ఎన్. వేణుగోపాల్, ఇతర ఆలోచనాపరులపట్ల సంఘ్ దురుసు ప్రవర్తనను ఖండిద్దాం.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ చివరిరోజు వీక్షణం స్టాల్లో అమ్మకానికి పెట్టిన ఓ పుస్తకం విషయంలో ఆ స్టాల్ నిర్వాహకుడు, వీక్షణం సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ పట్ల ఆర్ఎస్ఎస్ వ్యక్తుల దురుసు ప్రవర్తనను విప్లవ రచయితల సంఘం ఖండిస్తోంది. "తిరుపతి బాలాజీ బుద్ధ క్షేత్రమే" అనే ఆ పుస్తకాన్ని.. మన గతం పట్ల ఎరుకను పెంచడంలోభాగంగా ప్రచురించిన సమాంతరకు, అనువాదకుడు ఎ.ఎన్.నాగేశ్వరరావుకు అండగా తెలుగు సమాజం నిలబడాలని కోరుతున్నాం. బహుళత్వ విలువలను సాహిత్యంలో బలంగా ప్రతిపాదిస్తున్న మెర్సీ మార్గరేట్, స్కైబాబా వంటి రచయితలు తమ భావాల కారణంగా తరచూ వేధింపులకు గురవుతున్నారు. తన సంపాదకత్వంలో "ఉచ్చల జలధి తరంగ" పేరుతో కవితా