కవిత్వం

నీళ్ళు, అడవి, భూమి…

(జల్, జంగల్, జమీన్) సర్కార్ చుట్టరికం ఇప్పుడు నదులతో లేదు, నక్శా లతో ఉన్నదిఅక్కడ నీళ్ళు ప్రవహించవుసత్యమని నమ్మించే పటం మీద గీసిన రేఖలతో ఉన్నది పర్వతాలు ఔన్నత్యంతో కాదుఖనిజాల నిధులుగా మారినవి ఆరావళీ ఛాతీ మీద నడుస్తున్న యంత్రం ఏదో ప్రాచీన శోక గీతం వలెధ్వనిస్తున్నది.కానిప్రజల బాంధవ్యం ఇంకా తెగిపోలేదు ఇప్పుడు కూడ ప్రజలునదిని అమ్మా అంటారు వృక్షాలతో సంభాషిస్తారు మట్టిని తమ నుదుటిమీదఅలంకారంగా దిద్దుకుంటారుప్రకృతిపై వాళ్ళ విశ్వాసం మూఢ విశ్వాసం కాదుఅది ఇతిహాసం అది ప్రతి ఎండాకాలం తర్వాత ఒక పత్రహరితమై తిరిగి వస్తుందినగరం మనల్ని నాగరీకుల్ని చేస్తుందని అంటారు ఎప్పటిదాకా మా ఊపిరితిత్తుల్లో అడవి
కవిత్వం

చివరి వారెవరు?

అతడొక్కడేమిగిలి వున్నాడాఇంకెవరూ లేరనినీ ప్రకటన చూసిసముద్రం నవ్వుకుంటుందిజీవితం నీకు ఆగిపోవచ్చుఅక్కడనుండే మరలమేము మొదలవుతాంచరిత్ర నువ్వుతలకిందులుగా చదువుతావునీ చరిత్ర మట్టిలో కూరుకుపోయేకుళ్ళిన శవం మాత్రమేమేము చరిత్ర నిర్మాతలంమా పేజీలన్నీ నెత్తుటిరేఖలతో లిఖింప పడుతూచిరస్మరణీయమవుతాయిజనం ప్రభంజనమయ్యేరోజు మరల మొదలవుతోందిఅరణ్యం పచ్చగాచిగురిస్తోందినదులన్నీ ప్రవహిస్తూనే వున్నాయిపర్వత సానువలన్నీనిటారుగా నిలబడే వున్నాయిసూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడువెన్నెలా విరగబూస్తోందినువ్వనుకుంటావుఓడిపోయింది తల్లి పేగానిఆ చివరి విలుకాడు నుండిపెల్లుబికి వెళ్లువెత్తేయుద్ధ భేరీ నాదంనీ గుండెలను చీల్చుతుందికాలం మరల మరలతిరిగి తిరిగిముందుకే నడుస్తుందిఇదిసత్యం చెప్పిన మాటఅతడు తిరిగి కొండబారిడివరి కంకులలో గింజ కడుతున్నాడుచీకటి కొండల్లో దాచినబర్మారులో గంధకందట్టించి వస్తున్నాడుమహేంద్ర గిరులలోనుంచినియాంగిరి పర్వత సానువులనుండినలుదిక్కులా ప్రవహిస్తున్నారుఅతడుచివరి వాడూ కాదుఆమెచివరిదీ కాదుఇది ఓటమీ కాదునీది గెలుపూ
కవిత్వం

చీమలు

వాళ్లకు చీమలు సంఘటితంగావడం ఇష్టముండదు అవి రాజకీయాలమీద,సమాజం మీద మాట్లాడడమూ ఇష్టముండదు చీమలు పుట్టేది రాణిగారి గుడ్లనూ , ఆహారాన్నీమోయడానికేనని వాళ్ళ నిశ్చితాభిప్రాయం నిస్సందేహంగా చీమల ధిక్కార భాష అంటే వాళ్లకు పరమద్వేషం కాబట్టి చీమలు చేయి దాటి పోతున్నట్టనిపిస్తే వాళ్లు కాళ్ళ కింద తొక్కేస్తారు
కవిత్వం

నా పేరు ప్రతిఘటన!

విను! నాకు చదవడం వచ్చు! నేను రాస్తాను కూడా! నేను ఏ దుస్తులు ధరించాలో నాకు నేనుగా నిర్ణయించుకుంటాను! మీ అపహాస్యం , అరుపులు ,వెక్కిరింతల మధ్య నేను దృఢమైన సింధూర వృక్షంలా నిలబడతాను అదిగో స్కూలు బెల్లు మోగుతుంది వెళ్ళాలి!*నువ్వు ద్వేషాన్ని కక్కుతావు ! నేను బలాన్ని నాటుతాను ! నువ్వు గేట్లు మూసేస్తావు! నేను నా హక్కుల్ని గుంజుకుంటాను! చూడబోతే నీకు నా స్నేహితులు ఎవరో కూడా తెలియదులా ఉంది! *. నేను కళ్ళు మిరుమిట్లు గోలిపే కాంతిని! రక్తాలు కారుతున్నా నేను లేచి మళ్ళీ నిలబడతాను!నేను మరణించాక మళ్ళీ పుట్టే ఫీనిక్స్ పక్షిని కాదు
కవిత్వం

ఏప్రిల్ 1, 2026

ఏ మట్టి పొత్తిళ్ళలోంచి కన్ను తెరుస్తుందో విత్తనం మళ్ళీ ఆ మట్టిలోకే చేరుతోంది ఏదన్నా మట్టిలోకి ఒరిగిపోవడమంటే మాయమైపోవడం కాదు పోటెత్తే అశ్రుధారా సముద్రమంతా పైకి కనబడని గాయాలనుండి తొణికే కన్నీటి బొట్లే అమ్మ గుండెల్లోంచి పట్టిన పాలవలే కన్నీళ్ళన్నీ కూడా చిక్కటి రక్తమేకన్నీళ్ళతో మట్టి, చిత్తడి మత్తడిగా తడిచిన తర్వాతే తురాయిపూలు ఎర్ర రంగు పులుముకున్నాయి ఆకలేసినవాడికి అన్నం మెతుకులు పండాయి ఆశలకి ఆధారం దొరికిందిచెట్లను కూల్చేయడమంటే అడవి మాయమైపోవడం కాదు కొమ్మల వేల చేతుల్నెత్తి పిల్లల్ని చంకనెత్తుకునే తల్లులందరూ మట్టిలోంచే మళ్ళీ మళ్లీ పుడతారు గుట్టల్ని లోయల్ని జల్లెడపట్టిన డ్రోన్లకి ధాన్యపు కంకుల్లా పుట్టే మట్టి
కవిత్వం

కలల అల్లిక

ఓ కామ్రేడ్ ఎలా చనిపోతాడో అడుగొద్దుభూమి నుండి చెట్టును వేరు చేసినట్టు ఇంటి నుండి గుంజుకుపోయి గాలీ, వెలుతురూ చొరబడని చోటఅండాసెల్లో బందీచేస్తారు క్రమంగా రాజ్యం చెట్టులోని జీవాన్నంతాపీల్చి పిప్పిజేస్తుంది వాళ్లు చెట్టును చంపగలరేమో గాని ఆయన కలం నుండి చక్రాలకుర్చీ లోని చక్రాలనుండిపుట్టుకొచ్చే వేలాది వేర్లనెలా తెంపగలరుఓ కామ్రేడ్ మృతి పట్ల సంతాపం వద్దు.ఓచెట్టు తన ఆకుల్ని బూరలు చేసివిజయ గానాలు వినిపిస్తూనే ఉంటుందియుద్ధమాగదుసాయికి మరణం లేదు **
కవిత్వం

భూమి నవ్వుతోంది

ఇది దుఃఖం ఒరుపుతోగుండె కరిగిపోయే కాలం కదావారి గురి పాఠశాలలపైనేఎందుకు ఉంటుందోఒకమారు ఆలోచించామాపసిగుడ్డుల యెగిరిపడినమాంసపు ముద్దల మధ్యవాళ్ళు ఆకలిని తీర్చుకునేపాలకులయ్యారుఇది ఆయిల్కోసమో గ్యాస్ కోసమోజరుగుతున్న యుద్ధం కాదుతమకెదురు నిలిచిన జాతినిసమూలంగా నాశనం చేసే కుట్ర కదాఏ మూల తలెత్తి నిలబడినా ప్రశ్నించే మనుషుల హృదయాలనుచీల్చే యుద్ధ పిపాసుల దాహమిదిమధ్య ప్రాచ్యం నుండిమధ్య భారతం వరకు కురిసిన బాంబులవెనక దాగిన నిజం కదాద్రోహమొక్కటే వారికికనుచూపుగా మారిందిగుండె జారిన మనుషులనుచూపుతూ రేపు లేదనివెలుగు రాదనీఆకాశాన్ని ఆక్రమించామనిమిడిసి పడుతున్నారుభూమి నవ్వుతూబద్ధలైన దేహంలోంచిమొలకేత్తే చిగురునుప్రసవిస్తోంది...
కవిత్వం

పిల్లల ప్రాణాలే – యుద్ధం ఖరీదు

పాఠశాల గడియారం మోగాల్సిన వేళఆకాశం ఎందుకు అగ్నిగుండాల్ని కురిపించింది?పుస్తకాల మధ్య కూర్చున్న పిల్లలుఏ యుద్ధానికి శత్రువులయ్యారు?చిన్న చేతుల్లో పెన్సిల్ ఉండటంఎవరికి అంత ప్రమాదమైందీ?మీ యుద్ధాలకు సరిహద్దులు ఉంటాయంటారు,మ్యాప్‌ల మీద గీతలు గీస్తారు.అయితే చెప్పండిపిల్లల ఛాతీల మీద పడిన బాంబులుఏ సరిహద్దు దాటాయి?ఏ గెలుపు కోసం ఈ చిన్న ప్రాణాలు చెల్లించాయి?ఇప్పుడు ఆ నేల మీదబ్యాగులు పడి ఉన్నాయి, పుస్తకాలు పడి ఉన్నాయికానీ వాటిని మోసే చేతులు లేవుఅమ్మల అరుపులు మాత్రమే ఉన్నాయిమీ యుద్ధాల అసలు శబ్దం అదే కదా?దేశాలు గెలిచామని గొప్పలు చెప్పుకోండి,జెండాలు ఎగరేయండి, ప్రసంగాలు చేయండి.కానీ చరిత్ర మాత్రం ఇలా రాస్తుందిమీ విజయాల పునాదిపిల్లల సమాధుల మీదే
కవిత్వం

పాలకులు

పాలకులు శాంతికాముకులు యుద్ధంలో సంధి కోసం స్కూల్ పిల్లల శవాలకు చుట్టిన తెల్లటి వస్త్రాన్నిశాంతి కేతనంలా ఎగరేస్తారు పాలకులు మానవతావాదులుప్రపంచ ప్రజల మనసుల్లో మానవత్వాన్ని వెలిగించటం కోసం మనుషుల శవాలకు నిప్పంటిస్తారు పాలకులు నిర్మాతలు వందేళ్ల నిర్మాణాలన్నీటినిపునాదుల నుండి కూల్చేసి అందమైన శూన్యాన్ని నిర్మిస్తారు పాలకులు దయార్ద్ర హృదయులు పాల కోసం ఏడుస్తున్న పిల్లాడి నోటికి తండ్రి గుండె తెగి కారుతున్న రక్తాన్ని తాగమని డబ్బాలో నింపిస్తారు ఆకలని అరుస్తున్న చిన్నారి చేతికి అమ్మ శరీరం నుండి తెగిపడిన మాంసాన్ని తినమని అన్నం ముద్దలా అందిస్తారు రెండు నిమిషాలు మౌనం పాటించి స్కూల్ అసెంబ్లీలో ప్రార్ధన గీతంలాపిల్లల చావు
కవిత్వం

నా నేల నిమ్మలంగుంటే బాగుండు…

నా నేలమీద చావుల సాగు చేస్తున్నరు...కత్తులతో దున్ని శవాల విత్తులేస్తున్నరు...వేళకి నెత్తుటి వాన మస్తు కురుస్తుంది...పైరుకి బాంబుల ఎరువులు చల్లుతున్నరు...అయినా ఏ మొక్కై మొలవాల్నో తెల్వక విత్తులు భూమి పొత్తిళ్ళలోనే దాక్కున్నయ్...కుప్పలు తెప్పలుగా విత్తులు పోగైతనే ఉన్నయ్...నెత్తుటి వాన కుండపోతగా కురుస్తనే ఉంది... కన్నీటి కాలువల కన్న బిడ్డల శవాలనేరుకుంటున్నరు కొందరు...నెత్తుటి వాసనని అత్తరు వాసనలా అస్వాదిస్తున్నరు కొందరు...ఎవడి గెలుపోటముల కోసమో ఈ ఆటలు...గెలిచాకా ఎవడు జరుపుకుంటరో ఆ గెలుపు సంబరాలు....ఏ దిక్కుమాలిన దేహంలో పుట్టిందో ఈ నీతిమాలిన సాగు చేయాలనే ఆలోచన...ఆ ఆలోచనని ఎవరు బొందపెడుతరో...ఆ ఆలోచన పుట్టిన దేహం ఎప్పుడు దహనమైతదో...ఆ విత్తులకి శక్తులొచ్చి చావుల