భూ బకాసురులు
పల్లవి:ఊరూర వెలిసారురన్నో…భూ బకాసురుల గుంపురన్నో…బీదోడు బతికితే భయమంటూభూములన్నీ మింగేస్తారురన్నో!లేచి రా… ఎదిరించరా…నీ హక్కుకోసం గర్జించరా!ఈభూమి మన అమ్మలాంటిది రా తరాలరక్తంతో కాపాడుకున్నదిరా!!చరణం 1:బలం లేదంటే బలిచేస్తారురాపేదోడ్ని చూసి పండుగ చేసుకుంటారురాతాతల పత్రాలు చూపిస్తారురాతరతరాల చెమటను దోచేస్తారురా!రాత్రికిరాత్రే సరిహద్దు మార్చినిన్ను నీ నేలకే పరాయివాడ్ని చేసిఊరంతా మాదేనంటూఉచ్చులెన్నో వేస్తారురన్నో!చరణం 2:దీనుల ఇళ్లు… పొలాలపై కన్నేసిదేవుని మాన్యాలూ దోచేస్తారురావాగుల్ని, వంకల్ని మింగేస్తూవేల కోట్ల రాజులై తిరుగుతారురా!ఖబరిస్తానైనా… ఖరీదైన స్థలమైనా…ప్లాట్ల మాఫియా పేరిటకబ్జాల రాజ్యం నడిపిస్తారురాకన్నీటి గాధలు రాస్తారురా!చరణం 3:అన్నదమ్ముల మధ్య అగ్గి రాజేసితల్లి పిల్లల్ని వీధికొదిలేలా చేసిధనబలం మదంతో రెచ్చిపోయిదౌర్జన్యాలే ధర్మమంటారురా!ఎదురు నిలిస్తే కేసులంటారునిజం మాట్లాడితే బెదిరిస్తారుకానీ ప్రజా గళం మోగిందంటేపర్వతాలైనా









