వ్యాసాలు

నాలుగు లేబర్ కోడ్ ల విప‌త్తు రాబోతోంది..

కేంద్రంలోని ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చిన నాలుగు లేబర్ కోడ్లు 2026 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోనికి రావడం జరుగుతుంది. నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశంలోని కార్మిక సంఘాలు 2026 ఫిబ్రవరి 12న ఒకరోజు జాతీయ సమ్మెను నిర్వహించడం జరిగింది. దేశంలో గల కార్మిక వర్గం నుంచి విశేష స్పందన వచ్చింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకకు తగ్గలేదు సరి కదా మరింత పట్టుదలతో నాలుగు లేబరు కోడ్లను అమలు చేయడానికి ముందుకు వెళుతుంది. వీటికి ముందు చేసిన కొత్త న్యాయ చట్టాలు విషయంలో కూడా ఇదే జరిగింది. దేశంలో
వ్యాసాలు

గతాన్ని సమీక్షించుకుని సాయుధ పోరాట పథంలో  పురోగమిద్దాం!

(న‌క్సల్బ‌రీ శ్రీ‌కాకుళ పోరాటాల వెనుకంజ త‌ర్వాత విప్ల‌వోద్య‌మ పున‌ర్నిర్మాణానికి పూనుకున్న  కా. కొండ‌ప‌ల్లి సీతారామ‌య్య 1972లో రాసిన సుప్ర‌సిద్ధ ప‌త్రం ఇది. దీనికి ఆత్మ విమ‌ర్శ రిపోర్టు అనే పేరు కూడా ఉంది. ప్ర‌స్తుత విప్ల‌వోద్య‌మ సంక్షోభాన్ని, తాత్కాలిక ఓట‌మిని విమ‌ర్శ‌నాత్మ‌కంగా  అర్థం చేసుకోడానికి, భ‌విష్య‌త్తుప‌ట్ల నిర్మాణాత్మ‌క‌, ఆశావాదంతో వ్య‌వ‌హ‌రించ‌డానికి స్పూర్తిని ఇస్తుంద‌ని ఈ ప‌త్రంలోని ఉపోద్ఘాత భాగాన్ని పాఠ‌కుల కోసం ఇక్క‌డ ఇస్తున్నాం.. వ‌సంత‌మేఘం టీం) నక్సల్బరీలో 1967లో ఆరంభమైన రైతాంగ సాయుధ విప్లవం భారత విప్లవ చరిత్రలోనే ఒక పెద్ద మలుపు. రివిజనిస్టు నాయకత్వం తెలంగాణా రైతాంగ సాయుధ విప్లవానికి ద్రోహం తలపెట్టిన తర్వాత చైతన్యపూరితంగా
వ్యాసాలు

ఆ ముగ్గురి  స్ఫూర్తి.. దేశ సార్వభౌమాధికార పోరాటం

మార్చి 23 భారతదేశ చరిత్రలో మరువలేని రోజు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ నేలకొరిగి 95 ఏళ్ళు నిండాయి.ఈ సందర్భంగా వారిని స్మరించుకోడంతో పాటు వారు చూపిన బాటలో నడుస్తూ ఈ దేశాన్ని‌  కుల,మత,జాతి వివక్షలకు తావులేకుండా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం విలసిల్లే సార్వసత్తాక దేశంగా నిర్మించుకోవాల్సిన బాధ్య‌త‌ ఈ దేశ యువతీ యువకులపై, విద్యార్థులపై ఉంది. క్రీ.శ 1608 లో బ్రిటన్ కు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని రెండు వందల సంవత్సరాలు పాలించారు. ఈ కాలంలో
వ్యాసాలు

పుస్తక ప్రపంచమే లేకుంటే..నేనొక మామూలు మనిషిని – మంచికంటి

మంచికంటి మరో గ్రంథాలయ ఉద్యమకారుడుగా అందరికీ సుపరిచితుడు. ఆయన కవి కథకుడు, నవలాకారుడు ఉద్యమకారుడు. పుస్తకాల ప్రపంచం కోసం అందరికీ పుస్తకాలను చేరువ చేయడం కోసం గ్రంథాలయాలను బలోపేతం చేయడం కోసం ఒక గొప్ప ఉద్యమాన్ని నడుపుతున్న వ్యక్తి. స్కూటర్ పై అనేక ప్రాంతాలు పర్యటించి, విద్యార్థులతో పాటు రచయితలతో భాషాభిమానులతో గ్రంథాలయ నిర్వాహకులతో సాహిత్య సాంస్కృతిక సంస్థల నిర్వాహకులతో ముచ్చటించి యాత్రానుభవాలను  పుస్తకంగా మలచిన సృజనకారుడు. మంచి ఉపాధ్యాయుడు. * పుట్టిన ఊరు కలికివాయ, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. విద్యలో ప్రయోగాలు చేస్తున్న శాంతివనం ఫౌండేషన్ ఊరు: నాయుడుపాలెం, చీమకుర్తి మండలం.   ఆయన
వ్యాసాలు

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ల ఉగ్ర దాడిని, అధ్యక్షుడు అయతుల్లా అలీ ఖోమైనీ హత్యను ఖండించండి

ఇరాన్ అణ్వాయుధాలను,క్షిపణులను తయారు చేస్తుందని,అందుకు ఉపయోగపడే మూల పదార్థాలను నిల్వ చేస్తుందని దుష్ప్రచారం చేస్తూ,దాడులు చేస్తామని బెదిరిస్తూ,తన దేశ స్వయం రక్షణ వ్యవస్థను అమెరికా ఆదేశాలకు లోబడి ఉంచాలని దశాబ్దాలుగా వత్తిడి చేస్తుంది.ఇరాన్ తను అణ్వాయుధాలను తయారు చేయడం లేదని తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగిస్తామని చెప్పినా ఇరాన్ వాదనలను పట్టించుకోకుండా ఇంతకు ముందు ఒకసారి దాడులు చేసింది.మళ్ళీ మరొకమారు ఇదే వాదనను తెరపైకి తెచ్చి ఈ సాకుతో దాడి చేస్తామని బెదిరిస్తూ ఇందన వనరులను,ఖనిజ సంపదను, మార్కెట్ ను అప్పజెప్పాలని ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇరాన్ పై వత్తిడి
వ్యాసాలు

నిఘా వలయంలో బస్తర్ గ్రామాలు

నిఘా వలయంలో బస్తర్ గ్రామాలు మాలినీ సుబ్రమణ్యం 2026 ఫిబ్రవరి 26 మావోయిస్టుల తిరుగుబాటును అంతం చేసేందుకు మార్చి 31వ తేదీని గడువుగా కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో పూర్వ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలోని ప్రజల జీవితాలను భద్రతా బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్: చుత్వహి గ్రామంలో ఇళ్ళకు అంకెలను కేటాయిస్తున్న భద్రతా బలగాలు చుత్వహి గ్రామంలోని దాదాపు ప్రతి ఇంటికి ఒక నంబర్ ఉంటుంది; భద్రతా బలగాలు లావుపాటి ఇంగ్లీష్ అక్షరాలతో గోడలపై పెయింట్ చేసాయి. "మమ్మల్ని గుర్తించడానికి ఈ నంబర్లను ఉపయోగిస్తారు" అని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మారుమూల ఉన్న ఈ గ్రామ నివాసి భీమా కోసా చెబుతున్నాడు.
వ్యాసాలు

పుస్త‌కాల‌తోనే మనిషిగా గుర్తింపు – డాక్టర్ బి. నాగశేషు

డాక్టర్ బి. నాగశేషు  అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తెలుగు అధ్యయన, పరిశోధన విభాగం, ముక్త గంగోత్రి, మైసూర్  పనిచేస్తున్నారు. ఇప్పటివరకు వారధి, వ్యాసాలు, ఇరుగుపొరుగు, తెలుగు కన్నడ తులనాత్మక వ్యాసాలు,తగటు, తులనాత్మక వ్యాసాలు, ఏకుదారం, బీరప్ప,  కిలారి నవలలు వెలువరించారు. మాట్లాడే పుస్తకాల గురించి ఈ పక్షం వసంత మేఘంలో ఇలా అంటున్నారు.. 1.నాకు పుస్తకాలు చిన్నప్పటి నుంచి ఇష్టం. అయితే సుదీర్ఘంగా చదివే అలవాటు మాత్రం నా ఎం. ఏ. తెలుగు అయిపోయిన తర్వాత. ఏ పుస్తకాలు చదవాలి ఏ పుస్తకాలు చదవకూడదు అనేటువంటి నిబంధన నేను పెట్టుకోకుండా నాకు చేతికి దొరికిన పుస్తకాలన్నిటిని కూర్చుని చదివేవాడిని.
వ్యాసాలు

కొత్త లేబర్ కోడ్స్ ను రద్దు చేసేదాకా పోరాడాల్సిందే

భారత ప్రభుత్వం నవంబర్ 21, 2025 నుండి 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో 4 కొత్త కార్మిక కోడ్‌లను (Labour Codes) అమలులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక కోడ్‌లు (చట్టాలు)(New Labour Codes) ప్రజల్లో కార్మిక లోకంలో పెద్ద చర్చకు దారితీశాయి. కార్మికులు వీటిని "బానిసత్వ చట్టాలు"గా అభివర్ణిస్తుంటే, ప్రభుత్వం ఇవి "వ్యాపార సులభతరం (Ease of Doing Business)" కోసం చేసిన సంస్కరణలని అంటోంది.అయితే ఈ కార్మిక చట్టాలను మనం గమనిస్తే ఇవి కార్మికుల హక్కులను కాలరాస్తూ , యాజమాన్యాలకు పూర్తి అధికారాలను కట్టబెడుతూ కార్మికులను " కట్టు బానిసలుగా" మార్చడానికి
వ్యాసాలు

ఎప్‌స్టీన్ ఫైల్స్ .. వ్యవస్థల పతన గాథ

ఎప్‌స్టీన్‌ ఫైల్స్… సంచలనం కాదు.. వ్యవస్థల శవపరీక్ష!" జెఫ్రీ ఎప్‌స్టీన్‌... ఇది కేవలం ఒక నేరగాడి పేరు కాదు, చట్టాన్ని చుట్టచుట్టి జేబులో పెట్టుకున్న ఒక వికృత వ్యవస్థకు చిహ్నం. ఫిబ్రవరి 2026 నాటికి వెలుగులోకి వచ్చిన 6 మిలియన్ల పేజీల పత్రాలు, మనం గొప్పగా చెప్పుకునే 'నాగరిక లోకం' ముసుగును చీల్చి పారేస్తున్నాయి. ఇవి కేవలం అరాచకాల జాబితా కాదు. అధికారం ఉంటే అమానుషత్వాన్ని కూడా అలంకారంగా మార్చుకోవచ్చని నమ్మే 'ఎలైట్' వర్గాల అంతర్గత డైరీ. ధనం ముందు న్యాయదేవత కళ్లు గంతలు కట్టుకున్న వైనానికి, పెట్టుబడిదారీ సమాజం సృష్టించిన ఈ 'మృగ సామ్రాజ్యం' ఒక నిలువెత్తు
వ్యాసాలు

నాలుగేళ్ల నరమేధం.. ఆగేదెప్పుడు?

2014లో యుక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించున్నాక కూడ రష్యా దురాక్రమణ దాహం తీరలేదు. 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా పెద్ద ఎత్తున దాడి చేసింది. దాంతో యుక్రెయిన్ త‌న శ‌క్తినంతా కూడ‌దీసుకొని ప్ర‌తిఘ‌టించ‌టం ప్రారంభించింది. ఇది 2014 నుండి కొనసాగుతున్న రష్యా  ఆధిప‌త్యానికీ యుక్రెయిన్ ఎదురొడ్డి నిలిచి చేస్తున్న‌ యుద్ధం  తీవ్రతను సూచిస్తుంది. ప్ర‌ధానంగా 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఇటీవ‌లి చరిత్రలో సుదీర్ఘ యుద్ధంగా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలను ఓడించడానికి సోవియట్ యూనియన్‌కు 14 వందల 18 రోజులు పట్టగా, గత నెలలోనే ఆ సమయాన్ని రష్యా-యుక్రెయిన్ యుద్ధం దాటేసింది. అప్పటి