ఇథనాల్ వ్యతిరేక ఉద్యమంపై దాడి
(ప్రాణాంతక ఇథనాల్ కంపెనీ వ్యతిరేక రైతాంగ పోరాటానికి మద్దతుగా , ఆ ఉద్యమం పై రాజ్య హింసను నిరసిస్తూ చిత్తనూరు ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ పక్షాన రాసిన ఈ కీనోట్ ను ఈ సంచిక సంపాదకీయంగా ప్రచురిస్తున్నాం - వసంత మేఘం టీం) చిత్తనూర్, ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామాలకి చాలాదగ్గరలో ఇథనాల్ కంపెనీకి దగ్గర్లో ఎక్లాస్పూర్ గేటు దగ్గర రిలే ధర్నాలు జరుగుతున్న శిబిరం ముందు 22.10.2023న ఉదయం పూట రైతాంగంపై పోలీసులు దాడిచేశారు. అధికారులు, రాజకీయ నాయకత్వం మరియు కంపెనీ పక్షాన పోలీసులు చాలా ఆగ్రహంతో దాడిచేశారు. ఇది రైతులు ఊహించని ఘటన. ఎందుకు ఇలా