గల్పిక కథలు

దేశాంతరం!

కరోనా కాదుగాని బడీ లేక బయట ఆడుకోవడానికీ లేక పొద్దస్తమానమూ ఇంట్లో టీవీ చూస్తూ కాలం గడిపేస్తుంటే పరీక్షా కాలం కాస్తా వచ్చేసింది! “భారతదేశానికి సరిహద్దులు తెలపండి?” ప్రశ్నపత్రంలోని ప్రశ్న! “భారతదేశానికి తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, ఉత్తరాన హిమాలయా పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి” జవాబు రాసిన విద్యార్థికి జీరో మార్కులు వేశారు మాస్టారు! చదివి రాసిన విద్యార్థి డంగైపోయాడు! “టిక్రి, సింఘు, గాజీబోర్డర్” అని జవాబు రాసిన మిగతా విద్యార్థులను మాస్టారు మెచ్చుకొని ఎన్నికి అన్ని మార్కులూ వేసేశారు! టీవీలూ పేపర్లూ చూసి రాసిన విద్యార్థులు పొంగిపోయారు! “దేశ సరిహద్దులు మారిపోతాయా?” ఆశ్చర్యపోతూ
కాలమ్స్ బహుజనం

ఉద్యమగీతం

రజ్మియా అంటే ఉద్యమగీతం. తెలంగాణ ముస్లింకవులు తెలుగులో,ఉర్దులో రాసిన కవితల సంకలనం ఈ పుస్తకం. దీనికి సంపాదకుడు స్కైబాబ(ఎస్.కె.యూసుఫ్ బాబ). ’నసల్’కితాబ్ ఘర్,తెలంగాణ ముస్లిం రచయితల వేదికలు ఈ పుస్తకాన్ని ప్రచురించాయి. అక్బర్,ఫవాద్ తంకానత్ లు తెలుగు,ఉర్దులలో ముఖచిత్రాలు గీశారు. తెలుగులో 36 మంది(75 పేజీలు), ఉర్దులో 31మంది(68పేజీలు) కవుల కవితలతో కూడిన పుస్తకామిడి.డిసెంబర్ 2012 లో పుస్తక ప్రచురణ జరిగింది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆ నేపథ్యంలో రాసినవే ఇందులోని కవితలన్నీ. ఈ పుస్తకంలోని కవితలలో విభిన్న ఇతివృత్తాలను కవులు ఎంపిక చేసుకున్నారు. ప్రాథమికంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చుట్టూ తిరిగినా,కవితల్లో
సాహిత్యం వ్యాసాలు

మయన్మార్‌లో సైనికకుట్ర – తదనంతర పరిణామాలు

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది గంటల ముందు మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని జనవరి 31న తెల్లవారుజామున హస్తగతం చేసుకుంది. ఆగ్నేసియాలోని నిరుపేద దేశమైన మయన్మార్‌ మరోసారి సైనిక పాలనలోకి పోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత సైన్యాధిపతి మిన్‌ అంగ్‌ హేలింగ్‌ అధికారం చేపట్టాడు. అయిదు కోట్ల జనాభా కలిగిన మయన్మార్‌లో సైనిక కుట్రలు కొత్తేమీ కాదు. 1948లో స్వాతంత్ర్యం సాధించిన తరువాత మొదటి పద్నాలుగేళ్లు ప్రజాస్వామ్య పాలన కింద ఉన్న మయన్మార్‌లో 1962లో సైన్యం ఒక్కసారిగా తిరుగుబాటు చేసి అధికారం చేజిక్కించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారం తమ చేతుల్లోంచి
కాలమ్స్ అలనాటి రచన

ఓ బాలిక డైరీ

మూలం: ఆన్ ఫ్రాంక్                                           తెలుగు అనువాదం: బీనా దేవి ప్రపంచంలోనే మహా నియంత. ఎటువంటి నేరమూ చేయని లక్షలాది యూదు జాతీయులను కేవలం ‘యూదులుగా పుట్టడమే వాళ్ళ నేరమని’ భావించి, మారణహోమం చేయించిన నర రూప రాక్షసుడు అడాల్ఫ్ హిట్లర్. అతను పరిపాలిస్తున్న కాలంలో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఒక ఇంట్లో అటక లాంటి భాగంలో తన కుటుంబంతో సహా  గడిపిన  ఒక యూదు బాలిక ఆన్ ఫ్రాంక్.  జర్మన్ లో ఫ్రాంక్ ఫర్డ్ నగరంలో 1929 జూన్ 12 వ తేదీన పుట్టింది ఆన్ ఫ్రాంక్. తండ్రి ఒట్టో ఫ్రాంక్. తల్లి
సాహిత్యం కవిత్వం

స్వప్నకథనం

శూన్యగోళంలో తిరుగాడే పిట్టజీవావరణంలో ఇమడలేకగహన గగనం చేరలేకమన బాల్కానీ ఊచల మీద టపటపమన తలుపుల మీద టకటకమన గుండెలకు దగ్గరగా గునగునగుండే గువ్వై ఎగిరిపోన... కల అయిపోలేదుతూటాల మీదుగా పూలతుంట్లు తుంచిపాపల బుగ్గల నుంచి లేత గులాబీలు తెంచిమొర చాపిన లేగ ముట్టెకు ముద్దిచ్చిముట్టించి, ముట్టడించి,దట్టించి, దహించిరివ్వున. కెవ్వన... ఎగిరిపోన.. కలఅయిపోలేదుకనలి కనలికదిలి కదిలిఉప్పటి కన్నుల మీదుగా జారిచప్పటి పెదవుల మీదకు చేరిచప్పున తోలేలోపే ఎగిరిపోన..
కాలమ్స్ లోచూపు

భూమి,సంస్కృతి,నాగరికత

నేటి అర్ధ వలస,అర్థ భూస్వామ్య సామాజిక వ్యవస్థలో ఈ దేశం పట్ల పాలకవర్గాల దృష్టికోణం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజానుకూలంగా ఉండదు. ఒకప్పుడు గురజాడ ‘’దేశమంటే మట్టి కాదోయ్/ దేశమంటే మనుషులోయ్’’ అనంటే, నేటి పాలకులు దేశమంటే మట్టి మీద బతికే మనుషులు కాదు, ఆ మట్టి చుట్టూ పాతిన సరిహద్దులు, ఆ మట్టి కింద ఉన్న ఖనిజ వనరులేనని భావిస్తున్నారు. వాటిని తెగనమ్మి, పెట్టుబడిదారీ అభివృద్ధివైపే పాలకులు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ అభివృద్ధిలో ప్రజల నిజమైన అస్తిత్వ అభివృద్ధికి, జ్ఞానచైతన్యాల అభివృద్ధికి ఏ మాత్రం చోటు లేదు.ఉన్నదల్లా పెట్టుబడి వృద్ధియే. మనదేశంలో రైళ్ల విస్తరణ వల్ల సాపేక్షికంగా
సాహిత్యం కవిత్వం

సబ్జెక్ట్‌ కరెక్షన్‌

బిర్యానీ తినిపించి బంగ్లా రాయించేసుకొన్నాకకత్తి చేతికందించి మెడ తెంచుకుపోయాక మత్తు దిగేక అస్తుబిస్తుగా మిగిలేక ఓ మనిషీ ఓ మనీషి ఓ మహర్షీ మాయమయ్యాక కలి ఉలి ఆగిందిశిలకు ఆకలి మొదలైంది...