ఖండన

తులసి చందు భావ ప్రకటనా స్వేచ్ఛను ఫాసిస్టులు అడ్డుకోలేరు

జర్నలిస్టు తులసి చందును బెదిరిస్తూ, అసభ్యకర మాటలతో నిందిస్తూ సంఫ్‌ుపరివార్‌ మూక దాడి చేయడాన్ని విరసం ఖండిస్తోంది. ఆమె గత కొద్దికాలంగా ప్రజా సమస్యల మీద వీడియోలు రూపొందిస్తోంది. అందులో ఆమె చెప్పే వాస్తవాలకు, విశ్లేషణలకు విశేష ఆదరణ దొరుకుతోంది. ఆమె తీసుకొనే ప్రజాస్వామిక వైఖరిని వీక్షకులు అభినందిస్తున్నారు. కల్లోలభరిత ప్రజా జీవితాన్ని అర్థం చేసుకోడానికి ఆమె మాటలు దోహదం చేస్తున్నాయి. జర్నలిస్టులైనా, రచయితలైనా ఫాసిస్టు వాతావరణాన్ని వివరిస్తూ వాస్తవాలు చెప్పడం తమ బాధ్యత అనుకుంటారు. సత్యాన్ని ప్రకటించని రచన, జర్నలిజం వ్యర్థం. కానీ సత్యమంటే ఫాసిస్టులకు భయం. సత్యం చెప్పేవాళ్లంటే కంటగింపు. దేశవ్యాప్తంగా పాత్రికేయుల మీద, రచయితల
ఇంటర్వ్యూ

రచయిత తన రచన పట్లనిర్మమకారంగా ఉండాలి

మహమూద్‌ నాకెంతో ఇష్టమైన కవుల్లో ఒకడు. ఆ మాటకొస్తే సొంత ఊరు వాడు కాబట్టి ఇంకాస్త ఎక్కువే ఇష్టం. మహమూద్‌ని నేను మొదటి సారి 1999 -2000 ప్రాంతంలో  ప్రొద్దుటూరుకు వెతుక్కుంటూ వెళ్లి కలిశాను. అప్పటి నుంచి నాకు అతనితో సాన్నిహిత్యం ఉంది. నాకు మహమూద్‌ అంటే మిత్రజ్యోతి సంస్థ వ్యవస్థాపక సభ్యుడు.  “సీమ కవిత’’ సంకలనం ఎడిటర్‌. “మిష్కిన్‌’’ కథా రచయిత. ఇప్పుడు “ఆస్మాని’’ కవి.కవిగా, కథకుడిగా, కార్యనిర్వాహకుడిగా సీమ సాహిత్యానికి, సమాజానికి ఎంతో సేవ చేసినవాడు. అక్కడి ఒక తరానికి స్ఫూర్తినిచ్చినవాడు. క్షణం క్షణం పొట్ట తిప్పల కోసం పాకులాడుతూనే మరోవైపు తాను పుట్టిన గడ్డ కోసం, సమాజం కోసం పరితపించినవాడు. కీర్తి కోసం కాకుండా
వ్యాసాలు

కుల నిర్మూలన – నూతన ప్రజాస్వామిక విప్లవం

(కా. డప్పు రమేశ్ మొదటి సంస్మరణ సభ సందర్భంగా చేసిన ప్రసంగ పాఠం) 1967 లో నక్సల్బరీ తిరుగుబాటుతో నూతన ప్రజాస్వామిక విప్లవ పంథా మనదేశంలో స్థిరంగా వేళ్లూనుకుంది. ఇది ‘నూతన మానవుల’ నిర్మాణం అనే భావనను దేశంలో బలంగా ప్రవేశ పెట్టింది. రాజకీయంలో విప్లవ పథాన్ని ఆవిష్కరించడంతో పాటు సాహిత్యం, కళలు, సినిమా వంటి అన్ని రంగాలలో వినూతన కోణంతో ఆలోచించడం నేర్పింది. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు అంటూ చరిత్ర రచనలో పీడిత వర్గాల కోణం నుండి చరిత్రను చూడటం నేర్పించింది. ఆ నూతన దృక్కోణం స్పృశించని రంగమంటూ లేదు.
ఆర్ధికం

ప్రభుత్వ బ్యాంకుల మెడపై ప్రైవేట్‌ కత్తి

దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులను పెద్దపెద్ద కంపెనీలు నిలువునా ముంచేస్తున్నాయి. మొండిబకాయిలు లేదా నిరర్థక ఆస్తులు (నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌/ఎన్‌పిఎ).. పేర్లు ఏవైనా, లాభపడుతున్నది ఎగవేత కంపెనీలు.. నష్టపోతున్నది ప్రత్యక్షంగా బ్యాంకులు, పరోక్షంగా ప్రజలు. ఘరానా కంపెనీలు బ్యాంకులను ముంచకపోతే, ఈ బ్యాంకుల లాభాలు మరింతగా పెరిగి ఉండేవి. పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు రుణాలను ఎగవేయడమే బ్యాంకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ప్రభుత్వం దర్జాగా మొండిబాకీలను రద్దు చేస్తోంది. ఇలాంటి రుణాలను రద్దు చేయడం కంటే, వసూలు చేయాల్సిన అవసరం ఉందని ఎఐబిఇఎ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోకపోగా, మరింతగా రాయితీలను
ఇంటర్వ్యూ

కశ్మీర్ ఒక ప్రయోగశాల

(2023 మే 2న, కశ్మీర్‌లో లోయలో రాజ్యహింసకు పాల్పడుతున్న ఒక ప్రసిద్ధ జర్నలిస్టును రెజాజ్ ఎం షీబా సైదీక్ ఇంటర్వ్యూ చేశారు. భారత ప్రభుత్వం నుండి రాబోయే పరిణామాలను ఊహించిన ఆ జర్నలిస్ట్ తన పేరు బయటపెట్టవద్దని అంటే అతనికి "ఫ్రీడమ్" (స్వేచ్ఛ) అని పేరు పెట్టాం. హడావిడిగా తీసుకున్న ఈ చిన్న ఇంటర్వ్యూ వెనుక ఉన్న రాజకీయ కారణాన్ని తన పేరును అజ్ఞాతంగా వుంచాలనే అతని అభ్యర్థన నుండి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అనామకతను పిరికితనం అనే  దృష్టితో చూడలేం. కానీ "ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో" వున్న"ప్రజాస్వామ్యం- స్వాతంత్ర్యాల "వాస్తవాన్ని, భారతదేశ ప్రధాన భూభాగంలోనూ, కశ్మీర్‌లోనూ
సంపాదకీయం

అకాడమీ  ఎందుకు  అవార్డులిస్తుందో  రచయితలకు తెలియదా?

మంచికో చెడుకోగాని తేనెతుట్టె మరోసారి కదిలింది. అకాడమీ అవార్డుల మీద తీవ్రమైన చర్చే జరిగింది. ఫేస్‌బుక్‌ మీద కాబట్టి ఇంతకంటె గొప్పగా ఉండాలని ఆశించేందుకు లేదు. నింపాదిగా, నిలకడగా మాట్లాడుకోలేకపోవడం, తక్షణ ప్రతిస్పందనతో సరిపెట్టుకోవడం ఇవాల్టి మేధో సంస్కృతి. అట్లని అంతా ఇదే కాదు. తెలుగులో ఓపికగా జరుగుతున్న అత్యవసరమైన మేధో అన్వేషణ కూడా ఉన్నది. కేంద్ర సాహిత్య అకాడమీ గురించి, అది అవార్డులను ప్రకటించే పద్ధతి గురించి గతంలో కూడా చాలా వాద వివాదాలు జరిగాయి. అయితే ఇప్పటికైనా ఈ చర్చ అన్ని రకాల అవార్డులు, సన్మానాలు, పురస్కారాల గురించి  మరింత దృఢంగా ముందుకు సాగవలసి ఉన్నది.