ఏనుగుల దాడుల వల్ల పంటల్ని, రైతుల్ని కోల్పోతున్న దేశంలోని అనేక కల్లోలిత ప్రాంతాల్లో రాయలసీమ లోని చిత్తూరు జిల్లా ఒకటి. అటువైపు తమిళనాడు, ఇటువైపు కర్ణాటక మధ్య చిక్కిపోతున్న దట్టమైన అడవులు.అంతకంతకూ అడవుల మధ్య మెరుగవుతున్న రవాణా సౌకర్యాలు.. చదునవుతున్న కొండలు గుట్టలు, మాయమవుతున్న వృక్షసంపద, అడుగంటిపోతున్న చెరువులు, కుంటలు, అడవులకు ఆనుకుని ఉండే పల్లెల్లో ఆహారం కోసం ఏనుగుల రాక వల్ల , తమ ప్రాణాలు కంటే విలువైన పంటలను కాపాడుకోవటానికి రైతులు చేసే పోరాటం, అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ ముఖ్యమంటున్న ప్రభుత్వం, జీవనం కోసం ఏనుగులతో యుద్ధం చేసే పరిస్థితిలో రాయలసీమ రైతాంగం.. ఒక