సాహిత్యం కారా స్మృతిలో

ప్రపంచ కథకుడు

నాకు బాగా ఇష్టమైన కథా రచయితలు ఇద్దరే ఇద్దరు. ఒకరు మహాస్వేతాదేవి ఇంకొకరు కాళీపట్నం రామారావు. ఇద్దరి కథలని ఇష్టంగా చదువుకుంటాను. చాల సార్లు కథ రాస్తున్నప్పుడు ఎక్కడైనా తోచక పొతే వీళ్ళ పుస్తకాలలోకి తొంగి చుస్తాను. చిక్కులు కాస్త తొలిగి పోతాయి. సరిగ్గా చెప్పాలంటే వాళ్ళు నాకు రెడీరెకనర్ లాగ ఉపయోగపడుతుంటారు. వీళ్లిద్దరు నాకు సాహిత్యంలో రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఏదైనా కథ నచ్చాలంటే కథలోని ఇతివృత్తంతో బాటు కథ నడిపే తీరు కూడా నచ్చాలి. దాన్ని బట్టే కథలో readability పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలని సైతం పట్టుకోవడంలో వీళ్ళు ఇద్దరు సిద్ధహస్తులు. అంటే