కవిత్వం

వడ్డెబోయిన శ్రీనివాస్ కవితలు రెండు

1 రాజకీయ రాముడు వేట చూపులతో బోర విరుచుకొని ధనస్సు బాణాలతో నడి బజార్లో నిలబడ్డ రాముడి మెడలో భయం దండ పడింది అనుమాన భూతద్దాలు వచ్చాయి కలాల్ని చూస్తే గౌరీ లంకేష్ కనపడుతుంది గలాల్నిచూస్తే గోవిందు పన్సారే కల్బురిగి కనపడు తున్నారుమంటలు గాలుల్ల కవులు రచయితలు కలిస్తే పొట్టలు చీల్చిన తలలు తెగిన నరికిన తొడల రక్తింద్రియాలు కారుతూ వచ్చిన మండుతున్న అక్షరాలు మాట్లాడినట్టు అనిపిస్తుంది నడిచి నడిచి వలస ఆకలి కరోనా సాకై గంగలో గుంపులు గుంపులుగా జలచరాలు తినగా మిగిలిన ప్రవాహ శవాలు అక్షరాలై మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఈశాన్య ఢిల్లీ వీధుల్లోంచి పారిన హిందూ
ఇంటర్వ్యూ

పదముగ్గురు నక్సలైట్ల ఎన్‌కౌంటర్ బూటకమేనా?

(నిజ నిర్థారణకు వెళ్ళి వచ్చాక బస్తర్ జంక్షన్ అనే యూ ట్యూబ్ ఛానెల్ తో సంభాషణ. హిందీ  వీడియోకి తెలుగు అనువాదం) బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారని, ఘటనా స్థలం నుంచి ఎల్‌ఎమ్‌జి వంటి ఆటోమేటిక్ ఆయుధాలు, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై క్షేత్రస్థాయి నివేదిక కూడా చేశాం.. మీరు మా గత నివేదికలు చూడవచ్చు. ఇప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సందేహాలు తలెత్తుతున్నాయి, పోలీసుల వ్యవహార శైలి, వారి వాదనలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి, పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి, ఈ ప్రశ్నలు
కవిత్వం

కగార్  యుద్ధం

తల్లి అయితేనేం ఒడిలో పసిపిల్ల అయితేనేం తూటా తుపాకి నుంచి దూసుకొచ్చిందంటేనెత్తురు తాగకుండా నేల రాలదుముగ్గురయితేనేం మావోయిస్టులు పదముగ్గురయితేనేంపట్టాలు తప్పిన డబుల్‌ ఇంజన్‌ రైలురక్తదాహానికి నాలుగు నెలల్లో ఏభయి అయితేనేం ఎందరయితేనేంమనుషులుగా ఆటంకమైన వాళ్లందరూఅసువులు బాయందే అడవిలో కంపెనీ కాల్మోపలేదుపక్షులయినా అడవిలో కాయో పండో తిని విహాయసంలో ఎగిరినపుడు విత్తనాలు వెదజల్లుతాయిఎదురిచ్చే కృతజ్ఞతతో బాక్సైట్‌ దోచుకొని ఆకాశంలోకెగిరిన భారత్‌ ఎయిర్‌ ఫోర్స్‌ విమానాలు మాత్రంచెట్టు చేమలనూ, జనావాసాలనేకాదునేల సారాన్ని ధ్వంసం చేసి ఆదివాసీ ఉసురు తీసిగానీ ఎగురవు అర్థంకాని పరాయి లోకపులోహ విహంగం ఆకారంగాహృదయ రహిత రాజ్యం నీడగామనుషుల మధ్య భీతావహంగా అసహ్యంగాలూటీ సర్కారు జనతన సర్కార్‌సరిహద్దుల్నే చెరిపేసేదాక