సంస్మరణ

ఇలాంటి వారు నిర్మిస్తున్న విప్లవోద్యమం వెనకడుగు వేస్తుందా?

(దండకారణ్యంలో జరుగుతున్న మారణ హోమం గురించి ఆదివాసీ మహిళ కుమ్మే నాతో ఇలా సంభాషించడం మొదలు పెట్టింది. ఆమె మాటలు లోకమంతా వినాల్సినవి.  దండకారణ్యం గురించి, విప్లవోద్యమం గురించి, అందులో అమరులైన వీరుల గురించి నాకు చెప్పింది.  అందులో గొప్ప జీవితానుభవం ఉంది.  జ్ఞానం ఉంది. విప్లవాచరణ ఉంది. చాలా మామూలు జీవితం నుంచి వచ్చి విప్లవకారులై అమరులైన తీరు వివరించింది.  ఆమె ఏమంటున్నదో వినండి... ఓ కార్యకర్త) మేం ఆదివాసులం. అడవులే మా ప్రాణం. మా అడవులలో చాలా కాలంగా శాంతి కరువైంది. ఇపుడు ఎటు చూసినా మా అడవులలో ఖాకీలే దర్శనమిస్తున్నారు. ఎందుకో తెలియదు. అడవిలో
సంస్మరణ

చల్లగరిగె పదునెక్కిన తీరు

చల్లగరిగె వీరుడు కా. సుధాకర్‌ అమరత్వం తర్వాత ఆయన డైరీ సహచరులకు దొరికింది. అందులో ఆయన వేర్వేరు సందర్భాల్లో రాసుకున్న నోట్స్‌ ఆధారంగా వాళ్లు ఈ రచన చేశారు.  ఇందులో సుధాకర్‌ తన మార్గదర్శి విజేందర్‌ దగ్గరి నుంచి ఎన్నో అద్భుత విషయాలు రాసుకున్నాడు. క్రాంతికారీ జనతన సర్కార్ల గురించి, ఇవాళ దండకారణ్యమంతా సాగుతున్న ప్రజాస్వామిక పోరాటాల గురించి, ఎన్నికల గురించి సుధాకర్‌ లోతైన పరిశీలనలను ప్రస్తావిస్తూ ఆయన ఉద్యమ సహచరులు ఈ నివాళి వ్యాసం రాశారు.. - వసంతమేఘం టీం ఏప్రిల్‌ 16 నాడు ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లా ఆదివాసుల అడవిలోని ఆపటోల గ్రామం వద్ద తన
సంస్మరణ

తల్లీ కొడుకుల మరణానంతర తలపోత

 ప్రజా యుద్ధంలో ఉన్న ఆ కొడుక్కు తల్లి మరణవార్త ఎప్పటికో తెలిసింది. ఆ విషాదాన్ని, దాని చుట్టూ ఉన్న సొంత అనుభూతులను, విప్లవోద్యమ అనుభవాలను కలిసి ఆ కొడుకు ఈ వ్యాసం రాసి వసంత మేఘానికి పంపాడు. కానీ ఇది మాకు చేరి ప్రచురించేనాటికి ఆయన కూడా అమరుడయ్యాడు. ఆ తల్లి భీమరాజు. ఆ కొడుకు చీమల నర్సయ్య అలియాస్‌ జోగన్న. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బయ్యారం. ఆపరేషన్‌ కగార్‌లో ఏప్రిల్‌ 30, 2024 న అబూజ్‌మాడ్‌ (టేకెమెట) ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు. నిరుపేద దళితురాలైన ఆ తల్లి కన్నగచాట్లుపడి పెంచి పెద్ద చేసుకున్న కొడుకు విప్లవంలోకి వెళ్లాక ఆమె
సంస్మరణ

కవీ, అతని తల్లీ ‘మాటకు మాట మధ్య’

అజ్ఞాత అమర కవి సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ ఈనెల 24వ తేదీ మందమర్రిలో చనిపోయింది.  విప్లవకారులందరి తల్లుల్లాగే  కొడుకు జీవించి ఉన్నంత వరకు అతని కోసం నిరీక్షణా భారాన్ని అనుభవించింది. అతని మరణానంతరం బిడ్డ తలపోత వ్యథతో జీవించింది. విప్లవంలోకి వెళ్లే పిల్లల వ్యక్తిత్వంతో ప్రభావితమైన తల్లుల్లాగే ఈమె కూడా కొడుకు మీది ప్రేమలో విప్లవాన్ని చూసుకున్నది. ఆ ఎడబాటుతో, అనారోగ్యంతో ఆమె వెళ్లిపోయింది.  సత్యనారాయణ విప్లవోద్యమంలో ఎన్ని పేర్లతో పని చేశాడోగాని అతని రచన సంపుటితో ‘పునరంకితం’ సత్యనారాయణగా అజరామర గుర్తింపు తెచ్చుకున్నాడు.  తూర్పు గోదావరి జిల్లా దారకొండ ఘటనలో ఆయన  అమరుడయ్యాడు. విప్లవ మేధావి నవీన్‌
సంస్మరణ

కాకలు తీరిన యోధుడు సృజన్ సింగ్

భారత విప్లవోద్యమ చరిత్రలో 1980కి విశిష్ట స్థానం వుంది. దేశ విప్లవోద్యమ చరిత్రలో అది ఒక మైలురాయిగా నిలిచిపోయిన సంవత్సరం. 1980 జూన్ లో ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపిక చేసిన యువ విప్లవకారులు సరిహద్దులలోని దండకారణ్యంలో అడుగిడినారు. వారు, 35 మంది విప్లవకారులు 7 దళాల రూపంలో విశాల అటవీ ప్రాంతంలో తమ విప్లవ కార్యకలాపాలకు నాంది పలికారు. ఆ అటవీ ప్రాంతంలో భాగం పాత చంద్రపుర్ (చాందా) జిల్లా, వర్తమాన గడ్ చిరోలీ జిల్లా. గడ్ చిరోలీ జిల్లా ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరి నదులు సరిహద్దులుగా ఆంధ్రప్రదేశ్ తో అనుబంధాన్ని కలిగివుంది. గడ్చిరోలీ విప్లవోద్యమ చరిత్రలో 1980,