3 thoughts on “అరుణతార మే 2022

  1. 16-11-2022
    ✊✊
    మా సత్యం
    అరుణతార మే -2022 లో వైష్ణవశ్రీ గారి
    కవితలు
    ‘ఉన్మాదానికి
    ఓ రంగుంటుంది!’
    ‘యుద్ధాన్ని
    ప్రేమించొద్దు’
    చదివి.
    వైష్ణవిశ్రీ కవిత్వంలో శక్తివంతమైన పద చిత్రాలు దృశ్య శక్తిగా మారి పాఠకుల ముందు కనిపిస్తున్నట్లు ఫీల్ అవుతాం.
    బ్రష్టరాజకీయాలు వెయ్యి కాళ్ళతో వినాశనం వైపు పరిగెడుతున్న హిందూ మతోన్మాద చర్యల పట్ల, జాతిదుస్థితిని, శిధిల వ్యవస్థ యొక్క విషాద స్వరూపాన్ని తాత్విక దృష్టితో మానవఔన్నత్యాన్ని ధ్యేయంగా పెట్టుకుని కవితావిష్కరణ లో అక్షరబద్ధం చేసింది.
    ప్రజా కవి కాళోజి అన్నట్లు
    ” ఒక సిరా చుక్క లక్ష మెదడులకు పదును పెడుతుందన్నారు.”
    ప్రతి కవితా పంక్తి లోను,ప్రతి అక్షరం లోను ఆమె విశ్వజనీన హృదయం ప్రతిఫలిస్తూ ఉంటుంది. సునిశితమైన విమర్శ ప్రతిఫలిస్తుంది.
    అక్షరాలని ఆయుధాలుగా చేసుకొని చైతన్య యుద్ధం చేయడానికి సన్నద్ధమైన కవియిత్రి. వినూత్న భావాలతో పాటు ప్రతి పదాన్ని చైతన్యోద్దీప్తం చేయగల నేర్పు వైష్ణవశ్రీది.
    ఉద్యమభివందనాలు.

  2. 15-11-2022
    ఇంపార్టెంట్
    ✊✊
    మా సత్యం
    పాణి గారు రాసిన
    ఇన్కే తాక్వల్ లడాయి
    మన కాలపు మహత్తర పోరాటం
    సిలింగేర్ చదివా.
    పై పరిశీలనాత్మక వ్యాసం.
    ” సిలింగేర్” చదువుతున్నప్పుడు
    ఆర్ఎస్ రావు గారు రాసిన ‘కొత్తచూపు’ లోని వాక్యాలు
    ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి.
    “పాలక వర్గం కంటే ప్రజలే గొప్పవారు. తరతరాలుగా పోరాటాలు చేస్తూ వస్తున్నారు.
    ఎన్నో బాధలు అనుభవించారు.
    వారి చరిత్ర నుండి మనం కూడా పోరాటాలు చేయవచ్చనే స్ఫూర్తి.
    బాధలను అనుభవించ
    వచ్చనే స్ఫూర్తి మనకు లభించడం గర్వకారణం.
    ప్రజా పోరాటాలు చరిత్రను ముందుకు నడుపుతున్నాయి.
    కొత్త సమాజాన్ని నిర్మించే సంస్కృతి ప్రజలది.
    సామాన్యుడెప్పుడూ పోరాటంలోనే ఉంటాడు.”
    పాణి గారు రాసిన ఈ ‘ సిలింగేర్ ‘ లడాయిలో అంతర్లీనంగా వ్యక్తమవుతోంది.
    కొత్త చూపుతో
    సిలింగేర్ ఉద్యమ మూలాలను, నేపథ్యాన్ని కాలానుగుణంగా సరికొత్త వ్యూహముతో జరుగుతున్న మార్పును అధ్యయనం చేస్తు అంతర్లీనంగా దాగి ఉన్న ఒక మహత్తర పోరాటాన్ని నేటి ఉద్యమ తరానికి మరింత శక్తివంత నిర్మాణానికి ‘సిలింగేర్’
    ఉద్యమ నేపథ్యం ఒక నమూనా. విశ్లేషణలో ఎన్నో తార్కిక తాత్విక ప్రశ్నలు మన ముందు కదలాడుతూ ఉంటాయి.
    నక్సల్ బరి వెలుగులో భారత విప్లవోద్యమం నిర్మిస్తున్న నూతన చరిత్రలో భాగంగా నూతన మానవుడు ప్రత్యామ్నాయ సంస్కృతిని ఏర్పరచుకుంటూ జనతన సర్కారుతో విప్లవ మార్గంలో పోరాడుతూ విస్తరిస్తోంది.
    కొత్త దశలలో ఉద్యమిస్తున్న సిలింగేర్ ఉద్యమ పరిణామాలను గతితార్కిక చారిత్రక భౌతిక వాదం విశ్లేషణా సంవిధానముతో
    (historical dialectical materialism point of view తో) సామాజిక, ఆర్థిక,రాజకీయ, సంస్కృతిక, వైజ్ఞానిక, సాంకేతిక, సైనిక,మేధోపరమైన పరిణామాలను
    సిలింగేర్ ప్రజల ఆకాంక్షలనూ పరిశీలనాత్మకంగా/ సద్విమర్శనాత్మకంగా విశ్లేషించి గ్రంథస్తం చేశారు. వారి మేధో పరిశోధనలో చర్చ తార్కికం, తాత్విక అన్వేషణతో తప్పుడు ప్రచారాలను బహిర్గతం చేయడం ఒక రకంగా చెప్పాలంటే సత్యాన్ని వెలికి తీసే సోక్రటిక్ టెక్నిక్ (పద్ధతి.)
    గతి తార్కికంగా పరిశీలించినట్లయితే
    గతి తార్కిక పద్ధతికి అర్థం ఏమిటి?
    చారిత్రక భౌతిక వాదం, ఎప్పటికప్పుడు కొత్త చారిత్రకానుభవం నుంచీ, సామాజిక విజ్ఞాన శాస్త్రాల పరిశోధనా ఫలితాల నుంచీ సాధారణ నిర్ధారణలను గ్రహిస్తూ ఎప్పటికప్పుడు తనను తాను అభివృద్ధి చేసుకుంటూ ఉంటుందని.
    ఈ సందర్భంగా
    1846లో మార్క్స్ – ఎంగిల్స్ రాసిన
    జర్మన్ ఐడియాలజీ లోని వాక్యాలు గుర్తుచేస్తూ…
    ” ఒక కొత్త సమాజాన్ని దర్శించడానికి తగినట్టుగా తనను తాను రూపొందించుకోవడం కేవలం విప్లవంలో మాత్రమే సాధ్యమవుతుంది.” అన్నారు
    నిజమే!
    ప్రపంచ దృక్పథమైన
    మార్క్సిస్టు-లెనినిస్టు -మావోయిజం తత్వశాస్త్రం సైద్ధాంతిక పునాదికావడమే
    ఈ సిలింగేర్ రచనకు కారణం.
    సిలింగేర్ ప్రజల పోరాటపు లక్ష్యాలనూ, పద్ధతులనూ శాస్త్రీయంగా వివరించారు.
    ప్రత్యక్ష ఉద్యమ కార్యాకలాపాల చేత మిగతా ఇతర ప్రాంతాలకు చైతన్యం కలిగిస్తూ నిరంతరాయంగా అభివృద్ధి చెందుతూ, ఉద్యమాభివృద్ధికి సంబంధించిన దశల పరంపరలో సిలింగేర్ ప్రతి ఒక్కదశా అంతకు పూర్వపు దశకన్న మరింత విస్తృత ప్రభావ జనకమూగా రూపొందుతోంది. నూతన అవగాహనను కలిగిస్తూ సవాలక్ష సంక్లిష్ట సమస్యలకు అది నూతన వివరణలను ఇచ్చింది.
    భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి ఒక ప్రేరణాత్మకమైన రాజీపడని ఉద్యమ నిర్మాణానికి తోడ్పడుతుంది.
    పాణి గారు
    యుద్ధ ప్రతిపాదికన గత సంవత్సరం నుంచి జరుగుతున్న సిలింగేర్ ఉద్యమ రూపాన్ని రాజకీయ, సామాజిక,ఆర్థిక, సాంస్కృతిక, మతపరమైన, వైజ్ఞానిక, సాంకేతిక, మేధోపరమైన,
    సైనిక పరిణామాలన్నీ
    సిలింగేర్ ఉద్యమ చరిత్రలో భాగమే.
    నిష్పాక్షిక దృష్టితో గతి తార్కిక చారిత్రక భౌతికవాద దృష్టితో పరిశీలనాత్మకంగా విశ్లేషించి భావితరాలకు చరిత్రను గ్రంథస్థం చేశారు.
    సిలింగేర్ పోరాటం జల్, జంగల్, జమీన్ విముక్తి కోసం అత్యంత ధైర్య సాహసాలతో పోరాటాన్ని నిర్మిస్తున్న /విస్తరిస్తున్న ఆదివాసి ఉద్యమాలపై కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వం క్రూరమైన నిర్బంధాన్ని ప్రయోగించి
    అణచివేస్తున్న క్రమంలో మౌలికమైన ప్రజా సమస్యలపై ప్రజలను సంఘటితం చేస్తూ ప్రజలు అజేయులని చరిత్ర తేల్చేసిన సత్యాన్ని నిరూపిస్తూ వారి విశ్వాసాలు ఆచరణాత్మక జ్ఞానంమై సిలింగేర్ ప్రజల పోరాటం శక్తివంతమై 30 గ్రామాలలో అభివృద్ధి అవుతూ మును ముందుకే పోతుంది.
    జనతన సర్కార్ ఛాయలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి.
    ‘స్టాండ్ విత్ బస్తర్ ‘
    నినాదం భారతదేశంలో నలుమూలల ప్రతిధ్వనిస్తూ కొనసాగుతుంది.
    పెట్టుబడిదారీ ఆధునికీకరణను దాటి విప్లవాత్మక పరివర్తన వైపు అణచివేయబడిన వారి పోరాటంలో నుంచి MLM ప్రభావిత విశ్లేషణను పాణి వ్యక్తపరిచాడు.
    విముక్తి కోసం పోరాటం తప్పనిసరిగా రెండు దశలను కలిగి ఉండాలని పాణి నొక్కిచెప్పారు: అణచివేత స్వభావంపై ప్రతిబింబం, ఆపై దానిని మార్చడానికి ఖచ్చితమైన చర్య.
    అణచివేతకు గురైన వారి కోల్పోయిన మానవత్వాన్ని తిరిగి పొందేందుకు మరియు పూర్తి మానవీకరణను సాధించడానికి అణచివేతకు గురైన వారికి పోరాడటానికి సహాయపడటానికి పాణి చేసిన ప్రయత్నం. మానవీకరణ అనే భావన గురించిన జ్ఞానాన్ని పొందడం ప్రారంభించి, అణచివేతకు గురైన వారు తమ మానవత్వాన్ని తిరిగి పొందగల దశలను
    పాణి వివరించారు.
    ఈ సందర్భంగా 1967లో చేగువేరా అన్న మాటలు గుర్తు చేసుకుంటూ
    ” గెలిచినా ఓడినా
    శత్రువుపై చేసిన యుద్ధాలు”.
    సిలింగేర్ ఉద్యమ స్వరూపాన్ని
    సవి మర్శక వాస్తవికతతో (critical realism-క్రిటికల్ రియలిజం), సామ్యవాద వాస్తవికత
    (సోషలిస్టు రియలిజం)
    గతి తార్కిక చారిత్రక భౌతిక వాద దృష్టితో అవగాహన చేసుకుని ప్రయోగాత్మక దృష్టితో స్వామ్యవాద వాస్తవికతతో భాగం చేస్తూ సమాజంలోని అన్యాయాలను, అసమానతలను, ఆర్థిక సామాజిక వ్యత్యాసాలను,
    సవిమర్శకంగా హేతుబద్ధంగా ఖండిస్తూ గ్రంథస్తం చేయడం
    ఇందులో వాస్తవికత, స్వామ్యవాద వాస్తవికతకు స్పష్టమైన భేదాన్ని పరిశీలిస్తే స్పష్టమైన భావిని ప్రతీకగా చిత్రించారు.
    వర్గ సమాజంలో విమర్శన చేపట్టి ఉద్యమ చారిత్రక పరిణామాలను విశ్లేషిస్తూ జన జీవితము లోకి చొచ్చుకొని పోయి స్పష్టమైన భావిని సామ్యవాద వాస్తవికతను ప్రతీకగా ప్రతిఫలింప చేశారు.
    మార్క్సిజం ఒక శాస్త్రం.
    తిరోగామి భావాల సంస్కృతికి సంస్కరణ వాదానికి ఇందులో తావు లేదు.
    సాయుధ పోరాటం ద్వారానే సామ్యవాద వ్యవస్థ సాధ్యమనే విశ్వాసం అంతర్లీనంగా
    చదివే పాటకుల్లో తెలియజేస్తుంది.
    నక్సలబరి వెలుగులో సిలింగేరి ఉద్యమం ఎన్నో ఆటుపోటుల మధ్య ఇవాళ మరింతగా విస్తరించినందువల్ల
    ఈ ఉద్యమ స్ఫూర్తిని అందుకోవాల్సిన వాళ్లకు, స్వీకరించాల్సిన వాళ్లకు
    ఈ పుస్తకం చాలా అవసరం.
    ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఎంతో ఉద్వేగానికి, ఆవేశానికి గురవుతాము. గత పోరాటాల కంటే చాలా పరిణతితో, దీర్ఘకాలిక దృష్టితో, తప్పొప్పుల పై నిర్మొహమాటమైన స్వీయ విమర్శతో, విప్లవ ప్రజాస్వామిక పోరాటాల స్ఫూర్తితో పురోగమిస్తూ అంతిమ విజయం సాధిస్తామనే వాస్తవిక అవగాహనతో సాగుతున్నట్లు స్పష్టమవుతుంది.
    భారత రాజ్య యంత్రం అత్యంత దుర్మార్గంగా విభిన్న రూపాలలో ప్రజా పోరాటాలను అణచివేస్తుంది. అణచివేస్తున్నప్పటికీ నిత్య చైతన్య పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా
    దీర్ఘకాలిక ప్రజా యుద్ధ
    పంథాకు ప్రతీక.
    మోడీ ప్రభుత్వ 2014 ప్రారంభం నుండి అంధకార పర్వంతో రక్తసిక్తమై కొనసాగుతోంది.
    సుస్థిర నీతి నియమాలు శిథిల మయ్యాయి, శాంతి నీతి ధర్మ సంస్కారాలు విధ్వంసం అయ్యాయి, అయినా, హిందూ కాలకూట కాషాయ మతోన్మాద హింసోన్మాదాన్ని ఎదుర్కొంటూ ఒక నూతన సమాజ నిర్మాణం గురించిన స్వప్నాలను సాధించడానికి దృడ సంకల్పంతో పోరాడుతూనే ఉన్నారు.
    సీలింగేర్ ఉద్యమ నిర్మాణంలో నిరంతరాయమైన ప్రణాళిక బద్ధమైన పోరాటం స్థానికంగా, ఇతర ప్రాంతాల ప్రజల్ని ప్రభావితం చేస్తూ నిస్వార్ధంగా, నిబ్బరంగా, ముందుకు వెళుతున్నాయి.
    విప్లవ ప్రతీఘాత పాలక సేనల సైనిక వలయంలో ఉన్నప్పటికీ దాడులను సమర్థవంతంగా విరోచితంగా ఎదుర్కొని పోరాడడం వారి యొక్క మహత్తర ధైర్యాన్ని స్వార్థరహిత్యాన్ని ప్రదర్శించారు. విశ్వాసాలకి నిదర్శనం.
    సోషలిజం, కమ్యూనిజం అంటే ఏమిటో, వర్గ చైతన్య పూరిత,నూతన సమాజాన్ని నిర్మించే పోరాట మార్గాలు ఏమిటో, నూతన సమాజాన్ని నిర్మించే పోరాట కార్యాచరణ ఆచరణలో చూపిస్తున్నాయి.
    సీలింగేర్ విప్లవం యూనాడు ఆచరణాత్మక అంశం అవుతోంది.
    భారత పాలకులు మావోయిస్టు పార్టీపై/ ఆదివాసి ప్రజలపై కొనసాగిస్తున్న యుద్ధం
    సామ్రాజ్యవాద స్వభావానికి చిహ్నం.
    ప్రపంచ పెట్టుబడిదారులతో, దేశీ పెట్టుబడి దారులతో
    సామ్రాజ్యవాద దేశాలతో కుదుర్చుకున్న రహస్యం ఒప్పందం. నేటి దుర్వివేక, దుస్సంస్కార, దురాచార ,దుర్వివాద,
    దుర్వేష, దుర్భాష,
    దోష దూషితులగు హిందూ ఉగ్ర మతోన్మాద పాలకులకు వ్యతిరేకంగా రాజీలేని పోరాట నిర్మాణంతో ముందుకు పోదాం.
    లాంగ్ లీవ్ ఇండియన్ రెవల్యూషన్

  3. 15-11-2022
    ఇంపార్టెంట్
    ✊✊
    మా సత్యం
    పాణి గారు రాసిన
    ఇన్కే తాక్వల్ లడాయి
    మన కాలపు మహత్తర పోరాటం
    సిలింగేర్
    పై పరిశీలనాత్మక వ్యాసం.
    ” సిలింగేర్” చదువుతున్నప్పుడు
    ఆర్ఎస్ రావు గారు రాసిన ‘కొత్తచూపు’ లోని వాక్యాలు
    ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి.
    “పాలక వర్గం కంటే ప్రజలే గొప్పవారు. తరతరాలుగా పోరాటాలు చేస్తూ వస్తున్నారు.
    ఎన్నో బాధలు అనుభవించారు.
    వారి చరిత్ర నుండి మనం కూడా పోరాటాలు చేయవచ్చనే స్ఫూర్తి.
    బాధలను అనుభవించ
    వచ్చనే స్ఫూర్తి మనకు లభించడం గర్వకారణం.
    ప్రజా పోరాటాలు చరిత్రను ముందుకు నడుపుతున్నాయి.
    కొత్త సమాజాన్ని నిర్మించే సంస్కృతి ప్రజలది.
    సామాన్యుడెప్పుడూ పోరాటంలోనే ఉంటాడు.”
    పాణి గారు రాసిన ఈ ‘ సిలింగేర్ ‘ లడాయిలో అంతర్లీనంగా వ్యక్తమవుతోంది.
    కొత్త చూపుతో
    సిలింగేర్ ఉద్యమ మూలాలను, నేపథ్యాన్ని కాలానుగుణంగా సరికొత్త వ్యూహముతో జరుగుతున్న మార్పును అధ్యయనం చేస్తు అంతర్లీనంగా దాగి ఉన్న ఒక మహత్తర పోరాటాన్ని నేటి ఉద్యమ తరానికి మరింత శక్తివంత నిర్మాణానికి ‘సిలింగేర్’
    ఉద్యమ నేపథ్యం ఒక నమూనా. విశ్లేషణలో ఎన్నో తార్కిక తాత్విక ప్రశ్నలు మన ముందు కదలాడుతూ ఉంటాయి.
    నక్సల్ బరి వెలుగులో భారత విప్లవోద్యమం నిర్మిస్తున్న నూతన చరిత్రలో భాగంగా నూతన మానవుడు ప్రత్యామ్నాయ సంస్కృతిని ఏర్పరచుకుంటూ జనతన సర్కారుతో విప్లవ మార్గంలో పోరాడుతూ విస్తరిస్తోంది.
    కొత్త దశలలో ఉద్యమిస్తున్న సిలింగేర్ ఉద్యమ పరిణామాలను గతితార్కిక చారిత్రక భౌతిక వాదం విశ్లేషణా సంవిధానముతో
    (historical dialectical materialism point of view తో) సామాజిక, ఆర్థిక,రాజకీయ, సంస్కృతిక, వైజ్ఞానిక, సాంకేతిక, సైనిక,మేధోపరమైన పరిణామాలను
    సిలింగేర్ ప్రజల ఆకాంక్షలనూ పరిశీలనాత్మకంగా/ సద్విమర్శనాత్మకంగా విశ్లేషించి గ్రంథస్తం చేశారు. వారి మేధో పరిశోధనలో చర్చ తార్కికం, తాత్విక అన్వేషణతో తప్పుడు ప్రచారాలను బహిర్గతం చేయడం ఒక రకంగా చెప్పాలంటే సత్యాన్ని వెలికి తీసే సోక్రటిక్ టెక్నిక్ (పద్ధతి.)
    గతి తార్కికంగా పరిశీలించినట్లయితే
    గతి తార్కిక పద్ధతికి అర్థం ఏమిటి?
    చారిత్రక భౌతిక వాదం, ఎప్పటికప్పుడు కొత్త చారిత్రకానుభవం నుంచీ, సామాజిక విజ్ఞాన శాస్త్రాల పరిశోధనా ఫలితాల నుంచీ సాధారణ నిర్ధారణలను గ్రహిస్తూ ఎప్పటికప్పుడు తనను తాను అభివృద్ధి చేసుకుంటూ ఉంటుందని.
    ఈ సందర్భంగా
    1846లో మార్క్స్ – ఎంగిల్స్ రాసిన
    జర్మన్ ఐడియాలజీ లోని వాక్యాలు గుర్తుచేస్తూ…
    ” ఒక కొత్త సమాజాన్ని దర్శించడానికి తగినట్టుగా తనను తాను రూపొందించుకోవడం కేవలం విప్లవంలో మాత్రమే సాధ్యమవుతుంది.” అన్నారు
    నిజమే!
    ప్రపంచ దృక్పథమైన
    మార్క్సిస్టు-లెనినిస్టు -మావోయిజం తత్వశాస్త్రం సైద్ధాంతిక పునాదికావడమే
    ఈ సిలింగేర్ రచనకు కారణం.
    సిలింగేర్ ప్రజల పోరాటపు లక్ష్యాలనూ, పద్ధతులనూ శాస్త్రీయంగా వివరించారు.
    ప్రత్యక్ష ఉద్యమ కార్యాకలాపాల చేత మిగతా ఇతర ప్రాంతాలకు చైతన్యం కలిగిస్తూ నిరంతరాయంగా అభివృద్ధి చెందుతూ, ఉద్యమాభివృద్ధికి సంబంధించిన దశల పరంపరలో సిలింగేర్ ప్రతి ఒక్కదశా అంతకు పూర్వపు దశకన్న మరింత విస్తృత ప్రభావ జనకమూగా రూపొందుతోంది. నూతన అవగాహనను కలిగిస్తూ సవాలక్ష సంక్లిష్ట సమస్యలకు అది నూతన వివరణలను ఇచ్చింది.
    భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి ఒక ప్రేరణాత్మకమైన రాజీపడని ఉద్యమ నిర్మాణానికి తోడ్పడుతుంది.
    పాణి గారు
    యుద్ధ ప్రతిపాదికన గత సంవత్సరం నుంచి జరుగుతున్న సిలింగేర్ ఉద్యమ రూపాన్ని రాజకీయ, సామాజిక,ఆర్థిక, సాంస్కృతిక, మతపరమైన, వైజ్ఞానిక, సాంకేతిక, మేధోపరమైన,
    సైనిక పరిణామాలన్నీ
    సిలింగేర్ ఉద్యమ చరిత్రలో భాగమే.
    నిష్పాక్షిక దృష్టితో గతి తార్కిక చారిత్రక భౌతికవాద దృష్టితో పరిశీలనాత్మకంగా విశ్లేషించి భావితరాలకు చరిత్రను గ్రంథస్థం చేశారు.
    సిలింగేర్ పోరాటం జల్, జంగల్, జమీన్ విముక్తి కోసం అత్యంత ధైర్య సాహసాలతో పోరాటాన్ని నిర్మిస్తున్న /విస్తరిస్తున్న ఆదివాసి ఉద్యమాలపై కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వం క్రూరమైన నిర్బంధాన్ని ప్రయోగించి
    అణచివేస్తున్న క్రమంలో మౌలికమైన ప్రజా సమస్యలపై ప్రజలను సంఘటితం చేస్తూ ప్రజలు అజేయులని చరిత్ర తేల్చేసిన సత్యాన్ని నిరూపిస్తూ వారి విశ్వాసాలు ఆచరణాత్మక జ్ఞానంమై సిలింగేర్ ప్రజల పోరాటం శక్తివంతమై 30 గ్రామాలలో అభివృద్ధి అవుతూ మును ముందుకే పోతుంది.
    జనతన సర్కార్ ఛాయలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి.
    ‘స్టాండ్ విత్ బస్తర్ ‘
    నినాదం భారతదేశంలో నలుమూలల ప్రతిధ్వనిస్తూ కొనసాగుతుంది.
    పెట్టుబడిదారీ ఆధునికీకరణను దాటి విప్లవాత్మక పరివర్తన వైపు అణచివేయబడిన వారి పోరాటంలో నుంచి MLM ప్రభావిత విశ్లేషణను పాణి వ్యక్తపరిచాడు.
    విముక్తి కోసం పోరాటం తప్పనిసరిగా రెండు దశలను కలిగి ఉండాలని పాణి నొక్కిచెప్పారు: అణచివేత స్వభావంపై ప్రతిబింబం, ఆపై దానిని మార్చడానికి ఖచ్చితమైన చర్య.
    అణచివేతకు గురైన వారి కోల్పోయిన మానవత్వాన్ని తిరిగి పొందేందుకు మరియు పూర్తి మానవీకరణను సాధించడానికి అణచివేతకు గురైన వారికి పోరాడటానికి సహాయపడటానికి పాణి చేసిన ప్రయత్నం. మానవీకరణ అనే భావన గురించిన జ్ఞానాన్ని పొందడం ప్రారంభించి, అణచివేతకు గురైన వారు తమ మానవత్వాన్ని తిరిగి పొందగల దశలను
    పాణి వివరించారు.
    ఈ సందర్భంగా 1967లో చేగువేరా అన్న మాటలు గుర్తు చేసుకుంటూ
    ” గెలిచినా ఓడినా
    శత్రువుపై చేసిన యుద్ధాలు”.
    సిలింగేర్ ఉద్యమ స్వరూపాన్ని
    సవి మర్శక వాస్తవికతతో (critical realism-క్రిటికల్ రియలిజం), సామ్యవాద వాస్తవికత
    (సోషలిస్టు రియలిజం)
    గతి తార్కిక చారిత్రక భౌతిక వాద దృష్టితో అవగాహన చేసుకుని ప్రయోగాత్మక దృష్టితో స్వామ్యవాద వాస్తవికతతో భాగం చేస్తూ సమాజంలోని అన్యాయాలను, అసమానతలను, ఆర్థిక సామాజిక వ్యత్యాసాలను,
    సవిమర్శకంగా హేతుబద్ధంగా ఖండిస్తూ గ్రంథస్తం చేయడం
    ఇందులో వాస్తవికత, స్వామ్యవాద వాస్తవికతకు స్పష్టమైన భేదాన్ని పరిశీలిస్తే స్పష్టమైన భావిని ప్రతీకగా చిత్రించారు.
    వర్గ సమాజంలో విమర్శన చేపట్టి ఉద్యమ చారిత్రక పరిణామాలను విశ్లేషిస్తూ జన జీవితము లోకి చొచ్చుకొని పోయి స్పష్టమైన భావిని సామ్యవాద వాస్తవికతను ప్రతీకగా ప్రతిఫలింప చేశారు.
    మార్క్సిజం ఒక శాస్త్రం.
    తిరోగామి భావాల సంస్కృతికి సంస్కరణ వాదానికి ఇందులో తావు లేదు.
    సాయుధ పోరాటం ద్వారానే సామ్యవాద వ్యవస్థ సాధ్యమనే విశ్వాసం అంతర్లీనంగా
    చదివే పాటకుల్లో తెలియజేస్తుంది.
    నక్సలబరి వెలుగులో సిలింగేరి ఉద్యమం ఎన్నో ఆటుపోటుల మధ్య ఇవాళ మరింతగా విస్తరించినందువల్ల
    ఈ ఉద్యమ స్ఫూర్తిని అందుకోవాల్సిన వాళ్లకు, స్వీకరించాల్సిన వాళ్లకు
    ఈ పుస్తకం చాలా అవసరం.
    ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఎంతో ఉద్వేగానికి, ఆవేశానికి గురవుతాము. గత పోరాటాల కంటే చాలా పరిణతితో, దీర్ఘకాలిక దృష్టితో, తప్పొప్పుల పై నిర్మొహమాటమైన స్వీయ విమర్శతో, విప్లవ ప్రజాస్వామిక పోరాటాల స్ఫూర్తితో పురోగమిస్తూ అంతిమ విజయం సాధిస్తామనే వాస్తవిక అవగాహనతో సాగుతున్నట్లు స్పష్టమవుతుంది.
    భారత రాజ్య యంత్రం అత్యంత దుర్మార్గంగా విభిన్న రూపాలలో ప్రజా పోరాటాలను అణచివేస్తుంది. అణచివేస్తున్నప్పటికీ నిత్య చైతన్య పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా
    దీర్ఘకాలిక ప్రజా యుద్ధ
    పంథాకు ప్రతీక.
    మోడీ ప్రభుత్వ 2014 ప్రారంభం నుండి అంధకార పర్వంతో రక్తసిక్తమై కొనసాగుతోంది.
    సుస్థిర నీతి నియమాలు శిథిల మయ్యాయి, శాంతి నీతి ధర్మ సంస్కారాలు విధ్వంసం అయ్యాయి, అయినా, హిందూ కాలకూట కాషాయ మతోన్మాద హింసోన్మాదాన్ని ఎదుర్కొంటూ ఒక నూతన సమాజ నిర్మాణం గురించిన స్వప్నాలను సాధించడానికి దృడ సంకల్పంతో పోరాడుతూనే ఉన్నారు.
    సీలింగేర్ ఉద్యమ నిర్మాణంలో నిరంతరాయమైన ప్రణాళిక బద్ధమైన పోరాటం స్థానికంగా, ఇతర ప్రాంతాల ప్రజల్ని ప్రభావితం చేస్తూ నిస్వార్ధంగా, నిబ్బరంగా, ముందుకు వెళుతున్నాయి.
    విప్లవ ప్రతీఘాత పాలక సేనల సైనిక వలయంలో ఉన్నప్పటికీ దాడులను సమర్థవంతంగా విరోచితంగా ఎదుర్కొని పోరాడడం వారి యొక్క మహత్తర ధైర్యాన్ని స్వార్థరహిత్యాన్ని ప్రదర్శించారు. విశ్వాసాలకి నిదర్శనం.
    సోషలిజం, కమ్యూనిజం అంటే ఏమిటో, వర్గ చైతన్య పూరిత,నూతన సమాజాన్ని నిర్మించే పోరాట మార్గాలు ఏమిటో, నూతన సమాజాన్ని నిర్మించే పోరాట కార్యాచరణ ఆచరణలో చూపిస్తున్నాయి.
    సీలింగేర్ విప్లవం యూనాడు ఆచరణాత్మక అంశం అవుతోంది.
    భారత పాలకులు మావోయిస్టు పార్టీపై/ ఆదివాసి ప్రజలపై కొనసాగిస్తున్న యుద్ధం
    సామ్రాజ్యవాద స్వభావానికి చిహ్నం.
    ప్రపంచ పెట్టుబడిదారులతో, దేశీ పెట్టుబడి దారులతో
    సామ్రాజ్యవాద దేశాలతో కుదుర్చుకున్న రహస్యం ఒప్పందం. నేటి దుర్వివేక, దుస్సంస్కార, దురాచార ,దుర్వివాద,
    దుర్వేష, దుర్భాష,
    దోష దూషితులగు హిందూ ఉగ్ర మతోన్మాద పాలకులకు వ్యతిరేకంగా రాజీలేని పోరాట నిర్మాణంతో ముందుకు పోదాం.

Leave a Reply