సంపాదకీయం

కా. గొంజాలోకు జోహార్లు

పెరూ తొలితరం మావోయిస్టు, షైనింగ్‌ పాత్‌ నిర్మాత, ప్రజాయుద్ధ సంస్కృతిని లాటిన్‌ అమెరికా పోరాట ఆచ‌ర‌ణ‌లో ఎత్తిప‌ట్టిన  గొప్ప మార్క్సిస్టు-లెనినిస్టు  కామ్రేడ్‌  గొంజాలోకు విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం జోహార్లు! ప్రపంచ సోషలిస్టు విప్లవాన్ని వెలిగించిన 1980ల తరం మావోయిస్టు  మేధావి చివరి ముప్ఫై ఏళ్ల జీవితం జైలులోనే గడిచిపోయింది. పెరూలోని నావికా స్థావరంలోని ఆస్పత్రిలో 2021 సెప్టెంబరు 11వ తేదీన గొంజాలో 86 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా పార్కిన్సన్‌, చర్మ కేన్సర్‌తో ఆయన బాధపడుతున్నారు. ఈ స్థితిలో కూడా ఆయనకు వైద్య సాయాన్ని ప్రభుత్వం నిరాకరించింది. చివరకు తన భార్యతో ఇంటర్వ్యూను సైతం రద్దుచేసింది.
సంపాదకీయం

ఈ ఎన్‌కౌంటర్‌లు మనకు పట్టవా?

మే 10వ తేదీన బీజాపూర్‌ జిల్లా పిడియా అడవుల్లో జరిగినట్లు చెప్పబడుతున్న ఎన్‌కౌంటర్‌లో 12 మంది మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. ఆ 12 మందిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఉండే అవకాశం ఉందని, ఈ ఎన్‌కౌంటర్‌ను బీజాపూర్‌, దంతేవాడ, సుకుమా జిల్లాల ఎస్‌పిలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, వీరితోపాటు ఐజి సుందర్‌రాజ్‌ నిరంతరం సంబంధంలో ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నాడని, ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో 10వ తేదీ ఉదయానికి ఆరుగురు చనిపోయినట్లు తెలిసిందని, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని ఒక టివి చానెల్‌ ఎంతో ఉద్యోగపూరితంగా ప్రసారం చేసింది. స్టూడియో నుంచి ఎన్‌కౌంటర్‌ స్థలంలో ఉన్న సచిన్‌ అనే
సంపాదకీయం

మోడీ, ముస్లింలు – అర్బన్ మావోయిస్టులు

ఆస్తి పునః పంపిణీ (జిత్‌నే ఆబాదీ ఉత్‌నే హక్‌). ముస్లింలకు రిజర్వేషన్‌ అనే అంశాలపై ప్రధాని మోడీ రాజస్థాన్‌లో ఏం మాట్లాడాడో, స్వయంగా ఆయననోట దేశంలో చాల మంది ఇప్పటికే విని ఉంటారు. అది కాంగ్రెస్‌ మానిఫెస్టో కాదు ముస్లింలీగ్‌ మానిఫెస్టో అని అంతకన్నా అర్బన్‌ మావోయిస్టుల మానిఫెస్టో అని ఆయన అన్నాడు. అంటున్నాడు. గుజరాత్‌ శాసన సభ ఎన్నికల నుంచి మొదలుపెట్టి ఇప్ఫుడు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో లోక్‌సభలు ఎన్నికల దాకా ఆస్తి పునః పంపిణీ అర్బన్‌ మావోయిస్టుల ప్రతిపాదన అని ఆయన పునరుద్ఘాటిస్తున్నాడు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపాయికి, అద్వానీకి కూడ ఐడియాలాగ్‌ (సిద్ధాంత
సంపాదకీయం

అమ్మకానికి దేశం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశం మీదికి కొత్త పదాన్ని, పథకాన్ని వదిలారు. దాని పేరు నేషనల్‌ మానెటైజేషన్‌ పైప్‌లైన్‌(ఎన్‌ఎంపి). జాతీయ ఆస్తుల ద్రవ్యీకరణ ప్రణాళిక. అంటే జాతీయ ఆస్తులను అమ్ముకొని ద్రవ్యంగా మార్చుకోవడం.  అబ్చే.. ఇది అమ్మేయడం కాదు. కేవలం లీజుకు ఇవ్వడమే. ఆస్తి పత్రాలు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ఆస్తుల మీద అధికారం, అనుభవం మాత్రమే కార్పొరేట్లకు ఉంటాయని   కేంద్ర ప్రభుత్వం అంటోంది. కొద్ది మంది మేధావులేమంటున్నారంటే..బీజేపీ వాళ్లకు ఆర్థిక వ్యవస్థను నడపడం రాదు.. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరి కొద్ది మంది ఇది అసమర్థ ప్రభుత్వం.. అందుకే ఇలాంటి పనులు
సంపాదకీయం

కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర కోసమే కగార్‌

కొన్ని కొత్త పదాలు మన చెవిన పడేనాటికే అవి జీవితంలో భాగమైపోతాయి. జరగాల్సిన విధ్వంసమంతా జరిగిపోతుంది. మనం ఆ తర్వాత ఎప్పటికో గుర్తిస్తాం. పాలకులు ఒక పథకం ప్రకారమే ఈ పని చేస్తారు.  ఫాసిస్టు పాలకులైతే ఇక చెప్పనవసరమే లేదు. ఏ వైపు నుంచి ఎట్లా కమ్ముకొని వస్తారో ఊహించలేం. మనం దేనికది విడిగా విశ్లేషించుకుంటూ, ఒక్కోదాంట్లో తలమునకలవుతుంటాం. వాళ్లు మాత్రం అన్నిటినీ కలిపి ప్రజలపై ఎక్కుపెడతారు. దీన్ని మనం తెలుసుకోవడం ఏమోగాని అడుగడుగునా మనల్ని అనేక సందేహాలు వెంటాడుతుంటాయి.  ఏది హిందుత్వ? ఏది సనాతన? ఏది కార్పొరేటీకరణ? ఏది సైనికీకరణ? వాటి మధ్య సంబంధమేమిటి? తేడాలేమిటి? అనే
సంపాదకీయం

రాజ్యాన్ని సవాల్‌ చేస్తున్న సిలింగేర్‌, హస్‌దేవ్ పోరాటాలు

దశాబ్దాల మానవ నాగరికతలో ఆదివాసీ పోరాటాలు, వాటి యొక్క ప్రతిఫలనాలు భారతదేశ ప్రజాస్వామ్యానికి కొత్తవికాదు. అయితే ఎప్పటికప్పుడు ఆ పోరాట రూపాలు మారుతూ వస్తున్నాయి. ప్రతి కొత్తతరం తమదయిన అస్తిత్వం కోసమే కాదు, భారత ప్రజల తరపున నూతన పోరాట రూపాలను రూపొందించుకుంటున్నది. ఇది ఆదివాసీల జీవన్మరణ సమస్య కాదు. వారి వ్యక్తిత్వంలోనే కలగలసిన మనుషుల కోసం జీవించడమనే ఆకాంక్ష బలీయమైనది. వనవాసి నవలలో ఆదివాసి మహిళ భానుమతి నాకు భారతదేశమంటే తెలియదు అంటుంది. అరణ్యం మాత్రమే మా ఊరు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి నమూనా వెనుక దాగిన విధ్వంసీకరణలో భానుమతి ఆ మాట అనగలిగింది. ఒక దేశ
సంపాదకీయం

టీఎం కృష్ణ: కళా సాంస్కృతిక చర్చా సందర్భం

లోకం పట్టని ఒక చిన్న ప్రపంచంలోకి దేశ రాజకీయాలన్నీ వచ్చి చేరాయి. శిష్టులకు తప్ప ఇతరులకు చోటులేని రంగం గురించి మామూలు మనుషులు మాట్లాడుతున్నారు. భక్తిమార్గానికి తప్ప మరి దేనికీ అవకాశం లేని కర్ణాటక సంగీత సంప్రదాయాన్ని కొత్త ప్రమాణాలు పరీక్షిస్తున్నాయి.  రసజ్ఞులకే పరిమితమైన  ఇహపరాలను దాటి ఇదంతా సామాజిక చర్చా సందర్భమైంది. దీనికంతా కారణం టిఎం కృష్ణ అనే కర్ణాటక సంగీత విద్వాంసుడికి మద్రాసు సంగీత అకాడమీ ‘సంగీత కళానిధి’ అనే అవార్డు ప్రకటించడం. దాని మీద ఆ రంగంలోని ప్రముఖులు నిరసన తెలపడం.  వాళ్లు సంగీత అకాడమీ  తమకు అంతక ముందు  ఇచ్చిన అవార్డులను వెనక్కి
సంపాదకీయం

జీవనది మాట్లాడితే…

కుంభమేళా ముగిసింది. గంగానది ప్రవాహం కొనసాగుతోంది. కోట్ల మంది మనుషుల శరీర వాసనను నది తన నీటితో శుద్ధి చేసింది. నది రాత్రివేళ తనతో తను సంభాషించుకుంటుంది. ఇన్ని కోట్ల మంది మనుషులు.. సగ భారతదేశం నాలో మునక వేసిందా ఆని. నిరంతర ప్రవాహగతిలో నది నిశ్చల  జలధి  తరంగం. సముద్రతీరం లేని ప్రాంతంలో జీవించలేను అన్నాడు శ్రీరంగం శ్రీనివాసరావు. అతని జీవన మజిలీలు విశాఖపట్నం, చెన్నపట్నం. సముద్రంతో మనుషులకు ఉన్న భావోద్వేగ స్థితిని శ్రీశ్రీ పలవరించారు. నదులు మానవ నాగరికతా వికాసానికి జీవనోత్సవాన్ని ఇచ్చాయి. నది నుండి మానవులు  ఎంత స్వీకరించాలో అంతకు  మించి  వశం చేసుకున్నారు
సంపాదకీయం

మ‌న జీవితాల్లోకి చొర‌బాటు

అత్యంత శక్తివంతుడ‌ని చెప్పుకోబడుతున్న నాయకుడు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఆవును అనో,  కాదు అనో చెప్పలేకపోతున్నాడు. ఈ ఒక్క ప్రశ్నకే కాదు ఇప్పటిదాకా అయన దేనికీ జవాబు ఇవ్వలేదు.  కానీ ఆయన భక్తుల దృష్టిలో ఆయ‌న అత్యంత శక్తివంతుడు. ప్రపంచ అధినేతలను సైతం భ‌యపెట్టగలిగిన వాడు. అయన ఏమి చేసిన దేశం కోసం చేస్తాడని ప్రచారం చేసుకోగ‌ల‌వాడు. కానీ ఇప్పటిదాకా ఒక్క మీడియా సమావేశాన్ని కూడా ఎదుర్కోలేదు. అయితే  కంట కన్నీరు కారుస్తూ దేశభక్తి రాగాలాపన చేస్తుంటాడు. ఇప్పుడు పార్లమెంటులో దేనికీ జవాబు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. అంతగా ఆయన్ని ఇబ్బంది పెడుతున్న ప్రశ్న భారత
సంపాదకీయం

2024 ఎన్నికలు – హిందూ రాష్ట్ర స్థాపన

ఇప్పుడు దేశంలో ఎన్నికల కాలం నడుస్తున్నది. గత కొంత కాలంగా సాగుతున్న ఓట్ల యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. 2024 ఎన్నికలు ఈ దేశ  గమనాన్ని  నిర్ణయిస్తాయనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంటే, మరోసారి ఆ పార్టీ వస్తే దేశం ఏమైపోతుందని ఆందోళనపడేవాళ్లు ఎక్కువ అవుతున్నారు.  దీనికి కారణం లేకపోలేదు.  మూడోసారి  బిజెపీ అధికారంలోకి రావడం అంటే ‘హిందూ రాష్ట్ర’ స్థాపన అధికారికంగా ప్రారంభం కావడమే. ఇప్పటికే దానికి అవసరమైన సన్నాహాలను బీజేపీ పూర్తి చేసుకున్నది. సకల సాధనాలను ఉపయోగిస్తున్నది.  మరో వైపు కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని నిర్ణయించే ఎన్నికలు కూడా