వ్యాసాలు

హక్కుల చైతన్యాన్ని కార్మికవర్గ దృక్పథాన్ని పెంచే వ్యాసాలు

(ఇటీవల పౌరహక్కుల సంఘం యాభై వసంతాల సభల్లో విడుదలైన అమరుడు ప్రొ. శేషయ్య గారి పుస్తకానికి రాసిన ముందుమాట ) ప్రొ. శేషయ్యగారి రచనా సర్వస్వంలో ఇది మూడో సంపుటం. మొదటిది ‘రాజ్యాంగం-పౌరహక్కులు, విమర్శనాత్మక దృక్పథం(2021)’. రెండో సంపుటి ‘కాలంతో కరచాలనం, స్వేచ్ఛ సంపాదకీయాలు(2023)’. ఇప్పుడు ‘నూతన ఆర్థిక విధానాలు-కార్మికోద్యమం’. శేషయ్యగారి అమరత్వం తర్వాత ఆయన రచనలన్నీ ప్రచురించాలని పౌరహక్కుల సంఘం అనుకుంది. సంస్థ నాయకుడిగా, హక్కుల ఉద్యమ వ్యాఖ్యాతగా ఆయన వేర్వేరు సందర్భాల్లో రాసిన వ్యాసాలను పాఠకులకు అందించాలని ఈ పని ఆరంభించాం.  ఇందులోకి దిగాక ఈ వ్యాసాల విస్తృతి, లోతు మరింతగా అర్థమవుతున్నది. తెలుగు సమాజాలు,
వ్యాసాలు

ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సి ఉందని  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అనింది. అంటే పదేళ్లపాటు ప్రజాస్వామ్యంపట్ల ఖాతరు లేని బీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఒకటికి రెండుసార్లు గెలిచి అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిందని అర్థం. ప్రజాస్వామ్యం ధ్వంసమైపోయి కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే మిగిలింది.  దాని ద్వారా ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వచ్చిన పార్టీ భారతదేశాన్ని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని మరే పార్టీకంటే ఎక్కువ కాలం పాలించింది. బిజెపిని మినహాయిస్తే మరే పార్టీకంటే ఎక్కువ దుర్మార్గాలకు, ప్రజా వ్యతిరేకత చర్యలకు పాల్పడిన గతం కాంగ్రెస్‌కు ఉన్నది. అలాంటి పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సి
వ్యాసాలు

మన  రైతాంగ భవితవ్యం WTO దయా దాక్షిణ్యాల్లో

విధ్వంసం  విధ్వంసం నుండి కాదు విధ్వంసం లేకుండా నిర్వహించడం సాధ్యం కాని వ్యాపార ఒప్పందాల నుండి ఉద్భవిస్తుంది. -బెర్టోల్ట్ బ్రెచ్ట్ గత 20 ఏళ్లలో 3,50,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మూడు రైతు వ్యతిరేక దుర్మార్గ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేసిన ధర్నాలో  700 మంది రైతులు అమరులయ్యారు. నవంబర్‌లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే, మూడు చట్టాలను రద్దు చేసి, కనీస మద్దతు ధరపై పటిష్టమైన చట్టం చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించాడు. పేద రైతుల కోసం, దేశాభివృద్ధి కోసం ఈ చట్టాలను రూపొందించామని, కానీ వాటి
వ్యాసాలు

కనీస మద్దతు ధరవెనుక వాస్తవం

నీటి కొరతతో బాధపడుతున్న పంజాబ్‌లో పంటల వైవిధ్యీకరణను అమలు చేయడం నేడు చాలా అవసరం. కానీ గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో పప్పుధాన్యాలు, ప్రత్తి, మొక్కజొన్న ఉత్పత్తి, సేకరణ గణనీయంగా తగ్గింది. ఈ పంటలను సాపేక్షికంగా చాలా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేయడం వల్ల వచ్చే ఐదేళ్లలో ఈ పంటలకు సంబంధించి  కేంద్రంపై దాదాపుగా ఎటువంటి భారం పడదు. పంజాబ్‌లో వ్యవసాయం స్థితిగతులు ఏమిటో, రైతు సంఘాలు ఢిల్లీ చలో అనే నినాదంతో పెద్ద ముందంజ వేయడానికి ఎందుకు సిద్ధమవుతున్నాయో చూద్దాం. ఫిబ్రవరి 18 వ తారీకు ఆదివారం అర్ధరాత్రి వరకు నిరసనకారులతో జరిగిన నాలుగో విడత చర్చల్లో
వ్యాసాలు

మనందరం తెగబడి పోరాడాల్సిన 21 డిమాండ్ల చార్టర్

2024 ఫిబ్రవరి 16న అఖిల భారత గ్రామీణ బంద్; పారిశ్రామిక / రంగాల సమ్మె సందర్భంగా సంయుక్త్ కిసాన్ మోర్చా, జాయింట్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ (జెపిసిటియు) విడుదల చేసిన 21 పాయింట్ల డిమాండ్ల చార్టర్  సంయుక్త్  కిసాన్ మోర్చా (ఎస్కెఎం) సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, ఇండిపెండెంట్ సెక్టోరల్ ఫెడరేషన్లు / అసోసియేషన్ల ఉమ్మడి వేదిక మోదీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా 2024 ఫిబ్రవరి 16 న గ్రామీణ బంద్; పారిశ్రామిక / రంగాల సమ్మెకు పిలుపునిచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), ద్రవిడ మున్నేత్ర కాజకాం,
వ్యాసాలు

మరోసారి రైతుల నిరసన జ్వాల

2021 లో ఏడాది పొడవునా నిరసన వ్యక్తం చేసిన తరువాత, భారతదేశ రైతులు వ్యవసాయ రంగాన్ని "సరళీకరించడానికి" ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయించగలిగారు. ఇప్పుడు 2024లో రైతులు మరోసారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత నిరసనలకు దారితీసిన వ్యవసాయాన్ని నియోలిబరల్ కార్పొరేటీకరణకు అనువుగా మార్చివేయడం అనే సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ వ్యవసాయ వ్యాపార సంస్థలు, ఆర్థిక మూలధనం భారతదేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌పరం చేసేందుకు ఒక నిర్దిష్ట పథకం ప్రకారం ప్రయాస పడుతున్నాయి. ఈ పథకం 1990ల ఆరంభంలో మొదలైంది.  ఈ ప్రణాళికను అమలు చేయడానికి
వ్యాసాలు

శుభ్‌కరణ్  హత్యకు హర్యానా పోలీసులే కారణం 

ఫిబ్రవరి 21న పంజాబ్ - హర్యానా ఖనౌరి సరిహద్దులో హర్యానా పోలీసుల చర్యలో శుభ్‌కరణ్ మరణించాడు. ఆయన మరణం కారణంగా రైతులు ‘ఢిల్లీకి వెళ్దాం’ నిరసన ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. 22 ఏళ్ల రైతు శుభ్‌కరణ్ సింగ్ రైతు ఉద్యమ సమయంలో మరణించడంతో  పంజాబ్ లోని బటీండా జిల్లాలోని బల్లో గ్రామంలో విషాదకర వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 21 న పంజాబ్, హర్యానా సరిహద్దులోని పటియాలా జిల్లాలోని పతారాన్ పట్టణానికి సమీపంలో ఖనౌరీ సరిహద్దులో కొందరు నిరసనకారులు బారికేడ్ల వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. అందువల్ల రైతులు ‘ఢిల్లీకి వెళ్దాం’  నిరసన ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు.
వ్యాసాలు

రాజ్యాంగం – హక్కులు

(రాజ్యాంగవాదం గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో పాఠకుల అవగాహన కోసం ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాం. పౌరహక్కుల ఉద్యమ నాయకుడు, న్యాయశాస్త్ర ఆచార్యుడు ప్రొ. శేషయ్య 2008వ సంవత్సరంలో ప్రొద్దుటూరులో ప్రైవేట్‌ టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ యూనియన్‌ మిత్రుల కోసం చెప్పిన పాఠం ఇది. ఈ వ్యాసం ఆయన మరణానంతరం పౌరహక్కుల సంఘం ప్రచురిస్తున్న ప్రొ. శేషయ్య రచనా సర్వస్వం-1లో అచ్చయింది) రాజ్యాంగం ప్రాథమికంగా అధికారం గురించి మాట్లాడుతుంది. మన భారతదేశంలో అధ్యక్ష తరహా పాలన కాకుండా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పార్లమెంటులోని రెండు సభలు, రాష్ట్రపతి కలిపి ఒక నిర్మాణం వుంటుంది. అది పని చేయాలంటే
వ్యాసాలు

ఎన్నికలు – ముస్లింల ఎంపిక అవకాశం

2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, కొంతమంది ఉన్నత వర్గాల ముస్లింలు తమ సమాజాన్ని బిజెపి గురించిన తమ అభిప్రాయాలను పునరాలోచించమని కోరుతున్నారు. (తారిక్ మన్సూర్, 'ముస్లింలు బిజెపి గురించి పునరాలోచించాలి', ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 01, 2024). భారతీయ ముస్లింల పట్ల ఎలాంటి వివక్ష జరగడం లేదని పునరాలోచనకు పిలుపునిచ్చినవారు అంటున్నారు. ఆహార ధాన్యాలు, గృహనిర్మాణం, వంట గ్యాస్, తాగునీరు మొదలైన వాటికి సంబంధించిన ప్రభుత్వ సామాజిక సంక్షేమ పథకాల వల్ల ముస్లింలకు కూడా ప్రయోజనం చేకూరుతున్నదని వారు అంటున్నారు. ఇది కాకుండా, పస్మాందా, సూఫీ ముస్లింలపై బిజెపి ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. 2014 తరువాత
వ్యాసాలు

దోపిడీ ప్రయోజనాలే రాజ్యాంగ విలువగా మార్చారు

విప్లవ రచయితల సంఘం 29వ మహాసభలో పాల్గొనటానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనలు! గత సంవత్సరం జనవరి ఏడవ తేదీన హైదరాబాదులో జరిగిన విరసం అధ్యయన తరగతుల సందర్భంగా ఫాసిజాన్ని అర్థం చేసుకోవడం గురించిన చర్చలో మా అభిప్రాయాలను వివరించిన సంగతి ఒకసారి మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ప్రస్తుతం మనం అత్యంత సంక్లిష్ట సంక్షోభ సాంస్కృతిక వాతావరణంలో ఇక్కడ సమావేశమవుతున్నాం. ఇదంతా మన సామాజిక జీవితంలో, ప్రజల రోజువారీ అనుభవంలో ఉన్న సంక్షోభపు వ్యక్తీకరణగా భావించవచ్చు. 75 సంవత్సరాల క్రితపు అర్థవలస అర్థఫ్యూడల్‌ వ్యవస్థనుండి మౌలికంగా తెగతెంపులు చేసుకోగలిగిన నిజమైన ప్రజాస్వామిక మార్పు