సంపాదకీయం

ఎన్నికల తరువాత ..

‘ఎన్నికల వేడి’ అంటారు కదా. అది ఎన్నికలయ్యాక చల్లారిపోతుంది. మళ్లీ ఏవో ఎన్నికలు వచ్చే దాకా అంతా చల్లదనమే. పోలింగ్‌ పాలకుల తలరాత మారుస్తుంది. కొత్త వాళ్లు అధికారంలోకి రావచ్చు. పాత వాళ్లే కొనసాగవచ్చు. అద్భుతాలు జరిగినా, జరగకపోయినా ఏదో ఒక రకంగా ‘పాలించడబడటం’ ప్రజలకు మామూలవుతుంది. వేడి చల్లారిపోవడం, కొత్తపోయి పాతపడటం  అంటే ఇదే. కాకపోతే మొన్నటి సాధారణ ఎన్నికలకు కొంత ప్రత్యేకత ఉంది. ప్రధాన స్రవంతి పత్రికల్లో కూడా ఇది కనిపించింది. బీజేపీ కూటమికి, ఇండియా కూటమికి మధ్య భావజాల ఘర్షణగా కూడా  చూశాయి. నిజానికి ఇది దిన పత్రికలకు అందే వ్యవహారం కాదు. వాటి  
సంపాదకీయం

పుస్తకం ఎవరికి ప్రమాదకారి?

ఇవాళ దేశంలో జ్ఞానం అన్నిటికన్నా ప్రమాదకరమైనది. దానిని మోసే పుస్తకం, ఆ పుస్తకాన్ని రాసే, చదివే వ్యక్తులు ప్రమాదాకారులు. ఎలాగో మూడు ఉదాహరణలు మాత్రం చెప్తాను. మావోయిస్టు నాయకుడు ఆర్. కె. జ్ఞాపకాలతో ప్రచురించిన సాయుధ శాంతి స్వప్నం పుస్తకాలను ప్రెస్ నుండి విడుదల కాక ముందే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుస్తకాలను నిషేధించిన హీనమైన చరిత్ర కూడా మనకుంది కానీ అందులో ఏముందో కూడా చూడకుండా ఎత్తుకుపోవడం బహుశా ఇప్పుడే చూస్తున్నాం. వెయ్యి కాపీల పుస్తకాల కోసం వంద మంది ప్రెస్ మీద దాడి చేసి భీభత్సం సృష్టించి, వాళ్ళ ప్రాపర్టీ ఎత్తుకుపోయి వాళ్ళ మీదే కేసులు
సంపాదకీయం

సాహిత్య విమ‌ర్శ‌కు సొంత కార్య‌క్షేత్రం లేదా?

ఈ న‌డ‌మ ఏదో ఒక రూపంలో సాహిత్య విమ‌ర్శ గురించిన చ‌ర్చ‌లు  జ‌రుగుతున్నాయి . ఇప్పుడు  ఆ చ‌ర్చా సంద‌ర్భాల గురించి   మాట్లాడ‌బోవ‌డం లేదు.  అవి కొన్ని ముఖ్య‌మైన విష‌యాల‌ను  ప‌రోక్షంగా ముందుకు తీసుకొచ్చాయి.  అవి మాట్లాడుకుంటే చాలు.   సాహిత్య విమ‌ర్శ ప‌ని ఏమిటి? దానికి  సొంత కార్యక్షేత్రం ఏదైనా ఉన్న‌దా?    విమ‌ర్శ అనేది సాహిత్యం మీద‌,  సాహిత్య‌కారుల మీద ఆధార‌ప‌డిన ప‌రాన్న‌జీవి మాత్ర‌మేనా?     ర‌చ‌యిత‌ల‌ను పొగిడి వాళ్ల మెప్పు పొంద‌డంతో విమ‌ర్శ కార్య‌క్షేత్రం ముగిసిపోతుందా?  అనేవి ఆలోచించాలి.  నిజానికి సాహిత్యం గురించి   మాట్లాడుకొనేట‌ప్ప‌డు *సాహిత్య విమ‌ర్శ‌* ఆట‌లో అరిటిపండులా మారిపోతోంది. నేరుగా దాని గురించి
సంపాదకీయం

అనాగరిక అన్యాయ నేర చట్టాలు

ఇంకో అయిదు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా బిజెపి ప్రభుత్వం భారతదేశ క్రిమినల్‌ చట్టాలను మారుస్తూ పార్లమెంటులో బిల్లు పాస్‌ చేసుకుంది. అప్పుడు 143 మంది సభ్యులు సస్పెన్షన్‌లో ఉన్నారు. పార్లమెంటులో ఎటువంటి చర్చ లేదు. ప్రజా జీవితాన్ని ఎంతగానో శాసించే ఈ చట్టాల కోసం ప్రజాభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు. కనీసం న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన పాత ప్రభుత్వానికి మూడొంతుల మెజారిటీ లేదు. కనుక ప్రతిపక్ష సభ్యుల మద్దతు లేకుండా చట్టాలు చేయలేదు. అయితే దానికి మెజారిటీ ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన మూడు నేర చట్టాలు జులై 1 నుండి అమల్లోకి వస్తాయి. ఈ
సంపాదకీయం

విప్లవంలో శాంతి నిర్వచనం

ఆర్‌కె మరణానంతర జీవితాన్ని ఆరంభించాడు.  రెండు రోజులుగా ఆయన కోసం సమాజం దు:ఖిస్తున్నది. ఆయన్ను తలపోసుకుంటున్నది. ఆయనలాంటి వీరోచిత విప్లవకారులెందరినో ఆయనలో పోల్చుకుంటున్నది. ఉద్విగ్న విషాదాలతో తల్లడిల్లుతున్నది. ఆయనతో, ఆయన నిర్మించిన విప్లవోద్యమంతో రక్తమాంసాల, మేధో సంబంధం ఉన్నవాళ్ల దగ్గరి నుంచి, ఆయన రాజకీయాలతో ఏకీభావం లేని వాళ్ల దాకా అందరూ కన్నీరు కార్చుతున్నారు.   అది కేవలం ఒక మరణానికి సాటి మనుషుల ప్రతిస్పందన  కాదు. అదీ ఉంటుంది. అది అత్యంత మానవీయమైనది. నాగరికమైనది. దానితోపాటు ఆర్‌కెను ఒక వ్యక్తిగాకాక భారత విప్లవోద్యమానికి ప్రతీకగా భావించారు. విప్లవంలో రూపొందిన ఆయన మూర్తిమత్వం విప్లవానికి నిదర్శనమని అనుకున్నారు. అందుకే ఈ
సంపాదకీయం

రేణుక పర్యాయపదం మిడ్కో

విప్లవోద్యమం స్త్రీలను ఒక విశాలమైన ప్రపంచంలోకి తీసికెళుతుంది. వేల ఏళ్ల సంకెళ్ల నుంచి విముక్తమయ్యేందుకు రెక్కలు తొడుగుతుంది. పితృస్వామ్యమనే అత్యంత హేయమైన బందీఖాన నుంచి సుందరమైన స్వేచ్ఛాతీరంలోకి నడిపిస్తుంది. సొంత ఆస్తి పునాదిగా, లైంగిక శ్రమ విభజన అనే ఇరుకు గోడల మధ్య నిర్మాణమైన కుటుంబం నుంచి ఉత్పత్తిదాయకమైన, సృజనాత్మకమైన వర్గపోరాటంలో భాగం చేస్తుంది. అప్పుడు స్త్రీలు చేయగల అద్భుతాలు ఎట్లా ఉంటాయో, అవెంత సాహసికంగా పదునెక్కుతాయో తెలుసుకోవాలంటే మిడ్కో జీవితంలోకి తొంగి చూస్తే చాలు.  ఆమెలాంటి వేలాది, లక్షలాది నూతన మహిళలను అర్థం చేసుకోడానికి ఆమె నడచిన దారులను గమనిస్తే సరిపోతుంది. రేణుక ఒక మధ్య తరగతి
సంపాదకీయం

ఎన్నికలు – మరోసారి అర్బన్ నక్సల్స్, ముస్లింలే టార్గెట్

అర్బన్ నక్సల్ అంటే ఎవరు? అటువంటి వారున్నారా ? భారత ప్రభుత్వపు పార్లమెంట్ రికార్డ్ ల ప్రకారం అయితే లేరు. ఈ సంగ‌తి   కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రే ప్రకటించారు. కానీ నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి వారికి మాత్రం ప్రతి సభలో, సమావేశంలో అర్బన్ నక్సల్స్ గుర్తుకువస్తారు. ఈ నెల 23 న గుజరాత్ లో పర్యావరణం పై రాష్ట్రాల మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో  దేశప్రగతిని అర్బన్ నక్సలైట్లు  అడ్డుకుంటున్నారని  మోదీ అన్నాడు. దేశంలో 6000కు పైగా అప్లికేషన్ లు పర్యావరణ అనుమతుల కోసం నిరీక్షిస్తున్నాయని తెగ బాధ‌పడ్డాడు.  వీటివల్ల పెట్టుబడి
సంపాదకీయం

జీతన్‌ మరాండీకి జోహార్లు

ఉరికొయ్యలను దాదాపుగా తాకిన సాంస్కృతిక విప్లవ గొంతుక, జార్ఖండ్ అభేన్‌ నాయకుడు జీతన్‌ మరాండీకి జోహార్లు. ప్రజలను చైతన్యవంతం చేస్తున్న పాటపై సుదీర్ఘ కాలం సాగిన వేట మరాండీని మానసికంగా బలహీనపరచలేకపోయింది. కానీ, ఆయన ఆరోగ్యాన్ని మాత్రం బాగా దెబ్బతీసింది. ఓ తప్పుడు హత్య కేసు నుంచి 2013లో మరాండీ బయటపడ్డారు. అరెస్టు సమయంలో చేసిన ఇంటరాగేషన్‌లో పోలీసు అధికారులు చూపించిన నరకం వల్ల జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అనారోగ్య సమస్యలు వేధించాయి. ఈ నెల 12వ తేదీన బాగా జబ్బుపడిన ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వైద్య చికిత్స అందిస్తుండగానే 13న జీతన్‌
సంపాదకీయం

విభజన చట్టం చంద్రబాబుకు గుర్తుందా?

ఈ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్‌ ఎడాపెడా వాగ్దానాలు చేశారు. ఇద్దరూ చాలా సౌకర్యంగా ఒకటి మర్చిపోయారు. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయినప్పుడు చేసిన విభజన చట్టం. దానికి పదేళ్ల వయసు వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ‘నవ్యాంధ్ర’ను నిర్మిస్తానన్నాడు. కానీ విభజన చట్టం గురించి ఊసెత్తలేదు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్‌ రాజన్న రాజ్యం తెస్తా అన్నాడు. విభజన చట్టం నోరెత్తలేదు.  చెరి ఐదేళ్లు వంతులవారి రాష్ట్రాన్ని పాలించారు. ఈ పదేళ్లలో తాయిలాలకు లోటు లేదు. ఉచితాలకు అంతులేదు. పోటీపడి సామాజిక పింఛన్లు వాగ్దానాలు చేశారు. తోచిన వరకు ఇచ్చారు. కానీ
సంపాదకీయం

రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ఫాసిజాన్ని నిలువరిస్తుందా?

రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి ఎన్ఐఏ సోదాలు చేసింది. ఈ సారి ముస్లిం లపై ఈ దాడులు నిర్వహించింది.  ముస్లిం యువకులకు లీగల్ అవేర్ నెస్, కరాటేలో శిక్షణ ఇచ్చిందనే నెపంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై తెలంగాణ పోలీసులు జులై 2022 లో దేశద్రోహం కేసు పెట్టారు. ఆ కేసులో అప్పడే తెలంగాణ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్న సమయంలో  దీనిని ఎన్ఐఏ కు బదిలీ చేశారు.  దాడులుకు గురి అయింది ముస్లింలు,  చేసింది బిజెపి నేతృత్వంలోని ఎన్ఐఏ అనే విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ దాడుల‌కు వున్న రాజ‌కీయ ప్రాధాన్య‌త