సంభాషణ

రాజ్యం ఆ ‘సంథాలీ సిరింగ్‌’ గొంతు నులమకుండా ఆపాల్సింది మనమే

( కా.   జీతన్‌ మరాండీ  మ‌న కాల‌పు గొప్ప వాగ్గేయ‌కారుడు.  ఆయ‌న  గానానికి, ప్ర‌సంగాల‌కు రాజ్యం భీతిల్లిపోయింది.  మ‌ర‌ణ దండ‌న విధించింది. ఆయ‌న‌తోపాటు త‌న  న‌లుగురు స‌హ‌చ‌రులకు కూడా. ఈ ఆదివాసీ, ద‌ళిత సాంస్కృతికోద్య‌మ క‌ళాకారుల కోసం స‌మాజ‌మంతా క‌దిలింది. వాళ్ల‌ను ఉరి తాడు నుంచి త‌ప్పించింది. జీత‌న్ ఈ నెల 13 న అనారోగ్యంతో అమరుడ‌య్యాడు.   జైలులో ఉన్నప్పుడు ఆయ‌న  గురుంచి, ఝార్ఖండ్ ఉద్యమం గురుంచి అమృత రాసిన వ్యాసం ఇది.  అయన స్మృతిలో పునర్ముద్రిస్తున్నాం.- సంపాదకవర్గం   )  జీతన్‌ మరాండీని నేను చూడలేదు. అనిల్‌రామ్‌, మనోజ్‌ రాజ్‌వర్‌, ఛత్రపతి మండల్‌ల గురించిన వివరాలు నాకు తెలీవు. కానీ
ఆర్ధికం కాలమ్స్

శ‌ర‌వేగంగా పెరుగుతున్న అస‌మాన‌త‌లు

బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల నుంచి భారత పాలకవర్గాలైనా దళారీ బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలకు అధికార మార్పిడి జరిగి 75 ఏండ్లు కావస్తోంది. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ అని ఘనంగా పాలకవర్గాలు చెబుతున్నాయి. అయినా ఈ దేశ ప్రజలు కనీసం కడుపు నిండా తిండిలేక, ఉండడానికి గూడు లేక, కట్టుకోవడానికి సరిపోయే బట్టలేక, సరైనా వైద్యం అందక, నాణ్యమైన విద్య లేక కోట్లాదిమంది సతమతమవుతున్నారు. నోరున్నా న్యాయం కావాలని అడగలేని అభాగ్యులు కోటాను కోట్లు ఉన్నారు. దీనికి కారణం మన పాలకుల అప్రజాస్వామిక పాలన, ప్రజావ్యతిరేక విధానాలు, ఫాసిస్టు అణచివేత ధోరణులు అని స్పష్టమవుతోంది. అన్ని
ఆర్ధికం కాలమ్స్

ఇండో- పసిఫిక్ లో ఆకస్ చిచ్చు

ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతున్న అగ్రరాజ్యాలు భౌగోళిక రాజకీయ వ్యూహాల్లో తమకనుకూలమైన రీతిలో కూటములు ఏర్పరచుకుంటున్నాయి. ఆఫ్ఘాన్ నుంచి అవమానకరమైన రీతిలో నిష్క్రమించిన అగ్రరాజ్యం అమెరికా పోయిన పరువును నిలుపుకోవడానికి నానా తంటాలు పడుతుంది. తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం రకరకాల రక్షణ కూటములు కడుతున్నది. పులి మాంసం తినడం మానేసిందన్నట్లు ఇక యుద్ధం ముగిసింది అంటూనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త పన్నాగంతో సెప్టెంబర్ 15న బ్రిటీష్, ఆస్ట్రేలియాతో కలిసి చేసుకున్న మిలిటరీ ఒప్పందానికి ఆ మూడు దేశాల పేర్లు గుది గుచ్చి 'ఆకస్'గా వ్యవహరించబోతున్నారు. దీంతో అమెరికాకు యూరోపియన్ యూనియన్ తో ఇంతకాలం ఉన్న సత్సంబంధాలు బెడిసి కొట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు
కొత్త కవిత్వం కాలమ్స్

తూర్పు ముఖం

తెలుగు కవిత్వంలో దీర్ఘకవితలకు ప్రత్యేకత వున్నది.వస్తువును విస్తృతo చేయడానికి కవి ఎంచుకున్న కవితా మార్గం. నగ్నముని కొయ్యగుర్రం , శివారెడ్డి ఆస్ఫత్రి గీతం , వరవర రావు సముద్రం,   ఎన్.కె.లాల్ బనో గులామి  చోడో వంటి దీర్ఘ కవితలు భారత సమాజాన్ని అర్ధం చేసుకొని  ధిక్కార స్వరాన్ని నమోదు చేసినాయి. క‌ళ్యాణ‌రావు #, కాలం*, కాశీం మానాల‌, గుత్తికొండ వంటి దీర్ఘ‌క‌విత‌లు చ‌రిత్ర‌ను, విప్ల‌వోద్య‌మ చ‌రిత్ర‌ను న‌మోదు చేశాయి.    వీరంద‌రూ దీర్ఘ కవితల పరంపరకు ప్రగతి శీల దారులు  వేశారు.  ఛాయారాజ్  వంటి విప్లవ కవులు దీర్ఘ కవితా ప్రక్రియలో రాయడానికి ఉత్సుకతను ,అభినివేశాన్ని కనబరిచే వారు
కవిత్వంలోకి కాలమ్స్

నిషేధాల మధ్య ఆవిర్భవించిన కవి

కవి నడిచి వచ్చిన దారి తననెప్పుడూ ప్రజల వైపు నిలబెడుతుంది. కవిత్వంలో అత్యంత ఆధునిక శైలిలో తనకంటూ ఒక ఫ్రేంతో మనకు సుపరిచుతులైన కవి ఆశారాజు గారు. సిటీ లైఫ్ లోని సంక్లిష్టతను సున్నితంగా సరళంగా తనే రాయగలరని అందరికీ ఎరుక. ప్రతీ కవితలోనూ తన డిక్షన్ ఓ ప్రత్యేకతని మనకు అనుభూతిలోకి తెస్తుంది.  వరుసగా వచ్చే తన కవితా సంపుటాలలో నవ్యత తొణికిసలాడుతుంది. ఆ ఫ్రెష్నెస్ ని మనం తన కవిత్వాన్ని చదివేటప్పుడు  ఫీల్ కాగలం. తను కట్టే దృశ్య చిత్ర మాలిక మన మనో ఫలకంపై కదలాడుతూ వుంటుంది. అదే కవి సామాజిక సంక్లిష్టతపై, కల్లోలంపై
వ్యాసాలు

సంక్షేమ హౕస్టళ్ళు, గురుకులాల భ‌విత‌వ్యం?

కోవిడ్  సుదీర్ఘ విరామం అనంతరం సెప్టెంబర్ 1 నుండి తెలంగాణలో ప్రత్యక్ష విద్యబోధ‌న  ప్రారంభమైంది. విద్యార్థుల ఆరోగ్యంపై కలత చెందిన కొంత మంది తల్లిదండ్రులు, వ్యక్తులు సెప్టెంబర్ 1 నుండి పాఠశాలల ప్రారంభం నిలిపివేయాలని పిల్ వేశారు. ఆగస్టు 31 నాడు అత్యవసరంగా హైకోర్టు బెంచ్ పాఠశాలల ప్రారంభంపై విచారణ జరిపి గురుకులాలు,సంక్షేమ హౕస్టళ్ళను మినహాయించి మిగిలిన విద్యాసంస్థల ప్రారంభానికి అనుమతినిచ్చింది.అదే సమయంలో గురుకులాలు,సంక్షేమ హౕస్టళ్ళలో కోవిడ్ నిబంధనలు అమలుపై, అక్కడి వసతుల కల్పన, కనీస సౌకర్యాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురుకులాలో, సంక్షేమ హౕస్టళ్ళలోని విద్యార్థులు నివసించే గదులలో కోవిడ్ నిబంధనలు అమలుకు ఏమాత్రం అవకాశం
సాహిత్యం వ్యాసాలు

వివాదాస్పద వ్యక్తిత్వం

ఎంవి రమణారెడ్డి వాక్యం సరళంగా ఉంటుంది. ఆయన  ఏది రాసినా, మాట్లాడినా    నేరుగా  అర్థమైపోతారు. ఆయన వ్యక్తిత్వం దీనికి పూర్తి వ్యతిరేకం.  అందులో అనేక ఎత్తుపల్లాలున్నాయి.  ఆగాధాలు ఉన్నాయి.   చిక్కుముళ్లు ఉన్నాయి.  అలాంటి ఎంవిఆర్‌ గురించి సరళంగా   ఏం చెప్పినా అది తప్పే అవుతుంది. ఆయన్ను పట్టిచ్చే ఒకే ఒక వాక్యం రాయడం ఎవ్వరికైనా కష్టమవుతుంది. ఒక ప్రశంసాత్మక వాక్యం రాస్తే దాని పక్కనే ప్రశ్నించే వాస్తవం వచ్చి నిలదీస్తుంది.   ఆయన సామాజిక, రాజకీయ జీవితం  గుంటూరు మెడికల్‌ కాలేజీ విద్యార్థి దశలోనే ఆరంభమైంది. నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల ప్రచార వేదికగా ప్రభంజనం పత్రిక ఆరంభించారు. విరసం
సాహిత్యం వ్యాసాలు

పంజరంతో ప‌క్షి యుద్ధం

ఆఫ్ఘాన్ మహిళా కవిత్వం "అందరూ నిన్ను తమ దానిగా చెప్పు కుంటారు..కాని, నేను నిన్ను నిన్ను గానే చూస్తాను. "  Jalaluddin Rumi balki. (రూమి ) ఆప్ఘాన్ లు అన్ని సాహిత్య ప్రక్రియ ల కన్నా  కవిత్వానికి పెద్ద పీట వేస్తారు..తాము భావాల్ని కేవలం కవిత్వం ద్వారా మాత్రమే చెప్పగలమన్నది వాళ్ళ విశ్వాసం.. అక్కడ కవులు, కవయిత్రులు కవిత్వాన్ని బైటికి చదవడానికే ఇష్ట పడ్తారు(recitation)...ఆప్ఘాన్లు సాధారణంగా కవిత్వాన్ని  పర్షియన్(దారి), ఫస్తో భాషల్లో రాస్తారు..వాళ్ళు ఎక్కువగా "లాండై"(ద్విపద)పద్ధతిలో రాస్తుంటారు. పదమూడవ శతాబ్దంలో జన్మించిన సూఫీ కవి,జలాలుద్దీన్ రూమి బల్కీ ని వాళ్లు ఆదికవి గా భావిస్తారు.ఆయన కవిత్వంలో ఆధ్యాత్మికత