సాహిత్యం కాలమ్స్ కథావరణం

పెత్తనం చలాయించే కర్ర చేతులు మారితే ఆ కథే వేరు!

సాహిత్యంలో చాలా ముఖ్యమైన కథలు అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేయగలిగితే, పాఠకలోకం శ్రద్ధాసక్తులతో తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని కథల్ని వర్గీకరించగలిగితే అందులో తప్పనిసరిగా ఉండాల్సినవి గీతాంజలి  కథలు.  అచ్చవున్న  కథలలో చాలా కథలను చదవకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదన్నది ఆ కథలు చదివిన తక్షణమే అనిపిస్తుంది. సాహిత్య చరిత్రలో భాగంగా గుర్తించి తప్పకుండా  చదవాల్సిన ముఖ్యమైన కథల జాబితా ఒకటి ఇమ్మంటే.. అందులో తప్పనిసరిగా గీతాంజలి కథలుంటాయి. ఎందుకంటే ఈ కథలను చదవటం ఒక  సామాజిక చారిత్రక అవసరం. ఈ కథలను చదవకపోతే పాఠకులకు ఈ కథలలోని జీవితం  మనుషుల సంఘర్షణలు, మనుషుల వ్యక్తిగత అంతర్గత
సాహిత్యం సమీక్షలు

చీకటి నుండి వెలుగు దాకా….

మనం ఇక్కడి దాకా ఎలా చేరుకున్నాం. ఈ చేరుకు దారితీసిన భౌగోళిన, భౌతిక పరిస్థితులకు ఉన్న కార్యాకారణ సంబంధమేమిటి? నూత్న భారతదేశ నిర్మాణంలో భాగమయిన శ్రామికవర్గ సంస్కృతిని ధ్వంసం చేసి మతరాజ్యంగా భారత సమాజం నిర్మిత మవుతున్న చారిత్రక దశను, ఈ కాలంలో జరిగిన, అనేక చారిత్రక అంశాలను, ముఖ్యంగా మతరాజకీయాులను బహు పార్య్వాలలో ఆకార్‌ పటేల్‌ రచన మన 'హైందవరాజ్యం పరిచయం చేసింది. ఒక కాలానికి, భారత పాలకవర్గాల మతసంస్కృతికి, సంబంధించిన విషయం మాత్రమే కాదు. భారత ప్రజాస్వామ్యం మతాంతీకరణ వైపు అడుగులు వేయడానికి బీజాలు పడుతున్నాయనే విషయం తేటతెల్లమవుతున్నప్పుడు, ఇప్పుడున్న భారతదేశంలోని అల్ప్బసంఖ్యాకుల జీవనభద్రత ప్రమాదంలో
వ్యాసాలు

విప‌త్తు అంచులో మాన‌వాళి

పర్యావరణ కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా సమస్యగా మారింది. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పారిశ్రామిక, సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణాలు అవుతున్నాయి.  ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్ , నీటి ఆవిరి  సమతుల్యంగా ఉండాలి.  ఈ సమతుల్యత జల  వలయం సాధారణ వర్షపాతం, జంతువుల  మొక్కల జీవిత చక్రాలకు సహాయపతాయి.   పర్యావరణ సమతుల్యం వన్యప్రాణి మరియు వ్యవసాయానికి  మానవుని అభివృద్ధికి సహాయపడుతుంది.  కాలుష్య కారకాలను  వాతావరణంలో ప్రవేశపెట్టడాన్ని కాలుష్యం  అంటారు. పర్యావరణ కాలుష్యం ప్రధానంగా వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఉష్ణ కాలుష్యం, నేల కాలుష్యం.  వ్యవసాయ గృహ నిర్మాణం అటవీ నిర్మూలనకు దారితీ స్తున్నాయి.
సాహిత్యం వ్యాసాలు

విప్ల‌వ మాన‌వుడు

విప్లవకారులు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధపడడం వల్ల బయట సమాజానికి అజ్ఞాతంలో ఉండి పనిచేసే విప్లవకారులు ఎలా ఉంటారు అనే విషయం అర్థం అయింది. విప్లవకారుల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన కామ్రేడ్‌ ఆర్కే బయట ఉన్న ఆ కొద్ది రోజుల్లోనూ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపపజేశాడని చెప్పవచ్చు. మీడియా ప్రతినిధులు ఆయనను అనేక విషయాల మీద ఇంటర్వ్యూలు చేశారు. ఆయన ప్రతి క్షణం తాను ప్రజల తరుఫున మాట్లాడడానికి వచ్చాననే విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడారని అనిపించింది. ఇంగ్లీషు పత్రికల విలేఖరులు అడిగిన ప్రశ్నలను అనువాదం చేయించుకొని మళ్ళీ తెలుగులోనే జవాబులు చెప్పేవారు. దానివల్ల సామాన్య ప్రజలు కూడా ఆయన
సాహిత్యం కవిత్వం

హత్యలు కాని హత్యలు

ఇంటిమనిషిని కోల్పోయిన నొప్పిలా ఉంది సలుపు చేప ముల్లు గొంతులో దిగితేదవఖానకు పరుగెట్టొచ్చు తూట వెన్నులో దిగితేకుప్పకూలడం తప్ప దారేది తెలియకుండా జరిగినదే కావచ్చుమీ తుపాకులకు గందపు వాసన తప్పకన్నీటి వాసన తెలియదు కడుపుకోతకు గురైన ఇండ్లలోకిమనుషులుగా వెళ్ళి చూడండిగుమ్మాల్లో మనుషులకు బదులుగాదుఃఖాలు గుండెలు బాదుకుంటూఉంటాయి మీకు తెలియకుండా జరిగినదే కావచ్చుజరిగింది ఆస్తినష్టం కాదుప్రాణనష్టం కూలింది కూలీలుకుటుంబాన్ని కాపు కాసే మట్టిగోడలు సాయమందించి చేతులు దులుపుకున్నాకొన్ని ప్రేమలబాకీ ఎవరు తీరుస్తారు కలచివేసే వార్త ఈ రోజు వరకేఅన్ని సర్దుకపోతాయిప్రజలూ మరచిపోతారు రాని తండ్రి కొరకు ...ఓ బిడ్డ ఇంకా తలుపు వద్దబొమ్మను నిద్రపుచ్చుతూ ఎదురుచూస్తోంది ఏ షా దిగివస్తాడుబిడ్డను
సాహిత్యం కవిత్వం

అత‌ను పాల‌పుంత‌

తెల్వకుండానే  పుట్టుక పొలిమేరల్లో చుట్టుకున్న  నాగుపామును ఒల్చేసి చావుదాకా రక్తమాంసల సైద్ధాంతిక నిర్మాణమై చిగుళ్లువేసి వర్గపోరాటమై వెల్గుజిమ్మిన ఒక నూతన మానవుడు ఎర్రదండై అడవి మెడలో ఒదిగి పోయాడు ఒక యుద్ధం లోంచి ఆవిరి లా ఎగిరి వచ్చి బీడుపడిన నేలను జనసంద్రం చేసిన శాంతి మేఘము భూమి యుద్ధ కేంద్ర మైనంత కాలం వొక వాస్తవికత మూసుకున్న తలుపుల మీద చర్చలు నాటిపోయాడు వొక ఆధిపత్య రక్త పాతాన్ని దొర్లించిన సాయుధ విశాల ప్రవాహం లో వాగులు వంకలు పిల్లకాల్వలు  యుద్ధవ్యాపనమౌతున్న అడవి మైదానానికి తుపాకులవంతెనతడు మట్టి మనిషిని కౌగిలించుకొని కాలం ఈ పిడికెడు మట్టే ఉద్యమాలపుట్ట
సాహిత్యం వ్యాసాలు

ఏది సంస్కృతి?

(చలసాని ప్రసాద్‌ 5,6 జనవరి 2008 గుంటూరులో జరిగిన విరసం మహా సభల ప్రసంగ పాఠం పునర్ముద్రణ - వసంతమేఘం టీం) సంస్కృతి అంటే ఏమిటి? నాగరికత అంటే ఏమిటి? కులానికి, సంస్కృతికి సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలు వసంతకాలపు సరస్సులో పద్మాలలాగా నా మనస్సులో వున్నాయి. ఎంత సందేహ పూరితమైన అభిప్రాయాలున్నాయో అంత సమాచారము ఉన్నది, అన్ని ఆలోచనలూ ఉన్నాయి. ఇవన్ని ఈ సందర్భంలో మీతో పంచుకొని ఒక చిన్న ప్రయత్నమే ఇది. సంస్కృతి అనగానే సంఘపరివార్‌ గుర్తుకు వస్తుంది. బిజెపి నాయకుడు వెంకయ్యనాయుడు జాతీయ సంస్కృతిని, సాంస్కృతిక జాతీయ వాదమని చెపుతుంటాడు. అందులో జాతీయవాదమనేది ఒక ప్రత్యేకమైన అంశం.
సాహిత్యం కవిత్వం

నూతన మానవుడు

అస్తమించడమంటే రేపటి సూర్యోదయమే కదా అతడు అస్తమించాడు తుమృకోట తూర్పు గుమ్మంలో పొడిచి చిన ఆరుట్ల చిగురు కొమ్మల్లోంచి జాలువారి గుత్తికొండ నెత్తిమీద మొలిచిన సూర్యుడతడు శాంతి పావురంకు  ప్రజలంటే ఎంత పావురం విద్రోహ పొగమబ్బుల మధ్యనే శాంతి కపోత పతాకమెగిరేశాడు మంజీర సర్కారు జాగీరు మీద నిలబడి జన ఎజెండా జెండా నాటి ప్రజా ఆకాంక్ష వెల్లువల సద్దిమూట పట్టుకెళ్లాడు పంతులు కదాప్రపంచ గమనాన్ని తన వేకువ వెలుగు దారుల్లో చూపించి జనతన సర్కార్ రాస్తా మీదుగా జనాన్ని నడిపించాడు అతని కిరణాలు అరికాళ్ళు నాటిన అడుగుల నిండుగా జగిత్యాల జైత్రయాత్రలు...జంగల్ మహల్ రెపరెపలు... కన్నతల్లుల కడుపుకోత
కాలమ్స్ ఓపెన్ పేజీ

ఏ వెలుగులకు ఆ వెన్నెల?

కళ కళ కోసం కాదు. ఎప్పటి మాట ఇది! ఈ నినాదం వెనక ఎంత పోరాటం! ఈ నినాదం వెంట ఎన్ని త్యాగాలు! కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా గుర్తు చేయాల్సి వస్తోంది. చర్చ మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తోంది. సినిమా పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గతించాడు. ఆయన పని చేసిన రంగంలో తనదైన బలమైన ముద్ర వేసిపోయాడు. దాని గురించి మీడియా ఆలపిస్తూనే ఉంది. దాన్నలా ఉంచితే రచయితగా ఆయనేమిటి, ‘వ్యక్తిగత’ రాజకీయ విశ్వాసాలపరంగా ఆయనేమిటి, ఈ రెండిటినీ కలిపి చూడాలా, వేరువేరుగా చూడాలా అనే ప్రశ్న ముందుకొచ్చింది. ఆయన స్వయంగా ప్రకటించి ఉన్నాడు గనక