వ్యాసాలు

హిడ్మే మర్కం అక్రమ అరెస్టును ఖండిద్దాం!

హిడ్మే మర్కంను వెంటనే విడుదల చేయాలీ! చత్తిస్‌ఘఢ్‌లో పౌర హక్కుల కార్యకర్తలపై వేధింపులను ఆపాలి! మార్చి 9, 2021 ఛత్తీస్‌‌ఘఢ్ పోలీసులు, పారా మిలటరీ దళాలు అదుపులోకి తీసుకుని శారీరక, లైంగిక హింసలకు గురిచేయడంతో ఆత్మహత్య చేసుకొన్న కావ్య నంది, పండే కవాసీ అనే యిద్దరు ఆదివాసీ యువతుల స్మృతిలో దంతేవాడ, సమేలిలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంనుంచి 28 ఏళ్ల ఖనిజ తవ్వకాల వ్యతిరేక, ఆదివాసీ హక్కుల కార్యకర్త హిడ్మే మార్కమ్‌ను నిస్సిగ్గుగా, చట్టవిరుద్ధమైన తీరులో ఎత్తుకెళ్లిన ఘటన మమ్మల్ని దిగ్భ్రాంతుల్ని చేసింది. ఆ తరువాత హిడ్మే మార్కంను, (d/o పోడియం మార్కం, బుర్గం గ్రామం,
సాహిత్యం కవిత్వం

మీరూ – మీ రాజ్యం

నాలుగు రోడ్ల కూడలిలోనిమ్మ కాయ ముగ్గు తొక్కండిభూత వైద్య పట్టాదార్లుబెనారస్ నుండి వస్తున్నారు ఆత్మ పరమాత్మ లసంఘర్షణ ల నిగ్గు తేల్చేనిఖార్సైన చదువులురాజు ఇలాకాలో చెబుతున్నారు ఎలా చస్తేఎలా చంపితేఆత్మ పునర్జన్మ పొందుతుందోచెప్పే ప్రయోగశాలలు తయారవుతున్నాయితొందర పడినోట్లో రాగి చెంబులు పెట్టిడంబెల్స్ తో చంపబాకండి త్రిశూలం వాడితే శివుడొస్తడోచక్రం తో ఛేదిస్తే విష్ణువు వస్తాడోచెప్పే జ్ఞానంబాబాలకి లేదనివిశ్వవిద్యాలయాల్లో పురుడు పోస్తున్నారు నగ్న దేహాన్నిపటాల ముందు ప్రదర్శిస్తేపటాలు శాంతిస్తాయో లేదోననేపరిశోధనలు కొనసాగుతాయి త్వరలో అంతా ద్వైతమేశాస్త్రం సమాధిమీరు కోరుకుంటున్న సమాజమే వస్తుందిఆత్మలన్నీ మరుజన్మ ఎత్తిచావులేని పురాణ వైద్యాన్ని వెలుగులోకి తెస్తుంది రాజ్యం!! బువ్వ పెట్టే వాడ్ని చంపైనామీ మూఢ నమ్మకాన్ని
వ్యాసాలు

కథలవనం ఎండిపోయింది..

ఆకులన్నీ రాలి మోడై ఎండిన కథల చెట్టు కూలిపోయిన వర్తమాన స్థితి కనబడుతుంది. రాయలసీమలోకథల పెద్దోళ్ళలో.. బహుశా ఆధునిక కథను వొడిసిపట్టుకుని దాంతోనే నాలుగైదు దశాబ్ధాలు సాహచర్యంచేసిన కథల రారాజు అస్తమించిన దుఃఖ సందర్భమిది. ఆయన గూర్చి మాట్లాడ్డమంటే మానవీయ విలువలగూర్చి మాట్లాడటమే. సింగమనేని నారాయణ అసలు సిసలైన మార్క్సిస్టు కథకుడు. నిఖార్సైన భావజాలంతోజీవించినవాడు. కథల కార్థానాలోనే జీవితఖైదీగా బతికినవాడు. ఎవరేకథ రాసినా ఆ కథను అసాంతం చదివిఆ కథపై నాలుగుమాటలు మాట్లాడి కథకుడిని ఉత్సాహ పరిచే సాహిత్య సంస్కారమున్నవాడు. రాయలసీమకథను కథల ప్రపంచంలో అగ్రభాగాన నిలిపిన కథకుడు. ఆయన రాయని కథావస్తువు మిగల్లేదు. ఇదిరాయలేదనడానికి వీల్లేని వస్తువులన్నింటిని
వ్యాసాలు అనువాదాలు

కోవిడ్ 19 విపత్తుని ఎదుర్కోవడంలో క్యూబా సహకారం

‘వారు తెలివైన ఆయుధాలను కనిపెట్టారు. కానీ మేము మరింత ముఖ్యమైనది కనిపెట్టాము: ప్రజలు ఆలోచిస్తారు, అనుభూతి చెందుతారు.’ ఫెడల్ కాస్ట్రో అనేక పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాల్లోని ప్రజారోగ్య విధానాలలో వైఫల్యాన్ని COVID-19 విపత్తు బహిర్గతం చేసింది. IMF, ప్రపంచ బ్యాంక్ పునర్నిర్మాణ కార్యక్రమాల ద్వారా ప్రేరేపించబడిన ఆరోగ్యం, విద్యా కార్యక్రమాలలో కోతలు చేసిన దశాబ్దాల నయా ఉదారవాద కాఠిన్యం, ఇప్పుడు లాటిన్ అమెరికా, యూరప్, అమెరికా అంతటా వ్యాప్తిస్తున్న ప్రమాదకరమైన అంటువ్యాధులు, మరణాలలో ఫలితాలను చూపుతోంది. పాశ్చాత్య దేశాలలో, క్యూబా సమర్థతకు ఒక ఉదాహరణగా నిలిచింది. విపత్తుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మరొక మార్గం సాధ్యమని చూపించింది. సంఖ్యలు
ఇంటర్వ్యూ

భారతదేశ మహిళా ఉద్యమంపై బి. అనూరాధ ఇంటర్వ్యూ

భార‌తదేశ మహిళా ఉద్యమాన్ని ఎన్ని దశలుగా చూడవచ్చు? 1857 లో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం మొదలైనప్పటినుండీ 1947 వరకు జరిగిన బ్రిటిష్ వ్యతిరేక పోరాటాల్లోనూ “స్వాతంత్రోద్యమంలోనూ” మహిళల భాగస్వామ్యం చెప్పుకోదగినవిధంగా ఉంది. ప్రత్యేక మహిళాఉద్యమంగా రూపొందకపోయినా ఆ పోరాటాల్లో పాల్గొనడం ద్వారా వారు పితృస్వామ్యాన్ని ఢీకొన్నారు. వారి భాగస్వామ్యం అర్జీలు, విన్నపాలు సమర్పించడం దగ్గర నుండి, ఊరేగింపులూ పికెటింగ్ లు, ధర్నాలు, నిరాహారదీక్షలు, స్వచ్ఛంద అరెస్టులు తదితర రూపాల్లో కొనసాగడమే కాకుండా జాతీయ విప్లవకారులుగా సాయుధచర్యల వరకూ అన్నిటిలో పాల్గొన్నారు. 1917 నుండే అఖిల భారత స్థాయిలో మహిళా సంఘాలు ఏర్పడినప్పటికీ అవి స్వాతంత్ర పోరాటంలోనూ కొంత
వ్యాసాలు అనువాదాలు

పశ్చిమ బెంగాల్‌లో బ్రాహ్మణీయ ఫాసిజం ఆవిర్భావం

ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడటంలో పార్లమెంటరీ విధానం ప్రధాన రూపం కాదు. ఫాసిస్టు వ్యతరేకులు వీధుల్ని తమ అజమాయిషీలోకి తీసుకోవాలి డాక్టర్‌ అమితవ చక్రవర్తి ఫిబ్రవరి 4, 2021 పశ్చిమ బెంగాల్‌లో రానున్న శాసనసభ ఎన్నికలు అర్‌యస్‌య‌, భాజపా పరివారంలో అనందోత్సాహాల్ని రేకెత్తించాయి. ఎన్నికల్లో తాము ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. ఉత్తరభారతంలో జరుగుతున్న రైతాంగ పోరాటం మోడీ ప్రభుత్వపు “అభివృద్ధి నమూనా వాస్తవరూపాన్ని బహిర్గతం చేసింది. అయితే గత పార్లమెంటు ఎన్నికల నుండి బెంగాల్‌లో భాజపా అసాధారణ అభివృద్ధిని సాధించింది. దాని అవిర్భావ కాలం నుండి ఇంతటి పెరుగుదలను అర్‌యస్‌యస్‌ కలలో కూడా ఊహించలేదు. పశ్చిమబెంగాల్‌లో అధికారాన్ని
సంభాషణ ఇంటర్వ్యూ

విరసం రచయిత్రి నల్లూరి రుక్మిణితో ఇంటర్వ్యూ

కథలు రాస్తూ నవలలోకి రావాలని ఎందుకు అనిపించింది? నా కథలు అన్నీ దాదాపు సామాజిక సమస్యలకు సంబంధించినవే. ఈ రకమైన ఇతివృత్తాలకు 'చమక్కు' మనిపించే నైపుణ్యతకంటే 'నెరేటివ్‌' విధానం- పాఠకుడికి సులభంగా అర్ధమవడానికి వీలవుతుంది. అందువల్లే నేను కథను నైపుణ్యీకరించే క్రమం మీద ఎక్కువ శ్రద్ద పెట్టలేదు. సామాన్య పాఠకుడికి చేరాలన్నదే నా లక్ష్యం. దానివల్ల నా కథలు పెద్దవిగా వుండేవి. అలా రాస్తున్న క్రమంలో కథకంటే నవలలో జీవితాన్ని మరింత వివరించగలననిపించింది. అంటే, జీవితంలో వుండే ఆర్థిక సామాజిక, రాజకీయ ప్రాధాన్యతలను చెప్పడానికి నవలలో అయితే వీలవుతుందనుకున్నాను. నా మొదటి నవల 'నర్రెంక సెట్టు కింద' అలా
సాహిత్యం గల్పిక కథలు

జైలూ బెయిలూ!

“అబ్బా... వీవీకి బెయిలొచ్చింది, యేమైనా కోర్టుల వల్లే కాస్తో కూస్తో న్యాయం జరుగుతుంది” “రెండువేల పద్దెనిమిది నుంచి జైల్లో పెట్టి విచారణ జరపకుండానే తీర్పు యివ్వకుండానే శిక్షాకాలం అమలు చేస్తున్నారు కదా?” “ఔన్లే, యిప్పటిదాకా ఆయన మీద పెట్టిన యే కేసూ నిలబడలేదు” “ఇప్పుడూ బీమా కోరేగాం కేసూ నిలబడదు. ఆల్రెడీ ఆర్సెనాల్ ఫోరెన్సిక్ సంస్థ అమెరికా వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్టులో కూడా పోలీసులు పెట్టిన ఎలిగేషన్లు కల్పితాలని, నిందితుల కంప్యూటర్లలోకి సాక్షాలని అక్రమంగా లోడ్ చేశారని చెప్పింది” “ఎవరు యేమి చెప్పినా, మనం చెప్పిన రిజల్టు వస్తేనే మనం నమ్ముతాం, అదే నమ్మదగింది అవుతుంది” “అమెరికా
కాలమ్స్ ఆర్ధికం

పారుబాకీలతో బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభం

భారతదేశంలో అధికార బదిలీకి ముందు, తర్వాత ప్రైవేట్‌ బ్యాంకుల చరిత్ర అంతా అక్రమాలతో, మోసాలతో ముడిపడి ఉంది. వలసపాలన కాలంలో దేశంలో ఏర్పడిన ప్రైవేట్‌ బ్యాంకులు ప్రజల వద్ద నుండి వసూలు చేసిన డిపాజిట్లను తమ స్వప్రయోజనాలకు వినియోగించుకున్నాయి. ఆనాటికి ఉన్న 600 బ్యాంకులు పెద్ద పరిశ్రమలకు, వాణిజ్య వర్గాలకు పరిశ్రమల నిర్మాణం, వర్కింగ్‌ కాపిటల్‌, ఇతర అవసరాలకు రుణాలు ఇస్తుండేవి. చిన్న వృత్తులు, వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు తదితరాలకు రుణాలు అందేవి కాదు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించకపోవటం, వసూలుపై బ్యాంకులు తగినంత శద్ధ పెట్టకపోవటం, రుణాలు తీసుకున్న సంస్థలు చేసే మోసాలలో బ్యాంకులు కూడా భాగస్వాములు
కాలమ్స్ కొత్త కవిత్వం

కవిత్వం – వస్తు రూప విశ్లేషణ

కాలంతో పాటు కవితా రచన ప్రయాణం చేస్తున్నదా, లేదా కవిత్వం మానవ వ్యక్తీకరణను నమోదు చేయడంలో తడబడుతున్నదా. నిజానికి కవులు అక్షరాస్యులేనా? వర్తమానంలో నిలబడి కవిత్వం రాస్తున్నవారు పునాది అంశాలను తడుముతున్నారా? ఇవన్నీ కవితా రచనను లోతుగా గమనిస్తున్న వారికి ఎదురయ్యే సందేహాలు. కాలంతో పాటు మానవ జీవితంలో అనేక సంక్లిష్టతలు వచ్చి చేరాయి.పాలక వర్గం ప్రచారం చేస్తున్నట్లు నూత్న అభివృద్ధి నమూనాలో మానవుడి పరిమితులు విశాలత్వం మధ్య సంఘర్షణ వున్నది. అందివచ్చిన అవకాశాలు జీవితంలో వుండే సుఖలాలస కవితా సృజనలో వ్యక్తమవుతుంది. సృజనాత్మక తలంపై కవి జీవితంలోని ఘర్షణను అనువదించుకోకపోతే కళాత్మక వ్యక్తీకరణకు పరిమితి ఏర్పడుతుంది.రచనకు ,