హక్కులు వచ్చాయని
ఆనందపడే వాళ్ళు
అరడజను అయితే..
హక్కంటే ఏంటో
తెలియక పూట తింటే
మారు కూటికి లేనోల్లు 94 మంది..
ప్రజలను పాచికలు చేసి
ఆడిన ఈ చదరంగంలో
హక్కుల కాలరాసేవాడు “రాజకీయనాయకుడ”య్యాడు
వాటి కోసం గొంతు చించేవాడు
“రాజకీయ ఖైదీ” అయ్యాడు
ఇదే గణతంత్రం
నేటికి ఈ ఘనమైన “తంత్రం”
ఏంటో అర్థం కాక బలి పశువైతున్నది మనమే..
చీకటి నిండిన
ఈ మాయాజాలం లో
నక్షత్రాల వెలుగు వచ్చేదెప్పుడో..!
(72 ఏండ్ల గణ”తంత్ర” రాజ్యం పై)