కాశ్మీర్లోని కునాన్ పోష్పోరాలో, సైన్యంపైన ఎన్నటికీ తొలగని ఒక ఆరోపణ
1991లో, 40 మంది కశ్మీరీ మహిళలు సైనికాధికారులు తమపై అత్యాచారం చేశారని ఆరోపించారు. కేసు ఇంకా పెండింగ్లో ఉంది. ఫిబ్రవరి 23తో కునన్ పోష్పోరా సామూహిక అత్యాచార ఘటన జరిగి 35 ఏళ్లు పూర్తయ్యాయి. కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉన్న ఈ జంట గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్న భారత సైన్యానికి చెందిన ఒక యూనిట్ తమపై ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆ గ్రామ మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, 'లెస్ట్ వి ఫర్గెట్' (మనం మర్చిపోకూడదు) అనే శీర్షికతో 2024 సెప్టెంబర్ సంచికలో ప్రచురితమైన కథనాన్ని 'అవుట్లుక్' పునఃసమీక్షించింది. కునన్ పోష్పోరా సామూహిక అత్యాచార ఆరోపణల కేసు ఇప్పటికీ










