ఇంటర్వ్యూ సంభాషణ

భార‌త రాజ్యానికి ఆధునిక స్వ‌భావం లేదు

(రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు, మార్పు గురించి ముమ్మరంగా చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలోవ‌సంత‌మేఘంతో ప్ర‌ముఖ న్యాయ‌వాది, సామాజిక ఉద్య‌మ‌కారుడు వై.కే పంచుకున్న విమ‌ర్శ‌నాత్మ‌క అభిప్రాయాలు మీ కోసం..) 1. రాజ్యాంగాన్ని మార్చాల‌ని కేసీఆర్ అన‌గానే ఇంత ప్ర‌తిస్పంద‌న ఎందుకు వ‌స్తోంది?  రాజ్యాంగాన్ని మార్చాలనడం, సవరించాలనడం - ఈ రెండూ ఒకటి కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను సవరించడానికి ఆర్టికల్‌ ౩68 ద్వారా రాజ్యాంగమే అవకాశం కల్పించింది. అయితే, సాధారణ బిల్లును ఆమోదించటానికి భిన్నంగా రాజ్యాంగ సవరణ చేయటానికి ఒక ప్రత్యేక ప్రొసీజర్‌ను 368లోనే పొందుపరిచారు. ఆ ప్రకారం 107 రాజ్యాంగ సవరణ చట్టాలను ఇప్పటికే పార్లమెంట్‌ ఆమోదించింది. కానీ, కెసిఆర్‌ చెబుతున్న కొత్త
వ్యాసాలు కాలమ్స్ సమకాలీనం

రామానుజుడు-ఆయ‌న స‌మ‌త‌

క్రీశ 1017-1137 మ‌ధ్య జీవించిన రామానుజుడికి ముందే విశిష్టాద్వైతం ఉంది. దాన్ని ఆయ‌న  తాత్వికంగా, ఆచ‌ర‌ణాత్మ‌కంగా వ్య‌వ‌స్థీకృతం చేశాడు. రామానుజుడు రంగం మీదికి వ‌చ్చేనాటికి ఉన్న  చారిత్ర‌క , తాత్విక ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా ఆయ‌న *స‌మ‌తా వాదాన్ని* కీర్తించడం వ‌ల్ల ప్ర‌యోజ‌నం  ఏమీ ఉండ‌దు.  రామానుజుడి విశిష్టాద్వైతానికి ముందు ఆదిశంక‌రుడి అద్వైతం బ‌లంగా ఉండింది.  *బ్ర‌హ్మ స‌త్యం- జ‌గం మిధ్య* అనేది ఆయ‌న ప్ర‌ధాన సిద్ధాంతం. దీన్నుంచే త‌త్వ‌మ‌సి అనే భావ‌న‌ను తీసుకొచ్చాడు.  ప‌ర‌బ్ర‌హ్మ‌వు నీవే. ఈశ్వ‌రుడు, మాన‌వుడు(ఆత్మ‌) వేరే కాదు. రెండూ ఒక‌టే అనేది అద్వైతం.  జ‌గం మిధ్య అన‌డంలోని అద్వైత మాయావాదాన్ని రామానుజుడు అంగీక‌రించ‌లేదు. 
సంపాదకీయం

కవిత్వంలో మాదిగత్వం

ప్రతి కవీ తనదైన సొంత వాక్యాం ఒకటి ఇచ్చిపోతారు. సొంత వ్యక్తీకరణ అప్పగించి పోతారు. ఆ కవి చాలానే రాసి ఉండవచ్చు. చాలానే అచ్చేసి ఉండవచ్చు. కానీ కోర్‌ ఉంటుంది.  దాన్నే పాఠకులు తలచుకుంటారు. విమర్శకులు అంచనా వేస్తారు. మిగతావన్నీ వివరాలే. అవన్నీ చెప్పుకొనేది కోర్‌ను చేరుకోడానికే. అట్లా చూస్తే  కవిగా ఎండ్లూరి సుధాకర్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దళిత కవుల్లో కూడా ఆయనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.  సుధాకర్‌ తొలి సంపుటం ‘వర్తమానం’ 1992లో వచ్చింది. సరిగ్గా 30 ఏళ్ల కింద. ఒకసారి ఆ సంపుటాన్ని పరిశీలిస్తే కవిగా ఎండ్లూరి సుధాకర్‌ రూపొందిన తీరు కనిపిస్తుంది. ఆయనలోని
లోచూపు కాలమ్స్

ప్రగతిశీల శ‌క్తుల ముందుకు చ‌ర్చా  ప‌త్రం

          “సంస్కృతి-మార్క్సిస్టు సాంస్కృతిక సిద్ధాంతం” అనే విర‌సం 28వ మ‌హా స‌భ‌ల సంద‌ర్భంగా పాణి రాసిన  కీనోట్ పేపర్  ఒక అవ‌స‌ర‌మైన  చ‌ర్చ‌లోకి  ప్ర‌గ‌తిశీల శ‌క్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ది.  ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతీ నిర్మాణం గురించి ఆలోచించేవాళ్లంద‌రూ దీన్ని చ‌ద‌వాలి.  ఇందులోని విష‌యాల‌ను  ప‌ట్టించుకోవాలి. ఇందులో ప్ర‌తిపాదిస్తున్న‌విష‌యాల మంచి చెడ్డ‌ల‌ను ప‌రిశీలించ‌డానికి, వాటి శాస్త్రీయ‌త‌ను అంచ‌నా వేయ‌డానికి, వాటిని ముందుకు తీసికెళ్ల‌డానికి త‌ప్ప‌క  చ‌ద‌వాల్సిన పేప‌ర్ ఇది. సకల ప్రగతిశీల పోరాటాల సమన్వయానికి సాంస్కృతిక కోణం అవ‌స‌రం. దానికి సంబంధించిన అనేక  స‌ర‌ళ‌మైన ప్ర‌తిపాద‌న‌లు ఈ ప‌త్రంలో  ఉన్నాయి. కొన్ని ప్ర‌తిపాద‌ల‌న‌కు వివ‌ర‌ణ‌లు కూడా ఉన్నాయి.  సామాజిక ఉత్పత్తి
సాహిత్యం వ్యాసాలు

అస్తిత్వ కవితా ప‌తాక  

‘‘అప్పుడప్పుడూ చావు చింత చీకట్లో కుక్కలా వెంటాడుతుంటుంది’’ ఎండ్లూరి సుధాక‌ర్ మస్తిష్కం బద్దలై ఉబికి వచ్చిన కవిత *చావును చంపండి*.  తన జీవితానికిలా ఈ రకంగా  ముగింపు పలుకుతాడని ఊహించినవాళ్లెవ‌రూ ఉండ‌కపోవచ్చు. అస్తిత్వజెండాని గుండెలనిండా బతుకు పోరాటం చేసిన నిఖార్సైన కవి ఎండ్లూరి సుధాకర్‌. బతుకంటే అతడికి ముమ్మాటకీ యుద్దమే.  ఆధునిక కవిత్వం మల్లెమొగ్గల గొడుగులా కవిత్వపు నీడనిస్తున్న కాలం నుండి రాస్తున్న కవుల్లో తొలిగా దళిత అస్తిత్వ ఉద్యమ కవిత్వాన్ని అక్షరీకరించినవాడు. తన జీవితమంతా ఉద్యమయ్యే సాగింది. కవిత్వాన్ని ఉద్యమానికి ఆయుధంగా వాడినవాడు. బహుశా ఈ కాలపు మహోజ్వలిత దళిత ఉద్యమకారుడు. అతడి కవిత్వం నిండా ఆర్తి,
సంభాషణ

విప్లవోద్యమ వ్యక్తిత్వమే సాకేత్‌

‌అక్టోబర్‌ 14వ తారీఖు భారతదేశ విప్లవోద్యమానికి, విప్లవ శ్రేణులకు, విప్లవ కార్యకర్తలకు అత్యంత దుఃఖదాయకమైన రోజు. ఒక ఆత్మీయుడు, ఒక స్నేహశీలి, ఒక ఓదార్పు, ఒక ఊరట, ఒక నిరాడంబర, నిస్వార్థజీవి,  ఒడిదుడుకుల్లో ఆత్మవిశ్వాసం నింపే ఒక ఆపన్నహస్తం, మచ్చుకైనా కోపతాపాలు ప్రదర్శించని సహన సౌమ్యశీలి, ఒక అన్వేషి, ఒక ఆర్గనైజర్‌, ఒక సైద్ధాంతిక రాజకీయ వ్యూహాకర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రామకృష్ణగా చిరపరిచితుడైన  ప్రియతమ నాయకుడు కామ్రేడ్‌ సాకేత్‌, రామకృష్ణ, శ్రీనివాస్‌ (యస్‌.వి.), గోపాలం మాష్టారు (అక్కిరాజు హరగోపాల్‌) తీవ్రమైన కిడ్నీ జబ్బుతో 2021వ సంవత్సరం అక్టోబర్‌ 14వ తేదీన ఉదయం 6.30 నిమిషాలకు అమరత్వం చెందారు.  
వ్యాసాలు

పోస్కో దారిలోనే జిందాల్ పోక త‌ప్ప‌దు

నేప‌థ్యంః దక్షిణ కొరియా స్టీల్ కంపెనీ పోస్కో కోసం  ఒడిశా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న  వ్యవసాయ భూమిని  రైతులు పోరాడి సాధించుకున్నారు. ఈ పోరాటం ద‌శాబ్దంపైగా న‌డిచింది. సుమారు 3,000 వ్యవసాయ కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి.    ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం అదే భూమిని భారతీయ ఉక్కు కంపెనీకి అప్పగించింది. తిరిగి ఆ ప్రాంతం మళ్లీ నిరసనలు, ఘర్షణల‌తో అట్టుడుకుతున్న‌ది. ఎప్ప‌టిలాగే పోలీసుల క్రూరత్వంతో అల్లకల్లోలమైంది. ధింకియా, నవ్‌గావ్, గడకుజంగా అనే మూడు గ్రామ పంచాయతీల పరిధిలోని ఎనిమిది గ్రామాలలో దాదాపు 20,000 మంది  ఉంటున్నారు. వారిలో  అత్యధికులు షెడ్యూల్డ్ కులాలకు (SC) చెందినవారు. వీరు 60% కంటే
వ్యాసాలు

ప్రజల ప్రజాస్వామ్య ప్రతిఘటనను  దెబ్బతీసేoదుకై   మారణహోమ సైనిక విధానం

బస్తర్ చరిత్ర అంటేనే పోరాటాల చరిత్ర. తమ భూమిని, జీవితాలను, ప్రకృతి వనరులను దోచడమే గాక, తమ స్వీయ గౌరవాన్ని దెబ్బతీసే శక్తులను బస్తర్ తీవ్రంగా ప్రతిఘటించింది. అలాంటి తిరుగుబాట్లలో 1910 లో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన  భూంకాల్ తిరుగుబాటు ఒకటి. గుండాదుర్ అనే ఆదివాసీ నాయకత్వాన ఆదివాసీలు వలసవాదుల అటవీ మరియు ప్రకృతి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. నాటినుండి నేటిదాకా, బస్తర్ లో లభించే అపారమైన ప్రకృతి వనరుల దోపిడీకి వేచి చూస్తున్న దేశ, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాల రక్షణకై ప్రభుత్వo చేస్తున్న సైనికీకరణను, బస్తర్ ప్రజలు సాయుధంగా ఎదుర్కొంటూనే వున్నారు. పూనెం సోమ్లి ఒక
పత్రికా ప్రకటనలు

రైతులను మరిచిన బడ్జెట్

అన్నం పెడుతున్న వ్యవసాయ కుటుంబాలకు “అమృత కాలం “కాదిది వ్యవసాయ రంగానికి  కోతలు విధించిన 2022-2023 కేంద్ర బడ్జెట్  “రైతు కుటుంబాల ఆదాయం రెట్టింపు “లక్ష్యం మరచిన బడ్జెట్ ఇది ఎం‌ఎస్‌పి  చట్టబద్ధతకు ఏ హామీ ఇవ్వని కేంద్ర బడ్జెట్ ని తిరస్కరిద్దామ్ ---------------------------------------------------------------------------------- ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర రైతులకు రైతు స్వరాజ్య వేదిక పిలుపు ---------------------------------------------------------------------------------   వ్యవసాయ ,అనుబంధ రంగాలకు 4.26 శాతం నుండి 3.84 శాతానికి బడ్జెట్ తగ్గింది   పి‌ఎం ఆశా , ఇతర రైతులకు లబ్ధి చేకూర్చే పథకాలకు బడ్జెట్ లో కోత అమానుషం ------------------------------------------------------------------------------ దేశ రైతాంగానికి ఇచ్చిన హామీల
ఇంటర్వ్యూ సంభాషణ

పాత జీతాల కోసం పోరాడాల్సి వ‌స్తోంది

 ( ప్ర‌జాధ‌నాన్ని అనుత్పాద‌క రంగానికే ఎక్కువ‌గా త‌ర‌లిస్తున్నార‌ని, అందువ‌ల్లే ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డం కూడా భార‌మైపోయింద‌ని పీఆర్‌సీ ఉద్య‌మంలో ప‌ని చేస్తున్న డీటీఎఫ్ నాయ‌కుడు కె. ర‌త్నం ఏసేపు అంటున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు మెరుగైన పిఆర్‌సి కోసం  చేస్తున్న ఉద్యమం కార్మికవర్గ సంక్షేమంతో ముడిపడి వుంద‌ని అంటున్నారు. దాదాపుగా నూరు శాతం ఉద్యోగ‌వ‌ర్గాలు ఈ ఉద్య‌మంలో భాగ‌మ‌య్యాయ‌ని ఆయ‌న అంటున్నారు. అయితే గ‌తంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద‌, రైతు ఉద్య‌మం లాంటి వాటి మీద ఉద్యోగ‌, ఉపాధ్యాయ వ‌ర్గాలు క‌లిసి వ‌చ్చి ఉంటే ఇప్ప‌డు పీఆర్సీ పోరాటానికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు దొరికేది. దీన్ని అడ్డంపెట్టుకొనే పాల‌కులు ఉద్యోగుల‌కు వ్య‌తిరేకంగా