సమీక్షలు

కల్లోల కాలంలో అవసరమైన సంభాషణ

విరసం 50 ఏళ్ల సందర్భంలో ఎ.కె. ప్రభాకర్ ఎడిటర్‍గా పర్స్పెక్టివ్స్ "50 ఏళ్ల విరసం: పయనం- ప్రభావం" అనే పుస్తకాన్ని 2020 లో ప్రచురించింది. ఇందులో 12 మంది వ్యాసాలు, 21 స్పందనలు కలిపి మొత్తం 33 రచనలు ఉన్నాయి. వెంటనే వీటికి ప్రతిస్పందనగా వరలక్ష్మి, పాణి రాద్దామనుకున్న రెండు వ్యాసాలు  2021, మార్చి 31న ఎన్ఐఏ చేసిన దాడిలో  పోయాయి. ఇంతమంది మిత్రులు చేసిన ఈ సంభాషణకు ప్రతిస్పందించడం విరసం బాధ్యతగా భావించి   మళ్లీ "కల్లోలకాల ప్రతినిధి- దృక్పథాల సంభాషణ" అనే సుదీర్ఘ వ్యాసాన్ని పాణి రాసాడు.   ఇటీవలే ఇది  విడుదలైంది.            పర్స్పెక్టివ్స్ ప్రచురించిన పై
సమీక్షలు

రాజకీయార్థిక నవల ‘చంద్రవంక’

దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి కవి, రచయిత, సామాజిక ఉద్యమకారుడు. రచనను సామాజిక బాధ్యతగా గుర్తించినవాడు. తాను ఎన్నుకున్న వస్తువు దళిత, పీడిత కులాల అంతర్భాంగా వుండాలని తపన. మా ఎర్ర ఓబన్న పల్లె, ధనుస్సు అనే రెండు నవలలు, మాదిగ సామాజిక జీవితాన్ని అనేక కోణాల నుండి స్పృశించాయి. ఒకానొక స్థితిని అంచనా వేసాయి. ఎజ్రాశాస్త్రి రచనా మాద్యమాన్ని తను నడిచి వచ్చిన తొవ్వకు అనుసంధానం చేసుకున్నాడు. రచన ఒక బాధ్యత అని భావించినప్పుడు తన రచనా పద్ధతి ఎలాఉండాలో రచయిత నిర్ణయించుకుంటాడు. చంద్రవంక ఎజ్రాశాస్త్రి మూడవ నవల. ఈ నవల చారిత్రక ఉద్యమ నవల. ఇందులో పాత్రలు వాస్తవికమైనవి.
సమీక్షలు

ఎవరికీ పట్టని మరో ప్రపంచపు కథలు

కథలకు సంబంధించి వస్తువు ఎంపికే ప్రధానమైనది. దానిని అనుసరించేవే మిగతా లక్షణాలు. నేరుగా జన జీవనంతో మమేకమైపోయి, వాళ్ళ బతుకు సాధకబాధలే ఇతివృత్తాలు గా, ఆయా సమూహాలను చరిత్రలో భాగం చేసే రచయితలు చాలా చాలా అరుదు. వాళ్ళ ఆరాటపోరాటాల్ని చాలా దగ్గరగా చూసినప్పుడు, పరిశీలించినప్పుడు కలిగే అనుభూతి చాలా భిన్నమైన మార్గంలో కథకుడ్ని నడిపిస్తుంది. చాలా సున్నితమైన అంశాల్ని, ఇతరుల కన్నుకు కనబడని జీవితం తాలూకు ఘర్షణని చూసేలా చేస్తుంది.‌ ఖచ్చితంగా పాఠకుడికి ఆ సంఘటనలకు కారణమయ్యే శక్తుల మీద ఆగ్రహం కలుగుతుంది. జీవన విధ్వంసం దృశ్యాన్ని కథగా మలిచేటప్పుడు కథలో ఇలా ఎందుకు జరిగింది?జరగకూడదే?అనే మీమాంస