అరుణోదయ నాగన్నకు విప్లవ జోహార్లు
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ పరకాల నాగన్న శుక్రవారం (03-06-2026)అనారోగ్యంతో ఖమ్మంలో మరణించారు. ఈ దేశ ప్రజల విముక్తి కోసం సుదీర్ఘకాలంపాటు ఆడి, పాడి తుది శ్వాస వరకు పోరాడే ప్రజల పక్షానే నిలిచిన నాగన్నకు విరసం జోహార్లు అర్పిస్తోంది. శ్రీపాద శ్రీహరి అమరత్వంతో ఎరుపెక్కిన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారాం గ్రామంలో నాగన్న జన్మించారు. శ్రీహరి స్ఫూర్తితో గజ్జె కట్టి గళం ఎత్తి బయల్దేరిన పాలబుగ్గల పసివాడు పరకాల నాగయ్య నుండి అరుణోదయ నాగన్నగా రాజకీయ పరివర్తన చెంది ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారు. ఆయనది నిరుపేద గీత కార్మిక కుటుంబం. బాల్యం








