ఎరుకల కథలు

ధర్నా

"ఇదంతా అయ్యేపని కాదులేన్నా" నిష్ఠూరంగా అన్నాడు గోపాల్. గోపాల్ మాటలకు బదులు చెప్పే ప్రయత్నం చెయ్యలేదు రమణ. అతడికి ముప్పై ఐదేళ్లుంటాయి. సన్నగా పొడవుగా ఉన్నాడు. అతడి తల్లోంచి చెమట కారిపోతోంది. ఎడమచేతికి వున్న వాచీకేసి రోడ్డుకేసి మాటిమాటికి తలతిప్పి చూస్తున్నాడు. అతడి కళ్లు చురుగ్గా వున్నాయి. మొహం ప్రశాంతంగా వుంది. ఎంఆర్ఓ ఆఫీసు ముందు జనం గుంపు చేరిపోయారు. ఎండ చుర్రుమంటోంది. ఉదయం పదకొండు గంటలవుతున్నా ఎంఆర్ఒ జాడలేదు. ఆఫీసులో సిబ్బంది కూడా పలుచగా ఉన్నారు.కొన్ని సీట్లు ఖాలీగా కనపడుతున్నాయి.ఒక ఉద్యోగి దినపత్రికని తల పైకెత్తకుండా శ్రద్ధగా చదువుకుంటున్నాడు. అతడి ముందు బిక్క మొహంతో ఒకామె నిలబడి
ఎరుకల కథలు

దేనికీ భయపడొద్దు

“ దీన్ని టీ అంటారా ?  ” మొగిలప్ప గొంతు మెత్తగా వుంది. పైకి గట్టిగానే  అంటున్నట్లున్నా  ఆ గొంతులో ఏదో కోపం, ఉక్రోషం, నిరసన ఉన్నాయి,  కానీ అంతగా గట్టిగా మాట్లాడలేక పోతున్నాడు.ఆ  గొంతులో ఏదో మొహమాటం, బెరుకు. నాకు చప్పున అర్థం కాలేదు. కానీ నేను ఆలోచించే లోపే మొగిలప్ప గొంతు సవరించుకుని  బెరుగ్గా  “ స్టీల్ గ్లాస్ లోనే టీ  ఇవ్వు రెడ్డీ , వేడిగా  వుంటుందని ఎన్నోసార్లు చెప్పింటా.  అయినా నువ్వు ఆ ప్లాస్టిక్ కప్పులోనో , పేపర్ కప్పులోనో ఇస్తావు. టీ అస్సలు తాగినట్లే వుండదు రెడ్డీ ..  ” అంటున్నాడు
ఎరుకల కథలు

ప్రయత్నం

దుర్గమ్మ గుడి ముందు  -  ఇందిరమ్మ ఎస్.టి. కాలనీలో ఆరోజు గ్రామసభ జరుగుతోందని, ఒకరోజు ముందే దండోరా కొట్టడం వల్ల, జనం అక్కడ గుమిగూడి పోయారు.మధ్యాహ్నం మూడు దాటింది. ఎండ చుర్రుమంటోంది. ఆ పంచాయతీలో ఉపాధిహామీ పనుల్ని పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్ రమణ వేపచెట్టు నీడలో చాపపరిచి కూర్చుని ఉన్నాడు. రెండు పాతచాపలు  ఒకదాని పక్కన ఒకటి పరచబడి ఉన్నాయి. ఆ రెండు చాపల చుట్టూ నాలుగు ఇనుప కుర్చీలు, రెండు ప్లాస్టిక్ కుర్చీలు పహారా కాస్తున్నట్లు ఉన్నాయి. చాపపైన తెల్లకాగితాలు, గ్రామసభ రిజిష్టరు, హాజరు పట్టిక, ఇంక్ ప్యాడ్, ప్లాస్టిక్ సంచిలో కొన్ని అర్జీలు రమణ ముందుపేర్చబడ్డాయి.
ఎరుకల కథలు

అదే ప్రశ్న

ఆ ఇంటిముందు నిలబడి ఇల్లు అదేనా కాదా అన్నట్లు పరీక్షగా చూసింది కమలమ్మ. వేణుగోపాలస్వామి గుడివీధి, మల్లెపూల పందిరిల్లు, రెండంతస్థుల ఆకుపచ్చని  పాత బిల్డింగు. సుభద్రమ్మ చెప్పిన గుర్తులన్నీ సరిపోయాయి. అయినా లోపలికి వెళ్లాలంటే ఒక్కక్షణం భయమేసింది. కాళ్లకేదో అడ్డం పడుతున్నట్లు అనిపించింది. మొహమాటంగా బెరుగ్గా అనిపించింది.మళ్ళీ తనే  ధైర్యం తెచ్చుకుంది. కదలకపోతే ఆగిపోయేది తన జీవితమే అని గుర్తు తెచ్చుకుంది.ఇల్లు ఇంట్లో ఆకలితో సగం చనిపోయినట్లు, ఒంట్లో రక్తమే లేనట్లు నిస్తేజంగా కనిపించే పిల్లల మొహాలు గుర్తుకు వచ్చేసరికి ఒక్క ఉదుటున ముందుకే కదిలింది. మనుషులు ఎట్లున్నా ముందుకు వెళ్లాల్సిందే, వెళ్లకపోతే ఎట్లా కుదురుతుంది ? ముగ్గురు
ఎరుకల కథలు

అన్నం పెట్టినోల్లని ..

పలమనేరులో  ఆరేడు కళ్యాణమండపాలున్నాయి.అన్నీ కొత్త పేటలోనే వున్నాయి. పాతపేటలో ఒకప్పుడు ఒక చిన్న సత్రం వుండేది, కానీ ఏవో గొడవలు, కోర్టు కేసుల వల్ల అది మూతబడింది. ఇప్పుడిక ఎవరిదైనా పెండ్లి అంటే కొత్తపేటకు వెళ్లాల్సిందే. నాలుగో నెంబరు జాతీయ రహదారి  దాటాల్సిందే. వంటమాస్టర్ ఎరుకల కపాలిని కలవాలంటే మాత్రం ఎవరైనా  పాతపేటలోని ఎస్టీ కాలనీకి రావాల్సిందే.!  కపాలి వుండేది ఎస్టీ కాలనీలోనే. ఆ మనిషి కోసం పెద్ద పెద్దోళ్ళు రోడ్డు దాటి, వీధులు దాటి ఎస్టీ కాలనీలోకి వస్తారు. మేం ఒకప్పుడు వాళ్ళ ఇండ్లల్లోకి పోలేని వాళ్ళమే అయినా,  ఇప్పుడు మా జాతోడు చేసే వంటలు అందరూ
ఎరుకల కథలు

“మా తప్పు ఏంది సామీ ?”

“ అశోకు వచ్చిoడాడా ? వాడి  గురించి ఏమైనా తెలిసిందా అబ్బోడా? “  యస్టీ కాలనీ లోకి అడుగుపెట్టి  దుర్గమ్మ   గుడిపక్కలోకి తిరిగి నిలబడితే చాలు, బోరింగు పక్కలోo చి ఎప్పుడూ ఒక పలకరింపు మీకు వినపడుతుంది. ఆ గొంతులో వణుకు, భయం, ఆదుర్దా ప్రేమ , ఆశ అన్నీ కలగలసిపోయి మీకు వినిపిస్తాయి.గుడిలోంచి వచ్చే పిలుపు కాదు అది. గుడి పక్కనే ఒక మొండిగోడల  సగం ఇల్లు మీకు కనపడుతుంది. పైన రేకులతో కప్పబడిన పాత ఇల్లు. తలుపు సగం ఊడిపోయి ఎప్పుడూ మూయాల్సిన అవసరం లేనట్లు వుంటుంది.బయటే నులకమంచం పైన ఒక సగంమనిషి  కూర్చునో ,
కథలు ఎరుకల కథలు

అమరజీవి మా కాంతమ్మత్త !

అనుకుంటాం కానీ, అందరికీ ఆ భాగ్యం  దక్కదు. ఆమె చనిపోయినప్పుడు ఆమె పాడె  వెనుక మూడు ట్రాక్టర్లు కదిలాయి. వాటినిండా రంగురంగుల పూలహారాలే. ” అదీ సావంటే. పుణ్యాత్మురాలు. నిద్రలో నవ్వతా నవ్వతానే పోయింది, ఏమి జనం, ఏమి జనం! ఇంత మంది యాడాడి నుంచి  వచ్చిoడారో ?.ఆ మనుషులేమి? ఆ పూలహారాలేమి? ఏమి జనం, సావు కూడా పెళ్లి లాంటిదంటే ఇట్లాంటిదేనేమో. ” అని జనం నోర్లు నొక్కుకున్నారు.  ఇంకో మాట కూడా అనేశారు   "ఎరికిలోలల్లో  ఏ సావుకైనా పై కులమోల్లు, బయట కులాలోల్లు ఇంత మంది వచ్చిండేది ఎప్పుడైనా చూసినారా ? అదీ కాంతమ్మంటే!   ” 
ఎరుకల కథలు

“ఆయమ్మ అంతే! ఆమె ఒక  మదర్ తెరీసా!”

మా నాయన చెమటలు కార్చుకుంటా  గసపోసుకుంటా సాయంత్రమో రాత్రో ఇంటికి వస్తాడు. ఊసురోమని   ఆయన ఇల్లు చేరే టయానికి సరిగ్గా మా అమ్మ ఎప్పుడూ ఇంట్లో ఉండదు. పగలని లేదు రాత్రని లేదు, ఎవరు ఎప్పుడొచ్చి  “ జయమ్మక్కా... ఏo చేసేది  ఇప్పుడిట్లా అయిపోయిందే ..ఇప్పుడింక నాకు నువ్వే దిక్కు. ఏం చేస్తావో, యెట్లా చేస్తావో నీ ఇష్టం అక్కా ..” అని  ఏడిస్తే చాలు, ఆయమ్మ అంతగా కరిగి పోతుంది. మాయమ్మ ముక్కుపుల్ల, ఉంగరం, కమ్మలు ఎప్పుడూ ఎవరికోసమో కుదవలోనే(తాకట్టు)  వుంటాయి. ఆ మూడూ కలిపి   ఆయమ్మ వేసుకుంది మాత్రం మా కళ్ళతో మేం మా చిన్నప్పుడు  
ఎరుకల కథలు

“పదకొండు నెలల జీతగాడి కత”

(ఎంత చెప్పినప్పటికీ ఎంతగా చెప్పుకున్నప్పటికీ చెప్పుకోవాల్సిన జీవితాలు కొన్ని ఇంకా చీకట్లోనే ఉండిపోతాయి, మిగిలిపోతాయి. అలా చీకట్లో ఉండిపోయిన జీవితాల్లోని దుఃఖాలు నవ్వులు ఉద్వేగాలు సంతోషాలు ఆ కులం వాళ్లని మాత్రమే కాదు,  మనసున్న ఎవరైనా కదిలిస్తాయి, కలవరపెడతాయి, కన్నీళ్లు తెప్పిస్తాయి, నవ్విస్తాయి. ఆ దుఃఖ భాష తెలిసినప్పుడు, మనసుతో విన్నప్పుడు ఆ కతలను ఇంకా చదవాలనిపిస్తుంది,ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. గిరిజనులు రాసిన గిరిజన జీవన వ్యథలను చదవడం ఎవరికైనా ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. సాహిత్య విమర్శా వ్యాసాలు రాసే*కవి,కథకుడు,నవలాకారుడు పలమనేరు బాలాజీ (49)తన జాతి కతలను, వ్యథలను ఇక్కడ పంచుకుంటున్నారు. ఈ సంచిక నుండే ఎరుకల