హక్కుల చైతన్యాన్ని కార్మికవర్గ దృక్పథాన్ని పెంచే వ్యాసాలు
(ఇటీవల పౌరహక్కుల సంఘం యాభై వసంతాల సభల్లో విడుదలైన అమరుడు ప్రొ. శేషయ్య గారి పుస్తకానికి రాసిన ముందుమాట ) ప్రొ. శేషయ్యగారి రచనా సర్వస్వంలో ఇది మూడో సంపుటం. మొదటిది ‘రాజ్యాంగం-పౌరహక్కులు, విమర్శనాత్మక దృక్పథం(2021)’. రెండో సంపుటి ‘కాలంతో కరచాలనం, స్వేచ్ఛ సంపాదకీయాలు(2023)’. ఇప్పుడు ‘నూతన ఆర్థిక విధానాలు-కార్మికోద్యమం’. శేషయ్యగారి అమరత్వం తర్వాత ఆయన రచనలన్నీ ప్రచురించాలని పౌరహక్కుల సంఘం అనుకుంది. సంస్థ నాయకుడిగా, హక్కుల ఉద్యమ వ్యాఖ్యాతగా ఆయన వేర్వేరు సందర్భాల్లో రాసిన వ్యాసాలను పాఠకులకు అందించాలని ఈ పని ఆరంభించాం. ఇందులోకి దిగాక ఈ వ్యాసాల విస్తృతి, లోతు మరింతగా అర్థమవుతున్నది. తెలుగు సమాజాలు,