ఓపన్ పేజ్

భారత ప్రజాయుద్ధానికిఎల్లెలెరుగని సంఫీుభావం

ప్రపంచంలో ఎక్కడున్నా ప్రజల ఆకాంక్షలు కలుస్తాయి. మానవాళి  స్పందనలు ఉమ్మడి రూపం ధరిస్తాయి. ఒకే హృదయంలోంచి వ్యక్తమవుతాయి. చరిత్ర నిర్దేశించే లక్ష్యాలను విశాలమైన చూపులతో మారుమూలల నుంచి కూడా పోగు చేసుకుంటాయి.  విశ్వాసాలు, విలువలు, ప్రయోజనాలు భౌతిక రూపం ధరిస్తాయి. న్యాయాన్యాయ వైఖరులు ఎల్లప్పుడూ మానవీయత వైపే  నిలబడతాయి. లేకపోతే పాలస్తీనా అస్తిత్వం కోసం ప్రపంచమంతా  ఒకే గొంతుగా ఎట్లా ప్రతిధ్వనిస్తుంది? రక్తసిక్త  బస్తర్‌ అంతర్జాతీయ చైతన్యంగా ఎట్లా ప్రతిఫలిస్తుంది? దేశాల, సమూహాల ఉనికిని దురాక్రమిస్తున్న మార్కెట్‌కు, యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన ఎందుకు వెల్లువెత్తుతుంది? బాధితులకు ఈ ప్రపంచమంతా సంఫీుభావం ఎందుకు అందిస్తుంది? పాలస్తీనాలాగే బస్తర్‌ కూడా ఇవాళ
ఓపన్ పేజ్

దృశ్యంలోని అర్థాలు

ఢల్లీ కంటే గన్నవరమే అపురూపమట. చాల మందికి అట్లా అనిపించింది. అంతే మరి. రాజుకంటే రాజును నిలబెట్టినవాడే ఘనుడు.  భూస్వామ్యంలో ఇది చెల్లుబాటవుతుందా? ప్రజాస్వామ్యంలోనే సాధ్యం. తరచూ ప్రజాస్వామ్యం సాధించే విజయం ఇదే. జూన్‌ 12వ తేదీ ప్రమాణ స్వీకార వేదిక మీద కనిపించినంత ఆహ్లాదంగా చంద్రబాబు అంతకముందెన్నడూ కనిపించలేదని ఎవరో అన్నారు. నరేంద్రమోదీ కూడానట. వేదిక మీద ఆ ఇద్దరూ  ఎన్ని ముచ్చట్లు కలబోసుకున్నారో. ఎంతగా  చిరునవ్వులు చిందించారో. అధికార ప్రదర్శన తప్ప మరేమీ తెలియని ప్రధాని మమతానురాగాలను ఎంతగా ప్రకటించాడో. తాను ఒక్కడే తప్ప మరెవరినీ పక్కన భరించలేని వ్యక్తి అంత మంది మధ్య ఎంత
ఓపన్ పేజ్

‘ఇతరుల’ గురించి మాట్లాడలేమా?

మనుషుల స్పందనలు బహు విచిత్రం.  ఎప్పుడు దేన్ని పట్టించుకుంటారో.  ఏ విషయంలో  మౌనంగా ఉంటారో. దేన్ని తప్పించుకొని జాగ్రత్తగా తిరుగుతారో. చెప్పడం అంత సులభం కాదు. ఆరోపించీ లాభం లేదు. దీన్నంతా ఇష్టా ఇష్టాలుగా తేల్చవచ్చా? ఉద్దేశాలకు, రాజకీయాలకు మాత్రమే ఆపాదించవచ్చా? చైతన్యం గీటురాయి మీద పరీక్షించవచ్చా? సాంస్కృతిక స్థాయిగా కూడా చూడవచ్చా? ఇట్లా ఎన్ని చెప్పుకున్నా ఎంతో కొంత  మిగిలే ఉంటుంది. దీనికి చాలా కారణాలే ఉంటాయి. సమాజం యావత్తూ స్పందించడం సరే. అక్కడ చాలా సంక్లిష్టతలు పని చేస్తుంటాయి. స్పందనకూ మౌనానికీ  జటిలమైన కారణాలు ఉంటాయి. కానీ సమాజ కంఠస్వరంగా వినిపించే వాళ్ల మాటలనూ, మౌనాన్నీ