నన్నిలా ఉండనీయండి
(మొదట్లో అరుంధతి రాయ్ కు తన జ్ఞాపకాలను రాయాలనే ఆలోచన రాలేదు . తనను బాగా ప్రభావితం చేసిన , చికాకు పెట్టిన తన తల్లి మేరీ రాయ్ చనిపోయిన తర్వాతనే (Mother Mary Comes To Me ) రాయాలని భావించింది . ఈ పుస్తకం మేరీ రాయ్ జీవితానికి ఒక కిటికీ వంటిది. మేరీ రాయ్ అంతగా విస్మరించాల్సిన మనిషి కాదు . శూన్యం నుండి బయలుదేరి క్రిస్టియన్ వారసత్వాల కింద పనిచేస్తూ, స్త్రీల సమానహక్కుల కోసం కొట్లాడిన మనిషామె. కొట్టాయంలో ఆమె జీవితాన్ని ఒక సూపర్ హీరో లాగా నడిపించి, తన 89 సంవత్సరాల










