సంభాషణ

కాశ్మీర్‌లోని కునాన్ పోష్‌పోరాలో, సైన్యంపైన ఎన్నటికీ తొలగని ఒక ఆరోపణ

1991లో, 40 మంది కశ్మీరీ మహిళలు సైనికాధికారులు తమపై అత్యాచారం చేశారని ఆరోపించారు. కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఫిబ్రవరి 23తో కునన్ పోష్‌పోరా సామూహిక అత్యాచార ఘటన జరిగి 35 ఏళ్లు పూర్తయ్యాయి. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న ఈ జంట గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్న భారత సైన్యానికి చెందిన ఒక యూనిట్ తమపై ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆ గ్రామ మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, 'లెస్ట్ వి ఫర్గెట్' (మనం మర్చిపోకూడదు) అనే శీర్షికతో 2024 సెప్టెంబర్ సంచికలో ప్రచురితమైన కథనాన్ని 'అవుట్‌లుక్' పునఃసమీక్షించింది. కునన్ పోష్‌పోరా సామూహిక అత్యాచార ఆరోపణల కేసు ఇప్పటికీ
సంభాషణ

కునాన్ పోష్‌పోరా: నిజాన్ని; స్మృతిని సజీవంగా ఉంచడం

2018 ఫిబ్రవరి 23: ఫ్రెని మానిక్‌షా సుమారు 27 ఏళ్ల క్రితం చలికాలంలో ఒకనాడు, కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న కునన్- పోష్‌పోరా అనే జంట గ్రామాల చౌకీదార్ జుమా షేక్, తహసీల్దార్ సికందర్ మాలిక్‌ను కలిశారు. ఆయన దగ్గర ఉర్దూలో రాసిన ఒక లేఖ ఉంది, దానిపై గ్రామస్తుల సంతకాలు, వేలిముద్రలు ఉన్నాయి. ఆ లేఖలో, ఫిబ్రవరి 23- 24 మధ్య రాత్రి '4 రాజపుతానా రైఫిల్స్' సైన్యం వారి గ్రామాన్ని చుట్టుముట్టి తనిఖీలు నిర్వహించిన సమయంలో తాము అనుభవించిన భయంకరమైన లైంగిక హింస, చిత్రహింసల గురించి సాధారణ భాషలో వివరంగా తెలియచేసారు. బాధితులలో 60 ఏళ్ల
సంభాషణ

కళింగనగర్ (ఓడిశా)ఆదివాసీ మృత వీరులకు జోహార్లు

జనవరి 2,2006 న నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని బిజెడి-బిజెపి ఉమ్మడి ప్రభుత్వ పోలీసుల కాల్పుల్లో సామూహికంగా హత్య చేయబడ్డ 14 మంది కళింగనగర్ (ఓడిశా) ఆదివాసీ మృత వీరులకు జోహార్లు. కార్పోరేట్ కంపెనీల కోసం సాగిన బలవంతపు భూసేకరణ,గ్రామాల ధ్వంసం, భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా 2005 నుండి కళింగనగర్ ఆదివాసులు వీరోచితంగా పోరాడుతున్న క్రమంలో జనవరి 2, 2006 న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం జరిపిన పోలీసు కాల్పుల సామూహిక మారణకాండలో 14 మంది ఆదివాసీలు మృతి చెంది నేటికి 20 సంవత్సరాలు.ఇంకా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేసే క్రమంలో
ఇంటర్వ్యూ

రచయిత తన రచన పట్లనిర్మమకారంగా ఉండాలి

మహమూద్‌ నాకెంతో ఇష్టమైన కవుల్లో ఒకడు. ఆ మాటకొస్తే సొంత ఊరు వాడు కాబట్టి ఇంకాస్త ఎక్కువే ఇష్టం. మహమూద్‌ని నేను మొదటి సారి 1999 -2000 ప్రాంతంలో  ప్రొద్దుటూరుకు వెతుక్కుంటూ వెళ్లి కలిశాను. అప్పటి నుంచి నాకు అతనితో సాన్నిహిత్యం ఉంది. నాకు మహమూద్‌ అంటే మిత్రజ్యోతి సంస్థ వ్యవస్థాపక సభ్యుడు.  “సీమ కవిత’’ సంకలనం ఎడిటర్‌. “మిష్కిన్‌’’ కథా రచయిత. ఇప్పుడు “ఆస్మాని’’ కవి.కవిగా, కథకుడిగా, కార్యనిర్వాహకుడిగా సీమ సాహిత్యానికి, సమాజానికి ఎంతో సేవ చేసినవాడు. అక్కడి ఒక తరానికి స్ఫూర్తినిచ్చినవాడు. క్షణం క్షణం పొట్ట తిప్పల కోసం పాకులాడుతూనే మరోవైపు తాను పుట్టిన గడ్డ కోసం, సమాజం కోసం పరితపించినవాడు. కీర్తి కోసం కాకుండా
ఇంటర్వ్యూ

కశ్మీర్ ఒక ప్రయోగశాల

(2023 మే 2న, కశ్మీర్‌లో లోయలో రాజ్యహింసకు పాల్పడుతున్న ఒక ప్రసిద్ధ జర్నలిస్టును రెజాజ్ ఎం షీబా సైదీక్ ఇంటర్వ్యూ చేశారు. భారత ప్రభుత్వం నుండి రాబోయే పరిణామాలను ఊహించిన ఆ జర్నలిస్ట్ తన పేరు బయటపెట్టవద్దని అంటే అతనికి "ఫ్రీడమ్" (స్వేచ్ఛ) అని పేరు పెట్టాం. హడావిడిగా తీసుకున్న ఈ చిన్న ఇంటర్వ్యూ వెనుక ఉన్న రాజకీయ కారణాన్ని తన పేరును అజ్ఞాతంగా వుంచాలనే అతని అభ్యర్థన నుండి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అనామకతను పిరికితనం అనే  దృష్టితో చూడలేం. కానీ "ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో" వున్న"ప్రజాస్వామ్యం- స్వాతంత్ర్యాల "వాస్తవాన్ని, భారతదేశ ప్రధాన భూభాగంలోనూ, కశ్మీర్‌లోనూ
ఇంటర్వ్యూ సంభాషణ

ప్రజాస్వామ్యంలోనూ ఫాసిజం వస్తుంది

- సిద్ధికీ కప్పన్‌, రైహానాలతో ఇంటర్వ్యూ  (సిద్ధికీ కప్పన్‌ 43సంవత్సరాల వయసున్న మళయాళీ జర్నలిస్టు. కేరళ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ ఢల్లీి శాఖకు కార్యదర్శి. ఆయన్ను 5 అక్టోబర్‌ 2020న ఉత్తరప్రదేశ్‌లోని మథుర టాల్‌ప్లాజా వద్ద అరెస్టు చేశారు. ఆయనతోపాటు ఇద్దరు విద్యార్థి కార్యకర్తలు అతికూర్‌ రహ్మన్‌, మసూద్‌ అహ్మద్‌, డ్రైవర్‌ మొహ్మద్‌ ఆలంను కూడా నిర్బంధించారు. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌ అనే గ్రామంలో నలుగురు అగ్రకుల ఠాకూర్‌లు ఒక దళిత బాలికమీద సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనలో నిజనిర్ధారణకోసం ఆ గ్రామానికి వెళుతుండగా ఈ అరెస్టులు జరిగాయి. కప్పన్‌పై ఊపా, పియమ్‌ఎల్‌ఏ లతో సహా అనేక ఇతర
ఇంటర్వ్యూ

చరిత్రను తిరగ రాయడం  వీరోచితం అనుకుంటున్నారా ?

గణేష్‌ నారాయణ్‌ దేవి జ్ఞానానికి, శక్తికి మధ్య వుండే సంబంధం గురించి పరిశోధిస్తూ అనేక పుస్తకాలు, వ్యాసాలు రచించారు. మానవ చరిత్రలో శిష్టవర్గాలు, జ్ఞానాన్ని నిర్వచిస్తూ దానిపై గుత్తాధిపత్యాన్ని ఎలా సాధించారో ఆయన వివరించారు.  ఆయన గుజరాత్‌లోని వడోదరా (బరోడా)లో ‘‘భాషా రీసెర్చ్‌ అండ్‌ పబ్లికేషన్‌ సెంటర్‌’’ను, తేజ్‌ఘర్‌లో ‘‘ఆదివాసీ అకాడమీ’’ని స్థాపించారు.  2010లో ఆయన నాయకత్వంలో జరిగిన ‘‘భారతదేశంలో ప్రజల భాషల సర్వే’’ నేటికీ సజీవంగా వున్న 780 భారతీయ భాషలను రికార్డు చేసింది. ఆయనకు సాహిత్య అకాడమీ అవార్టు, సార్క్‌ దేశాల సాహిత్య అవార్డు, ప్రిన్స్‌ క్లాస్‌ (PrinceClaus)1 అవార్డు, అంతర్జాతీయ లింగ్వాపాక్స్‌ బహుమతి (
ఇంటర్వ్యూ

హస్ దేవ్‍ను కాపాడుకుంటాం

10 ఏళ్లకు పైగా గడిచిపోయింది, హస్‌దేవ్‌లో జరుగుతున్న చెట్ల నరికివేతను, బొగ్గు తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిరసనలు నిరంతరం కొనసాగుతున్నాయి. అయితే, 10 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఎలాంటి తార్కికమైన ప్రభావం లేదా ఫలితం రాలేదు. వాస్తవానికి, కార్పొరేట్ - ప్రభుత్వాల మధ్య బంధం చాలా బలంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. మనం నీరు, భూమి, అడవులను కాపాడటానికి ప్రయత్నించాలి. మనం ఈ విధ్వంసాన్ని ఆపకపోతే, మానవ నాగరికతకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ పోరాటం కేవలం హస్‌దేవ్ ఆదివాసులది మాత్రమే కాదు. ఇది మొత్తం సర్‌గుజా డివిజన్ ప్రజల పోరాటం. మనం గెలిపించిన ఎంపీలు
ఇంటర్వ్యూ

హింసా నివారణకు శాంతి చర్చలే మార్గం

1. పాలకులు కాల్పుల విరమణ ప్రకటన చేయాలని ఇటీవల పూర్వ విప్లవ విద్యార్థి వేదిక తరపున పెద్ద ఎత్తున సంతకాలు సేకరించారు కదా? ఈ ప్రయత్నంలో మీ వేదిక అనుభవం ఏమిటి? కాల్పుల విరమణ ప్రకటన చేయాలి అని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ సంతకాల సేకరణ కోసం మేం కలసిన వారిలో చాలా మంది తెలంగాణలో కాల్పులు జరగడం లేదు కదా ...మీరు అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని తప్ప తెలంగాణ ప్రభుత్వాన్ని కాదు పైగా తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులపట్ల సానుభూతిగానే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. కనిపించడం మాత్రమే కాదు సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నక్సలైట్ సమస్య శాంతి భద్రతల
వ్యాసాలు సంభాషణ

శ్రమ సంబంధాలఅమ్మ

నవంబర్‌ 1 నాడు మల్లోజుల మధురమ్మ తన వందవ ఏట కన్నుమూసింది. ఆమె నిండా నూరేళ్లు బతికింది. బతికినన్నాళ్లు ఆమె విప్లవ సానుభూతిరాలుగానే బతికింది. ఇటీవలి కాలంలో చాల మందే అమ్మలు, నాన్నలు కన్నుమూస్తున్న వార్తలు వినాల్సి వస్తున్నది. కొద్ది రోజుల క్రితం మా సహచర కామ్రేడ్‌ హన్మంతు తండ్రి  పాక చంద్రయ్య 90వ ఏట సెప్టెంబర్‌ 30నాడు కన్ను మూసిన విషయం వార్త పత్రికల ద్వార తెలిసింది. ఆయన తొమ్మిది పదులు నిండిన వయసులో కన్ను మూశాడు. ఆయనకు ఆరుగురి సంతానంలో మా కామ్రేడ్‌ హన్మంతే పెద్ద కుమారుడు. ఆయన మరణం బాధాకరం.  కానీ ప్రతి జీవికి