్ని ఎంతోకొంతో కోల్పోవ‌డ‌మో జ‌రుగుతుంటుంది. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో పార్ల‌మెంటు లోప‌ల‌, బ‌య‌ట ధాటిగా ప్ర‌సంగాలు చేసిన విన్‌స్ట‌న్ చ‌ర్చిల్ ఆ యుద్ధం త‌ర్వాత బ్రిట‌న్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓడిపోయాడు. రెండో ప్ర‌పంచ యుద్ధంలో విజేత‌లు, ప‌రాజితులు అంతా న‌ష్ట‌పోయారు. చ‌ర్చిల్ ఓట‌మికి ఇది ఒక కార‌ణం. ఇక‌.. యుద్ధంలో చొర‌వ‌ను బ్రిట‌న్ జాడ విడుచుకుని సోవియ‌ట్ యూనియ‌న్ హీరోగా నిల‌వ‌డానికి కార‌ణ‌మ‌య్యాడంటూ లార్డ్స్ సైతం చ‌ర్చిల్‌ను క‌సిగా ఓడించ‌డం ప్ర‌ధాన కార‌ణం. యుద్ధాల స‌మ‌యంలో పాల‌క పార్టీలతోపాటు వ్యాపార సంస్థ‌లు
సంపాదకీయం

చికాగో నుండి నోయిడా దాకా కార్మిక వర్గ పోరాటాలకు జేజేలు

భారత పోరాటాల చరిత్రలో మరొక పోరాటం నమోదు అయింది. గత దశాబ్ద కాలంలో దేశంలో ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమం, రైతు ఉద్యమాలు, సిలింగేర్, తిజీమాలి లాంటి ఆదివాసీ పోరాటాలు జరిగాయి. ఇప్పుడు నోయిడా కార్మిక ఆందోళన వాటి సరసన చేరింది. వీటిలో దేనికవే ప్రత్యేకమయిన పోరాటలు. మరొకవైపు ఇవన్ని కార్పొరేట్ హిందుత్వ ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలు. ఈ తరహా పోరాటాలే దేశంలో అరకొరగా మిగిలి ఉన్న పోరాట, ప్రజాస్వామిక వాదులకు ఊపిరి అవుతున్నాయి. వీటిని కాపాడుకోవటం అనేది దేశ ప్రజలకు అవసరం, ఆవశ్యకత.                  నోయిడాలో 82 ఫ్యాక్టరీలకు చెందిన కార్మికులు ఏప్రిల్ మొదటి వారం నుంచి సమ్మె
సంపాదకీయం

మార్చి 31 తర్వాత..

... కూడా లోకం ఉంటుంది. దాని చరిత్ర ఉంటుంది. దాన్ని నిర్మించుకుంటూ మోసుకపోతున్న మహా మానవాళి చిరస్థాయిగా ఉంటుంది. మనుషులంటే పోటెత్తే భావోద్వేగాలు కదా.. అవీ ఉంటాయి. మనుషులంటే తీవ్రమైన ధిక్కార ప్రతిఘటనలు కదా.. అవీ పదిలంగా ఉంటాయి. మనుషులంటే స్వేచ్ఛాగానాలూ, విముక్తి ఆకాంక్షలూ, సుందర లోకాల స్వప్న రాగాలూ. అవీ వినిపిస్తూనే ఉంటాయి. కన్నీరూ, కఠినమైన ఆచరణా కలిసి రూపొందిన ఒక నిర్మాణం విధ్వంసమైందేగాని, దాని రక్తమాంస సంలీన చైతన్యం తుడిచిపెట్టుకపోయేది కాదు. మార్చి 31 తర్వాత కూడా మానవ సృజన కలాపమైన విప్లవం తిరిగి ఏదో ఒక మారుమూల లేచి నిలబడుతుంది. మరింత నాణ్యంగా, గంభీరంగా,
సంపాదకీయం

సామ్రాజ్యవాద యుద్ధం మహిళల్ని విముక్తి చేస్తుందా?

ఇరాన్‌లో మత ఛాందసవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2022లో మహిళలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. మహ్సా అమిని అనే కుర్దిష్ మహిళ మరణం ఈ ఉద్యమాన్ని రగిలించింది. హిజాబ్ సరిగా ధరించలేదనే నేరానికి ఆమెను మోరల్ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత కస్టడీలో ఆమె మరణించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఇరాన్ ఆమ్మాయిలు బహిరంగంగా హిజాబ్‌లను మంటల్లో కాల్చేయడం, పొడవాటి జుట్టును కత్తిరించి పడెయ్యడం ప్రపంచమంతా చూసింది. నిరసన ప్రదర్శనల్లో వందలాది యువతీ యువకులు పోలీసు హింసకు బలయ్యారు. వేలాది మంది జైళ్లపాలయ్యారు. ఇరాన్ ప్రజలు, ముఖ్యంగా యువత తమ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతప్తితో
సంపాదకీయం

కార్మిక సమ్మెకు సంఘీ భావం

ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సమ్మె విజయవంతం కావడానికి కార్మిక వర్గం సమాయుత్తమాతుంది. పన్నెండు ఏళ్ల నరేంద్ర మోదీ  పాలనలో కార్మిక, కర్షక వర్గ  విధానాల పట్ల అనుసరి స్తున్న వైఖరి పట్ల అసంతృప్తి ఉంది.  ఇప్పటికే భారత దేశ రైతులు రోడ్లపై నిలబడి ఉన్నారు.వ్యవసాయం ఏమాత్రం లాభసాటి కాదని  చివరకు పోరాట రూపమే మిగిలిందనే నమ్మికతో వున్నారు. తాజాగా మహారాష్ట్రలో వేలాది మంది రైతులు రోడ్లపై నిల్చున్నారు. ఈ దేశానికి సంబంధించి నంతవరకు  కార్మికులు, కర్షకులు పునాదిగా ఉన్నారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా    ఉన్నారు. రైతులు ఈనాటికీ తమకు ఉన్న
సంపాదకీయం

ప్రతీకలు కూడా దేశద్రోహమట! పౌరహక్కుల సంఘంపై అక్రమ కేసు

భాషకంటే ప్రతీకలు ప్రాచీనమైనవి. మనుషులు తమ వ్యక్తీకరణకు సంకేతాలను, ప్రతీకలనే మొదట సాధనం చేసుకున్నారు. ప్రకృతి పరిశీలనలో కలిగిన భావోద్వేగాలను, భయోద్విగతలను కొండ గుహల్లో బొమ్మలు గీచినట్లు ఆధారాలు ఉన్నాయి. అసలు మానవ ఊహ తొలి వ్యక్తీకరణలు నిర్దిష్ట భాషార్థం సంతరించుకోకముందు గీతల్లో, చిత్రాల్లో ఉన్నట్లు చూడవచ్చు. ఆ తర్వాత తమ సామాజిక   నిరసనలను, కోపాలను, విజయాలను కూడా ప్రతీకాత్మం చేశారు. మానవ నాగరికతా వికాసంలో ఊహా వ్యక్తీకరణలకు ఇంత పురాతన సంప్రదాయం ఉన్నది. చివరికి భగవంతుడ్ని కూడా అప్పటి దాకా ఏ ఏ విశేషణాలతో, ప్రతీకలతో గౌరవించారో వాటినే తిరగేసి ఆగ్రహావేశాలతో నిందా స్తుతి చేశారు. రాజులకు
సంపాదకీయం

రాజ్యాంగం చెప్పినవన్నీ చేశారా? ఉమ్మడి పౌరస్మృతి తేవడానికి..

ప్రజా క్షేత్రం గురించి బీజేపీకి బాగా తెలుసు. ఎంత బాగా తెలుసో అర్థమయ్యే కొద్దీ మనకు ఆందోళన పెరుగుతుంది. మామూలుగా  కామన్‌సెన్స్‌లో భాగంగా సంఫ్‌ుపరివార్‌  ఈ సమాజాన్ని మధ్య యుగాల్లోకి తీసికెళుతుందనే విమర్శ చాలా మంది చేస్తుంటారు. తన మీద ఇలాంటి అభిప్రాయం ఉన్న ఈ సమాజంతో  సంఫ్‌ు ఎట్లా వ్యవహరిస్తుంది? నిజంగానే ఈ దేశంలోకి ముస్లింలు రాకముందటి రోజులే ఉజ్వలమైనవని,  కాబట్టి  సమాజాన్ని  అక్కడికి తీసికెళతానని అనగలుగుతుందా? సంఫ్‌ుపరివార్‌కు ఇలాంటి భావజాలంలో కూడా ఉన్నది. ఒక ‘అద్భుతమైన’ గతాన్ని ఊహించి  చెప్పి, దాని చుట్టూ భావోద్వేగాలు లేవదీసి, ‘ఇతరుల’ మీద విద్వేష విషాన్ని నింపి, ‘తనదే’ అయిన
సంపాదకీయం

ప్రజా యుద్ధమే కా. హన్మంతు జీవన సందేశం

మావోయిస్టు పాక హన్మంతు అంత్యక్రియలకు పదిహేను వేల మంది వచ్చారని పత్రికలు రాశాయి. ఈ మాటకు మీలో కొందరైనా  'ఆఁ వస్తార్లెండీ, చనిపోయినప్పుడు. చివరిసారి చూద్దామని. ఆదేమీ ఆ ఉద్యమ బలం కాద'ని అంటారు. అందులో ఏ అర్థ‌మూ లేద‌ని అంటారు. ఇంత జన సందోహం ఆయనకు వీడ్కోలు పలికిందని అంటే 'మరణాన్ని సెలబ్రేట్ చేస్తున్నార'నే మేధావులు మీలో ఉంటారు. జీవితం, మరణం అవిభాజ్యమనే ఎరుక ప్రజలకు ఉంటుందని అంటే, 'సిద్ధాంతం గురించి మాట్లాడకుండా ప్రజల కామన్సెన్స్ చూసి సంతృప్తి చెందుతున్నార'ని అనే వాళ్లు మీలో తప్పక ఉంటారు. ఇంతకూ ప్రజల్లో ఎవరు ఉన్నారు? వాళ్ల మనో ప్రపంచాన్ని